మండవ వెంకటేశ్వర రావు

మండవ వెంకటేశ్వర రావు తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిచ్‌పల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుండి నాలుగు సార్లు, నిజామాబాద్‌ రూరల్‌ నియోజకవర్గం నుండి ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచి ఎక్సైజ్‌ శాఖ, విద్యా శాఖ, భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా పని చేశాడు.

మండవ వెంకటేశ్వర రావు
మండవ వెంకటేశ్వర రావు


మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే
నియోజకవర్గం డిచ్‌పల్లి అసెంబ్లీ నియోజకవర్గం
నిజామాబాద్‌ రూరల్‌ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 1950
నిజామాబాద్ జిల్లా, తెలంగాణ, భారతదేశం
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ భారత్ రాష్ట్ర సమితి
ఇతర రాజకీయ పార్టీలు తెలుగుదేశం పార్టీ
నివాసం హైదరాబాద్

రాజకీయ జీవితం సవరించు

మండవ వెంకటేశ్వర రావు తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి డిచ్‌పల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుండి 1985లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి అంతరెడ్డి బాల్ రెడ్డి పై 7726 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.ఆయన 1989, 1994, 1999 ఎన్నికల్లో వరుసగా నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు.

మండవ వెంకటేశ్వరరావు 1995లో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా, 1997లో నారా చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో ఎక్సైజ్‌ శాఖమంత్రిగా పని చేశాడు. మండవ వెంకటేశ్వరరావు 1999 ఎన్నికల్లో గెలిచిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా మూడేళ్ల పాటు పని చేసి, 2002లో విద్యాశాఖ మంత్రిగా భాద్యతలు నిర్వహించాడు.[1]

మండవ వెంకటేశ్వరరావు 2004లో ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి టీఆర్ఎస్ అభ్యర్థి గడ్డం గంగారెడ్డి చేతిలో ఓటమి పాలయ్యాడు. ఆయన 2008 (ఉప ఎన్నిక) 2009, 2010 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత 2014లో జరిగిన ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నాడు.

హైదరాబాద్‌లోని మండవ వెంకటేశ్వరరావు ఇంటికి 05 ఏప్రిల్ 2019న వెళ్లిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆయనను పార్టీలోకి రావాలని ఆహ్వానించాడు.[2] ఆయన ఏప్రిల్ 06వ తేదీన ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరాడు.[3][4]

మూలాలు సవరించు

  1. Sakshi (3 November 2018). "నిజామాబాద్‌ నియోజకవర్గా ఎన్నికల రివ్యూ". Archived from the original on 25 November 2021. Retrieved 25 November 2021.
  2. TV9 Telugu (5 April 2019). "టీఆర్ఎస్‌లోకి టీడీపీ నేత మండవ.. ఇంటికెళ్లి ఆహ్వానించిన కేసీఆర్". Archived from the original on 25 November 2021. Retrieved 25 November 2021.
  3. Sakshi (6 April 2019). "టీఆర్‌ఎస్‌లో చేరిన మండవ, గాయత్రి రవి". Archived from the original on 25 November 2021. Retrieved 25 November 2021.
  4. 10TV (6 April 2019). "టీడీపీకి షాక్ : టీఆర్ఎస్‌లో చేరిన మండవ వెంకటేశ్వరరావు" (in telugu). Archived from the original on 25 November 2021. Retrieved 25 November 2021.{{cite news}}: CS1 maint: unrecognized language (link)