సింగూరు జలాశయం

తెలంగాణ రాష్ట్రం, మెదక్ జిల్లాలోని జలాశయం

సింగూరు జలాశయం అనేది తెలంగాణ రాష్ట్రం, మెదక్ జిల్లాలో మంజీరా నదిపై ఉన్న సింగూర్ డ్యామ్ బ్యాక్ వాటర్ కోసం నిర్మించిన జలాశయం. ఇది హైదరాబాదు నగరానికి నిరంతర తాగునీటి వనరుగా ఉంది.[1][2] ఈ జలాశయానికి మల్లన్నసాగర్‌ ప్రాజెక్టు నుండి ఇన్ ఫ్లో ఉండగా, నిజాం సాగర్ ప్రాజెక్టుకు ఔట్ ఫ్లో ఉంది.[3]

సింగూరు జలాశయం
సింగూరు జలాశయం
ప్రదేశంసింగూర్, మెదక్ జిల్లా, తెలంగాణ
అక్షాంశ,రేఖాంశాలు17°44′59″N 77°55′40″E / 17.7496°N 77.9278°E / 17.7496; 77.9278
రకంజలాశయం
సరస్సులోకి ప్రవాహంమల్లన్నసాగర్‌ ప్రాజెక్టు
వెలుపలికి ప్రవాహంనిజాం సాగర్‌
ప్రవహించే దేశాలుభారతదేశం

సామర్థ్యం మార్చు

ఈ జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 1717.93 అడుగులు కాగా, నిల్వ సామర్థ్యం 29.91 టీఎంసీలుగా ఉంది. ఈ జలాశయంలోకి నీటి నిలువ కారణంగా, సింగూరు ఆనకట్ట దిగువ ప్రాంతాల్లో భూగర్భ జలమట్టాలు పెరుగుతాయి. సంగారెడ్డి, కామారెడ్డి, మెదక్ జిల్లాలకు తాగునీరు అందుకుంది.[4]

సాగునీరు మార్చు

మల్లన్నసాగర్‌ ప్రాజెక్టుతో సింగూర్‌ ప్రాజెక్టుకు అనుసంధానించి నీటిని సరఫరా చేయడంద్వారా ఈ జలాశయం కిందనున్న ఆయకట్టుకు రెండు పంటలకు నీరందుతుంది. ఈ జలాశయం కింద దాదాపు 60 వేల ఎకరాలు ఉంది. ప్రతి సంవత్సరం వానాకాలం, యాసంగి సీజన్ లలో రైతులు అవసరాన్ని బట్టి ఈ జలాశయం నుండి దశల వారీగా నీటిని విడుదల చేస్తారు.

మూలాలు మార్చు

  1. TNN (2003-05-31). "Water twice a week from June 15". The Times of India. Archived from the original on 2012-09-16. Retrieved 2022-04-23.
  2. "End to water blues in sight". 2003-07-29. Archived from the original on 2012-11-10. Retrieved 2022-04-23.
  3. "'మంజీరా'లో సింగూరు నీటి నిల్వలు". Sakshi. 2014-04-05. Archived from the original on 2022-04-23. Retrieved 2022-04-23.
  4. "సగం నిండిన సింగూరు ప్రాజెక్టు". EENADU. 2020-09-19. Archived from the original on 2022-04-23. Retrieved 2022-04-23.