కోస్తా
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
కోస్తా లేదా తీరాంధ్ర ఆంధ్రప్రదేశ్ లోని తీరప్రాంతం. కోస్తా అన్న తెలుగు మాట, కోస్ట్ అన్న ఇంగ్లీషు మాట కూడా 'కోస్తా' అన్న పోర్చుగీసు భాష నుండి పుట్టిందని ఒక అనుమానం ఉంది.
కోస్తా | |
---|---|
ప్రాంతం | |
ముద్దుపేరు(ర్లు): తీరాంధ్ర | |
దేశం | ![]() |
రాష్ట్రం | ![]() |
జిల్లా | |
విస్తీర్ణం | |
• మొత్తం | 92,906 కి.మీ2 (35,871 చ. మై) |
జనాభా వివరాలు (2011) | |
• మొత్తం | 3,41,93,868[ఆధారం చూపాలి] |
పెద్ద నగరాలు |
ఆంధ్రప్రదేశ్లోని మూడు (కోస్తా,ఉత్తరాంధ్ర, రాయలసీమ) ప్రధాన విభాగాలలో కోస్తా ఒకటి. 1947లో భారతదేశానికి స్వాతంత్ర్యం రావడానికి ముందు బ్రిటిష్ ఇండియాలోని మద్రాసు ప్రెసిడెన్సీలో ఉండేది. 1953లో ఆంధ్రరాష్ట్రం ఏర్పడే వరకూ ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఇది అంతర్భాగంగా ఉండేది.
మొత్తం కోస్తా జిల్లాలు 12. అవి వరుసగా
- ఎన్టీఆర్ జిల్లా
- బి.అర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా
- విశాఖపట్నం జిల్లా
- తూర్పు గోదావరి జిల్లా
- పశ్చిమ గోదావరి జిల్లా
- కృష్ణా జిల్లా
- గుంటూరు జిల్లా
- ప్రకాశం జిల్లా
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా
- ఏలూరు జిల్లా
- బాపట్ల జిల్లా
- కాకినాడ జిల్లా
బ్రిటీషు ప్రభుత్వం పాలన కింద ఉన్న జిల్లాలు కనుక వీటిని సర్కారు జిల్లాలు అని, ఈ ప్రాంతాన్ని సర్కారు అని కూడా వ్యవహరిస్తారు.ఈ తొమ్మిది జిల్లాలూ 972 కి.మీ. నిడివిగల బంగాళాఖాత తీరాన్ని ఆనుకొని ఉన్నాయి. అందుకే ఈ ప్రాంతాన్ని కోస్తా ప్రాంతం అంటారు. భారతదేశంలో గుజరాత్ తరువాత రెండవ పెద్ద తీర రేఖ ఉన్న రాష్ట్రం ఇది. గోదావరి, కృష్ణా, పెన్నానదుల సాగరసంగమ స్థానాల్లో ఉన్న ఈ ప్రాంతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతటిలోను మిక్కిలి సారవంతమైంది. వరి, చెరకు పంటలకు ప్రసిద్ధి గాంచింది.
కోస్తా, రాయలసీమ ప్రజలు 1972లో జై ఆంధ్ర పేరుతో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం పోరాడారు.