మధు యాష్కీ గౌడ్

(మధు యస్కీ గౌడ్ నుండి దారిమార్పు చెందింది)

మధు యాష్కీ గౌడ్ (జ: 15 డిసెంబర్ 1960) తెలంగాణ రాష్ట్ర రాజకీయ నాయకుడు. ఇతడు 2004లో 14వ, 2009లో 15వ లోక్‌సభకు ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లోని నిజామాబాదు లోకసభ నియోజకవర్గం నుండి భారత జాతీయ కాంగ్రెసు అభ్యర్థిగా ఎన్నికయ్యారు. మధు యాష్కీని తెలంగాణ పీసీసీ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ చైర్మన్‌ గా 26 జూన్ 2021లో జాతీయ కాంగ్రెస్ పార్టీ నియమించింది.[1][2]

మధు యాష్కీ గౌడ్
మధు యాష్కీ గౌడ్


తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ చైర్మన్‌ & మాజీ పార్లమెంటు సభ్యుడు
నియోజకవర్గం నిజామాబాదు

వ్యక్తిగత వివరాలు

జననం (1960-12-15) 1960 డిసెంబరు 15 (వయసు 62)
హైదరాబాదు, తెలంగాణ
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెసు
జీవిత భాగస్వామి శుచీ మధు
సంతానం 2 కూతుర్లు
నివాసం హైదరాబాదు
వెబ్‌సైటు http://www.madhuyaskhi.com
September 26, 2006నాటికి

వ్యక్తిగత విషయాలుసవరించు

మధు యాష్కీ గౌడ్ రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ లో డిసెంబరు 15, 1960 కృష్ణయ్య, సులోచన దంపతులకు జన్మించాడు. ఇతన్ని చిన్నాన్న పోచయ్య, అనసూయ దంపతులు పెంచుకున్నారు. మధు యాష్కీ కి ముగ్గురు అన్నదమ్ములు, ఆరుగురు అక్క చెల్లెలు. వారి తల్లితండ్రులకు ఆయన నాల్గొవ సంతానం. ఆయన పదవ తరగతి వరకు జిల్లా పరిషత్ పాఠశాలలో చదువుకున్నాడు. హైదరాబాద్ సిటీ కాలేజీ లో ఇంటర్మీడియట్ పూర్తి చేశాడు. యాష్కీ 1982లో నిజాం కళాశాల నుండి బి.ఎ., 1985లో ఢిల్లీ విశ్వవిద్యాలయం నుండి ఎల్.ఎల్.బి. 1989లో ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి ఎల్.ఎల్.ఎమ్. పట్టాలు పొందారు. ఆయన 20 జూన్ 1991లో డా. సుచీ దేవి ని వివాహమాడాడు. వీరికి ఇద్దరు కూతుర్లు కోమలి, గగన.

రాజకీయ జీవితంసవరించు

మధు యాష్కీ 2004 లో క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చాడు. అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నుండి 2004లో నిజామాబాదు స్థానం నుండి పోటీ చేసి పార్లమెంట్ లోకి తొలిసారి అడుగు పెట్టాడు. ఆయన రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుల్లో ఒక్కడు. 2007లో ఏఐసిసి కార్యదర్శిగా నియమితుడయ్యాడు. 2009 లో నిజామాబాదు స్థానం నుండి తిరిగి లోక్ సభకు ఎన్నికయ్యాడు. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొన్నాడు. తెలంగాణ వాణి ని ఎప్పటికప్పుడు అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళేవాడు. 2014లో పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమి అనంతరం 2015లో ఆయనను ఏఐసీసీ అధికార ప్రతినిధిగా కాంగ్రెస్ హై కమాండ్ నియమించింది.

జీవిత విశేషాలుసవరించు

  • మధు యాష్కీ న్యూయార్క్ అటార్నీ, అంతర్జాతీయ న్యాయం, వ్యాపారంలో కన్సల్టంట్ గా అమెరికాలోని ప్రవాస భారతీయులకు సహాయపడుతున్నారు.
  • మధు యాష్కీ 2004 లో భారత పార్లమెంటుకు ఎన్నికోబడిన ప్రథమ, ఏకైక ప్రవాస భారతీయుడు.

పురస్కారాలుసవరించు

  • ప్రవాస భారతీయునిగా 2005లో ఎన్నుకోబడ్డారు.

సంఘ సేవసవరించు

  • మధు యాష్కీ ఫౌండేషన్ అనే సేవా సంస్థను 2003లో స్థాపించి, పేదలకు ఆర్థిక సాయం, పేద విద్యార్ధులకు విద్య చెప్పిస్తున్నారు.

మూలాలుసవరించు

  1. Outlook India. "Cong MP A Revanth Reddy appointed new Telangana PCC chief". Outlook India. Archived from the original on 26 జూన్ 2021. Retrieved 26 June 2021.
  2. Andhrajyothy (27 June 2021). "టీపీసీసీలో జిల్లా నేతలకు కీలక పదవులు". andhrajyothy. Archived from the original on 27 జూన్ 2021. Retrieved 27 June 2021.