పీర్ల పండుగ : మొహరం పండుగును తెలుగు ప్రాంతాల్లో పీర్ల పండుగ అంటారు. షియా తెగ వాళ్ళు ఈ పండుగను పాటిస్తారు. దైవప్రవక్త ముహమ్మదుగారి మనమళ్ళు హసన్, హుసేన్ ల వీరోచిత ప్రాణత్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ పీరుల్ని ఊరేగిస్తారు. రక్తంకారేలా ఒళ్ళు కోసుకుంటారు, కొరడాలతో కొట్టుకుంటారు. నిప్పుల గుండం తొక్కుతారు. పీరుల్ని పీర్లచావడిలో ఉంచుతారు. ఇందులో హిందువులు కూడా ఎక్కువగా పాల్గొంటారు. ఇస్లాంలో ఇలాంటి హేతువులేని విషయాలను మూలం చేసుకునే పండుగలకు స్థానం ఇవ్వరు కాబట్టి ఈ పీర్ల పండుగకు వ్యతిరేకంగా ఫత్వాలు ఉన్నాయి. అందుకే ఈ విషయం నిషిద్దం అని తెలిసే కొద్దీ ఈ పండుగను ఆచరించేముస్లిముల సంఖ్య తగ్గుతోంది. "ఊదు వేయందే పీరు లేవదు". ఊదు అంటే సాంబ్రాణి పొగ. పీరమ్మ, పీరుసాయిబు అనే పేర్లు తెలుగునాట ప్రసిద్ధి.

పీరు
పీర్ల పండుగ ఉత్సవంలో పీర్ల ఊరేగింపు
పీర్ల పండుగ ఊరేగింపు

పీరు మార్చు

పీరు అనే పదం సూఫీతత్వానికి సంబంధించింది. పీరు అనగా గురువు, "ఆధ్యాత్మిక గురువు".

కానీ కొద్ది మంది ఈ "పంజా" లేదా "నిషాన్" లేదా "అలం" (జెండా) ను "పీరు" అనే పేరు పెట్టేసారు. అది అదే పేరుతొ చాలా కాలం కొనసాగింది. ఈ పంజా (పీరు) మొహర్రం నెలలోని మొదటి 'అష్రా' (పదిరోజులు) లో జరిపుకొను ఉత్సవాలలో ఉపయోగించే, 'పంజా' లేదా 'అలమ్' (జెండా). ఇత్తడి పళ్ళాల్లాంటివి కర్ర లకు తొడిగి పీర్ల పండుగలో ఊరేగిస్తారు. కర్బలా యుద్ధంలో, ఇమామ్ హుసేన్, వారి కుటుంబీకులు ఉపయోగించిన, కరవాలాలు, డాలులు, జెండాలకు చెందిన నమూనాలు, ఈ రోజుల్లో, వారి అమరత్వాన్ని గుర్తించుకొంటూ, స్మరించుకొంటూ ఊరేగిస్తారు.

ఇవీ చూడండి మార్చు