పాడుతా తీయగా (ధారావాహిక)

పాడుతా తీయగా ఈటీవీలో బహుళ ప్రజాదరణ పొందిన పాటల పోటీ కార్యక్రమం. ప్రముఖ సినీ నేపథ్య గాయకుడు ఎస్.పి బాలసుబ్రహ్మణ్యం దీనికి వ్యాఖ్యాత. ఆంధ్రప్రదేశ్ నలుమూలలా ప్రతిభ ఉన్న గాయనీ గాయకులను ప్రోత్సహించడం ఈ కార్యక్రమం యొక్క ముఖ్యోద్దేశం. దీని దర్శకుడు ఎన్.బి. శాస్త్రి. 1996 మే 16న హైదరాబాదులోని సారధి స్టూడియోలో అతికొద్ది మంది సమక్షంలో [1] ప్రారంభమైన ఈ కార్యక్రమం ఇప్పటికీ కొనసాగటమే కాక అమెరికా కు కూడా విస్తరించింది. దక్షిణ భారతంలోనే మొట్టమొదటి సంగీత ఆధారిత రియాలిటీ షో ఇది.

పాడుతా తీయగా
పాడుతా తీయగా టైటిల్ తో పాటు హోస్ట్‌ ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం
తరంరియాలిటీ-సింగింగ్
దర్శకత్వంఎన్. బి. శాస్త్రి
సమర్పణఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం (1996 - 2000, 2007 - 2020)
ఎస్. పి. చరణ్ (2021 - ప్రస్తుతం)
న్యాయ నిర్ణేతలుఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం (1996 - 2020)
చంద్రబోస్ (2021 - ప్రస్తుతం)
సునీత ఉపద్రష్ట (2021 - ప్రస్తుతం)
విజయ్ ప్రకాష్ (2021 - ప్రస్తుతం)
దేశంఇండియా
అసలు భాషతెలుగు
సీజన్ల20 (including old series) సంఖ్య
ఎపిసోడ్ల సంఖ్య1,102 (as of 2020)
ప్రొడక్షన్
Executive producerసురభి శేఖర్
Producersరామోజీ రావు
ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం
ప్రొడక్షన్ locationsభారతదేశం -
(Old Series - 1&2)
(Series - 1-6)
(series - 12-18)
యు.ఎస్.-
(series - 7,8,9,11)
కెమేరా సెట్‌అప్మల్టీ-కెమెరా
నడుస్తున్న సమయం60 minutes
ప్రొడక్షన్ కంపెనీరామోజీ గ్రూప్
డిస్ట్రిబ్యూటర్ETV నెట్‌వర్క్
విడుదల
వాస్తవ నెట్‌వర్క్ETV నెట్‌వర్క్
వాస్తవ విడుదల1996 జనవరి 12 (1996-01-12) –
present (present)
Chronology
సంబంధిత ప్రదర్శనలుPadutha Theeyaga Youth Series

మంగళంపల్లి బాలమురళీకృష్ణ, సాలూరి రాజేశ్వరరావు, కె.విశ్వనాధ్, కె.వి. మహదేవన్, ఎమ్మెస్ విశ్వనాథన్, ఇళయరాజా, కె.బాలచందర్, కీరవాణి, సుశీల, జానకి లాంటి ప్రముఖులెందరో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ఎంతో మంది గాయకులను సినీ పరిశ్రమకు అందించింది. ప్రముఖ గాయని ఉష (గాయని), కౌసల్య (గాయని), గోపికా పూర్ణిమ, మల్లిఖార్జున్, సందీప్, హేమచంద్ర, కారుణ్య మొదలైన వారు. ఈ కార్యక్రమం ద్వారా వెలుగులోకి వచ్చారు.

మూలాలు మార్చు

  1. ఈనాడు ఆదివారం సంచిక, ఆగస్టు 11, 2013