పాల్వంచ పురపాలకసంఘం

పాల్వంచ పురపాలకసంఘం, తెలంగాణ రాష్ట్రం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన ఒక పట్టణ స్థానిక స్వపరిపాలన సంస్థ.[1] పాల్వంచ పట్టణం దీని ప్రధాన పరిపాలన కేంద్రం. ఈ పురపాలక సంఘం ఖమ్మం లోకసభ నియోజకవర్గం లోని కొత్తగూడెం శాసనసభ నియోజకవర్గం పరిధిలో ఉంది.[2]

పాల్వంచ పురపాలకసంఘం
—  పురపాలకసంఘం  —
పాల్వంచ పురపాలకసంఘం is located in తెలంగాణ
పాల్వంచ పురపాలకసంఘం
పాల్వంచ పురపాలకసంఘం
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 17°30′32″N 80°56′34″E / 17.5089364°N 80.9428911°E / 17.5089364; 80.9428911
రాష్ట్రం తెలంగాణ
జిల్లా భద్రాద్రి కొత్తగూడెం
మండలం పాల్వంచ
ప్రభుత్వం
 - చైర్‌పర్సన్‌
 - వైస్ చైర్‌పర్సన్‌
వైశాల్యము
 - మొత్తం 60.82 km² (23.5 sq mi)
జనాభా (2011)
 - మొత్తం 80,144
 - పురుషుల సంఖ్య 39,893
 - స్త్రీల సంఖ్య 40,251
 - గృహాల సంఖ్య 20,857
పిన్ కోడ్ - 507115
Area code(s) టెలిఫోన్ కోడ్ - 08744
వెబ్‌సైటు: అధికార వెబ్ సైట్
పాల్వంచ మున్సిపాలిటీలో గుడిపాడు గ్రామం వద్ద అంగన్వాడీ కేంద్రం

చరిత్రసవరించు

మేజర్ గ్రామ పంచాయితీగా ఉన్న పాల్వంచ 1987లో 3వ గ్రేడ్ పురపాలక సంఘంగా ఏర్పాటుచేయబడి, 2001లో అప్ గ్రేడ్ చేయబడింది. ఈ పట్టణంలో 24 వార్డులు ఉన్నాయి. 1987లో తొలిసారి మునిసిపల్‌ ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌ నాయకుడు కొమరం రాములు తొలి చైర్మన్‌గా ఎన్నికయ్యాడు. ఆ పాలకవర్గం 1992 వరకు కొనసాగగా, 1995లో రెండవసారి జరిగిన ఎన్నికల్లో మళ్లీ కాంగ్రెస్‌ విజయం సాధించింది. 2000 సంత్సరం వరకు బన్సీలాల్‌ చైర్మన్‌గా పనిచేశాడు. ఇక ఆ తరువాత 21 సంవత్సరాలుగా ఈ ద్వితీయ శ్రేణి మున్సిపాల్టీకి ఎన్నికలు నిర్వహించలేదు.[3]

భౌగోళికంసవరించు

పాల్వంచ 60.82 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలోఉంది. ఇది 17°35′53″N 80°42′22″E / 17.598°N 80.706°E / 17.598; 80.706 అక్షాంశరేఖాంశాల మధ్య ఉంది. రాష్ట్ర రాజధాని హైదరాబాదు నుండి 290 కిలోమీటర్ల దూరంలో, జిల్లా కేంద్రం కొత్తగూడెం నుండి 12 కిలోమీటర్ల దూరంలో ఉంది.

జనాభా గణాంకాలుసవరించు

2011 భారత జనాభా లెక్కల ప్రకారం, పురపాలక సంఘం పరిధిలో ఉన్న జనాభా మొత్తం 80144 మంది కాగా, అందులో 39893 మంది పురుషులు, 40251 మంది మహిళలు ఉన్నారు. 20857 గృహాలు ఉన్నాయి. ఇది పరిపాలనా పరంగా మునిసిపాలిటీ రెవెన్యూ వార్డులుగా విభజించబడింది.[4]

పౌర పరిపాలనసవరించు

పురపాలక సంఘం కౌన్సిల్ కు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నిక జరుగుతుంది. పురపాలక సంఘం పరిధిలోని జనాభా ప్రాతిపదికననుసరించి స్థానిక సంస్థల ఎన్నికల ప్రకారం దీనిని 24 ఎన్నికల వార్డులుగా విభజింపబడింది. ప్రతి వార్డుకు వార్డు కౌన్సిలర్ ప్రాతినిధ్యం వహిస్తాడు. కౌన్సిల్ బోర్డుకు చైర్‌పర్సన్ నేతృత్వం వహిస్తారు. 2020 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల ప్రకారం చైర్‌పర్సన్‌గా, వైస్ చైర్‌పర్సన్‌గా ఎన్నికైనారు. వీరు ఎన్నికైననాటినుండి నుండి ఐదు సంవత్సరాలు పదవిలో కొనసాగుతారు.

మూలాలుసవరించు

  1. "Palwancha Municipality". palwanchamunicipality.telangana.gov.in. Retrieved 3 May 2021.
  2. Telangana, Government. "Commissioner and Director of Municipal Administration(CDMA), Municipal Administration and Urban Development (MA&UD) Department". cdma.telangana.gov.in. Archived from the original on 4 December 2019. Retrieved 3 May 2021.
  3. ఆంధ్రజ్యోతి, ఖమ్మం (17 April 2021). "పాల్వంచ కథ.. అంతులేని వ్యధ.. 21ఏళ్లుగా మునిసిపల్‌ ఎన్ని'కళ'కు దూరం". www.andhrajyothy.com. Archived from the original on 3 May 2021. Retrieved 3 May 2021.
  4. "Basic Information of Municipality, Palwancha Municipality". palwanchamunicipality.telangana.gov.in. Retrieved 3 May 2021.

వెలుపలి లంకెలుసవరించు