చేవెళ్ళ లోక్‌సభ నియోజకవర్గం

భారతదేశంలోని తెలంగాణ రాష్ట్రానికి చెందిన లోక్ సభ నియోజకవర్గం
(చేవెళ్ళ లోకసభ నియోజకవర్గం నుండి దారిమార్పు చెందింది)

తెలంగాణ లోని 17 లోక్‌సభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. ఈ లోక్‌సభ నియోజక వర్గంలో 7 శాసనసభ నియోజకవర్గములు ఉన్నాయి. కొత్తగా చేపట్టిన నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ వల్ల ఈ లోక్‌సభ నియోజకవర్గం నూతనంగా ఏర్పడింది. ఇంతకు పూర్వం ఇది హైదరాబాదు లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉండేది.తెలంగాణాలోని 33 జిల్లాలలో జిల్లా కేంద్రము కాని పార్లమెంటు రెండు స్థానాలు చేవెళ్ళ,జహీరాబాదు. 2019 లో జరిగిన 17 వ లోక్‌సభ ఎన్నికల్లో గడ్డం రంజిత్‌రెడ్డి గెలుపొందాడు.

ఈ నియోజకవర్గం నుండి ప్రాతినిథ్యం వహించిన జైపాల్ రెడ్డి

దీని పరిధిలోని శాసనసభ నియోజకవర్గములు సవరించు

  1. మహేశ్వరం అసెంబ్లీ నియోజకవర్గం
  2. రాజేంద్రనగర్ అసెంబ్లీ నియోజకవర్గం
  3. శేరిలింగంపల్లి అసెంబ్లీ నియోజకవర్గం
  4. చేవెళ్ళ అసెంబ్లీ నియోజకవర్గం
  5. పరిగి అసెంబ్లీ నియోజకవర్గం
  6. వికారాబాదు అసెంబ్లీ నియోజకవర్గం (ఎస్సీ లకు రిజర్వ్ చేయబడినది)
  7. తాండూర్ అసెంబ్లీ నియోజకవర్గం

2009 ఎన్నికలు సవరించు

2009 ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ తరఫున బద్దం బాల్‌రెడ్డి పోటీ చేస్తున్నాడు.[1] కాంగ్రెస్ పార్టీ తరఫున 2004లో మిర్యాలగూడ లోక్‌సభ నుండి విజయం సాధించిన ఎస్.జైపాల్ రెడ్డి పోటీలో ఉన్నాడు. [2]

సంవత్సరం అసెంబ్లీ నియోజకవర్గం సంఖ్య పేరు నియోజక వర్గం రకం గెలుపొందిన అభ్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు
2009 10 చేవెళ్ళ జనరల్ సూదిని జైపాల్ రెడ్డి పు కాంగ్రెస్ 420807 ఎ.పి.జితేందర్ రెడ్డి పు తె.దే.పా 402275

2014 ఎన్నికలు సవరించు

మూలాలు సవరించు

  1. ఈనాడు దినపత్రిక, తేది 14-03-2009
  2. ఈనాడు దినపత్రిక, తేది 22-03-2009