ఎర్రమల్లెలు
ఎర్ర మల్లెలు 1981లో విడుదలైన తెలుగు సినిమా. నవతరం పిక్చర్స్ పతాకంపై మాదాల కోదండరామయ్య, మాదాల రంగారావు లు నిర్మించిన ఈ సినిమాకు ధవళ సత్యం దర్శకత్వం వహించాడు. మురళీ మోహన్, గిరిబాబు, మాదాల రంగారావు ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ సినిమాకు కె.చక్రవర్తి సంగీతాన్నందించాడు.[1] ఈ చిత్రంలో ఎస్. పి. శైలజ ఆలపించిన నాంపల్లి టేషనుకాడి రాజాలింగో అనే పాట ప్రజాదరణ పొందింది.
ఎర్రమల్లెలు (1981 తెలుగు సినిమా) | |
![]() | |
---|---|
దర్శకత్వం | ధవళ సత్యం |
తారాగణం | మురళీమోహన్ , రాజేష్, మాదాల రంగారావు |
సంగీతం | కె. చక్రవర్తి |
నిర్మాణ సంస్థ | నవతరం పిక్చర్స్ |
భాష | తెలుగు |
కథ మార్చు
ఒక ఊరికి ముగ్గురు క్షుద్రదేవతలు మునసబు, కరణం, కామందు. మిగిలిన జనమంతా వీళ్ళు ఆడుకోవడానికి పావుల్లాంటి వాళ్ళు. చదువురాని వాళ్లి. ఆ ఊరికి చదువు చెప్పడానికి ఒక మాస్టారు వస్తాడు. ఆ మేస్టారి రాకతో చైతన్యం వస్తుంది. విప్లవం రగులుతుంది. ఆ మంటల్లో ఆ ముగ్గురు క్షుద్రదేవతలతో పాటు పక్కవూరి ఫ్యాక్టరీ యజమాని కూడా భగ్గుమంటాడు.[2]
తారాగణం మార్చు
- మురళీ మోహన్
- గిరిబాబు
- మాదాల రంగారావు
- రంగనాథ్
- పి.ఎల్.నారయణ
- సాక్షి రంగారావు
- పి.జె.శర్మ
- సాయిచంద్
- చలపతిరావు
- నర్రా వెంకటేశ్వరరావు
- ఎంపి.ప్రసాద్
- వీరభద్రరావు
- పుష్పకుమారి
- కృష్ణవేణి
- లక్ష్మీచిత్ర
- శ్రీలక్ష్మి
- జయశీల
- నవత
- శివ పార్వతి
- కె.విజయ
- టి.కృష్ణ (తొట్టేంపూడి కృష్ణ)
సాంకేతిక వర్గం మార్చు
- దర్శకుడు: ధవళ సత్యం
- నిర్మాతలు: మాదాల కోదండరామయ్య, మాదాల రంగారావు
- ఛాయాగ్రహణం: జి.మోహనకృష్ణ
- కూర్పు: నాయని మహేశ్వరరావు
- సంగీతం: కె.చక్రవర్తి
- పాటలు: సి.నారాయణరెడ్డి, కొండవీటి వెంకట కవి, అదృష్టదీపక్, ప్రభు, ధవళ సత్యం
- విడుదల తేదీ: 1981 మే 1.
- పాటలు:
- 1; నాంపల్లి టేషన్ కాడా రాజాలింగో.ఎస్.పి.శైలజ.
- ఓ లగి జిగి లగీ జిగి . శ్రీపండితారాధ్య బాలసుబ్రహ్మణ్యం.
- నేడే మేడే
- బంగారు మా తల్లి ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ పి శైలజ , జీ.ఆనంద్.
- బంజరు భూమిలో .
మూలాలు మార్చు
- ↑ "Erra Mallelu (1981)". Indiancine.ma. Retrieved 2020-08-20.
- ↑ "Indiancine.ma". Indiancine.ma. Retrieved 2020-08-20.