పసిఘాట్,భారత రాష్ట్రమైన అరుణాచల్ ప్రదేశ్ లోని తూర్పు సియాంగ్ జిల్లాకు చెందిన ముఖ్యపట్టణం.హిమాలయాల తూర్పు పర్వత ప్రాంతంలో సముద్ర మట్టానికి 155 మీటర్లు (509 అ) సగటు ఎత్తులో ఉంది.పసిఘాట్ అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఒక పురాతన పట్టణం.[4] జూన్ 2017లో స్మార్ట్ సిటీస్ మిషన్ అభివృద్ధి పథకంలో భారతప్రభుత్వం పసిఘాట్‌ను చేర్చింది.ఇది భారత వైమానికదళానికి చెందిన ముందస్తు విడిదిప్రాంతం. (ఎ.ఎల్.జి.)

పసిఘాట్
పట్టణం
హోటల్ సియాంగ్ నుండి పాసిఘాట్ దృశ్యం
హోటల్ సియాంగ్ నుండి పాసిఘాట్ దృశ్యం
పసిఘాట్ is located in Arunachal Pradesh
పసిఘాట్
పసిఘాట్
భారతదేశంలోని అరుణాచల్ ప్రదేశ్‌లో స్థానం
పసిఘాట్ is located in India
పసిఘాట్
పసిఘాట్
పసిఘాట్ (India)
Coordinates: 28°04′N 95°20′E / 28.07°N 95.33°E / 28.07; 95.33
దేశం India
రాష్ట్రంఅరుణాచల్ ప్రదేశ్
జిల్లాతూర్పు సియాంగ్
Government
 • Typeబహుళ పార్టీ ప్రజాస్వామ్యం
 • డిప్యూటీ కమిషనర్డా. కిన్నీ సింగ్, ఐఎఎస్
Area
 • Total14.60 km2 (5.64 sq mi)
Elevation
152 మీ (499 అ.)
Population
 (2011)[1]
 • Total24,656
 • Density1,504.9/km2 (3,898/sq mi)
భాషలు[2][3]
 • అధికార
Time zoneUTC+5:30 (IST)
పిన్‌కోడ్
791102
టెలిఫోన్ కోడ్0368
ISO 3166 codeIN-AR
Vehicle registrationAR-09

చరిత్ర మార్చు

అబోర్ కొండల ఉత్తరప్రాంత పరిపాలనా సౌలభ్యానికి ప్రవేశ ద్వారంగా సా.శ. 1911 లో పసిఘాట్ బ్రిటిష్ రాజు చేత స్థాపించబడింది.పసిఘాట్ చుట్టుపక్కల గ్రామాల్లో ప్రధానంగా ఆది గిరిజనుల స్థావరాలు ఇప్పటికీ నివసిస్తున్నాయి.2011 నాటికి ఇది 100 సంవత్సరాలు ఉనికిని కలిగి ఉంది.

1894లో నాల్గవ ఆంగ్లో-అబోర్ యుద్ధం తరువాత 1912లో జరిగిన చివరి ఆంగ్లో-అబోర్ యుద్ధం కారణంగా పసిఘాట్ చరిత్ర బయటపడింది.ఇక్కడ మొట్టమొదటిసారిగా అసిస్టెంట్ పొలిటికల్ ఆఫీసర్‌ను నియమించడంతో పరిపాలనా ప్రధాన కార్యాలయం స్థాపించబడింది.స్వాతంత్య్రానంతర యుగం 1946లో పసిఘాట్ కు సమీపంలోమొట్టమొదటివిమానాశ్రయం (పాగ్లెక్,పిఐ లైన్ సమీపంలో) స్థాపించడంతో పసిఘాట్ ఘనత పొందింది.1950లో అరుణాచల్ ప్రదేశ్‌ మొట్టమొదటి వ్యవసాయ సంస్థ పసిఘాట్‌లో స్థాపించబడింది.తరువాత మౌలిక సదుపాయాల అభివృద్ధి ఇతర సౌకర్యాలు కల్పించబడ్డాయి.

  • సాధారణ వైద్యశాల (1954 లో స్థాపించబడింది.అయితే కొందరు దీనిని పట్టణంవలె పాతదిగా పేర్కొన్నారు)
  • కో-ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ (1957)
  • నర్సు శిక్షణకేంద్రం (సాధారణ వైద్యశాలకు అనుబంధంగా ఉంది)
  • జవహర్‌లాల్ నెహ్రూ కళాశాల- అరుణాచల్ ప్రదేశ్‌లోని మొట్టమొదటి కళాశాల (3 జూలై 19964న స్థాపించబడింది [5] )
  • 1966లో రాష్ట్రంలో మొట్టమొదటి ఆకాశవాణి కేంద్రం స్థాపన.

ప్రారంభ ప్రతిపాదకులు షిల్లాంగ్ (అప్పటి నీఫా) నుండి రాష్ట్ర రాజధానిని మార్చడానికి పసిఘాట్ అవసరమైన మంచి మౌలిక సదుపాయాలను నొక్కిచెప్పారు.ఏదేమైనా 1974 లో అప్పటి రాజధాని ఇటానగర్ ఈ హక్కును కోల్పోయింది.ముఖ్యమైన ఏకైక అభివృద్ధి కేంద్ర ఉద్యానవన,అటవీ,వ్యవసాయ విశ్వనిద్యాలయం 7 మార్చి 2001 న పసిఘాట్‌లో స్థాపించబడింది.

భౌగోళికం మార్చు

పసిఘాట్ 28°04′N 95°20′E / 28.07°N 95.33°E / 28.07; 95.33 వద్ద ఉంది.[6] ఇది 153 మీ (502 అడుగులు) సగటు ఎత్తులో ఉంది.పసిఘాట్ ఒక సాధారణ లోతట్టు ఈశాన్య భారతదేశ తేమతోకూడిన ఉపఉష్ణమండల వాతావరణం (కొప్పెన్ సిడబ్యుయు) తో కలిగిఉంది.ఇది ఉష్ణమండల రుతుపవనాల వాతావరణం (ఆమ్) గా అర్హత సాధించడానికి కొంచెం చల్లగా ఉంటుంది. పసిఘాట్ కు మూడు వైపులా చుట్టుముట్టబడిన ఎత్తైన కొండలు అస్సాం మైదానంనుండి వచ్చే వర్షాన్నిమోసే మేఘాలను ప్రత్యేకమైన పతన-వంటి లక్షణాలు ఆకర్షించడానికి అనువుగా ఉన్నాయి.వర్షం మోసే గాలి కొండలకి ఆటంకం కలిగిస్తుంది.జూన్ నుండి సెప్టెంబరు వరకు అనూహ్యంగా భారీ వర్షపాతం ఉంటుంది.సగటు నెలవారీ వర్షపాతం 796 మిల్లీమీటర్లు (31.34 అంగుళాలు) సరాసరి రోజుకు 25.4 మిల్లీమీటర్లు (ఒక అంగుళం)కు సమానం.శీతాకాలం సైబీరియన్ హై నుండి బలమైన,చల్లని,పొడి ఈశాన్య గాలులు వీస్తాయి.ఇవి శీతాకాలంలో కూడా పసిఘాట్ లో పొగమంచు లేకుండా చేస్తాయి.నవంబరు నుండి ఫిబ్రవరి వరకు శీతాకాలం రోజులు సాధారణంగా వేడిని కలిగి ఉంటాయి. అయితే మార్చి నుండి మే వరకు"వేడి"వసంత రుతువులో భారీ ఉరుములతో కూడిన వర్షాలు ఉంటాయి.ఉదయం కూడా చాలా వెచ్చగా వేడి,తేమతో కూడిన వాతావరణం ఉంటుంది బ్రహ్మపుత్ర నది పసిఘాట్‌లోని దిహాంగ్ లేదా సియాంగ్ పేరుతో ఉన్న పర్వత ప్రాంతాల నుండి ఉద్భవించింది.అక్కడి నుండి అరుణాచల్ ప్రదేశ్ లోని సాడియా పట్టణానికి పశ్చిమాన ఉన్న మైదానంలోకి ప్రవేశిస్తుంది..నైరుతి వైపు ప్రవహిస్తూ, దాని ఎడమవైపు ఒడ్డున ఉన్నప్రధాన ఉపనదులలో కలుస్తుంది.దిబాంగ్, లోహిత్,ఆ తరువాత మైదానాలలో దీనిని బ్రహ్మపుత్ర అని పిలుస్తారు.అప్పుడు అది అస్సాం మైదానాలకు వెళ్లే పసిఘాట్ ప్రాంతాన్ని దాటుతుంది.మూస:Pasighat weatherbox

ఆర్థిక వ్యవస్థ మార్చు

ఇక్కడి స్థానికప్రజల ప్రధాన వృత్తి వ్యవసాయం.ఈ ప్రాంతంలో ఉత్పత్తి అయ్యే ప్రధాన ఆహారపంట వరి.పట్టణ సమీపంలో అనేక పెద్ద టీ తోటలు ఉన్నాయి.ఇవి ఈ ప్రాంతం నలుమూలల ఉండే కార్మికులకు ఉపాధిని కలిగిస్తున్నాయి.1990 లో సుప్రీంకోర్టు కలపపరిశ్రమను అణిచివేసే వరకు కలప పెద్దపరిశ్రమగా ఉంది. పసిఘాట్ లో పర్యాటకం కొంతవరకు ఉంది.వ్యవసాయం,ఉద్యానవనం పర్యాటకం పట్టణానికి ఆర్థిక వ్యవస్థ ప్రధాన వనర్లుగా కొనసాగుతున్నాయి.

జనాభా మార్చు

 
పసిఘాట్ లోని వివేకానంద కేంద్రీయ విద్యాలయ పాఠశాల

2011 భారత జనాభా లెక్కల ప్రకారం పసిఘాట్ జనాభా మొత్తం 24,656.[7][8] మొత్తం జనాభాలో పురుషులు 50.62% (12,482 మంది), మహిళలు 49.37% (12,174 మంది) ఉన్నారు.పసిఘాట్ సగటు అక్షరాస్యత రేటు 79.6%,ఇది జాతీయ సగటు 59.5% కంటే ఎక్కువగాఉంది.పురుషుల అక్షరాస్యత 85.33%, స్త్రీల అక్షరాస్యత 73.74%.పసిఘాట్‌ జనాభాలో 6 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు గలవారు 12% మంది ఉన్నారు.పసిఘాట్‌లో ప్రధానంగా ఆది ప్రజలు నివసిస్తున్నారు.

సంస్కృతి మార్చు

పసిఘాట్ ప్రజలు రకరకాల పండుగలను జరుపుకుంటారు.వాటిలో సోలుంగ్, అరన్,ఎటోర్ ముఖ్యమైన పండుగలు.ఆది ప్రజలు ప్రధాన పండుగగా పరిగణించబడే సోలుంగ్ పండుగ పురాణాల ప్రకారం సంపద దేవత కైన్-నానే ఈ ఆరాధన లేదా'పూజ'చేయమని,వ్యక్తిగతంగా కోరినప్పుడు ఉనికిలోకి వచ్చిందని నమ్ముతుంటారు సోలుంగ్‌ పండగను సెప్టెంబరు నెలలో ఐదు రోజులు ఆదిప్రజలు జరుపుకుంటారు.మొదటి రోజు లేదా సోలుంగ్ గిడి డాగిన్.ఇది వారు ఈ కార్యక్రమానికి సిద్ధమయ్యే రోజు.డోరెఫ్ లాంగ్,ఇది రెండవ రోజు.జంతువుల వధల రోజు.బిన్యాత్ బినం లేదా మూడవ రోజు ఇది ప్రార్థనల రోజు.ఎకోఫ్ టాక్టర్ నాల్గవ రోజు.ఈ రోజున ఆయుధాలు,మందుగుండు సామగ్రిని తయారు చేస్తారు.మిరి లేదా ఐదవ రోజు వీడ్కోలు రోజుగా పరిగణిస్తారు.సోలుంగ్ సమయంలో మానవులు,జంతువులు,మొక్కలు మొదలైనవాటి జీవితాన్ని చూపించే సోలుంగ్ అబాంగ్ సాహిత్య పాటలు పాడతారు.ఆది ప్రజలు రంగురంగుల పోనుంగ్ నృత్యం,తాపు అనే యుద్ధ నృత్యాలకు నిపుణులు

రవాణా సదుపాయం మార్చు

 
సియాంగ్ నదిపై రాణఘాట్ వంతెన (బ్రహ్మపుత్ర)

పసిఘాట్ జాతీయ రహదారి-51తో అనుసంధానించబడింది.గౌహతి, లఖింపూర్, ఇటానగర్, బ్రగఢ్ నుండి ఫెర్రీ ద్వారా బ్రహ్మపుత్ర నదిని దాటి 32 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓర్యమ్‌ఘాట్ వరకు నుండి తరచూ సేవలు కలిగి ఉన్న జలమార్గం ఉంది.పసిఘాట్ నుండి బస్సు లేదా టాక్సీలో చేరుకోవచ్చు.సమీప ప్రధాన రైలు ప్రయాణ సౌకర్యం ముర్కాంగ్సెలెక్ వద్ద ఉంది.ఇది రంగియా - ముర్కాంగ్సెలెక్ బ్రాడ్ గేజ్ ట్రాక్ టెర్మినల్ స్టేషన్.[9]

227 కిలోమీటర్ల ముర్కాంగ్‌సెలెక్-పసిఘాట్-తేజు-రూపై మార్గం వ్యూహాత్మక ప్రాజెక్టుగా చేపడుతోంది.[10][11] ప్రధాన రైలు మార్గం పసిఘాట్ వరకు విస్తరించాలని ప్రతిపాదించారు.బిజి రైల్వే మార్గం ఉత్తర-అస్సాం ప్రాంతాన్ని పసిఘాట్ పట్టణంతో కలుపుతుంది.రైలు మార్గంద్వారా తూర్పు సియాంగ్ జిల్లా ప్రధాన కార్యాలయం 26.5 కి.మీ. దూరంలో ఉంది.సుమారు 24.5 కి.మీ. మార్గం అరుణాచల్ భూభాగంలో వస్తుంది.2010 లో అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ప్రకటించిన ఈశాన్యంలోని రెండు ప్రధాన రైలు ప్రాజెక్టులలో రంగియా-ముర్కాంగ్సెలెక్ బి.జి.మార్పిడి (పసిఘాట్ వరకు పొడిగింపుతో) ఒకటి. ఈ బ్రాడ్ గేజ్ లైన్ రాష్ట్రంలోని రోయింగ్,పార్సురంకుండ్,రూపై ఇతర ప్రదేశాలకు వెళ్లనుంది.పసిఘాట్- తేజు-పర్షురామ్ కుండ్ కోసం ప్రాథమిక ఇంజనీరింగ్-ట్రాఫిక్ సర్వేను రాష్ట్ర ప్రభుత్వం కోరిక మేరకు ఈశాన్య సరిహద్దు రైల్వేశాఖ నిర్వహించింది.[9] అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర రవాణా సేవలు (ఎపిఎస్టిఎస్) జిల్లాలో మరొక రవాణా మార్గంగా చెప్పవచ్చు.ఇది ఇతర జిల్లాలు,సమీప గ్రామాలతో అనుసంధానించబడి ఉంది.ఎపిఎస్‌టిఎస్ బస్సులు రాష్ట్ర రాజధాని పసిఘాట్ నుండి ఇటానగర్ వరకు పసిఘాట్ నుండి షిల్లాంగ్,మేఘాలయ నుండి గౌహతి మీదుగా రోజూ నడుస్తాయి. ప్రైవేటు ఆపరేటర్లు నడుపుతున్న అస్సాంలోని గౌహతి బస్సు సర్వీసులు అందుబాటులో ఉన్నాయి.అనధికార యాజమాన్యంలోని వింగర్,టాటా సుమో సేవలు కూడా జిల్లా అంతటా ఉన్నాయి.అవి ఇతర జిల్లాల్లో కూడా నడుస్తాయి.అలాగే ఎంచుకున్న వారాంతపు రోజులలో పసిఘాట్ నుండి గౌహతి,తిరిగి గౌహతి నుండి పసిఘాట్ వరకు సాధారణ విమానాలు కూడా ఏప్రిల్ 2018 నుండి ప్రారంభమయ్యాయి.గౌహతి, కోల్‌కతా పసిఘాట్ విమానాశ్రయంతో ఎయిర్ లైన్స్ కూటమి ద్వారా అనుసంధానించబడ్డాయి.

పర్యాటక మార్చు

 
సిసింగ్ నది (బ్రహ్మపుత్ర) పసిఘాట్కు తూర్పున రణఘాట్ వద్ద మైదానంలోకి ప్రవేశిస్తుంది

పసిఘాట్ శక్తివంతమైన సియాంగ్,వేలాడే స్వదేశీ వంతెనలగల ప్రదేశం. జలపాతాలు పర్వత శిఖరాల ఆకర్షిస్తాయి.ఇవి ఆపరిసరాలను చల్లబరుస్తాయి. పట్టణంలోని ఆకర్షణలు:

  • భారతదేశంలోని అరుణాచల్ ప్రదేశ్ లోని డేయింగ్ ఎరింగ్ వన్యప్రాణుల అభయారణ్యం రాష్ట్రంలోని అత్యంత ప్రాచుర్యం పొందిన వన్యప్రాణుల ఉద్యానవనాలలో ఒకటి.190 square kilometres (73 sq mi) విస్తీర్ణంలో విస్తరించి ఉంది.ప్రధాన ప్రాంతంగా చెట్లు కలిగిన ఒండ్రు గడ్డి భూములు 15% ఉంటాయి.మిగిలిన ప్రాంతం నీటితో ఉంది.అభయారణ్యం భూమిని ఎక్కువగా మెబో,మోంగు బాంగోస్ విరాళంగా ఇచ్చారు.ఇది జోపాంగ్ అని పిలువబడుతుంది.
  • బోడాక్ సీనిక్ ఏరియా :బోడాక్-మెబో-జెంగింగ్ సీనిక్ ఏరియా పొరుగు రాష్ట్రాలు,పట్టణాలు నుండి,పసిఘాట్ నివాసితుల నుండి వచ్చే పర్యాటకులకు చెందిన పిక్నిక్ ప్రదేశం.ఇది పసిఘాట్ ప్రధాన పట్టణానికి 15 కిలోమీటర్ల దూరంలో గ్రామాలు,వ్యవసాయ భూములు ఉన్న పెద్ద అటవీ సుందరమైన ప్రాంతం.సియాంగ్ వంతెన నుండి ప్రారంభమయ్యే రహదారి వెంట ఉంది.కుడి వైపున మెబో గ్రామానికి,ఎడమ వైపు జెంగింగ్ గ్రామానికి మారుతుంది.
  • కేకర్ మోనింగ్:ఇది రోటుంగ్ సమీపంలోని ఒక పర్వత శిఖరం.ఇది ఒక ముఖ్యమైన చారిత్రిక ప్రదేశం ఆది ప్రజలు 1911 లో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఒక బలమైన నిరోధక జారీ చేసిన ప్రాంతం.యగ్రంగ్ గ్రామానికి చెందిన మాట్మూర్ జామోహ్ రాజకీయ అధికారి నోయెల్ విలియమ్సన్‌ను హత్య చేసినందుకు బ్రిటిష్ వారు చేపట్టిన శిక్షా యాత్రలో ఈయుద్ధం ఒక భాగం.
  • కొమ్సింగ్ : సియాంగ్ ఎడమ ఒడ్డున ఉన్న ఒక గ్రామం విలియమ్సన్ హత్య జరిగిన ప్రదేశం.నోయెల్ విలియమ్సన్ పేరును కలిగి ఉన్న రాతి సారాంశం ఇప్పటికీ సియాంగ్ సమీపంలో ఉంది.
  • కొమ్లిఘాట్ పూర్వం ఇది నది ఓడరేవుగా ఉండేది.ఈ ఘాట్ వలసరాజ్యాల పట్టణంగా పసిఘాట్ ప్రాంతాన్ని సూచిస్తుంది.ఇది వరద తరువాత సియాంగ్ నదిలో మునిగిపోయింది.నది ఆతరువాత తన మార్గాన్ని మార్చుకుంది.
  • పసిఘాట్ బౌద్ధ దేవాలయం:హైవే నుండి ఎయిర్ స్ట్రిప్ ఎదురుగా ఉన్న ఈ చిన్న ఆలయం పసిఘాట్ లోని ఏకైక బౌద్ధ ఆరాధనా స్థలంగా పనిచేస్తుంది.
  • తూర్పు సియాంగ్ జిల్లా మ్యూజియం:పసిఘాట్ విమానాశ్రయానికి ఎదురుగా ఉన్నఇది తూర్పు సియాంగ్ జిల్లా మ్యూజియం.
  • ఆది బానే కేబాంగ్ ప్రధాన కార్యాలయం:పసిఘాట్‌లో ఆది బానే కేబాంగ్ ప్రధాన కార్యాలయం కూడా ఉంది,ఇది ఆది ప్రజల సాంస్కృతిక,భాషా, సాంప్రదాయ అంశాలను పరిపాలించే వాస్తవ సాంస్కృతిక పార్లమెంటుగా పనిచేస్తుంది.
  • పసిఘాట్ విమానాశ్రయం ఒక మిలిటరీ ఎయిర్‌స్ట్రిప్.దీనికి ఉన్నత శ్రేణి కల్పించి ప్రజల ప్రయాణ సౌకర్యాలు తీర్చడానికి పౌర విమానాశ్రయంగా ఉపయోగించబడుతోంది.
  • గోమ్సి :రాణి గ్రామానికి సమీపంలో ఒక సాగుప్రాంతం చారిత్రక ప్రాముఖ్యత కలిగిన మరొక ప్రదేశం.జూన్ 1996 లోఆర్కియాలజీ ఆఫ్ రీసెర్చ్ డిపార్ట్మెంట్ డిప్యూటీ డైరెక్టర్ టి. టాడా నేతృత్వంలోని పురావస్తు శాస్త్రవేత్తల బృందం ఈ ప్రదేశంలో ట్రయల్ తవ్వకం,సర్వే నిర్వహించింది.ప్రారంభ మధ్యయుగ కాలం (బహుశా ప్రీ-అహోమ్) గత సంస్కృతి విభిన్న సాక్ష్యాలను వారు కనుగొన్నారు.

ఇది కూడ చూడు మార్చు

మూలాలు మార్చు

  1. "Census of India Search details". censusindia.gov.in. Retrieved 10 May 2015.
  2. "1977 Sikkim government gazette" (PDF). sikkim.gov.in (in ఇంగ్లీష్). Governor of Sikkim. p. 188. Archived from the original (PDF) on 22 July 2018. Retrieved 28 May 2019.
  3. "50th Report of the Commissioner for Linguistic Minorities in India" (PDF). 16 July 2014. p. 109. Archived from the original (PDF) on 2 January 2018. Retrieved 28 May 2019.
  4. Pasighat: Oldest town of Arunachal Pradesh Archived 26 జనవరి 2011 at the Wayback Machine.
  5. "JAWAHARLAL NEHRU COLLEGE". Retrieved June 17, 2020.
  6. Falling Rain Genomics, Inc - Pasighat
  7. "Census of India 2001: Data from the 2001 Census, including cities, villages and towns (Provisional)". Census Commission of India. Archived from the original on 16 June 2004. Retrieved 1 November 2008.
  8. ORGI. "Census of India Website : Office of the Registrar General & Census Commissioner, India". censusindia.gov.in. Retrieved 2017-11-13.
  9. 9.0 9.1 "Solace to suffering humanity would surface from Arunachal, believes Shankaracharya". ANI. Archived from the original on 19 August 2014. Retrieved 16 January 2014.
  10. India to construct strategic railway lines along border with China, Hindustan Times, 30 Nov 2016.
  11. 2019 target to survey 3 strategic rail lines along China border, Arunachal Observer, January 5, 2019.

వెలుపలి లంకెలు మార్చు

"https://te.wikipedia.org/w/index.php?title=పసిఘాట్&oldid=3895249" నుండి వెలికితీశారు