మోపిదేవి
మోపిదేవి, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని కృష్ణా జిల్లాకు చెందిన గ్రామం. పిన్ కోడ్ నం. 521 125., ఎస్.టి.డి.కోడ్ = 08671.
మోపిదేవి | |
— రెవిన్యూ గ్రామం — | |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
---|---|
జిల్లా | కృష్ణా |
మండలం | మోపిదేవి |
ప్రభుత్వము | |
- సర్పంచి | శ్రీ కొల్లి చక్రపాణి |
జనాభా (2001) | |
- మొత్తం | 7,438 |
- పురుషులు | 3,319 |
- స్త్రీలు | 3,367 |
- గృహాల సంఖ్య | 1,846 |
పిన్ కోడ్ | 521125 |
ఎస్.టి.డి కోడ్ | 08671 |
మోపిదేవి | |
— మండలం — | |
కృష్ణా జిల్లా పటములో మోపిదేవి మండలం స్థానం | |
ఆంధ్రప్రదేశ్ పటంలో మోపిదేవి స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: Coordinates: Coordinates: Unknown argument format |
|
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | కృష్ణా జిల్లా |
మండల కేంద్రం | మోపిదేవి |
గ్రామాలు | 17 |
ప్రభుత్వము | |
- మండలాధ్యక్షుడు | |
జనాభా (2001) | |
- మొత్తం | 36,012 |
- పురుషులు | 18,071 |
- స్త్రీలు | 17,941 |
అక్షరాస్యత (2001) | |
- మొత్తం | 61.35% |
- పురుషులు | 66.89% |
- స్త్రీలు | 55.81% |
పిన్కోడ్ | 521125 |
గ్రామ చరిత్రసవరించు
గ్రామం పేరు వెనుక చరిత్రసవరించు
గ్రామ భౌగోళికంసవరించు
[1] సముద్రమట్టానికి 6 మీ.ఎత్తు Time zone: IST (UTC+5:30)
సమీప గ్రామాలుసవరించు
పులిగడ్డ, పెదప్రోలు, నాగాయతిప్ప. పెదకళ్ళేపల్లి.
సమీప మండలాలుసవరించు
గ్రామానికి రవాణా సౌకర్యాలుసవరించు
రైల్వేస్టేషన్:- విజయవాడ 64 కి.మీ., మచిలీపట్నం 30 కి.మీ.
గ్రామంలోని విద్యా సౌకర్యాలుసవరించు
జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలసవరించు
- ఈ పాఠశాలలో చదువుచున్న కర్లపూడి పావని అను విద్యార్థిని, డిసెంబరు/2013 లో, చండీఘర్ లో జరుగు జాతీయస్థాయి త్రోబాలు పోటీలకు, అండర్-14 విభాగంలో పాల్గొనుటకు ఎంపికైనది. [3]
- ఈ పాఠశాల, 2014,ఫిబ్రవరి-19న, 65వ వార్షికోత్సవం జరుపుకున్నది. [4]
- ఈ పాఠశాలలో చదివిన కొక్కిలిగడ్డ కిన్నెర అను విద్యార్థిని, 10వ తరగతి 556 మార్కులతో ఉత్తీర్ణురాలై, నూజివీడులోని ఐ.ఐ.ఐ.టి.లో సీటు సాధించింది. అక్కడ మొదటి సంవత్సరం బి.టెక్. చదువుచున్న ఈమె, 2014,మే-14 నుండి 18 వరకు అమెరికాలోని "నాసా" అంతరిక్ష పరిశోధన సంస్థ వారు నిర్వహించిన పోటీలలో పాల్గొని, ప్రదర్శించిన ఎథేనా-2014(ATHENA-2014) ప్రాజెక్టుకు ప్రపంచస్థాయిలో రెండవ స్థానం లభించింది. రాతియుగం నుండి రాకెట్ యుగం వరకు సాధించిన ప్రగతిని శాశ్వతంగా, అత్యాధునిక సౌకర్యాలు అనుభవించాలంటే ఏమి చేయాలన్న విషయమై ఈమె రూపొందించిన ప్రాజెక్టు ప్రశంసలనందుకున్నది. దీనిద్వారా అంతరిక్షంలో కృత్రిమ నివాస ప్రాంతం రూపొందించి, అక్కడ ఎదురయ్యే సమస్యలను ముందుగానే ఊహించి, పరిష్కార మార్గాలను ఈమె తన ప్రాజెక్టు ద్వారా వివరించింది.[ఈనాడు కృష్ణా; 2014,మే-30; 11వ పేజీ.]
- ఈ పాఠశాలలో 2014-15 విద్యా సంవత్సరంలో 10వ తరగతి చదివిన కొండేటి కళ్యాణి అను విద్యార్థిని, ఈ పాఠశాలలోనే తొలిసారిగా, 10/10 గ్రేడ్ మార్కులు సాధించి, పాఠశాలకే ఎనలేని గుర్తింపు తెచ్చింది. [10]
- ఈ పాఠశాలో ప్రవాస భారతీయులైన దాతల ఆర్థిక సహకారంతో, 2015,ఆగస్టు-11వ తేదీనాడు, డిజిటల్ తరగతులను ప్రారంభించనున్నారు. [11]
- ఈ పాఠశాల విద్యార్థి కారుమూరి నాగమల్లేశ్వరరావు, రాష్ట్రస్థాయిలో నిర్వహించు పాఠశాలల క్రీడాపోటీలలో, అండర్-16 విభాగంలో పాల్గొనడానికి ఎంపికైనాడు. [12]
- ప్రస్తుత కేంద్ర సాహిత్య అకాడమీ కార్యదర్శి శ్రీ కృత్తివెంటి శ్రీనివాసరావు,ఈ పాఠశాలలోనే విద్యనభ్యసించారు. [17]
- ఈ పాఠశాల క్రీడా మైదానంలో, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా, ఐదు లక్షల రూపాయల వ్యయంతో ఒక ట్రాక్ ఏర్పాటుచేయుచున్నారు. ఈ పాఠశాలలో క్రీడలు, ఆటలు ప్రోత్సహించేటందుకు ప్రభుత్వం ఉపాధి హామీ పథకం నిధులను ఈ పాఠశాలకు కేటాయించినది. [20]
- ఈ పాఠశాలలో చదువుచున్న గొరిపర్తి గోపీకృష్ణ అను విద్యార్ధి, ఇటీవల అనంతపురంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి సాఫ్ట్ బాల్ పోటీలలో తన ప్రతిభ కనబరచి, ఆగష్టు-2017లో నిర్వహించు జాతీయస్థాయి పోటీలకు ఎంపికైనాడు. [21]
మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాలసవరించు
ఈ పాఠశాల స్థానిక ప్రజాశక్తినగర్ లో ఉంది. ఈ పాఠశాల వార్షికోత్సవం, 2015,మార్చి-12వ తేదీ నాడు నిర్వహించెదరు. [8]
మహాత్మా జ్యోతిబా పూలే వెనుకబడిన తరగతుల గురుకుల పాఠశాలసవరించు
(ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ గురుకుల పాఠశాల)
- ఈ పాఠశాల విద్యార్థులు, పాఠశాల స్థాపించిన 2003-2004 నుండి ఇప్పటివరకు, 10వ తరగతి పరీక్షలలో, వరుసగా 11వ సారి, 100% ఉత్తీర్ణత సాధించి రికార్డులకెక్కినారు. [4]
- ఈ పాఠశాలలో, 2014,డిసెంబరు-15 నుండి 17 వరకు, మహాత్మా పూలే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గురుకుల పాఠశాలల, రాష్ట్రస్థాయి పోటీలు నిర్వహించారు. ఈ పోటీలలో, 31 పాఠశాలలకు చెందిన 1,000 మంది క్రీడాకారులు, బాలబాలికల జట్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వాలీబాల్, ఖో-ఖో, షటిల్ బాడ్మింటన్, కబడ్డీ, టెన్నికాయిట్, చదరంగం విభాగాలలోనూ, అథ్లెటిక్స్ విభాగంలో రన్నింగ్, షాట్ పుట్, థ్రోబాల్, హైజంప్, లాంగ్ జంప్ తదితర పోటీలు నిర్వహించారు. ఉదయం నుండి సాయంత్రం వరకు క్రీడాపోటీలు, సాయంత్రం సాంస్కృతిక, వినోద కార్యక్రమాలు నిర్వహించారు. [6] & [7]
- ఇటీవల గుడివాడలోని నందమూరి తారకరామరావు స్టేడియంలో నిర్వహించిన జాతీయస్థాయి పైకా వాలీబాల్ పోటీలలో, ఆంధ్రప్రదేశ్ జట్టు విజేతగా నిలిచి, స్వర్ణపతకం సాధించింది. ఈ జట్టులో ఈ గురుకుల పాఠశాల విద్యార్థి అర్జున్ ప్రధాన భాగస్వామ్య పాత్ర పోషించి, జట్టు విజయంలో కీలక పాత్ర వహించాడు. [15]
గ్రామంలో మౌలిక వసతులుసవరించు
మండల వనరుల కేంద్రంసవరించు
ఈ కేంద్రాన్ని ఒకటిన్నర లక్షల రూపాయల వ్యయంతో అధునికీకరించి, పూర్తిస్థాయిలో వసతులు, సౌకర్యాలు కల్పించారు. నూతన హంగులు సంతరించుకున్న ఈ భవనాన్ని, 2017,ఏప్రిల్-6న ప్రారంభించారు. [19]
బ్యాంకులుసవరించు
- స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఫోన్ నం. 08671/247257.,సెల్=9908524842.
- కెనారా బ్యాంక్:- గ్రామంలో ఈ బ్యాంక్ శాఖను 2015,నవంబరు-19న ప్రారంభించారు. [14]
కావూరు రమేష్ బాబు స్మారక ప్రాధమిక అరోగ్య కేంద్రంసవరించు
ఈ కేంద్రానికి, శ్రీ కావూరి రమేష్ బాబు, లక్షలాది రూపాయల విలువైన 20 సెంట్ల స్థలాన్ని, 2003లో వితరణ చేసారు. ప్రభుత్వం నిధులు మంజూరుచేసి, అ స్థలంలో భవనం నిర్మించారు. [13]
పశువైద్యశాలసవరించు
తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణమండపంసవరించు
సంపద కేంద్రంసవరించు
మోపిదేవి గ్రామములో ఈ కేంద్రాన్ని ప్రభుత్వం 9 లక్షల రూపాయల ఉపాధి హామీ నిధులతో నిర్మించినది. ఈ కేంద్రానికి విద్యుత్తు సౌకర్యం గూడా ఏర్పడినది. పంచాయతీ నిధులతో ధరావతు సొమ్ము గూడా చెల్లించడంతో, నియంత్రిక, కొత్త స్తంభాలు గూడా ఏర్పాటు చేసి మీటరు గూడా బిగించినారు. త్వరలో ఈ కేంద్రాన్ని పూర్తిస్థాయిలో అందుబాటులోనికి తీసుకొనివచ్చెదరు. []
గ్రామానికి వ్యవసాయం, సాగునీటి సౌకర్యంసవరించు
చెరువుసవరించు
ఈ గ్రామంలోని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారికి చెందిన ఈ చెరువు, ఏడు ఎకరాలలో విస్తరించియున్నది. ఈ చెరువును పూడికతీత పనులకోసం ఎండగట్టినారు. స్వామివారికి పుష్కరిణి ఏర్పాటుతోపాటు, భవిష్యత్తులో తెప్పోత్సవం నిర్వహించుటకై అనువైన వాతావరణం కల్పించడంతోపాటు, చెరువుగట్లను పటిష్ఠంచేసి, గట్లపై మొక్కలు పెంచడం, చెరువు మధ్యలో అహ్లాదకరంగా ఫౌంటెన్ ఏర్పాటు, తదితర పనులతో సుందరీకరణ చేయబోవుచున్నారు. [19]
గ్రామ పంచాయతీసవరించు
- గంజివాని పాలెం గ్రామం, మోపిదేవి గ్రామ పంచాయతీలోని ఒక శివారు గ్రామం.
- కీ.శే. యండ్రపాటి వెంకటేశ్వరారావు, మాజీ సర్పంచి.
- 2013 జూలైలో మోపిదేవి గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీ కొల్లి చక్రపాణి సర్పంచిగా గెలుపొందారు. వీరు 2016,మే-7వతేదీ శనివారం ఉదయం, పదవిలో ఉండగానే, మోపిదేవిలోని తన స్వగృహంలో, హఠాత్తుగా, గుండెపోటుతో కన్నుమూసినారు. వీరి అనంతరం శ్రీ కర్లపూడి పూర్ణచంద్రరావు, గ్రామ సర్పంచ్గా పదవీ బాధ్యతలు చేపట్టినారు. [2],[16]&[18]
గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలుసవరించు
శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారి ఆలయంసవరించు
చరిత్రసవరించు
స్థలపురాణం ప్రకారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలోని మూలమూర్తి స్వయంభూలింగం. వీరారపు పర్వతాలు అనే కుమ్మరి శివభక్తుని భక్తికి మెచ్చి శివుడు కలలో కనిపించి మోపిదేవి గ్రామంలోని చీమలపుట్టను త్రవ్వి తన లింగాన్ని బయల్పరచమని ఆదేశించాడు. పర్వతాలు తన కల గురించి గ్రామస్థులకు తెలియజేసి కలలో కనిపించిన ప్రదేశంలో చీమలపుట్టను త్రవ్వాడు. ఆశ్చర్యకరంగా బయల్పడిన లింగాన్ని ఆ చీమలపుట్టపైనే ప్రతిష్ఠించి గ్రామస్థులు పూజించడం ప్రారంభించారు. పర్వతాలు గుఱ్ఱము, నంది, కోడి, గరుత్మంతుని విగ్రహాలను బంకమన్నుతో తయారుచేశాడు. మహాఋషుల విగ్రహాలను కూడా బంకమన్నుతో తయారుచేసి బట్టిలో కాల్చి కలకాలం చెక్కుచెదరకుండా తీర్చిదిద్దాడు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చల్లపల్లి జమిందారీ కుటుంబం యొక్క ఇలవేల్పు. ఇప్పటికీ వీరి ఆధ్యర్యంలోనే ఆలయ నిర్వహణ కొనసాగుతున్నది.
నాగశిలసవరించు
ఈ ఆలయ ఆవరణలో, 2014, ఆగష్టు-8, రెండవ శ్రావణ శుక్రవారం నాడు, నాగమల్లి వృక్షం వద్ద, నాగశిల ప్రతిష్ఠ కోసం, గూడపాడుకు చెందిన శ్రీ కోట భాస్కరరావు, రాజారావు, సూర్యప్రకాశరావు దంపతులు, ప్రత్యేకపూజలు నిర్వహించారు. ప్రతిష్ఠించనున్న నాగశిలకు, వేదమంత్రోచ్ఛారణలు, హోమాల మధ్య, అర్చకులు, ఈ దంపతులచే ప్రతిష్ఠకు సంబంధించిన పూజలు చేయించారు. [6]
దేవస్థానం చిరునామాసవరించు
అసిస్టెంట్ కమిషనర్ & ఎక్జెక్యూటివ్ ఆఫీసర్, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవస్థానం, మోపిదేవి గ్రామం. కృష్ణా జిల్లా. pin 521 125.
- ఫోన్ నం. 08671/257240., సెల్ = 9491000723., ఇ.మెయిల్:- ap_eo_estatetemples@yahoo.co.in
మోపిదేవి గ్రామంలోని ఇతర ఆలయాలుసవరించు
- శ్రీ బాల సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారి ఆలయం:- ఈ ఆలయం మోపిదేవి గ్రామంలోని ఆశ్రమ పాఠశాల సమీపంలో ఉంది.
- శ్రీ గంగా పార్వతీ సమేత సకలేశ్వరస్వామి ఆలయం:- సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ప్రక్కనే మరో ప్రసిద్ధ ఆలయం - శ్రీ గంగా పార్వతీ సమేత, సకలేశ్వరస్వామి ఆలయం ఉంది. ఇది కూడా స్వయంభూలింగమే సగర మహారాజు పూజించిన లింగం కావడంతో ఆ పేరు వచ్చింది. 1783లో మోపిదేవి వరదలలో కొట్టుకుపోయినప్పుడు ఈ లింగం బయల్పడింది. అప్పటి జమీందారైన అడుసుమిల్లి గంగుభొట్లు ఆలయం నిర్మింపజేశాడు. అయితే ఆ లింగం భూమిలో ఇంకా ఎంత లోతువరకు విస్తరించి ఉన్నదో ఎవరికీ తెలియదు. ప్రస్తుతం ఈ ఆలయ నిర్వహణ అడుసుమిల్లి కుటుంబం చేతిలో ఉంది. ఈ స్వామివారి కళ్యాణం, ప్రతి సంవత్సరం, మహాశివరాత్రికి రెండు రోజులముందు నిర్వహించెదరు. ఈ రెండు ఆలయాలను సందర్శించడానికి భక్తులు ఆంధ్రదేశమంతటి నుండి విచ్చేస్తారు. ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం, దసరా పండుగ సందర్భంగా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా నిర్వహించెదరు.
- శ్రీ రామాలయం:- మోపిదేవి బస్సుస్టాండ్ ప్రాంతంలో నెలకొన్న ఈ ఆలయంలో 2015,ఆగష్టు-16వ తేదీ ఆదివారం నాడు, పోతురాజు శిలల ప్రతిష్ఠాపన కార్యక్రమం, అత్యంత వైభవంగా నిర్వహించారు. ప్రతిష్ఠించవలసిన శిలలను శనివారం రాత్రి, జాగరణతో గ్రామోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వేలాదిగా పాల్గొని మొక్కుబడులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా విచ్చేసిన రెండువేల మందికి పైగా భక్తులకు, మద్యాహ్నం అన్నసంతర్పణ నిర్వహించారు. [11]
- శ్రీ అంకమ్మ తల్లి ఆలయం:- మోపిదేవి గ్రామంలోని బి.సి.కాలనీలో 2014, ఆగష్టు-3వ తేదీ ఆదివారం నాడు, శ్రీ అంకమ్మ దేవత విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. యార్లగడ్డ వంశస్తుల ఇలదేవత అగు శ్రీ అంకమ్మ దేవత, పోతురాజు శిలలను, గ్రామోత్సవం నిర్వహించి, దేవాలయంలో ప్రతిష్ఠించారు. యార్లగడ్డ వంశస్తులైన 30 కుటుంబాలవారు, 200మంది భక్తులు, ప్రతిష్ఠించిన అమ్మవారిని మొక్కుబడులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో దూరప్రాంతాలలో ఉన్న యార్లగడ్డ వంశస్థులు పాల్గొన్నారు. [5]
- శ్రీ ఆంజనేయస్వామివారి ఆలయం:- మోపిదేవి వార్ఫు ప్రాంతంలో ఉన్న ఈ ఆలయంలో, ప్రతి సంవత్సరం, హనుమజ్జయంతి వేడుకలు వైభవంగా నిర్వహించెదరు. [9]
సమీప దేవాలయాలుసవరించు
- విజయవాడ - కనకదుర్గ గుడి,
- పెనుగంచిప్రోలు, తిరపతమ్మ తల్లి
- వేదాద్రి నారసింహ క్షేత్రం
- శ్రీకాకుళం (ఘంటశాల) - ఆంధ్ర మహావిష్ణువు క్షేత్రం
- కొల్లేటికోట - పెద్దింట్లమ్మ
- నెమలి - వేణుగోపాలస్వామి
- పెదకళ్ళేపల్లి - నాగేశ్వరాలయం
- ఆగిరిపల్లి - వ్యాఘ్రనరసింహస్వామి
గ్రామంలోని ప్రధాన పంటలుసవరించు
గ్రామంలోని ప్రధాన వృత్తులుసవరించు
వ్యవసాయం, వ్యవసాయాదారిత వృత్తులు
గ్రామ ప్రముఖులుసవరించు
గ్రామ విశేషాలుసవరించు
మండలంలోని గ్రామాలుసవరించు
- అడపావారిపాలెం
- అన్నవరం
- అయోధ్య
- బొబ్బర్లంక
- చిరువోలు
- చిరువోలులంక ఉత్తరం
- కప్తానుపాలెం
- కొక్కిలిగడ్డ
- బండికోళ్ళంక
- మెల్లమర్రు (మేళ్ళమర్రు)
- మెల్లమర్తిలంక (మేళ్ళమర్తిలంక)
- మెరకనపల్లి
- మోపిదేవి
- మోపిదేవిలంక
- నాగాయతిప్ప
- పెదకళ్ళేపల్లి (మోపిదేవి)
- పెదప్రోలు
- రావి వారి పాలెం
- శివరాంపురం (మోపిదేవి)
- టేకుపల్లి
- వెంకటాపురం
- కె.కొత్తపాలెం(మోపిదేవి)
- కోసూరివారిపాలెం
- బోడగుంట
- గంజివానిపాలెం
జనాభాసవరించు
- 2011 జనాభా లెక్కల ప్రకారం మండలంలోని గ్రామాల జనాభా వివరాలు:[2]
గణాంకాలుసవరించు
- జనాభా (2001) - మొత్తం 36,012 - పురుషులు 18,071 - స్త్రీలు 17,941
క్రమ సంఖ్య | ఊరి పేరు | గడపల సంఖ్య | మొత్తం జనాభా | పురుషుల సంఖ్య | స్త్రీలు |
---|---|---|---|---|---|
1. | అన్నవరం | 258 | 896 | 444 | 452 |
2. | అయోధ్య | 58 | 177 | 89 | 88 |
3. | బొబ్బర్లంక | 225 | 834 | 401 | 433 |
4. | చిరువోలు | 185 | 682 | 353 | 329 |
5. | కప్తానుపాలెం | 408 | 1,488 | 755 | 733 |
6. | కొక్కిలిగడ్డ | 1,194 | 4,543 | 2,330 | 2,213 |
7. | మెల్లమర్రు | 53 | 195 | 101 | 94 |
8. | మెల్లమర్తిలంక | 188 | 636 | 325 | 311 |
9. | మెరకనపల్లి | 315 | 1,089 | 544 | 545 |
10. | మోపిదేవి | 1,846 | 6,686 | 3,319 | 3,367 |
11. | మోపిదేవిలంక | 210 | 718 | 377 | 341 |
12. | నాగాయతిప్ప | 504 | 1,795 | 890 | 905 |
13. | చిరువోలులంక ఉత్తరం | 1,164 | 3,820 | 1,932 | 1,888 |
14. | పెదకళ్ళేపల్లి | 1,962 | 7,214 | 3,623 | 3,591 |
15. | పెదప్రోలు | 955 | 3,506 | 1,739 | 1,767 |
16. | టేకుపల్లి | 100 | 372 | 182 | 190 |
17. | వెంకటాపురం | 374 | 1,361 | 667 | 694 |
వనరులుసవరించు
- ↑ "http://www.onefivenine.com/india/villages/Krishna/Mopidevi/Mopidevi". Retrieved 26 June 2016. External link in
|title=
(help) - ↑ "2011 జనాభా లెక్కల అధికారిక జాలగూడు". Archived from the original on 2013-10-05. Retrieved 2013-05-05.
వెలుపలి లింకులుసవరించు
[2] ఈనాడు కృష్ణా; 2013,సెప్టెంబరు-26; 2వపేజీ. [3] ఈనాడు కృష్ణా; 2013,నవంబరు-25; 3వపేజీ. [4] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2014,జూన్-1; 2వపేజీ. [5] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2014 ఆగష్టు-4; 2వపేజీ. [6] ఈనాడు కృష్ణా; 2014,డిసెంబరు-13; 15వపేజీ. [7] ఈనాడు కృష్ణా; 2014,డిసెంబరు-18; 10వపేజీ. [8] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2015,మార్చి-11; 2వపేజీ. [9] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2015,మే-23; 2వపేజీ. [10] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2015,ఆగష్టు-11; 2వపేజీ. [11] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2015,ఆగష్టు-17; 3వపేజీ. [12] ఈనాడు కృష్ణా; 2015,ఆగష్టు-26; 15వపేజీ. [13] ఈనాడు అమరావతి; 2015,అక్టోబరు-28; 39వపేజీ. [14] ఈనాడు అమరావతి; 2015,నవంబరు-20; 40వపేజీ. [15] ఈనాడు అమరావతి; 2016,జనవరి-26; 41వపేజీ. [16] ఈనాడు అమరావతి/అవనిగడ్డ; 2016,మే-8; 1వపేజీ [17] ఈనాడు అమరావతి; 2016,నవంబరు-6; 19వపేజీ. [18] ఈనాడు అమరావతి/అవనిగడ్డ; 2017,మార్చి-25; 2వపేజీ. [19] ఈనాడు అమరావతి/అవనిగడ్డ; 2017,ఏప్రిల్-7; 2వపేజీ. [20] ఈనాడు అమరావతి/అవనిగడ్డ; 2017,జులై-8; 1వపేజీ. [21] ఈనాడు అమరావతి/అవనిగడ్డ; 2017,జులై-12; 3వపేజీ. [22] ఈనాడు అమరావతి; 2020,సెప్టెంబరు-28; 4వపేజీ.