సీతాదయాకర్ రెడ్డి
సీతాదయాకర్ రెడ్డి, తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ తరపున దేవరకద్ర శాసనసభ నియోజకవర్గం నుండి 2009లో ప్రాతినిథ్యం వహించింది.[1]
సీతాదయాకర్ రెడ్డి | |||
![]()
| |||
తెలంగాణ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్
ఛైర్పర్సన్ | |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 2025 ఏప్రిల్ 3 | |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 2009 - 2014 | |||
తరువాత | ఆల వెంకటేశ్వర్ రెడ్డి | ||
---|---|---|---|
నియోజకవర్గం | దేవరకద్ర | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 1961 అక్టోబర్ 27 సదాశివనగర్, నిజామాబాద్ జిల్లా, తెలంగాణ, భారతదేశం | ||
జాతీయత | భారతీయురాలు | ||
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ | ||
ఇతర రాజకీయ పార్టీలు | తెలుగుదేశం పార్టీ | ||
జీవిత భాగస్వామి | కొత్తకోట దయాకర్ రెడ్డి | ||
నివాసం | హైదరాబాద్, తెలంగాణ, భారతదేశం |
జననం - విద్యాభ్యాసం
మార్చుసీతాదయాకర్ రెడ్డి 1961, అక్టోబరు 27న కామినేని రాజేశ్వరరావు, భారతి దంపతులకు నిజామాబాద్ జిల్లా, సదాశివనగర్లో జన్మించింది. ఆర్.బి.వి.ఆర్.ఆర్. మహిళా కళాశాలలో ఇంటర్ (1977-79), బి.ఏ. (1979-82) చదివింది. 1982-84 మధ్యకాలంలో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎం.ఏ. సోషియాలజీ చదివింది.[2]
వివాహం - పిల్లలు
మార్చు1984, ఫిబ్రవరి 3న కొత్తకోట దయాకర్ రెడ్డితో సీతాదయాకర్ రెడ్డి వివాహం జరిగింది. వీరికి ఇద్దరు అబ్బాయిలు (సిద్ధార్థ, కార్తీక్).[3]
రాజకీయరంగ ప్రస్థానం
మార్చుసీతాదయాకర్ రెడ్డి 1994లో రాజకీయాల్లోకి ప్రవేశించి 2001లో దేవరకద్ర జడ్పీటీసి సభ్యులుగా విజయం సాధించి, జిల్లా పరిషత్ చైర్పర్సన్గా ఎన్నికయింది. 2009లో కొత్తగా ఏర్పడిన దేవరకద్ర శాసనసభ నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ తరఫున సీతాదయాకర్ రెడ్డి పోటీ చేయగా, కాంగ్రెస్ పార్టీ తరఫున స్వర్ణ సుధాకర్, భారతీయ జనతా పార్టీ నుండి భరత్ భూషణ్, ప్రజారాజ్యం పార్టీ తరఫున కె.ఎస్.రవి కుమార్, లోక్సత్తా పార్టీ తరఫున కృష్ణకుమార్ రెడ్డి పోటీ చేశారు. ప్రధానపోటీ తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీల మధ్య జరుగగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సీతాదయాకర్ రెడ్డి తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి స్వర్ణ సుధాకర్ రెడ్డి పై 19034 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించింది.[4][5]
సీతాదయాకర్ రెడ్డి 2014 శాసనసభ ఎన్నికలలో తెలంగాణ రాష్ట్ర సమితి తరపున పోటీచేసిన ఆల వెంకటేశ్వర్ రెడ్డి చేతిలో పరాజయం పొందింది.
సీతా దయాకర్ రెడ్డి 2023 సెప్టెంబర్ 11న హైదరాబాద్ గాంధీభవన్లో కాంగ్రెస్ రాష్ట్ర ఇంఛార్జ్ మాణిక్రావ్ ఠాక్రే, పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరింది.[6][7] ఆమె 2025 ఏప్రిల్ 3న రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఛైర్పర్సన్గా నియమితురాలై ఏప్రిల్ 4న భాద్యతలు చేపట్టింది.[8][9]
మూలాలు
మార్చు- ↑ 10tv Mahaboobnagar. "THURSDAY, 12 SEPTEMBER 2013 జిల్లా నుంచి గెలిచిన ప్రస్తుత ప్రజాప్రతినిధులు". 10tvmahaboobnagar.blogspot.in. Retrieved 16 May 2017.
{{cite web}}
: CS1 maint: numeric names: authors list (link)[permanent dead link] - ↑ మైనేత.కాం. "Seetha Dayakar Reddy". myneta.info. Retrieved 16 May 2017.
- ↑ Sakshi (17 April 2014). "సీతమ్మ వెనక తోడు'నీడ'". Archived from the original on 2 August 2021. Retrieved 2 August 2021.
- ↑ EENADU (9 November 2023). "అతివలకు అవకాశం తక్కువే". Archived from the original on 9 November 2023. Retrieved 9 November 2023.
- ↑ Eenadu (26 October 2023). "అంచెలంచెలుగా ఎదిగి అసెంబ్లీకి". Archived from the original on 26 October 2023. Retrieved 26 October 2023.
- ↑ "కాంగ్రెస్లో చేరిన మాజీ ఎమ్మెల్యే సీతా దయాకర్ రెడ్డి". Mana Telangana. 11 September 2023. Archived from the original on 4 April 2025. Retrieved 4 April 2025.
- ↑ "కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ ఎమ్మెల్యే.. ఆమె వల్లే అప్పట్లో కేసీఆర్ ఎంపీ అయ్యారన్న రేవంత్ రెడ్డి". 10TV Telugu. 11 September 2023. Archived from the original on 4 April 2025. Retrieved 4 April 2025.
- ↑ "బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఛైర్పర్సన్గా సీతాదయాకర్రెడ్డి". Eenadu. 4 April 2025. Archived from the original on 4 April 2025. Retrieved 4 April 2025.
- ↑ "తెలంగాణ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్ గా కొత్త కోట సీతా దయాకర్ రెడ్డి ...మరో ఆరుగురు కూడా..." Big Tv. 4 April 2025. Archived from the original on 4 April 2025. Retrieved 4 April 2025.