కళ్యాణదుర్గం
కళ్యాణదుర్గం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లాకు చెందిన పట్టణం.ఇది రెవిన్యూ డివిజన్ కేంద్రం.ఇది కళ్యాణదుర్గం మండలానికి చెందిన పట్టణం,[1] కళ్యాణదుర్గం మండలానికి ప్రధాన కేంద్రం.ఇది పురపాలకసంఘం హోదా కలిగి పట్టణం.[2] ఇది అనంతపురం లోకసభ నియోజకవర్గంలోని, కళ్యాణ దుర్గం శాసనసభ నియోజకవర్గం కింద నిర్వహించబడుతుంది.ఇది కళ్యాణదుర్గం రెవెన్యూ డివిజనుకు ప్రధాన కేంద్రంగా కూడా ఉంది. పరిధికి చెందిన మండలాల్లో ఇది ఒకటి.గ్రామం కోడ్: 594956.
కళ్యాణ దుర్గం (పట్టణం) | |
— రెవిన్యూ గ్రామం, జణనగణన పట్టణం — | |
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కళ్యాణదుర్గం స్థానం | |
అక్షాంశ రేఖాంశాలు: Coordinates: 14°33′00″N 77°06′00″E / 14.5500°N 77.1000°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | అనంతపురం |
మండలం | కళ్యాణదుర్గం |
వైశాల్యము | |
- మొత్తం | 34.92 km² (13.5 sq mi) |
ఎత్తు | 656 m (2,152 ft) |
జనాభా (2011) | |
- మొత్తం | 32,328 |
- పురుషుల సంఖ్య | 16,036 |
- స్త్రీల సంఖ్య | 16,292 |
- గృహాల సంఖ్య | 7,220 |
పిన్ కోడ్ | 509131 |
ఎస్.టి.డి కోడ్ | 08504 |
వెబ్సైటు: కళ్యాణదుర్గం పురపాలక సంఘం అధికారక వెబ్సైట్ |
గణాంకాలుసవరించు
2011 భారత జనాభా లెక్కల ప్రకారం, కళ్యాణదుర్గం పట్టణ పరిధిలో మొత్తం జనాభా 32,328 మంది ఉన్నారు. అందులో పురుషులు 16,036 కాగా, మహిళలు 16,292 మంది ఉన్నారు. లింగ నిష్పత్తి 1000 మంది పురుషులకు 1016 మంది మహిళలుగా ఉంది. పట్టణంలో పిల్లలు 0-6 సంవత్సరాల వయస్సు మధ్య ఉన్న పిల్లలు 3,404 మంది ఉన్నారు.ఇది కళ్యాణదుర్గం పట్టణ జనాభాలో 10.53% గా ఉంది.పట్టణంలో స్త్రీల సెక్స్ నిష్పత్తి రాష్ట్ర సగటు 993 కు వ్యతిరేకంగా 1016 గా ఉంది.పురుషుల అక్షరాస్యత 80.93% కాగా, మహిళా అక్షరాస్యత 67.51% గా ఉంది.[3] పిన్ కోడ్ నం. 515761.
2011 భారత జనాభా లెక్కల ప్రకారం పట్టణ పరిధిలో మొత్తం 7,220 గృహాలకు పైగా పరిపాలనను కలిగి ఉంది.వీటికి నీటి సరఫరా, మురుగునీటి పారుదల వంటి ప్రాథమిక సౌకర్యాలను కళ్యాణదుర్గం పురపాలక సంఘం అందిస్తుంది.దీనికి పట్టణ పరిధిలో రహదారులను నిర్మించడానికి, ఇతర వసతులు సమకూర్చటానికి దాని పరిధిలోకి వచ్చే ఆస్తులపై పన్ను విధించడానికి అధికారం కలిగిఉంది.[3]
చరిత్రసవరించు
కళ్యాణదుర్గం శ్రీ కృష్ణదేవరాయలు పాలించిన విజయనగర సామ్రాజ్యంలో ఒక భాగం ఉంది.రాజలు పరిపాలించిన కాలంనాటి గజెటర్ ప్రకారం రాయదుర్గ్, చిత్రదుర్గ, కళ్యాణదుర్గ్ ఈ మూడు ముఖ్యమైన కోటలుగా ఉండేవని తెలుస్తుంది.వీటిని ఒకప్పుడు బోయ పాలెగర్ పాలించాడు. కల్యాణదుర్గ అనే పేరు 16 వ శతాబ్దంలో పాలేగర్ బోయ కల్యాణప్ప నుండి వచ్చిందని చరిత్ర ద్వారా తెలుస్తుంది.1893 డిసెంబర్లో బ్రిటిష్ పాలకులు అప్పటి మద్రాసు ప్రెసెడెన్సీలోని ధర్మవరం, రాయదుర్గ్ (బళ్లారి) తాలూకాల నుండి చీల్చి కల్యాణదుర్గ్ తాలూకాను ఏర్పాటు చేశారు. 2012 మార్చిలో కళ్యాణదుర్గం పురపాలక సంఘంగా ఏర్పడింది.
దేవాలయాలుసవరించు
- అక్కమాంబ ఆలయం:ఈ గ్రామస్థులు శ్రీ అక్కమాంబాదేవిని తమ గ్రామ దేవతగా స్వీకరించారు. తమ ఇంటి ఇలవేలుపుగా గుడికట్టి ఆరాధించుకుంటున్నారు. ఈ ఆలయంలో సప్తమాతలకు ప్రతీకగా శ్రీ అక్కమాంబాదేవి సజీవ జీవకళ ఉట్టిపడే రీతిలో భాసిల్లుతోంది.[1]
- శ్రీ సుబ్రహ్మణేశ్వర స్వామి ఆలయం పట్టణం నడిబొడ్డున ఉంది. ఈ ఆలయం 16 వ శతాబ్దంలో నిర్మించబడింది.
మూలాలుసవరించు
- ↑ "Kalyandurg Mandal Villages, Anantapur, Andhra Pradesh @VList.in". vlist.in. Retrieved 2020-06-27.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2020-02-20. Retrieved 2020-06-26.
- ↑ 3.0 3.1 "Kalyandurg Census Town City Population Census 2011-2020 | Andhra Pradesh". www.census2011.co.in. Retrieved 2020-06-26.
వెలుపలి లంకెలుసవరించు
Wikimedia Commons has media related to Kalyandurg. |