దొంగల బండి

(దొంగలబండి నుండి దారిమార్పు చెందింది)

}}

దొంగల బండి
దొంగల బండి.jpg
దర్శకత్వంసతీష్ వేగేశ్న
రచనసతీష్ వేగేశ్న (కథ, చిత్రానువాదం, మాటలు)
నిర్మాతజి. ఎస్. కె. నాయుడు
తారాగణంఅల్లరి నరేష్, తాన్య
ఛాయాగ్రహణంఎస్. అరుణ్ కుమార్
కూర్పునందమూరి హరి
సంగీతంవల్లూరి రాజశేఖర్
నిర్మాణ
సంస్థ
జి. ఎస్. కె. నెట్వర్క్
విడుదల తేదీ
2008 డిసెంబరు 12 (2008-12-12)
భాషతెలుగు

దొంగలబండి 2008 లో సతీష్ వేగేశ్న దర్శకత్వంలో విడుదలైన హాస్యచిత్రం. నిజాం కాలం నాటి నిధిని అన్వేషించడానికి బయలుదేరిన బృందం, మార్గమధ్యంలో వారు ఎదుర్కొనే సమస్యలు హాస్యభరితంగా మలచబడ్డాయి.[1]

కథసవరించు

నిజాం సామ్రాజ్యం భారతదేశంలో విలీనమయ్యే సమయంలో నిజాం ప్రభువు తనదగ్గరున్న విలువైన నగలన్నీ ఒక పెట్టెలో దాచి తన సేనాధిపతికిచ్చి దాచమంటాడు. ముగ్గురు దొంగలు ఆ నిధిని పసిగట్టి దొంగిలించి ఒక అడవిలో దాస్తారు. దాచి ఉంచిన ప్రదేశం తాలూకు పటాన్ని మూడు భాగాలుగా చేసి తలో ముక్కా పంచుకుంటారు. కానీ వాళ్ళు కలుసుకోవడానికి మళ్ళీ కుదరదు. యాభై ఏళ్ళ తర్వాత మళ్ళీ ఆ ముగ్గురు దొంగల యొక్క బంధువులు మూడు భాగాలను కలిపి నిధి కోసం వెతుకులాట మొదలు పెడతారు.

తారాగణంసవరించు

మూలాలుసవరించు

  1. జీవి. "దొంగలబండి సినిమా సమీక్ష". idlebrain.com. Retrieved 5 October 2016.

బయటి లింకులుసవరించు