గణపతిరాజు అచ్యుతరామరాజు

(అచ్యుత రామరాజు నుండి దారిమార్పు చెందింది)

గణపతిరాజు అచ్యుతరామరాజు (మార్చి 5, 1924 - 2004) న్యాయవాది, సాహిత్య, సాంస్కృతిక, నాటక కళాకారులు.[1]

గణపతిరాజు అచ్యుతరామరాజు
జననంగణపతిరాజు అచ్యుతరామరాజు
మార్చి 5, 1924
తూర్పు గోదావరి జిల్లా కొలిమేరు
మరణం2004
వృత్తిప్రఖ్యాత క్రిమినల్ న్యాయవాది
ప్రసిద్ధిప్రముఖ న్యాయవాది, సాహిత్య, సాంస్కృతిక, నాటక కళాకారులు
తండ్రిసాంబమూర్తి
తల్లిఛాయా భాస్కరయ్యమ్మ

జీవిత విశేషాలు మార్చు

వీరు మహా శివరాత్రి పర్వదినాన అనగా 5 మార్చి 1924 తేదీన తూర్పు గోదావరి జిల్లా కొలిమేరు గ్రామంలో భాస్కరయ్యమ్మ, సాంబమూర్తి దంపతులకు జన్మించారు. ప్రాథమిక విద్య విశాఖపట్నంలో సి.బి.ఎం. ఉన్నత పాఠశాలలో ఇంటర్మీడియట్ మిసెస్ ఏ.వి.ఎన్. కళాశాలలో బి.ఎ. కాకినాడ పి.ఆర్కాలీజీలో బి.ఎల్. చెన్నై లా కాలేజీలో పూర్తిచేసి విశాఖపట్నంలో లా ప్రాక్టీసు మొదలుపెట్టారు.ప్రఖ్యాత క్రిమినల్ లాయరుగా పేరుపొందడమే కాక చిన్న వయస్సులో 1966 లో విశాఖపట్టణ అసోసియేషన్ అధ్యక్షులుగా ఎన్నికయ్యారు.వృత్తిరీత్యా న్యాయవాదిగా అయినా సాహిత్య, సాంస్కృతిక, నాటక, కళారంగాలలో, విద్యా, కార్మిక, రాజకీయ రంగాలలో అసమాన ప్రతిభ ప్రదర్శించి అనేక సంస్థలకు వ్యవస్థాపకులై అధ్యక్షులై రాణించారు.‘కవిభూషణ’, ‘కళాసరస్వతి’, ‘కవిరాజు’, ‘రాజకవి’, ‘సాహితీ’, ‘సాంస్కృతిక’, ‘సామ్రాట్’‘నాటకరత్న’, ’నాటకపితామహ’, ‘నవయుగ ఆంద్రభోజ’, ’అభినవ కృష్ణదేవరాయ’వంటి గౌరవాలు ఎన్నో అనేక సంస్థలుఇచ్చి సత్కరించారు.197౦ లో విశాకపట్నం లో పౌరాసన్మానం,సువర్ణ ఘంటా కంకణం ప్రధానంగా జరిగాయి.ఆంధ్ర విశ్వ కళాపరిషత్ 1993 లో కళాప్రపూర్ణ గౌరవం ప్రధానం చేసింది.19౩8 లో హైస్కూల్లో చదివేటప్పుడు కధలు రాయడం ప్రారంభించారు.

నాటకరంగములో కృషి మార్చు

ఆరోజుల్లోనే మంచి వక్తగా పేరు సంపాదించారు.‘చింతామణి’, లో శ్రీకృష్ణుడుగా, విలియం షేక్‌స్పియర్ ఆంగ్ల నాటకాలలో విభిన్న పాత్రలు ధరించారు. ఆనాటి నుంచి నటులుగా, నాటక రచయితగా, ప్రయోక్తగా, నాటక సంస్థల నిర్వహణదక్షులుగా ప్రఖ్యాతి చెందారు.పిన్న వయస్సులోనే రవీంద్రనాద్ ఠాగూర్ నాటకాన్ని‘మాలిని’ పేరుతో అనువదించారు.వీరి హాస్యరస ప్రధానమైన నాటకాలు ‘బ్రహ్మముడి’, ’వినాయకుడి పెళ్లి’అనేకసార్లు ప్రదర్శింపబడి ప్రేక్షకుల మన్ననలు పొందాయి.‘ఖడ్గతిక్కన’, ’తీర్పు’, ’అన్వేషణ’, ’చిన్నపిల్లలు’, ‘ఇంకాన ------------ఇటుపైసాగావు’వంటి ప్రయోగాత్మక నాటక రచయితగా ప్రసిద్ధికెక్కారు. విశాఖ నాటక కళామండలిలో శిక్షణ పొందిన నటులు,దర్శకులు,సంగీత కళాకారులు తరువాత సినీ,టి.వి.రంగాల్లో ప్రఖ్యాతులయ్యారు.నేటి గొల్లపూడి మారుతీరావు,కాశీవిశ్వనాద్,ఆనాటి చంద్రకళ,సంగీత దర్శకులు,ఇత్యాదులో వారిలో కొందరు.

నాటక రంగంలో ఎంత కీర్తి గడించారో అంత కీర్తి సాహిత్య రంగంలో సాధించగలిగారు.చిన్ననాటనే కధలు రాసిన వీరు 1949లో విశాఖ రచయితల సంఘ తొలి సభ్యులలో ఒకరై కార్యవర్గ సభ్యత్వం నుంచి అధ్యక్ష స్థానం వరకు ఎదిగి దాని నుండి తప్పుకున్నారు.‘ఆంధ్రదర్శిని’1953లో వీరిని నటులుగా గుర్తించి పరిచయం చేసింది.1957లో ఆంద్రప్రదేశ్ సంగీత మూల నాటక అకాడమీకి సభ్యులుగా ఎన్నికయ్యారు.1971లో విశాఖ సాహితీ మూల పురుషులలో ఒకరై మూడు దశాబ్దాలుగా పైబడి అధ్యక్షపీఠం అధిరోహించారు.

సాహిత్యములో కృషి మార్చు

సాహితీసభలు నిర్విరామంగా నిర్వహించి‘విశాఖ సాహితి, తరపున సుమారు 100 పుస్తకాలు ప్రచురింపచేసి ఎందరో వర్ధమాన కధలు,కవులు, రచయితలకు ఉత్సాహ ప్రోత్సాహాలందించారు.వీరి‘కసి’కధకు 1973 లో ప్రధమ బహుమతి లభించింది. ‘అమరం’, ‘ఆనందహేల’, ’రమ్యారామం’, స్వీయ కవితా సంకలనా’ల ద్వారా ఫ్రౌఢ కవిగా చక్కని గుర్తింపు పొందారు.సాహిత్యపు విలువలు ప్రోదిచేసుకోన్నవిగా గుర్తింపుపొందిన వీరు రచించిన పుస్తక పీఠికాలు ఎందరిచేతనో ప్రశంసింపబడ్డాయి.వీరు తమ కావ్యాలను, రచనలను ఎంతోమందికి అంకితం ఇచ్చారు.విద్యా రంగంలో వీరి కృషి తక్కువేమీ కాదు.వీరు 1964 నుంచి 1972 వరకు ఆంధ్రా విశ్వ కళాపరిషత్లోనూ 1969–1972 వరకూ శ్రీ వెంకటేశ్వరా విశ్వవిద్యాలయాలకు సెనేటర్ గా ఎన్నికై విద్యా రంగంలో ప్రశస్తి పొందారు. వీరి రాజకీయ జీవితం కూడా చిన్న వయసులో ప్రార౦భమైనదే వీరు 1937 లో తేన్నీటి విశ్వనాధం గారి ఎన్నికల ప్రచార కార్యక్రమంలో చురుగ్గా పాల్గొన్నారు.

కెరీర్ మార్చు

  • విశాఖపట్నంలో ప్రాక్టీసు ప్రారంభించి అనతికాలంలోనే ప్రఖ్యాత క్రిమినల్ న్యాయవాదిగా పేరుపొందారు. 1966లో విశాఖపట్నం బార్ అసోసియేషన్ అధ్యక్షులుగా ఎన్నికయ్యారు.
  • వీరు 1950లో విశాఖ నాటక కళామండలిని స్థాపించి నెలకు ఒక నాటకం చొప్పున టౌన్ హాలులో ప్రదర్శిస్తూ 12 సంవత్సరాలు నిర్వహించారు. అది ఆగిపోయిన పిదప 1968లో విశాఖ నాటక కళాపరిషత్ పేరుతో పునరుద్ధరించారు.
  • 1968లో జనసంఘ్ అభ్యర్థిగా పోటీచేసి అఖండ విజయం సాధించి ఆంధ్ర ప్రదేశ్ శాసన మండలి సభ్యులుగా రాణించారు.
  • వీరికి 1993 సంవత్సరంలో ఆంధ్ర విశ్వకళా పరిషత్తు కళా ప్రపూర్ణ గౌరవం ప్రదానం చేసింది.

ఎన్నికలలో పోటీ మార్చు

ఉత్తర సర్కారు జిల్లాల పట్టభద్రుల నియోజక వర్గం నుంచి పోటీచేసి 1962 లో ఓడినా 1968 లో జనసంఘ్ అభ్యర్థిగా పోటీచేసి అఖండ విజయం సాధించి ఆరేళ్ళ పాటు శాసన మండలి సభ్యులుగా ప్రతిపక్షానికి రాణింపు తేవడమే కాక పాలక పక్ష మన్ననలు కూడా పొందారు. వీరు విశాఖపట్నంలో జరిగే ప్రతి సాహిత్య, సంస్కృతిక, విద్యా రంగాలలో ఇచ్చిన ఉపన్యాసాలు సభికులను ఎంతగానో అలరించేవి.

మరణం మార్చు

వీరు 2004 లో పరమపదించారు.

మూలాలు మార్చు

  1. అచ్యుతరామరాజు గణపతిరాజు, 20వ శతాబ్ది తెలుగు వెలుగులు, మొదటి భాగం, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాద్, 2005, పేజీలు: 5-6.

ఇతర లింకులు మార్చు