పినాకిని ఎక్స్‌ప్రెస్

పినాకిని ఎక్స్‌ప్రెస్ అనే బండి భారతదేశం లోని ఆంధ్ర ప్రదేశ్ లోని విజయవాడ జంక్షన్, తమిళనాడు లోని చెన్నై ల మధ్య నడిచే వేగమైన రైలు. ఈ బండి 1991 లో నడపబడింది. పెన్నా నది పేరు మీదగా ఈ బండికి పినాకిని అని పేరు పెట్టినారు. భారతీయ రైల్వే లోని దక్షిణ మధ్య రైల్వే లోని విజయవాడ రైల్వే విభాగం దీనిని నడుపుచున్నది.

పినాకిని ఎక్స్‌ప్రెస్
సారాంశం
రైలు వర్గంవేగమైన రైలు
స్థానికతఆంధ్ర ప్రదేశ్
ప్రస్తుతం నడిపేవారుదక్షిణ మధ్య రైల్వే
మార్గం
మొదలువిజయవాడ
ఆగే స్టేషనులు13
గమ్యంచెన్నై
ప్రయాణ దూరం431 km (268 mi)
సగటు ప్రయాణ సమయం7 గంటలు
రైలు నడిచే విధంప్రతి రోజు
సదుపాయాలు
శ్రేణులుశీతలీకారణ, రెండవ శ్రేణి కూర్చొనుట, అరక్షితము
కూర్చునేందుకు సదుపాయాలుఉంది
పడుకునేందుకు సదుపాయాలులేదు
ఆహార సదుపాయాలుఉంది
సాంకేతికత
పట్టాల గేజ్1,676 mm (5 ft 6 in)
వేగం60 km/h (37 mph) సగటు వేగము
మార్గపటం

జోను , డివిజను మార్చు

ఈ ఎక్స్‌ప్రెస్ రైలు భారతీయ రైల్వేలు లోని దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలోకి వస్తుంది.

తరచుదనం (ఫ్రీక్వెన్సీ) మార్చు

ఈ రైలు వారానికి ఏడు రోజులు నడుస్తుంది.

బండి సంఖ్య మార్చు

విజయవాడ నుండి చెన్నై వెళ్ళేటప్పుడు 12711 గా నడుచును, తిరుగు ప్రయాణంలో 12712 గా నడుచును.[1][2]

ప్రయాణ దారి మార్చు

సౌకర్యాలు మార్చు

పినాకిని ఎక్స్‌ప్రెస్ సాధారణంగా LGD WAP4 / WAP7 ఇంజనుచే లాగబడుచున్నది. ఈ బండికి సాధారణంగా మొత్తం 24 పెట్టెలు ఉండును దానిలో ఒక పాంట్రీ, 2 శీతలీకరణ పెట్టెలు, 8 రెండవ శ్రేణి సిట్టింగ్, 11 అరక్షిత పెట్టెలు ఉండును.

ట్రివియా మార్చు

  • పినాకిని ఎక్స్‌ప్రెస్ దక్షిణ మధ్య రైల్వే లోనే మొదటి హరిత మరుగుదొడ్లు (గ్రీన్ టాయ్లెట్స్) ఉన్న రైలు.[3]
  • పినాకిని ఎక్స్‌ప్రెస్ యొక్క సోదర రైళ్ళు రత్నాచల్ ఎక్స్‌ప్రెస్, శాతవాహన ఎక్స్‌ప్రెస్ . ఈ మూడు బండ్లు విజయవాడ నుండి చెన్నై, విశాఖపట్నం, సికంద్రాబాద్ కు ఒకే సమయానికి (06:10) బయలుదేరును. తిరిగి రాత్రికల్లా విజయవాడ వచ్చి చేరును.

ఇవి కూడా చూడండి మార్చు

మూలాలు మార్చు

  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-03-04. Retrieved 2015-10-01.
  2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-03-04. Retrieved 2015-10-01.
  3. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2008-04-01. Retrieved 2015-10-01.