పొందూరు
పొందూరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఒక మండలం. పొందూరు శ్రీకాకుళం నకు 20 కి.మీ దూరంలో ఉంది. ఖద్దరు, హస్తకళలకు ప్రసిద్ధి చెందిన ప్రాంతం. భారతదేశంలో ఖాదీ వస్త్ర ప్రియులకు యిష్టమైన ఖద్దరును తయారుచేసే ప్రాంతం పొందూరు. పొందూరు రైల్వే స్టేషను దక్షిణ మధ్య రైల్వేలో హౌరా, చెన్నై మార్గంలో ఉంది. ఇచ్చట కంప్యూటరీకరణ కలిగిన ఉప తపాలా కార్యాలయం ఉంది. పొందూరునకు 7 కి.మీ దూరంలో బాలయోగీశ్వరస్వామి ఆశ్రమం ప్రసిద్ధి చెందింది.
గణాంకాలుసవరించు
2011 భారత జనగణన గణాంకాల ప్రకారం జనాభా - మొత్తం 73,890 - పురుషులు 37,197 - స్త్రీలు 36,693
పొందూరు ఖద్దరుసవరించు
పొందూరు చేనేత పరిశ్రమకు ప్రసిద్ధి చెందిన ప్రాంతం. ఒకవిధమైన చేప దంతాలతో ప్రత్తిని శుభ్రం చేసి దానిని రాట్నాలను ఉపయోగించి దారాన్ని తీస్తారు. ఈ దారాలనుపయోగించి మగ్గాలపై ఖద్దరు బట్టలను నేస్తారు. పొందూరు ఖద్దరు భారత దేశ స్వాతంత్ర్య ఉద్యమాన్ని గుర్తు చేస్తుంది. మహాత్మా గాంధీ కూడా పొందూరుకు చెందిన ఖద్దరును యిష్టపడే వారు. పొందూరు ఖాదీ దేశమంతటా ఖాదీ బట్టలు వేసుకునే వారికి ప్రసిద్ధి చెందింది. ఈ ప్రాంతంలో దేవాంగ, పట్టుశాలి, నాగవంశం అనే కులాలు ముఖ్యమైనవి. ఇక్కడి ప్రజల ప్రధాన వృత్తి చేనేత. ప్రత్తిని శుభ్రం చేసి రాట్నాలతో దారాన్ని తీసి మగ్గాలపై చక్కని ఖద్దరు వస్త్రాలను నేస్తారు. మగ్గాల తోనేకాక యంత్రపరికరాలు, మరమగ్గాల ఆధారంగా ఖద్దరు ఇతర రకాల నేతలు నేయు నేతగాళ్ళు కలరు. అమెరికా, స్వీడన్ వంటి దేశాలకు ఎగుమతులు కూడా జరుగుతాయి
ప్రముఖులుసవరించు
- ఘండికోట బ్రహ్మాజీరావు - ఉత్తరాంధ్ర రచయిత, సాహితీ వేత్త.
చిత్రమాలికసవరించు
పొందూరులో జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ గ్రహీతలుసవరించు
ఉపరాష్ట్రపతి శంకర దయాళ్ శర్మ ద్వారా అరార్డు స్వీకరిస్తున్న పమ్మిన కూర్మారావు
భారత రాష్ట్రపతి డా.శంకర్ దయాళ్ శర్మ ద్వారా అవార్డు స్వీకరిస్తున్న వి.కృష్ణదాసు
రాష్ట్రపతి ప్రతిభాపాటిల్ ద్వారా జాతీయ అవార్డు స్వీకరిస్తున్న గోపాలరావు
2016 సెప్టెంబరు 5 న భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ వద్ద నుండి జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాన్ని స్వీకరిస్తున్న పమ్మిన రమాదేవి.