పాలువాయి

ఆంధ్ర ప్రదేశ్, పల్నాడు జిల్లా, రెంటచింతల మండలంలోని గ్రామం

పాలువాయి, పల్నాడు జిల్లా, రెంటచింతల మండలానికి చెందిన గ్రామం. ఇది మండల కేంద్రమైన రెంటచింతల నుండి 6 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన మాచర్ల నుండి 13 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 జనగణన ప్రకారం ఈ గ్రామం 1641 ఇళ్లతో, 6231 జనాభాతో 1995 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 3095, ఆడవారి సంఖ్య 3136. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 757 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 552. గ్రామ జనగణన లొకేషన్ కోడ్ 589836.[1]

పాలువాయి
—  రెవెన్యూ గ్రామం  —
పాలువాయి is located in Andhra Pradesh
పాలువాయి
పాలువాయి
అక్షాంశరేఖాంశాలు: 16°35′08″N 79°29′24″E / 16.585527°N 79.490089°E / 16.585527; 79.490089
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా పల్నాడు
మండలం రెంటచింతల
ప్రభుత్వం
 - సర్పంచి శ్రీమతి గొలమారి పద్మ
జనాభా (2011)
 - మొత్తం 6,231
 - పురుషుల సంఖ్య 3,095
 - స్త్రీల సంఖ్య 3,136
 - గృహాల సంఖ్య 1,641
పిన్ కోడ్ 522 421
ఎస్.టి.డి కోడ్ 08642

గ్రామం పేరు వెనుక చరిత్ర మార్చు

ఈ మండలంలో 3 పాలువాయి గ్రామాలు ఉన్నాయి. కొత్త పాలువాయి, పాత పాలువాయి, పాలువాయి గేటు. కొత్త పాలువాయి గ్రామంలో ఒక అందమైన కోవెల ఉంది.

సమీప గ్రామాలు మార్చు

మిట్టగుడిపాడు 4 కి.మీ, జెట్టిపాలెం 6 కి.మీ, మల్లవరం 6 కి.మీ, మంచికల్లు 6 కి.మీ, గోలి 7 కి.మీ.

విద్యా సౌకర్యాలు మార్చు

గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు 2, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల ఒకటి ఉన్నాయి. సమీప బాలబడి రెంటచింతలలో ఉంది.సమీప జూనియర్ కళాశాల రెంటచింతల లోను, ప్రభుత్వ ఆర్ట్స్, సైన్స్, డిగ్రీ కళాశాల, ఇంజనీరింగ్ కళాశాల‌లు మాచర్లలోనూ ఉన్నాయి. సమీప వైద్య కళాశాల గుంటూరులోను, మేనేజిమెంటు కళాశాల, పాలీటెక్నిక్‌లు మాచర్లలోనూ ఉన్నాయి.సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల, అనియత విద్యా కేంద్రం మాచర్లలోను, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల గుంటూరులోనూ ఉన్నాయి.

వైద్య సౌకర్యం మార్చు

ప్రభుత్వ వైద్య సౌకర్యం మార్చు

గ్రామంలో ఉన్న 1 ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో డాక్టర్లు లేరు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది.పశు వైద్యశాల గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.అలోపతీ ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, డిస్పెన్సరీ, సంచార వైద్య శాల, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.

ప్రైవేటు వైద్య సౌకర్యం మార్చు

గ్రామంలో 2 ప్రభుత్వేతర వైద్య సౌకర్యాలున్నాయి.

తాగు నీరు మార్చు

గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది. బోరుబావుల ద్వారా కూడా ఏడాది పొడుగునా నీరు అందుతుంది. కాలువ/వాగు/నది ద్వారా గ్రామానికి నీటిపారుదల వసతి ఉంది. చెరువు నీటి సౌకర్యం ఉంది.

పారిశుధ్యం మార్చు

గ్రామంలో మురుగునీటి పారుదల వ్యవస్థ లేదు.మురుగునీటిని శుద్ధి ప్లాంట్‌లోకి పంపిస్తున్నారు.గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది.సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు.ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు.సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను రోడ్డు పక్కనే పారబోస్తారు.

సమాచార, రవాణా సౌకర్యాలు మార్చు

సబ్ పోస్టాఫీసు సౌకర్యం ఉంది.పోస్టాఫీసు సౌకర్యం గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసుగ్రామానికి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్మొదలైన సౌకర్యాలు ఉన్నాయి.ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు, ప్రైవేటు బస్సులుతిరుగుతున్నాయి.సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది.వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. రైల్వే స్టేషన్ గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. ప్రధాన జిల్లా రహదారి, జిల్లా రహదారి గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. జాతీయ రహదారి, రాష్ట్ర రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి.గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, కచ్చారోడ్లూ ఉన్నాయి.

మార్కెటింగు, బ్యాంకింగు మార్చు

గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం ఉన్నాయి. వాణిజ్య బ్యాంకు, వ్యవసాయ ఋణ సంఘం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. వారం వారం సంత గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి.ఏటీఎమ్, సహకార బ్యాంకు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి.

ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు మార్చు

గ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ కేంద్రం, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. ఆటల మైదానం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. గ్రంథాలయం, పబ్లిక్ రీడింగ్ రూం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. సినిమా హాలు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.

విద్యుత్తు మార్చు

గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా చేస్తున్నారు రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 7 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.

భూమి వినియోగం మార్చు

పాలువాయిలో భూ వినియోగం కింది విధంగా ఉంది. (హెక్టార్లలో) :

  • వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 83
  • వ్యవసాయం సాగని, బంజరు భూమి: 195
  • వ్యవసాయం చేయదగ్గ బంజరు భూమి: 8
  • నికరంగా విత్తిన భూ క్షేత్రం: 1709
  • నీటి సౌకర్యం లేని భూ క్షేత్రం: 991
  • నీటి వనరుల నుండి నీటి పారుదల లభిస్తున్న భూక్షేత్రం: 718

నీటిపారుదల సౌకర్యాలు మార్చు

పాలువాయిలో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది

  • కాలువలు: 718 హెక్టార్లు

తయారీ మార్చు

పాలువాయిలో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి (అవరోహణ క్రమంలో) :

గ్రామంలో ప్రధాన పంటలు మార్చు

వరి, ప్రత్తి, మిరప

గ్రామ పంచాయతీ మార్చు

ఈ గ్రామంలో పంచాయతీ సర్పంచిగా 1966 నుండి 1968 వరకు శొంఠిరెడ్డి చినపేరిరెడ్డి, ఆయన పెద్దకుమారుడు పెద్ద గురవారెడ్డి, 1981 నుండి 1987 వరకూ, రెండో కుమారుడు చిన్న గురవారెడ్డి 1994 నుండి 1999 వరకూ పనిచేశారు. పెద్ద గురవారెడ్డి కోడలు నాగమ్మ ఐదేళ్ళపాటు రెంటచింతల మండలాధ్యక్షురాలిగా పనిచేశారు. వియ్యంకులు పాశం మస్తాన్ రెడ్డి సర్పంచిగా, అతని సోదరుడు పాశం నర్సిరెడ్డి సర్పంచిగా, ఎం.పి.పి.గా గెలుపొందారు. గురవారెడ్డి కుమారుడు శ్రీ నర్సిరెడ్డి, సాగునీటి సంఘం అధ్యక్షునిగా గతంలో చేశారు. అల్లుడు పాశం నర్సిరెడ్డి, పాలువాయి సర్పంచిగా 2005 నుండి 2010 వరకూ పనిచేశారు. 2013 జూలైలో 'పాలువాయి గేటు' గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో గొలమారి పద్మ, సర్పంచిగా ఎన్నికైనారు.

దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు మార్చు

శ్రీ వరసిద్ధి విఘ్నేశ్వర స్వామి ఆలయo మార్చు

పాలువాయి గ్రామం జంక్షనులోని ఈ ఆలయ 9వ వార్షికోత్సవం, 2014, ఫిబ్రవరి-10న, జరుగును. శంకుస్థాపన చేయడానికి ముహూర్తం నిశ్చయించారు.

ఈ ఆలయంలో, 2015, ఫిబ్రవరి-9, సోమవారం నాడు, నవగ్రహ ప్రతిష్ఠొత్సవాలు ఘనంగా నిర్వహించారు. లక్ష్మీ గణపతి, చండీ, రుద్ర హోమాలు నిర్వహించారు. అనంతరం శివలింగం, సుబ్రహ్మణ్యస్వామి, గణపతి విగ్రహాలను ప్రతిష్ఠించారు. అనంతరం భక్తులకు అన్నదానం నిర్వహించారు. ఉత్సవాల సందర్భంగా ఆలయాన్ని రంగురంగుల విద్యుద్దీపాలతో సుందరంగా అలంకరించారు.

ఈ ఆలయ వార్షికోత్సవ వేడుకలు, 2016, ఫిబ్రవరి-10వ బుధవారంనాడు వైభవంగా నివహించారు.

శ్రీ గంగా ఙానప్రసూనాంబా సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామివారి ఆలయం మార్చు

ఈ ఆలయ వార్షికోత్సవం సందర్భంగా, 2014, జూన్-24, మంగళవారం నాడు, స్వామివారి కల్యాణం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదానం నిర్వహించారు.

శ్రీ చౌడేశ్వరీ అమ్మవారి ఆలయం మార్చు

గ్రామంలో రెండు సెంట్ల విస్తీర్ణంలో దాతల సహకారంతో, 15 లక్షల రూపాయల వ్యయంతో, నూతనంగా నిర్మించిన ఈ ఆలయంలో, 2017, జూన్-1వతేదీ గురువారం ఉదయం 9-16 కి, వేదమంత్రోచ్ఛారణల మధ్య, శ్రీ చౌడేశ్వరీమాత, లింగమంతులు, గణపతి, పోతురాజు ల విగ్రహప్రతిష్ఠ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మే-31వతేదీ బుధవారంనాడు, విగ్రహాలకు జలస్నానం చేయించి గ్రామోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయాన్ని రంగురంగుల విద్యుద్దీపాలతో అందంగా అలంకరించారు. ఈ ఆలయ ప్రతిష్ఠ నిర్వహించి 16 రోజులైన సందర్భంగా, 2017, జూన్-16వతేదీ శుక్రవారంనాడు, గ్రామస్థులు తమతమ గృహాలలో బోనాలు వండుకొని, గ్రామ ప్రధాన వీధులగుండా మంగళవాయిద్యాలతో, ఊరేగింపుగా ఆలయానికి చేరుకుని, బోనాలను అమ్మవారికి సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్థులు అధికసంఖ్యలో పాల్గొన్నారు.

శ్రీ అయ్యప్పస్వామివారి ఆలయం మార్చు

పాలువాయి గేటులో, ఐదుసెంట్లస్థలంలో 15 లక్షల రూపాయల వ్యయంతో, నూతనంగా నిర్మించిన ఈ ఆలయంలో విగ్రహప్రతిష్ఠా మహోత్సవాలు, 2015, జూన్-2వ తేదీ మంగళవారం నుండి ప్రారంభమగును. ఈ ఆలయంలో ప్రతిష్ఠించుటకొరకు, విఘ్నేశ్వరుడు, కుమారస్వామి, మాలికాపురత్తమ్మ దేవతామూర్తుల విగ్రహాలను, తెనాలిలో పంచలోహాలతో తయారుచేయించారు. మంగళ, బుధవారాలలో 16మంది వేదపండితులతో హోమాలు, ప్రత్యేకపూజలు, కేరళ వాయిద్యకళాకారులచే గ్రామోత్సవం, నిర్వహించారు. 4వతేదీ గురువారం ఉదయం పురోహితుల వేదమంత్రోచ్ఛారణలమధ్య, అయ్యప్ప, వినాయకుడు, కుమారస్వామి, మాలికాపురత్తమ్మ దేవతామూర్తుల పంచలోహవిగ్రహాలను, వీరాంజనేయస్వామికి, అయ్యప్ప ఆలయంలోనూ రెండుధ్వజస్తంభాల ప్రతిష్ఠ, వేలాదిమంది భక్తుల సమక్షంలో వైభవంగా నిర్వహించారు. అనంతరం విచ్చేసిన వేలాదిమంది భక్తులకు అన్నదానం నిర్వహించారు.

శ్రీ రామాలయం మార్చు

ఈ ఆలయాన్ని 100 సంవత్సరాల క్రితం ఎస్.సి.కాలనీకి చెందిన పలువురు భక్తుల ఆర్థిక సహకారంతో నిర్మించారు. ప్రస్తుతం శిథిలావస్థకు చేరిన ఈ ఆలయన్ని పునరుద్ధరించవలెనని భక్తుల కోరిక.

శ్రీ ఆంజనేయస్వామివారి ఆలయం మార్చు

పాలువాయి జంక్షనులోని ఈ ఆలయంలో, తూర్పు రాజగోపుర నిర్మాణానికి, 2017, జూన్-19వతేదీ సోమవారంనాడు భూమిపూజ నిర్వహించారు. ఈ నిర్మాణానికి పశర్లపూడి గ్రామానికి చెందిన శ్రీ కొణకంచి సాంబశివరావు దంపతులు ఒకటిన్నర లక్షల రూపాయలను వితరణగా అందించారు.

శ్రీ షిర్డీసాయిబాబా మందిరం మార్చు

పాలువాయి జంక్షనులోని ఈ ఆలయంలో, ప్రతి సంవత్సరం గురుపొర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించెదరు.

గ్రామంలో ప్రధాన వృత్తులు మార్చు

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు

గ్రామ విశేషాలు మార్చు

  1. ఈ గ్రామం నుండి చాలా మంది ఉన్నత చదువులు చదువుకొని, రకరకాల కొలువుల్లో ఉన్నారు.
  2. ప్రఖ్యాత సినీ నటీమణి, నిర్మాతా, భరణీ స్టూడియో యజమాని భానుమతీ రామకృష్ణ ఇంటిపేరు, పాలువాయి.
  3. ఈ గ్రామానికి చెందిన లారీ డ్రైవరయిన గురిందపల్లి సుధాకరబాబు కుమార్తెలు శ్రావణి, మౌనిక డిగ్రీ చదువుచున్నారు. వీరిద్దరూ కరాటేలో రాణించుచూ, రాష్ట్రస్థాయిలో పలు పతకాలు సాధించుచున్నారు.

గణాంకాలు మార్చు

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 5,674. ఇందులో పురుషుల సంఖ్య 2,831, స్త్రీల సంఖ్య 2,843, గ్రామంలో నివాస గృహాలు 1,371 ఉన్నాయి.గ్రామ విస్తీర్ణము 1,995 హెక్టారులు.

మూలాలు మార్చు

  1. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".
"https://te.wikipedia.org/w/index.php?title=పాలువాయి&oldid=4130772" నుండి వెలికితీశారు