మల్కాపురం (తుళ్ళూరు)

ఆంధ్రప్రదేశ్, గుంటూరు జిల్లా, తుళ్ళూరు మండలంలోని గ్రామం
(మల్కపురం (తుళ్ళూరు మండలం) నుండి దారిమార్పు చెందింది)

మల్కాపురం, గుంటూరు జిల్లా తుళ్ళూరు మండలం లోని గ్రామం.ఇది మండల కేంద్రమైన తుళ్ళూరు నుండి 9 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన మంగళగిరి నుండి 12 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 412 ఇళ్లతో, 1360 జనాభాతో 222 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 661, ఆడవారి సంఖ్య 699. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 679 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 117. గ్రామ జనగణన లొకేషన్ కోడ్ 589972.[1] రాణి రుద్రమదేవి స్థాపించిన గోళకి మఠం గురించిన శాసనం ఇక్కడ ఉంది.[2]

మల్కాపురం
—  రెవెన్యూ గ్రామం  —
మల్కాపురం is located in Andhra Pradesh
మల్కాపురం
మల్కాపురం
అక్షాంశరేఖాంశాలు: 16°33′28″N 80°27′47″E / 16.557885°N 80.463066°E / 16.557885; 80.463066
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా గుంటూరు
మండలం తుళ్ళూరు
ప్రభుత్వం
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 1,360
 - పురుషుల సంఖ్య 661
 - స్త్రీల సంఖ్య 699
 - గృహాల సంఖ్య 412
కాలాంశం భారత ప్రామాణిక కాలమానం (UTC)
పిన్ కోడ్ 522237
ఎస్.టి.డి కోడ్

గ్రామ చరిత్ర మార్చు

1199 AD నుండి 1261AD వరకు ఈ ప్రాంతాన్ని కాకతీయ చక్రవర్తి గణపతి దేవుడు పరిపాలించారు. ఆకాలంలో శైవ మతం ఉచ్చస్థితిలో ఉంది. శైవులు దేశం నలుమూలల అనేక మఠాలు నెలకొల్పి ప్రజాసేవ చేసారు. ఈ శైవ మఠాలలో దాహళ దేశం నుండి వచ్చిన గోళకీ మఠము సుప్రసిద్దమైనది. ఈ మఠానికి మందడం ప్రధాన కేంద్రం. ఈ మఠానికి అనుభంధంగా వేద పాఠశాలు, సత్రాలు, దేవాలయాలతో పాటు ప్రసూతి ఆరోగ్య శాలలు ఉండేవి. ఈ గోళకీ మఠము యొక్క మఠాధిపతి విశ్వేశర శివ దేశికులు. వీరు కాకతీయ చక్రవర్తి గణపతి దేవునికి శివ దీక్షను ఇచ్చారు, ఈ గోళకీ మఠము నిర్వహణ నిమిత్తం వెలగపూడి, మందడ గ్రామాలను మందడంలో ఉన్న ఆధ్యాత్మిక గురువు శివచర్యకు బహుమతిగా ఇచ్చారు[2].

ఈ గ్రామం లోనే కాకతీయ చక్రవర్తి వేయించిన శిలా శాసనం మల్కాపురం శాసనం కూడా ఇక్కడ చూడవచ్చు. ఈ శాసనం 2.9x2.9 అడుగుల చతురస్రాకారపు ఒక నల్ల రాతి శిలా స్తంభం. దీని ఎత్తు 14.6 అడుగులు. తెలుగు సంస్కృత భాషలలో 182 పంక్తులలో రాణి రుద్రమదేవి జన్మించిన శుభ సందర్భంగా విశ్వేశర గోళకీ మఠముకు ఇచ్చిన భూదానం గురించి చెక్కబడింది.[2][3]

గ్రామ పరిపాలన - సి.ఆర్.డి.ఏ మార్చు

సీఆర్‌డీఏ పరిధిలోకి వస్తున్న మండలాలు, గ్రామాలను ప్రభుత్వం విడిగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం గుర్తించిన వాటిలోని చాలా గ్రామాలు వీజీటీఎం పరిధిలో ఉన్నాయి. గతంలో వీజీటీఎం పరిధిలో ఉన్న వాటితోపాటుగా ఇప్పుడు మరిన్ని కొన్ని గ్రామాలు చేరాయి. సీఆర్‌డీఏ పరిధిలోకి వచ్చే గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని మండలాలు, గ్రామాలను గుర్తిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. తుళ్లూరు మండలం పరిధిలో: లింగాయపాలెం, దాని పరిధిలో ఉన్న ఆవాస ప్రాంతాలు (హామ్లెట్స్), మోదుగు లంకపాలెం, ఉద్దండ రాయుని పాలెం, వెలగపూడి, నేలపాడు, శాకమూరు, ఐనవోలు, మల్కాపురం, మందడంతో పాటు దాని పరిధిలో ఉన్న హామ్లెట్స్, వెంకటపాలెం, అనంతవరం, నెక్కల్లు, తుళ్లూరు, దొండపాడు, అబ్బరాజుపాలెం, రాయపూడి, బోరుపాలెం, కొండ్రాజుపాలెం, పిచుకల పాలెం, ఉండవల్లి, పెనుమాక, తాడేపల్లి మున్సిపాలిటీ పరిధిలోని నులకపేట, డోలస్ నగర్ ప్రాంతాలు ఉన్నాయి.

గుంటూరు జిల్లా పరిధిలోని మండలాలు మార్చు

తాడేపల్లి, మంగళగిరి, తుళ్లూరు, దుగ్గిరాల, తెనాలి, తాడికొండ, గుంటూరు మండలం, చేబ్రోలు, మేడికొండూరు, పెదకాకాని, వట్టిచెరుకూరు, అమరావతి, కొల్లిపర, వేమూరు, కొల్లూరు, అమృతలూరు, చుండూరు మండలాలతో పాటు ఆయా మండలాల పట్టణ ప్రాంతం కూడా సీఆర్‌డీఏ పరిధిలోకి వస్తుంది.

సమీప గ్రామాలు మార్చు

ఉద్దండరాయునిపాలెం 1 కి.మీ, మందడం 1 కి.మీ, లింగాయపాలెం 3 కి.మీ, ఐనవోలు 3 కి.మీ, తుళ్ళూరు 4 కి.మీ.

విద్యా సౌకర్యాలు మార్చు

గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఒకటి ఉంది. సమీప బాలబడి, ప్రాథమిక పాఠశాల తుళ్ళూరులోను, ప్రాథమికోన్నత పాఠశాల మందడంలోను, మాధ్యమిక పాఠశాల మందడంలోనూ ఉన్నాయి. సమీప జూనియర్ కళాశాల, ప్రభుత్వ ఆర్ట్స్, సైన్స్, డిగ్రీ కళాశాల తుళ్ళూరులోను, ఇంజనీరింగ్ కళాశాల మంగళగిరిలోనూ ఉన్నాయి. సమీప వైద్య కళాశాల, మేనేజిమెంటు కళాశాల మంగళగిరిలోను, పాలీటెక్నిక్ విజయవాడలోనూ ఉన్నాయి. సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల, అనియత విద్యా కేంద్రం విజయవాడలోను, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల గుంటూరు లోనూ ఉన్నాయి.

వైద్య సౌకర్యం మార్చు

ప్రభుత్వ వైద్య సౌకర్యం మార్చు

మల్కాపురంలో ఉన్న ఒక ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో డాక్టర్లు లేరు. ఒకరు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. డిస్పెన్సరీ, పశు వైద్యశాల గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, సంచార వైద్య శాల, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.

ప్రైవేటు వైద్య సౌకర్యం మార్చు

తాగు నీరు మార్చు

గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది.

పారిశుధ్యం మార్చు

గ్రామంలో మురుగునీటి పారుదల వ్యవస్థ లేదు.మురుగునీటిని శుద్ధి ప్లాంట్‌లోకి పంపిస్తున్నారు.గ్రామం సంపూర్ణ పారిశుధ్య పథకం కిందకు రావట్లేదు.సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు.ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు.సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.

సమాచార, రవాణా సౌకర్యాలు మార్చు

మల్కాపురంలో సబ్ పోస్టాఫీసు సౌకర్యం గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. పోస్టాఫీసు సౌకర్యం గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. లాండ్ లైన్ టెలిఫోన్, మొబైల్ ఫోన్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. పబ్లిక్ ఫోన్ ఆఫీసు, ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. ప్రైవేటు బస్సు సౌకర్యం, రైల్వే స్టేషన్ మొదలైన సౌకర్యాలు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. ప్రధాన జిల్లా రహదారి గ్రామం గుండా పోతోంది. జిల్లా రహదారి గ్రామం నుండి 5 కి.మీ. దూరంలోపు ఉంది. జాతీయ రహదారి, రాష్ట్ర రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు ఉన్నాయి.

మార్కెటింగు, బ్యాంకింగు మార్చు

గ్రామంలో వ్యవసాయ పరపతి సంఘం ఉంది. గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం ఉన్నాయి. ఏటీఎమ్, వాణిజ్య బ్యాంకు గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉన్నాయి. సహకార బ్యాంకు గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. రోజువారీ మార్కెట్, వారం వారం సంత, వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి.

ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు మార్చు

గ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది.అసెంబ్లీ పోలింగ్ కేంద్రం, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. గ్రంథాలయం, పబ్లిక్ రీడింగ్ రూం గ్రామం నుండి 5 కి.మీ.లోపు దూరంలో ఉన్నాయి. ఆటల మైదానం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. సినిమా హాలు గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది.

విద్యుత్తు మార్చు

గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి విద్యుత్ సరఫరా చేస్తున్నారు.

భూమి వినియోగం మార్చు

మల్కాపురంలో భూ వినియోగం కింది విధంగా ఉంది:

  • వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 15 హెక్టార్లు
  • వ్యవసాయం సాగని, బంజరు భూమి: 1 హెక్టార్లు
  • నికరంగా విత్తిన భూమి: 204 హెక్టార్లు
  • నీటి సౌకర్యం లేని భూమి: 180 హెక్టార్లు
  • వివిధ వనరుల నుండి నీటి పారుదల లభిస్తున్న భూమి: 24 హెక్టార్లు

నీటిపారుదల సౌకర్యాలు మార్చు

మల్కాపురంలో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది

  • బావులు/బోరు బావులు: 14 హెక్టార్లు

ఉత్పత్తి మార్చు

మల్కాపురంలో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.

ప్రధాన పంటలు మార్చు

ప్రత్తి, మిరప, చెరకు

గ్రామంలో మౌలిక వసతులు మార్చు

ఈ గ్రామంలో 1,000 Archived 2021-07-28 at the Wayback Machine కోట్ల రూపాయల అంచనా వ్యయంతో, 220/132/33 కె.వి., గ్యాస్ ఇన్సులేటెడ్ విద్యుత్తు ఉప కేంద్రం (సబ్-స్టేషను) ఏర్పాటుకు ట్రాన్స్ కో (TRANSCO) ప్రతిపాదించింది. ఈ కేంద్రంలో హుద్ హుద్ తుఫాను వంటి విపత్తులనెదుర్కొనడానికి దీటుగా, భూగర్భ విద్యుత్తు సరఫరా వ్యవస్థను అమలులోనికి తీసుకొనిరాబోతున్నారు. ఇందుకు నిర్మాణవ్యయం పది రెట్లు ఎక్కువైనప్పటికీ ప్రభుత్వం దీనివైపే మొగ్గుచూపినది. ఈ విద్యుత్తు ఉపకేంద్రం నవ్యాంధ్రలోనే మొట్టమొదటిదిగా గుర్తింపుపొందనున్నది. [4]

గ్రామ పంచాయతీ మార్చు

1960లో మల్కాపురం గ్రామపంచాయతీ సర్పంచిగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన శ్రీ గద్దే రత్తయ్య గారు, తాడికొండ నియోజకవర్గానికి తొలి ఎం.ఎల్.ఏగా ఎన్నికై, 1967 నుండి 1978 వరకూ పదవిలో ఉన్నారు. 1978 నుండి 1983 వరకూ మంగళగిరి ఎం.ఎల్.ఏగా ఉన్నారు. ఈయనమాజీ రాష్ట్రపతి శ్రీ నీలం సంజీవరెడ్డిగారికి అత్యంత సన్నిహితులు. 1960లో జిల్లాలో మొదటిసారి, రక్షిత మంచినీటిపథకం ఏర్పాటుచేసి, అప్పటి విద్యాశాఖామంత్రి శ్రీపి.బి.పట్టాభిరామారావుగారి చేతులమీదుగా ప్రారంభింపజేశారు. గ్రామపంచాయతీ సర్పంచిగా, పొగాకుబోర్డు సభ్యులుగా, శాసనసభ్యులుగా ప్రజాసేవకు పునరంకితమయ్యారు. 1973 లో అప్పటి రాష్ట్ర గవర్నరు శ్రీ మోహనలాల్ సుఖాడియాను తాడికొండకు రప్పించి, అక్కదేవత చెరువులో రైతులకు పట్టాలిప్పించారు. మల్కాపురంలో రెండు విడతలుగా దళితులకు నివేశనస్థలాలు పంపిణీ చేశారు. కృష్ణానది కరకట్ట నిర్మాణంలో వీరి పాత్ర కీలకం. సీతానగరం నుండి వైకుంఠపురం వరకూ, నిర్మించిన కరకట్ట నేడు 100 గ్రామాలకు వరద ముంపు నుండి రక్షిస్తోంది. వైకుంఠపురం వద్ద ఫేజ్-1 ఎత్తిపోతల పథకాన్ని రత్తయ్యగారు మంజూరు చేయించి నిర్మింపజేశారు. రైతులకు ఉపయోగపడే పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు.

గామంలో ప్రధాన వృత్తులు మార్చు

వ్యవసాయం. వ్యవసాయాధారిత వృత్తులు

గణాంకాలు మార్చు

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 1,274. ఇందులో పురుషుల సంఖ్య 623, స్త్రీల సంఖ్య 651, గ్రామంలో నివాస గృహాలు 334 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణము 222 హెక్టారులు.

మూలాలు మార్చు

  1. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".
  2. 2.0 2.1 2.2 శ్రీనివాస్, కొడాలి (2020). అమారావతి - ఆవశ్యకత. గుంటూరు: రాయల్ సివిల్ పబ్లికేషన్.
  3. "13వ శతాబ్దానికి చెందిన శాశనాలు వెలగపూడి సమీపంలో దొరికాయి". The Hindu. Amaravati. 17 May 2015. Retrieved 12 May 2019.