దివిసీమ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లాలో గల ఒక చిన్న, సారవంతమైన ద్వీపం దివిసీమ.
భౌగోళిక స్థితిసవరించు
దివిసీమ పులిగడ్డ (అవనిగడ్డ) వద్ద డెల్టా ప్రాంతంలో ఏర్పడింది, ఇక్కడ కృష్ణా నది బంగాళాఖాతంలో కలిసే ముందు రెండుగా చీలిపోయింది. ఒక పాయ కోడూరు మండలం హంసలదీవి వద్ద బంగాళాఖాతంలో కలవగా, మరో పాయ నాగాయలంక మండలంలోని గుల్లలమోద సమీపంలో బంగాళాఖాతంలో కలుస్తుంది. ఇటీవల ఒక కొత్త వంతెనను పులిగడ్డ వద్ద నిర్మించారు. ఇది రేపల్లె, పులిగడ్డను కలుపుతుంది. దివిసీమలో కూచిపూడి, మొవ్వ, సంగమేశ్వరం, నాగాయలంక, కోడూరు, హంసలదీవి, మోపిదేవి, అవనిగడ్డ, చల్లపల్లి, పెదకళ్ళేపల్లి, శ్రీకాకుళం, ఘంటసాల గుర్తించదగ్గ ప్రదేశాలు. ఈ ప్రదేశ వైశాల్యం 1204 చ.కి.మీ. ఇది అధిక వర్షపాతం గల చిట్టడవి ప్రాంతం.[1]
చరిత్రసవరించు
ఆంధ్రప్రదేశ్ చరిత్రలో దివిసీమకు విశిష్ట స్థానం ఉంది. ఆంధ్రలోని సీమ అనగా గుర్తువచ్చేయి రాయలసీమ దివిసీమ, కోనసీమ. తెలుగు నాట్యకలలకు ఇది పుట్టినిల్లు. ఇక్కడ దాదాపుగా 100 ఆలయాలను ప్రతిష్ఠించారు.వాటిలో గణించదగినవి 32 ఆలయాలు.
ఆలయాలుసవరించు
దివిసీమలో ఉన్న 100 ఆలయాలలో 8 ప్రసిద్ధమైనవి. అవి అవనిగడ్డ, కూచిపూడి, గణపేశ్వరం, ఘంటశాల, పెదకళ్ళేపల్లి, విశ్వనాథపల్లి, సంగమేశ్వరం, శ్రీకాకుళం, హంసలదీవి.
అవనిగడ్డసవరించు
ఈ గ్రామం చారిత్రకంగా ఎంతో ప్రసిద్ధి పొందిన లక్ష్మీ నారాయణ స్వామివారి ఆలయానికి నిలయం. ఈ ఆలయ శిల్పాకళా వైభవానికి ఎంతో ఆదరణ ఉంది. ఈ ఆలయాన్ని శ్రీరాముడు ప్రతిష్ఠించాడని నమ్మకం.ఒకప్పుడు కృష్ణానదీ గర్భంలో లక్ష్మీపతిలంకా అనే ప్రాంతంలో ఉండేది. ఆ ప్రదేశానికి వరదతాకిడి ఎక్కువుగా ఉండడంతో 2వ కులోత్తుంగ చోళగొంక దేవుడు ఆలయ గోపురాలను ప్రస్తుతమున్న చోటుకు తరలించాడు. ఈ ఆలయంలో ప్రతియేటా వైశాఖ శుద్ధ త్రయోదశి నుంచి పౌర్ణమి వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతూంటాయి.
ప్రముఖులుసవరించు
- పింగళి వెంకయ్య - స్వాతంత్ర్య సమర యోధుడు, భారతదేశ జాతీయ పతాక రూపకర్త.
- మండలి వెంకటకృష్ణారావు - అవనిగడ్డ శాసనసభ నియోజకవర్గం నుంచి 1972 లో ఏకగ్రీవంగా ఎన్నికైన శాసన సభ్యుడు, గాంధేయవాది.
- ఘంటసాల వెంకటేశ్వరరావు - తెలుగు సినిమా సంగీత దర్శకుడు, నేపథ్య గాయకుడు.
- వేటూరి సుందరరామ్మూర్తి - తెలుగు సినీ గీత రచయిత.
- పసుపులేటి కన్నాంబ - రంగస్థల నటి, గాయని.
- మండలి బుద్ధ ప్రసాద్ - రాజకీయ నాయకుడు,ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉపసభాపతి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో మాజీ మంత్రి, తెలుగు భాషాభిమాని.
- మైనేని హరిప్రసాద్ రావు -అణుశక్తి పరిశోధకులు. న్యూక్లియర్ పవర్ బోర్డుకు డైరెక్టరుగా, మద్రాసు అణు విద్యుత్తు కేంద్రం నిర్మాణంలో క్రీయాశీలక వ్యక్తి. పద్మశ్రీ పురస్కార గ్రహీత
- సింహాద్రి సత్యనారాయణ - మాడుమార్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. ఆయన లా చదివారు. 30 ఏళ్ల పాటు న్యాయవాదిగా ఆవనిగడ్డలోనే పనిచేశారు.
- అంబటి బ్రాహ్మణయ్య -1994 నుండి 99 వరకు మచిలీపట్నం ఎమ్మెల్యేగా, 1999 నుండి 2004 వరకు బందరు పార్లమెంటు సభ్యునిగా,2009 అసెంబ్లీ ఎన్నికల్లో అవనిగడ్డ శాసనసభ్యుడిగా పనిచేశాడు.
ఉప్పెనసవరించు
- ప్రధాన వ్యాసం 1977 ఆంధ్ర ప్రదేశ్ తుఫాను
ఈ ప్రాంతం 1977 నవంబరు 19నలో ఒక పెద్ద తుఫానుకు గురై మానవ జీవితాలతో సహా అపూర్వ నష్టాన్ని చవిచూసి ప్రపంచవ్యాప్త వార్తలకెక్కింది. ఈ సహజసిద్ధమైన విపత్తు ఫలితంగా 10,000 మంది ప్రజలు మరణించి ఉంటారని, అలాగే 10,00,000 జంతువులు మరణించి ఉంటాయని అంచనా వేశారు. బాధితులు త్వరగా కోలుకొనేందుకు చాలావరకు స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వం కృషి చేశాయి.[2]
మూలాలుసవరించు
- ↑ యద్దనపూడి, బాబూరావు. దివిసీమ పూర్వ చరిత్ర. pp. iii.
- ↑ Diviseema Social Service Society