భారత స్వాతంత్ర్యోద్యమంలో జవాహర్ లాల్ నెహ్రూ

1920ల్లో ప్రారంభించి 1945-47 వరకూ జవాహర్ లాల్ నెహ్రూ భారత స్వాతంత్ర్యోద్యమంలో వహించిన పాత్రను ఈ వ్యాసం వివరిస్తుంది. తండ్రి మోతీలాల్ నెహ్రూ ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు కావడంతో పాటుగా కేంబ్రిడ్జిలో చదువుకున్న రోజుల్లోనే వలసవాద వ్యతిరేకత మొగ్గతొడిగింది.

భారత స్వాతంత్ర్యోద్యమంలో జవాహర్ లాల్ నెహ్రూ, గాంధీతో

జాతీయోద్యమ నేపథ్యం మార్చు

రాజకీయాల్లోకి ప్రవేశం మార్చు

మొదటి ప్రపంచయుద్ధం, హోంరూల్ లీగ్ మార్చు

అలహాబాద్ ఉన్నత న్యాయస్థానంలో తండ్రి చాటు న్యాయవాదిగా పనిచేస్తున్న జవాహర్‌లాల్ తండ్రితో పాటుగా 1912లో పాట్నాలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ వార్షిక సమావేశాలకు హాజరయ్యాడు.[1] జీవితకాలం పాటు అనుబంధం పెంచుకున్న ఆ సంస్థ అప్పటి దశలో చేస్తున్న రాజకీయాలు జవాహర్‌లాల్‌కు కనీస ఆసక్తి కలిగించలేదు. అతనికి ఆ సమావేశాలు - "ఇంగ్లీషు తెలిసిన ఉన్నత వర్గాల వ్యవహారంగా మాత్రమే" అనిపించాయి.[2] ఆ దశలో కాంగ్రెస్ దాదాపుగా మితవాద రాజకీయ నాయకులతో నిండి ఉండేది.[1] మొదటి ప్రపంచయుద్ధం వచ్చిన ఆ దశలో తనకు ఒక స్పష్టమైన వైఖరి లేదని జవాహర్ తర్వాతి దశలో అంగీకరించాడు. నెహ్రూ జీవితచరిత్రకారుల్లో ఒకడైన ఫ్రాంక్ మోరిస్ రాసినదాని ప్రకారం "అతని (జవాహర్‌లాల్) సానుభూతి ఏ దేశంతో అయినా ఉందంటే అది ఫ్రాన్స్. ఫ్రెంచి సంస్కృతి పట్ల అతనికి ఎంతగానో గౌరవం ఉండేది."[3] యుద్ధసమయంలో జవాహర్ "సెయింట్ జాన్స్ అంబులెన్స్"కు స్వచ్ఛంద సేవకునిగా ఉన్నాడు. అలహాబాదులో సెయింట్ జాన్స్ అంబులెన్స్ సర్వీసు వారి ప్రాంతీయ కార్యదర్శుల్లో అతను ఒకడు.[1] కానీ ప్రభుత్వం పాస్ చేసిన సెన్సార్‌షిప్ బిల్లులను వ్యతిరేకించాడు.[4] 1917లో ప్రాంతీయ సైన్యం నమూనాలో తయారుచేసిన భారతీయ రక్షణదళంలో చేరడానికి తన సమ్మతిని తెలియజేశాడు. తనవంటి యువకులను అందులో చేరేలా ప్రోత్సహించే కార్యకలాపాల్లో పాల్గొనడానికి సంసిద్ధుడైనాడు.[5]

కాంగ్రెస్ సంస్థలో అతివాదులకు ప్రవేశం ఇప్పించే ప్రయత్నాలు బెడిసికొట్టి మితవాదులు విజయం సాధించడంతో బాలగంగాధర తిలక్, అనీ బిసెంట్ హోంరూల్ లీగులు స్థాపించారు. స్వయంపాలన ఆవశ్యకతను ప్రచారం చేసే ఉద్దేశంతో ఈ సంస్థలు స్థాపించారు. ప్రభుత్వం అనీబిసెంట్‌ని బొంబాయి, సెంట్రల్ ప్రావిన్సుల నుంచి బహిష్కరించింది.[5] దీనిపై దేశవ్యాప్తంగా ఎందరో విద్యావంతులు, అనీబిసెంట్ అనుచరులు ఆందోళన వ్యక్తం చేశారు. అలా ప్రభుత్వ చర్యలను నిరసించినవారిలో జవాహర్‌లాల్ ఒకడు. ప్రతిస్పందనగా తాను భారతీయ రక్షణదళంలో చేరడానికి చేసిన దరఖాస్తు ఉపసంహరించుకుని, దళంలో చేరేలా ఇతరులను ప్రోత్సహించేందుకు నిర్వహించబోయిన సభ రద్దుచేశాడు. మోతీలాల్ అధ్యక్షతన జవాహర్‌లాల్ ఒకానొక కార్యదర్శిగా యునైటెడ్ ప్రావిన్సుల హోంరూల్ లీగ్ ఏర్పాటుచేశారు. అయితే హోంరూల్ సాధించేందుకు చేపట్టాల్సిన కార్యాచరణ విషయంలో జవాహర్‌లాల్‌కి స్పష్టత లేదు. హోంరూల్ నాయకులైన అనీబిసెంట్ ఆంగ్లో-సాక్సన్ పద్ధతి కానీ, తిలక్ తీవ్రమైన అతివాదం కానీ అతన్ని ఆకర్షించలేదు. అలాగని స్వంతంగా తనే కార్యాచరణ ఏర్పురుచుకోగల స్పష్టత కూడా లేదు.[6] సిరిసంపదల వల్ల దేశప్రజలకు సేవచేయగల స్థితిలో ఉండి కూడా తండ్రి స్థాపించిన ఇండిపెండెంట్ పత్రిక నిర్వహణలో సహకారం తప్ప మరేమీ చేయలేకపోతున్నందుకు అసంతుష్టితో గడిపేవాడు.[7]

సహాయ నిరాకరణోద్యమం మార్చు

మహాత్మా గాంధీ ప్రభావం మార్చు

1919లో రౌలట్ చట్టం అమలులోకి రావడం, జలియన్ వాలాబాగ్ దురంతం జరగడం జవాహర్‌లాల్‌లో పెద్ద పరివర్తనానికి కారణమయ్యాయి. జలియన్‌ వాలాబాగ్ దురంతాన్ని గురించి నివేదించడానికి ఏర్పరిచిన కాంగ్రెస్ కమిటీకి జవాహర్‌లాల్ సహకరించేందుకు అమృత్‌సర్ సందర్శించాడు. ప్రత్యేకించి జలియన్ వాలాబాగ్ దురంతం పట్ల ఇంగ్లండులో వ్యక్తమైన అభిప్రాయం అతన్ని కలతపెట్టింది.[8] సర్వేపల్లి గోపాల్ ఈ దశలో వచ్చిన మార్పు గురించి - " (అంతవరకు) దయాసముద్రులైన బ్రిటీష్ పాలకులవల్ల ఉపకారం మేలు జరుగుతాయని (జవాహర్‌లాల్) ఆశిస్తూ ఉన్నాడు. కాని స్వాతంత్ర్యమనేది ఒకరు ఆదరభావంతో ఇచ్చే కాన్క కాదనీ, ప్రతిఘటించి పోరాటం సల్పినందువల్ల దక్కే ఫలితమనీ దేశంలో సర్వసాధారణంగా చాలామందికి కనువిప్పు కలిగింది. దాని పర్యవసానమే జవహర్‌లో వచ్చిన పెద్ద పరివర్తనం." అని రాశాడు.[9] 1920లో పలువురు భారతీయ జాతీయోద్యమ నాయకులు, కార్యకర్తల వలెనే జవాహర్‌లాల్ కూడా గాంధీ భావాలు, కార్యాచరణ విపరీతంగా ఆకర్షించాయి. గాంధీ పిలుపును అనుసరించి సహాయ నిరాకరణోద్యమంలో తన కృషి ప్రారంభించాడు. జవాహర్‌లాల్ యునైటెడ్ ప్రావిన్సుల్లో సహాయ నిరాకరణోద్యమాన్ని నిర్వహించే బాధ్యత స్వీకరించాడు. యుపిలో ప్రముఖుడైన కాంగ్రెస్ నాయకుడిగా అతికొద్ది కాలంలోనే పేరు సంపాదించాడు.[10]

1920 జూలై నుంచి అలహాబాద్ జిల్లాకు ఉత్తరాన ఉన్న ప్రతాబ్‌గఢ్ జిల్లాలో జమీందార్లు చిత్తం వచ్చినట్టు కౌళ్ళు, జరిమానాలు, నజరానాలు విధిస్తూండడంతో తిరగబడ్డ[11] వెనుకబడ్డ కుర్మీ కులానికి చెందిన రైతుల పోరాటానికి జవాహర్‌లాల్ నాయకత్వం వహించాడు. రైతుల కోర్కెలకు న్యాయబద్ధమైన స్పష్టమైన రూపం ఇచ్చి, వారిని అహింసవైపు మళ్ళించి వారి సమస్యలను వెల్లడించేందుకు కిసాన్ సభలను ఏర్పాటుచేశాడు. మరోవైపు రైతులను అక్రమంగా అరెస్టు చేసిన బ్రిటీష్ అధికారులతో సంప్రదింపులు జరిపాడు.[12][13] రైతుల్లోని క్రమశిక్షణ, వారికి జవాహర్ నాయకత్వం పట్ల గౌరవం అతన్ని కదిలించాయి. ప్రతాబ్‌గఢ్ ప్రాంతంలో ఒకచోట సభలో తాను ప్రసంగిస్తూండగా జనంలో చిన్న కలకలం కనిపించింది, మాట్లాడకున్నా వారిలో వారే తోసుకోవడం, మోచేతులతో పొడుచుకోవడం కనిపించింది. ఆగ్రహించి అదేమని ప్రశ్నిస్తే - అక్కడొక పాము ఉందని, ప్రాణభయం ఓవైపు ఉన్నా కూడా క్రమశిక్షణ తప్పకుండా అలా మౌనంగానే ఒకరినొకరు హెచ్చరించుకుంటున్నారని తెలిసింది. మూడున్నర దశాబ్దాల తర్వాత గుర్తుచేసుకునేంతగా జవాహర్ మీద ఈ సంఘటన ముద్రవేసింది.[14] జమీందార్ల విధానాలకు తోడు ప్రభుత్వ బాధ్యతారాహిత్యం వల్ల 1921 సంవత్సరంలో హింసాత్మకమైన రైతాంగ ఆందోళన అవధ్ అంతటా వ్యాపించింది.[15] జనవరి, ఫిబ్రవరి నెలల్లో రెండు వేర్వేరు సంఘటనల్లో పోలీసుల దాడులు, నాయకుల అరెస్టుల వల్ల రెచ్చిపోతున్న గుంపుల ఎదుట నిలిచి జవాహర్ వారికి సాహసోపేతంగా అహింస బోధించి శాంతపరిచాడు. ప్రభుత్వం ఒకపక్క సహాయనిరాకరణ ఉద్యమ నాయకులైన గాంధీ, నెహ్రూ వంటివారి పట్ల అనుమాన దృక్కులతో చూస్తూనే, ఉద్యమ నాయకత్వం కౌళ్ళు చెల్లించమని సూచించే జవాహర్‌లాల్, గాంధీ వంటివారి చేతిలో ఉండాలని,[16] ఏమీ చెల్లించవద్దని ఆజ్ఞాపించే సాధువుల చేతిలో ఉండరాదని ఆశించారు. పన్నులు, కౌళ్ళ చెల్లింపు నిరాకరించమనే నాయకులను క్రమేపీ ప్రభుత్వం అరెస్టు చేసి, రైతు ఉద్యమ నాయకత్వాన్ని పూర్తిగా కాంగ్రెస్ పాలు చేసింది. జవాహర్ సహా కాంగ్రెస్ వారు రైతు సమస్యల మీద తక్కువగా వ్యవస్థా నిర్మాణం, నిధుల వసూళ్ళపై ఎక్కువగా కేంద్రీకరించడంతో ప్రభుత్వానికి వీలుచిక్కింది.[17] తర్వాతి దశలో రైతాంగం మరో రాజకీయ ఆందోళన అయిన ఏకా ఉద్యమం ప్రారంభించింది. జవాహర్ వేరే పనిలో మునిగి, ఈ ఉద్యమంలో పాల్గొనకుండా ఉండిపోయాడు. అంతటితో ఆ రైతు ఉద్యమంలో జవాహర్ అనుబంధం ముగిసింది.[18]

1921లో నెహ్రూ ఒకపక్క అఖిలభారత కాంగ్రెస్ వ్యవహారాల్లోనూ, ఇటుపక్క స్వంత రాష్ట్రంలోని కార్యాచరణలోనూ ఆసక్తిగా పాల్గొనసాగాడు. అలహాబాద్ జిల్లాలో కనీసం 50వేల మందిని కాంగ్రెస్ సభ్యులుగా చేర్పించాలని, ప్రత్యేకించి స్త్రీలను హెచ్చుసంఖ్యలో చేర్చాలని లక్ష్యం నిర్ణయించుకున్నాడు. సహాయ నిరాకరణ, ఖిలాఫత్ ఉద్యమాలను బలపరచడానికి యునైటెడ్ ప్రావిన్సుల్లోని జిల్లాలంతటా పర్యటనలు ప్రారంభించాడు. అనేక కార్యక్రమాలు, సభలు నిర్ణయించుకుని వాటికై విస్తారంగా ప్రయాణాలు చేశాడు. ఒకదశలో తాను చేరుకోవాల్సిన సభ కోసం రెండు ఊళ్ళ మధ్య పరుగులు కూడా పెట్టాడు.[19] మరో సందర్భంలో తప్పిపోయిన రైలును అందుకునేందుకు పక్క స్టేషనుకు రైల్వే ట్రాలీలో ప్రయాణించాడు. 1920, 21ల్లో స్వరాజ్యం సాధించడానికి స్వదేశీ వస్తువులు, దుస్తులు వినియోగించడమే ఏకైక మార్గమన్న అభిప్రాయంలో ఉండేవాడు. విదేశీ వస్త్ర బహిష్కరణ,[20] స్వరాజ్య నిధికి విరాళాల సేకరణ మంచి ఉత్సాహంతో చేస్తూండేవాడు. ప్రభుత్వాజ్ఞలను పూర్తిగా లెక్కచేయని మనస్థితి రాలేదు. సభల విషయంలో నిషేధాజ్ఞలు పాటించేవాడు.[21] అయితే ప్రభుత్వం హింసను ప్రేరేపించే రచనలు చేయనని పూచీ ఇమ్మని కోరగా, ప్రభుత్వానికి క్షమాపణ కానీ, పూచీ కానీ ఇవ్వనని నిరాకరించాడు. [22] 1921 డిసెంబరు 5న యునైటెడ్ ప్రావిన్సు స్వచ్ఛంద సేవకుల వ్యవస్థను చట్టవిరుద్ధమని ప్రకటించి, దాని కార్యదర్శి జవాహరలాల్‌ను, ఈ కార్యకలాపాలతో సంబంధం ఉన్న తండ్రి మోతీలాల్‌ను అరెస్టు చేశారు. జవాహర్‌లాల్‌కు ఆరునెలల సాధారణ జైలుశిక్ష, రూ.100 జరిమానా, అది చెల్లించకుంటే మరో నెల శిక్ష విధించారు. జవాహర్ అధికారులు అణచివేస్తున్నా, తాను నిర్బంధంలో ఉన్నా జైలు నుంచే యుపి కాంగ్రెస్ పని కొనసాగించాడు. ఏవో సాంకేతిక కారణాలతో సగం శిక్ష అనుభవించగానే 1952 మార్చిలో జవాహర్‌ని విడుదల చేశారు. చౌరీచౌరా సంఘటన వంటి హింసాత్మక ఘటనలు ఎక్కువ అవుతున్నాయన్న కారణంగా మహాత్మా గాంధీ సహాయనిరాకరణ ఉద్యమాన్ని నిలిపివేయడం జవాహర్‌లాల్ వంటి పలువురు కాంగ్రెస్ నాయకులకు ఆశాభంగం అయింది.[23]

మొదటిసారి కారాగార వాసం మార్చు

మహర్షి వంటివాడైన మా ప్రియతమ నాయకుని(గాంధీ)కి శిక్ష విధించిన తర్వాత జైలు మాకు స్వర్గమైంది. పవిత్రమైన యాత్రా స్థలమైంది.... నా అదృష్టానికి నేనే అబ్బురపడుతున్నాను.

— న్యాయస్థానంలో జవాహర్‌లాల్ నెహ్రూ ప్రకటనలో భాగం[24]

సహాయ నిరాకరణోద్యమం ఆపేయాలని మహాత్మా గాంధీ హఠాత్తుగా తీసుకున్న నిర్ణయం తీవ్రమైనదీ, ఆశాభంగం కలిగించేదీ అయినా జవాహర్‌లాల్ గాంధీ మార్గనిర్దేశానికే కట్టుబడ్డాడు. ఆ నిర్ణయంతో దెబ్బతిన్న కాంగ్రెస్ కార్యకర్తల ఆత్మస్థైర్యాన్ని నిలబెట్టడం జవాహర్‌కి చాలా కష్టమైంది.[23] యునైటెడ్ ప్రావిన్సుల్లో రాట్నం తిప్పడం, విదేశీ వస్తు బహిష్కరణ వంటి నిర్మాణాత్మక కార్యక్రమాల్లోనూ, గాంధీ స్వరాజ్య కార్యక్రమాలను ప్రచారం చేయడంలోనూ గడిపేవాడు. అప్పటికే మహాత్మా గాంధీని అరెస్టు చేసి, జైలు శిక్ష విధించిన ప్రభుత్వం తీవ్రమైన అణచివేత చర్యలకు పాల్పడసాగింది. ఈ నిర్బంధాల మధ్య నిర్మాణాత్మక కార్యక్రమాలు కూడా సాగడం కష్టమయ్యేది. 1922 మే 12న పికెటింగ్ జరుపుతూ, దాన్ని ప్రచారం చేస్తున్నాడన్న కారణంతో జవాహర్‌లాల్‌ని అరెస్టు చేశారు.[25] సహాయనిరాకరణ ఉద్యమ కార్యాచరణలో భాగంగా న్యాయస్థానాలు విడనాడాలన్న సూత్రం అనుసరించి జవాహర్‌లాల్ తన తరఫున వాదించడానికి, క్రాస్ పరీక్ష చేయడానికీ అంగీకరించలేదు. కోర్టులో న్యాయమూర్తి మాట్లాడే అవకాశం ఇచ్చినప్పుడు సుదీర్ఘమైన ప్రకటన ఒకటి చేశాడు. దానిలో తన దృక్పథాన్ని వివరిస్తూ, ప్రభుత్వ దమనకాండను నిరసించాడు. విదేశీ వస్త్రబహిష్కరణకు ఈ విధంగా ప్రాచుర్యం కలిగించినందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్పాడు. మహాత్మాగాంధీ వంటి నాయకుని కింద దేశసేవ చేయడం భాగ్యమని తోటి భారతీయులకు ప్రబోధిస్తూ ముగించాడు.[24] ప్రభుత్వం ఆశించని విధంగా విద్యావంతులైన భారతీయ యువతను జవాహర్ కోర్టు ప్రకటన ప్రభావితం చేసింది.

ఈసారి 18 నెలల కఠిన కారాగార శిక్ష, వంద రూపాయల జరిమానా విధించారు. జరిమానా కట్టకపోతే మరో మూడు నెలల జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. అతనిని జైలుశిక్ష అనుభవించేందుకు లక్నో జైలుకు తరలించారు. ఆ జైలులో సందర్శకులను వేధిస్తారన్న చెడ్డపేరు ఉండడంతో స్నేహితులు, బంధువులను చూసే అవకాశం తానే వదులుకున్నాడు. జైలు జీవితం పేరిట బలవంతాన లభించే తీరికను జవాహర్ సద్వినియోగం చేసుకున్నాడు.[26] శారీరక వ్యాయామం, నూలు వడకడం, చరిత్ర, యాత్రా జీవనాలకు సంబంధించిన పుస్తకాలు చదవడం, ఉత్తరాలు రాయడం వంటి పనుల్లో నిమగ్నమయ్యాడు. జైలు జీవితం తాలూకు కష్టాలు, ఇబ్బందులు అతనికి బాగా సంతృప్తి కలిగించాయి. దేశం కోసం కష్టపడుతున్నందుకు ఒకవిధమైన సంతృప్తి చెందేవాడు. జైలు నుంచి విడుదల కోరుకోవట్లేదని ఒక లేఖలో జవాహర్‌లాల్ రాశాడు. అందుకు భిన్నంగా యునైటెడ్ ప్రావిన్సుల శాసన మండలి తీర్మానాన్ని అమలు చేస్తూ శిక్ష పూర్తికాకుండానే 1923 జనవరి 31న సార్వత్రిక క్షమాభిక్షలో భాగంగా జవాహర్ శిక్షాకాలం ముగిసింది.[27]

పార్టీ వ్యవహారాలు, పరిపాలన మార్చు

పార్టీలో మధ్యవర్తిత్వం మార్చు

విడుదల కాగానే కాంగ్రెస్ పార్టీ శాసనసభల్లో ప్రవేశించాలనే వారు, ప్రవేశించరాదనే వారి మధ్య చీలిపోయి ఉంది. ప్రవేశించాలనే మితవాద పక్షంలో తన తండ్రి మోతీలాల్ సహా తనకు సన్నిహితులు ఉన్నారు. స్వతాహాగా జవాహర్‌కి సహాయ నిరాకరణను తిరగదోడి శాసనసభల్లో చేరడం చేపట్టడం ఇష్టం లేదు. కానీ ఈ చీలికల విషయంలో సంస్థ దెబ్బతింటుందని కలతపడ్డాడు. సహాయ నిరాకరణమే స్వరాజ్యానికి మార్గమన్న తన విధానాన్ని పునరుద్ఘాటించినా శాసనసభల ప్రవేశం విషయంలో అప్పటికి ఏ అభిప్రాయం వ్యక్తం చేయలేదు. ఇరుపక్షాలూ తమ ప్రచారాలు రెండు నెలలపాటు ఆపివేసేలా 1923 ఫిబ్రవరి మాసాంతంలో జరిగిన అలహాబాద్ సభలో మౌలానా అబుల్ కలామ్ ఆజాద్‌తో కలిసి ఇరుపక్షాలనూ జవాహర్ ఒప్పించాడు.[28] తిరిగి మే నెలలో రెండు పక్షాల వారూ కలహానికి సంసిద్ధులయ్యే సరికి కాంగ్రెస్ చీలిక నివారించడానికి జవాహర్‌లాల్ ఓ రాజీ సూత్రాన్ని ప్రతిపాదించాడు. దాని ప్రకారం శాసనసభల్లో ప్రవేశించరాదని 1922 డిసెంబరులో జరిగిన నిర్ణయాన్ని కొట్టివేయరు, అలాగని ప్రచారమూ ఇవ్వరు. అంటే సూత్రం అలానే ఉండనిచ్చి శాసనసభల్లో ప్రవేశించవచ్చని సారాంశం. ఇది శాసనసభల్లో ప్రవేశానికి ఆశిస్తున్నవారికే అనుకూలంగా ఉంది. ఈ తీర్మానం బొంబాయిలో జరిగిన అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సైతం ఆమోదించింది. కానీ శాసనసభా ప్రవేశం ఇష్టంలేని ఆరుగురు సభ్యులూ రాజీనామా చేసి, ఆమోదించాలని పట్టుబట్టారు.[29] ఆ దశలో చివరకు కమిటీలో ఏ పక్షానికి మొగ్గకుండా ఉన్న జవాహర్‌లాల్ వంటివారు ఉండాలని ఇరుపక్షాలూ అంగీకారానికి వచ్చాయి. అయితే అతికొద్ది నెలల్లోనే ఈ రాజీ తీర్మానాన్ని పలు రాష్ట్ర కమిటీలు తిరస్కరించాయి. ఆ కమిటీలపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని అఖిలభారత కాంగ్రెస్ కమిటీ సమావేశంలో జవాహర్ పెట్టిన తీర్మానం వీగిపోవడంతో పార్టీ పదవులన్నిటికి రాజీనామా చేశాడు.[30]

జెండా సత్యాగ్రహం, నాభా సమస్య మార్చు

అయిష్టమైన పార్టీ కలహాల నుంచి రాజీనామాతో విముక్తి పొందిన జవాహర్‌లాల్ తిరిగి కార్యాచరణపై దృష్టిపెట్టాడు. నాగపూరులో జాతీయ జెండాతో ఊరేగింపును అనుమతించేందుకు జిల్లా మొజిస్ట్రేటు నిరాకరించడంతో జెండా సత్యాగ్రహం ప్రారంభమైంది. దానిని వ్యవస్థీకరించి, ఎప్పటికప్పుడు స్థానిక కార్యకర్తలకు తోడుగా వివిధ ప్రాంతాల నుంచి స్వచ్ఛంద కార్యకర్తల బృందాలు వెళ్ళి ఊరేగింపుగా జెండాను తీసుకుపోతూ అరెస్టు అవుతూండేలా పంపుతూ వచ్చారు. చివరకు ప్రభుత్వం దిగి వచ్చి జాతీయ జెండాను ఎగురవేసుకునేందుకు అనుమతి ఇచ్చేదాకా ఇది కొనసాగింది. ఆ తర్వాత అకాలీ ఉద్యమంలో ఆసక్తి కనబరిచి, క్రమేపీ ఆ ఉద్యమంలో మమేకమయ్యాడు. పంజాబ్ రాష్ట్రంలోని సిక్ఖులకు గురుద్వారాల నిర్వహణలో సంస్కరణలు అమలు చేయాలని ప్రారంభించిన అకాలీల ఉద్యమం శాంతిభద్రతల సమస్య తెస్తుందని పంజాబ్ ప్రభుత్వం వారి ప్రయత్నాలు ప్రతిఘటించింది. అలా మతసంస్కరణల ఉద్యమం రాజకీయ ఉద్యమమై, మహాత్మా గాంధీ ప్రబోధించిన అహింసా సిద్ధాంతం స్వీకరించి ప్రభుత్వాన్ని ఎదిరించసాగారు. 1923 జూన్, జూలైల్లో వారి సభల్లో పాల్గొనడంతో ప్రారంభించి క్రమేపీ సెప్టెంబరు నాటికల్లా అకాలీలతో కలిసి అప్పుడప్పుడే పదవీచ్యుతుడై, సంస్థానం కోల్పోయిన సిక్ఖు సంస్థానాధీశ్వరుని ప్రాంతం- నాభా సంస్థానం వెళ్ళాడు. అధికారులు అప్పటికే సంస్థానంలో ప్రవేశించిన జవాహర్‌లాల్‌ని సంస్థానంలో ప్రవేశించవద్దన్న ఉత్తర్వు చూపించి, దానిని ఉల్లంఘించాడంటూ అరెస్టు చేశారు. జవాహర్‌లాల్‌నీ, అతని స్నేహితులనీ ఒకే గొలుసులకు కట్టివేసి, జనంతో కిక్కిరిసిన మూడో తరగతి రైలు పెట్టెలో నాభా పట్టణం తీసుకువెళ్ళి దారుణమైన స్థితిగతులు ఉన్న నాభా జైలులో నిర్బంధించారు. అతనిపై నేరారోపణలు అసంబంద్ధంగా ఉండడంతో సిక్ఖుల జాథాలలో ఉన్నాడనీ, వారంతా దౌర్జన్యం చేశారనీ అక్రమ కేసు బనాయించారు. కేసు నత్తనడకన సాగుతూండగా బ్రిటీష్ ఇండియా ప్రభుత్వం కలగజేసుకుని కొన్ని సూచనలు చేసింది. తదనుగుణంగా నిందితులకు 30 నెలల కఠిన కారాగార శిక్ష విధించి, వెనువెంటనే నిలిపివేసి, సంస్థానాన్ని విడిచి వెళ్ళి తిరిగి రావద్దన్నారు.[31]

మున్సిపల్ పరిపాలన మార్చు

నాభా జైలు నుంచి తిరిగివచ్చాకా జవాహర్‌లాల్ ఉత్సాహలేమితో కొట్టుమిట్టాడుతున్న కాంగ్రెస్ పార్టీకి జవజీవాలు తీసుకురావడం ఎలాగన్న ప్రశ్నపై సతమతమయ్యాడు. అప్పటికి జవాహర్‌ భావాల్లో సామ్యవాదం వంటివేమీ జొరబడలేదు, గాంధేయవాదానికే పూర్తి నిబద్ధునిగా ఉండేవాడు.[32] కాకినాడలో జరిగిన అఖిల భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో ప్రసంగిస్తూ - "భారతీయ స్వచ్ఛంద సేవకులకూ, పాశ్చాత్య దేశాల వలంటిర్లకూ మధ్య ఉభయ సామాన్యమైన విశేషం అంతగా లేదు. భారతీయ స్వచ్ఛంద సేవక సంస్థకు అహింస ప్రాథమిక సూత్రమై ఉండాలి. భారతదేశానికి అహింసను, క్రమశిక్షణను పాటించే సైనికులు అవసరమై వున్నారు" అంటూ అవే భావాలు గాంధీయమైన భాషలోనే వెల్లడించాడు. జాతీయ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శులు ముగ్గురిలో ఒకనిగా జవాహర్‌లాల్ పార్టీ నిర్వహణా భారాన్ని, అనుసంధాన కార్యకలాపాలను చాలావరకూ భుజాన వేసుకున్నాడు.[33] కాంగ్రెస్ పార్టీ ద్రవ్య వ్యవహారాలు, అకాలీ ఉద్యమాన్ని జాతీయోద్యమంతో అనుసంధానం చేసే కార్యకలాపాలతో తీరికలేకుండా పనిచేయసాగాడు.[34]

ఖిలాఫత్ ఉద్యమ స్ఫూర్తి నానాటికీ దెబ్బతింటూ దేశంలో హిందూ-ముస్లిం మత విద్వేషాలు రెచ్చిపోసాగాయి. 1924 ఫిబ్రవరిలో బ్రిటీష్ వారు ఆరోగ్యకారణాలతో విడుదల చేసిన గాంధీ సెప్టెంబరు నాటికి ఈ మతవిద్వేషాలు సమసిపోవాలంటూ 21 రోజుల ఉపవాస దీక్ష తీసుకున్నాడు. జవాహర్‌లాల్‌ను ఆ వార్త చాలా బాధించింది. అది తెలిసేనాటికే మతకలహాలు తగ్గించేందుకు, వాస్తవ స్థితిగతులు తెలుసుకునేందుకు పర్యటనలు చేస్తున్నాడు. హిందూ-ముస్లిముల నడుమ ఐక్యత సాధించే మార్గాన్వేషణకు యుపిలో ప్రతీ పట్టణంలో, ప్రతీ గ్రామంలో సమావేశాలు నిర్వహించాలని పిలుపునిచ్చాడు, స్వయంగా ఢిల్లీలో ఐక్యతా మహాసభలో పాల్గొన్నాడు.[34] అలహాబాద్‌ నగరంలో జరిగిన మత ఘర్షణల వివరాలను సేకరించి, గాంధీకి నివేదిక పంపాడు. మత ఘర్షణలు జవాహర్‌లాల్‌ మనస్సును చాలా గాయపరిచాయి. 1925 జనవరిలో ఈ అంశంపై జరిగిన అఖిల పక్ష మహాసభ విఫలమైంది. ఈ సభలో జరిగిన చర్చ వినాల్సిరావడమే అతనికి ఎంతో బాధాకరంగా పరిణమించింది. అతని ఉద్దేశంలో ఇది అవాస్తవికమైన, ఊహాత్మకమైన అంశాల చుట్టూ అల్లుకుపోతూండే సమస్య, కనుకనే ఈ సమస్యపై శక్తివంతమైన చర్యలు తీసుకోలేకపోయాడు.[35]

నా ప్రియతమ నాయకుడు (గాంధీ) జైలులోపల మ్రగ్గుతూ ఉండగా నా సమయంలో అధిక భాగాన్ని ఏ పదవిలోనూ వ్యయపరచదలుచుకోలేదు. నాకు చేతనైనప్పుడల్లా యుద్ధం చేస్తాను. నాకు వీలైనప్పుడల్లా పోరాడుతాను, బలంగా దెబ్బతీస్తాను, స్వరాజ్యం వచ్చేదాకా అదే నా ముఖ్యమైన పని. తక్కినదంతా శిక్షణ, తయారీ.

— యుపి రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ కార్యదర్శిగా జవాహర్‌లాల్ నెహ్రూ 1923 ఏప్రిల్ 5న కాంగ్రెస్ కమిటీలకు, రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ సభ్యులకు పంపిన సర్క్యులర్‌లో భాగం.[24]

సహాయ నిరాకరణోద్యమ విరమణ తర్వాత ఐరోపా ప్రయాణంలోపు సంక్షుభిత సంవత్సరాల్లో జవాహర్‌ జీవితంలో చెప్పుకోదగ్గ విశేషం - అలహాబాద్ పురపాలక సంఘ అధ్యక్షునిగా చేసిన కృషి. 1923 ఏప్రిల్ నుంచి 1925 ఏప్రిల్ వరకూ ఈ పదవిలో ఉన్న జవాహర్ పరిపాలనలో తొలి అనుభవాన్ని ఇక్కడే గడించాడు.[36] సర్వేపల్లి గోపాల్ ఉద్దేశంలో తర్వాతి కాలంలో ప్రధానమంత్రిగా నెహ్రూ కనబరిచిన "సహచరులపై తన ప్రాబల్యం చూపడం, సామర్థ్యాన్ని అభిలషించడం, సమర్థులైన తన క్రింది అధికార్ల పట్ల విడవని విశ్వాసం చూపడం, కొత్త ఆలోచనలతో అన్ని దిక్కులా ముందుకు సాగిపోయేందుకు గట్టిగా ప్రయత్నించడం వంటి లక్షణాలు" బీజప్రాయంగా అలహాబాద్ పురపాలక సంఘంలో చేసిన పనిలో చూడవచ్చు.[37] పదవి చేపట్టినందుకు శక్తివంచన లేకుండా పనిచేసినా అతను ఏనాడూ దీనికి స్వరాజ్యం కోసం చేసే పోరాటం కన్నా ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వలేదు. మొదలుపెట్టినప్పుడు అయిష్టమైనదైనా పరిపాలనా వ్యవహారాలు క్రమేపీ అతని ఆసక్తిని చూరగొన్నాయి.[38] పురపాలక సంఘ సభ్యుల అలసత్వం, క్రమశిక్షణా రాహిత్యం పదవిలోకి వచ్చిన తొలినాళ్ళలోనే బహిరంగ విమర్శలతో తొలగించి, క్రమశిక్షణ నెలకొల్పాడు. చిన్న చిన్న అంశాలకు స్వరాజ్య విధానంతో ముడిపెట్టి పట్టుపట్టేవారు స్వంత పార్టీ సభ్యులే అయినా అంగీకరించేవాడు కాదు.[39] ఆంగ్లేయులపై నిష్కారణంగా ప్రతీకారం చూపే విధానాలనూ సమర్థించలేదు. అవసరమైనప్పుడు, తగినంత స్థాయి ఉన్న విధానాలలో కాంగ్రెస్ విధానాల దృష్ట్యా నడుచుకునేవాడు.[40] బ్రిటీష్ వస్తువుల బహిష్కరణ, పాఠశాలల్లో నూలు వడకడం, కాంగ్రెస్ నాయకులకు సన్మానం, తిలక్ వర్థంతి, గాంధీకి శిక్షవేసిన రోజు జ్ఞాపకార్థంగా గాంధీ దినోత్సవం సెలవులు ఇవ్వడం వంటి చర్యలు రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకించినా ఖాతరుచేయకుండా నిర్వహించాడు. ప్రజలకు మేలుచేకూర్చే పలు నిర్ణయాలు, క్రమం తప్పకుండా ప్రజలకు నివేదికలతో పారదర్శకత పాటించడం వంటి అనేక చర్యలు చేపట్టాడు. ప్రత్యక్షంగా కనిపించే న్యాయబుద్ధి, నీతి, నిజాయితీలతో పురపాలక సంఘ వ్యవహారాల్లోని అన్ని పక్షాల వారిలోనూ పలుకుబడి, ప్రాభవం సంపాదించాడు.[41] కమీషనర్ కూడా మునిసిపల్ వ్యవహారాలు మెరుగుకావడం వెనుక జవాహర్‌లాల్ కృషిని ప్రస్తావించాల్సిన స్థితి తీసుకువచ్చాడు. అయితే పురపాలక వ్యవహారాలు కేవలం గృహవసతి, పారిశుధ్యం వంటి అంశాలకే పరిమితమై విశాలమైన అర్థంలో సాంఘిక సంక్షేమాన్ని తమ పరిధిగా ఎంచే వీలులేకపోవడం, ఆ రంగంలో కృషిచేయలేకపోవడం అతనికి సంతృప్తి కలిగించలేదు.[42] 1925 ఏప్రిల్‌లో పార్టీ కార్యకలాపాల దృష్ట్యా బోర్డు పనులు చూడడానికి వీలుచిక్కడం లేదంటూ మునిసిపల్ బోర్డు ఛైర్మన్ పదవికీ, బోర్డు సభ్యత్వానికి కూడా రాజీనామా చేశాడు.[43]

సామ్యవాద ప్రభావం, పూర్ణ స్వరాజ్య వాదం మార్చు

ఐరోపా పర్యటన, నూతన రాజకీయ భావాల అంకురం (1926-1927) మార్చు

జవాహర్‌లాల్ 1926 మార్చి 1న భార్య కమల, కుమార్తె ఇందిరలతో బయలుదేరి ఐరోపా చేరుకున్నాడు. జెనీవాలో ఒక చౌక బసలో స్థిరపడ్డాడు. క్షయవ్యాధితో బాధపడుతున్న భార్య కోలుకునేందుకు ప్రధానంగా ఈ ఐరోపా నివాసం. అయితే అది ఆమె మీద ప్రభావం ఏమీ చూపించకపోగా జవాహర్‌లాల్ రాజకీయ, ఆర్థిక భావాలలో విప్లవాత్మకం అనదగ్గ పరిణామం తీసుకువచ్చింది. మరోవైపు భారతదేశంలో జాతీయవాద రాజకీయాల పరిస్థితి దారుణంగా తయారైంది. మతసామరస్యం లోపించి మతకల్లోలాలు వ్యాప్తిచెందుతూ ఉన్న వార్తలు జవాహర్‌కు అందుతూండేవి. ఈ వార్తలు ఆయనను కుంగతీసేవి. మతాన్ని అదుపులోకి తెచ్చుకుని, రాజకీయాలను లౌకిక తత్వం వైపు మళ్ళించడమే దీనికి పరిష్కారమని భావించేవాడు. ఈ దశలో అతను బౌద్ధికమైన పనులు కాక చేసినవి భార్యకు సేవ, కుమార్తెను పాఠశాలకు తీసుకెళ్ళి, తీసుకురావడం. అంటే అతని కార్యాచరణయుతమైన జీవితంలో అధ్యయనానికి బోలెడంత ఖాళీ దొరికినట్టు. ఫ్రెంచి భాష నేర్చుకోవడం, బహు గ్రంథ పఠనం, వివిధ కోర్సులకు, ఉపన్యాసాలకు హాజరుకావడం వంటి పనులతో ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. విస్తారమైన అధ్యయనం వల్ల ఆయన మనస్సు, బుద్ధి నూతన సిద్ధాంత బీజాలకు సిద్ధంగా ఉంది. ఆ ఏడాది ముగిసేనాటికి కమల ఆరోగ్యంపై ఐరోపా నివాసం మెరుగదల ఏమీ చూపించడం లేదని తేలిపోయింది. మోతీలాల్ కూడా ఐరోపా పర్యటనకు వస్తూండడంతో ఇక జవాహర్ కుటుంబం ఐరోపా ఖండాన్ని సందర్శించింది. ఈ సందర్శన జవాహర్‌లాల్ అధ్యయనానికి, ఐరోపా రాజకీయవేత్తలతో పరిచయాలు, వారి ఉద్యమాల పట్ల అవగాహన కలిగించి, తర్వాతికాలపు జవాహర్ ఆలోచనల్లో వినూత్నమైన గాఢత్వాన్ని కల్పించింది.

1927 ఫిబ్రవరిలో బ్రస్సెల్స్‌లో వలసపీడన, సామ్రాజ్యవాదాలకు వ్యతిరేకంగా జరిగిన అంతర్జాతీయ మహాసభలో భారత జాతీయ కాంగ్రెస్ ప్రతినిధిగా జవాహర్‌ అధ్యక్ష మండలి సభ్యుడి హోదాలో పాల్గొన్నాడు. సమావేశాల్లో వక్తగా, ఇష్టాగోష్ఠి సభ్యునిగా, ఒక సమావేశానికి అధ్యక్షునిగా, తీర్మానాల ముసాయిదా రచయితగా పలు హోదాల్లో చురుకుగా పాల్గొన్నాడు. సమావేశంలోని పలువురు రాజకీయవేత్తల సాంగత్యం అతనిని ప్రభావితం చేసింది. ఈ సమావేశాల్లో మాట్లాడుతూ జవాహర్ ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న సామ్రాజ్యవాద వ్యతిరేక ఉద్యమాల్లో సాధారణాంశం వివరించాడు. భారతీయుల్లో విభేదాలు తీవ్రతరం చేయడం, ఫ్యూడల్ సమాజానికి చెందిన సంస్థానాధీశులను, భారతీయ భూస్వాములను కాపాడడం వంటి సామ్రాజ్యవాద ప్రబలమైన దృష్టాంతాలను భారతదేశంలో ఎత్తిచూపాడు. తొలిసారి జవాహర్ ఆలోచనల్లో రాజకీయ-ఆర్థిక అంశాల పరస్పర సంబంధం పట్ల స్పష్టత వచ్చింది. అలా కేవలం బ్రిటీష్ సామ్రాజ్యవాదాన్ని ఖండించే జాతీయవాది స్థాయి నుంచి సామ్రాజ్యవాదపు ఉద్దేశాలు, తీరుతెన్నులు, అది పనిచేసే తీరును అవగాహన చేసుకోవడానికి తన రాజకీయ జీవితంలో తొలిసారి ప్రయత్నించాడు.

చైనా-భారత దేశ జాతీయవాద రాజకీయాల మధ్య సంబంధాలు ఏర్పడాలని ఆశించాడు. ఆ తర్వాత 30 సంవత్సరాల పాటు చైనాకీ, భారతదేశానికి ఉండవలసిన సత్సంబంధాల విషయమై మారకుండా నిలబడిన జవాహర్ దృక్పథానికి పునాది మహాసభలోనే పడింది. ప్రపంచ రాజకీయాలను కూడా చాలా సదవగాహనతో అంచనా వేశాడు. అప్పటికి చైనాలో జాతీయవాదులైన కూమిటాంగులు, కమ్యూనిస్టులు కలిసి బ్రిటీష్ సామ్రాజ్యవాదం, దాని ప్రభావంలో ఉన్న చైనా చక్రవర్తులకు వ్యతిరేకంగా పనిచేస్తూ ఉండగానే - చైనీయులకు విజయం సిద్ధిస్తే ఆసియాలో సోవియట్ మహా ప్రజాతంత్ర రాజ్యం ఏర్పాటైనట్టేననీ, చైనా-సోవియట్ రష్యా కలిసి ఆసియా, ఐరోపా ఖండాలపై ప్రాబల్యం చూపుతాయనీ, చైనాలోని రైతాంగ ఒత్తిడి వల్ల శుద్ధ కమ్యూనిజం నుంచి చాలామేరకు చైనీయ కమ్యూనిజం వైదొలగుతుందనీ భావించాడు. మరోవైపు బ్రిటన్ ప్రపంచంలో తన స్థానాన్ని కోల్పోతోందని, పూర్తిగా కోల్పోకుండా అమెరికా ఉపగ్రహంగా అమెరికన్ పెట్టుబడిదారీ పక్షాన నిలిచి పోరాడవచ్చని గ్రహించగలిగాడు. బ్రిటన్ ఐరోపాదేశాలన్నిటి మద్దతూ తీసుకున్నా ఒక మహాఖండంలా ఉండబోయే చైనా-రష్యా ప్రభావాన్ని ఎదుర్కోవడం సులభసాధ్యం కాదనీ ఊహించాడు. 1927 నాటికే వీటన్నిటినీ గ్రహించి, కాంగ్రెస్ కార్యవర్గానికి రహస్య నివేదికలో పంపాడు. క్రమేపీ దశాబ్దాల కాలంలో ఈ అంశాలన్నీ వాస్తవరూపం దాలుస్తూ ఉండడాన్ని అతని జీవితచరిత్రకారుడు సర్వేపల్లి గోపాల్ వ్యాఖ్యానిస్తూ ఇవన్నీ "జవాహర్‌లాల్ ... ప్రపంచ వ్యవహారాల్లో దూరదృష్టి కల రాజకీయ ప్రవక్తగా" నిలిపాయన్నాడు.

ఈ మహాసభ ఫలితంగా ఏర్పడ్డ సామ్రాజ్యవాద వ్యతిరేక లీగ్‌కు గౌరవ అధ్యక్షునిగా, కార్యనిర్వాహక మండలి సభ్యునిగా జవాహర్‌లాల్ ఎన్నికయ్యాడు. లీగ్ మీద, మహాసభ మీద సోవియట్ రష్యా ప్రభావం పైకి కనిపించకుండా ఉండేది. దీన్ని గ్రహించినా ఉపేక్షించగలిగాడు. పీడిత జాతులతో సోవియట్ రష్యా తన ప్రయోజనం కోసం సన్నిహితంగా వ్యవహరిస్తోందనీ, ఇది మరో కొత్త సామ్రాజ్యవాదానికి సుదూర భవిష్యత్తులో దారితీయవచ్చుననీ అంచనా వేశాడు. 1927లో సోవియట్ రష్యా అక్టోబర్ విప్లవం దశమ వార్షికోత్సవాల సందర్భంగా సోవియట్ ప్రభుత్వం పంపిన ఆహ్వానాన్ని అనుసరించి జవాహర్‌లాల్, మోతీలాల్ సోవియట్ రష్యాను సందర్శించారు. సోవియట్ యూనియన్ చరిత్రలో సుఖశాంతులతో కూడిన మొదటి దశ ఆఖరు రోజుల్లో సందర్శించాడు. సోవియట్ యూనియన్ ప్రభుత్వ ఆహ్వానం మేరకు, వారు చూపించదలిచిన విషయాలు మాత్రమే చూస్తున్నామని తెలిసినా వ్యవసాయం, జైళ్ళ సంస్కరణ, స్త్రీల పట్ల ప్రవర్తన, అల్పసంఖ్యాకుల సమస్యల పరిష్కారం, నిరక్షరాస్యతా నిర్మూలన వంటి అంశాల్లో అభివృద్ధి త్వరితగతిన సాధించిందన్న అభిప్రాయానికి వచ్చాడు. వ్యవసాయ ప్రధాన దేశం కావడం, విస్తారంగా నిరక్షరాస్యత వేళ్ళూనుకొని ఉండడం వంటి పోలికల వల్ల భారతదేశానికి చాలా విషయాల్లో సోవియట్ యూనియన్ బోధించదగ్గ అంశాలు అనేకం ఉంటాయని నమ్మాడు. ఇలా రష్యా అతని తొలి సందర్శనలో గాఢమైన ముద్రే వేసింది.

మొత్తానికి నిఖార్సైన గాంధీ శిష్యునిగా, గాంధేయవాద మూసలో ఆలోచించే యువకుడిగా 1926 తొలి నెలల్లో ఐరోపా బయలుదేరిన నెహ్రూ దాదాపు పూర్తి కమ్యూనిస్టుగా, అంతర్జాతీయ తత్వంతో భారతదేశ సమస్యలు ముడిపెట్టగలిగే ఆలోచనా విధానంతో విప్లవాత్మకమైన మార్పుతో 1927 తుదినాటికి భారతదేశానికి తిరిగివచ్చాడు.

పూర్ణ స్వాతంత్ర్య వాదం, ఇండిపెండెన్స్ ఫర్ ఇండియా లీగ్ మార్చు

గాంధీ నాయకత్వంలో భారత జాతీయ కాంగ్రెస్ అప్పటి వరకూ ఉపయోగిస్తూ వచ్చిన స్వరాజ్యమనే పదాన్ని అధినివేశ ప్రతిపత్తి కోరడం అనే సాంకేతిక అర్థంలో వాడుతూ వచ్చారు. అధినివేశ ప్రతిపత్తి అన్నది బ్రిటీష్ సామ్రాజ్యంలో భాగంగా ఉంటూనే అంతర్గతంగా కొంత స్వతంత్రాన్ని పొందే ఒక ఏర్పాటు. కాంగ్రెస్ వంటి సంస్థ అధినివేశ ప్రతిపత్తి కోసం పాకులాడడం ఐరోపా నుంచి వచ్చాకా జవాహర్‌లాల్‌కి నిరర్థకమని తోచింది. కాంగ్రెస్‌తో వీలైనంత త్వరగా సంపూర్ణ స్వాతంత్ర్యం తమ లక్ష్యం అని అంగీకరింపజేయడం కనీసం మొదటి మెట్టుగా తోచింది. అధినివేశ ప్రతిపత్తిలో విడిపోయే హక్కు ఉంటుందని చేసే వాదాల్లోని యుక్తి అతను అంగీకరించేవాడు కాదు. అసలు అధినివేశ ప్రతిపత్తికి అంగీకరించడమే భారతదేశ మానసిక భ్రష్టత్వానికి నిదర్శనమని భావించాడు. ఇది ఐరోపాలో అతనికి కలిగిన నూతన రాజకీయ, ఆర్థిక చైతన్యానికి సరిగా సరిపోయే కార్యాచరణ అని తోచింది.

జవాహర్‌లాల్ మద్రాసు కాంగ్రెస్ మహాసభలో పూర్ణ స్వాతంత్ర్యం కోరుతూ ఒక తీర్మానాన్ని ఆమోదింపజేయగలిగాడు. పూర్ణ స్వాతంత్ర్యానికి రక్షణ, ద్రవ్య, ఆర్థిక విషయాలు, విదేశాంగ విధానంపై పూర్తి అదుపు అని తీర్మానంలో అర్థం చెప్పాడు. అయితే ఈ తీర్మానాన్ని కేవలం జవాహర్‌లాల్‌ని సంతోషపరిచి, సంతృప్తుణ్ణి చేయడానికే గాంధీ ప్రధానంగా ఉద్దేశించాడు. కనుక కాంగ్రెస్ నియమావళిలో పూర్వ అర్థంలో స్వరాజ్యం అన్న పదమే కనిపిస్తుంది. అందుకే బ్రిటీష్ వారితో పూర్తి తెగతెంపులు చేసుకోవడానికి ఇష్టపడని వారు కూడా కాంగ్రెస్‌లో కొనసాగ సాగారు. ఈ కారణాలన్నిటి దృష్ట్యా జవాహర్ నెగ్గించిన తీర్మానం పూర్తిగా పరిహాసాస్పదం అయింది. మహాత్మా గాంధీకి కానీ, అప్పటికి నెహ్రూ రిపోర్టు రాస్తున్న మోతీలాల్‌కి కానీ పూర్ణ స్వాతంత్ర్యం అనే లక్ష్యం ఆమోదయోగ్యం కాదు.[44]

కాంగ్రెస్‌లో ఉంటూనే స్వాతంత్ర్యం కోసం ఒత్తిడి తీసుకువచ్చే పక్షంగా ఇండిపెండెన్స్ ఫర్ ఇండియా లీగ్ నెలకొల్పాడు. జవాహర్ ఉద్దేశంలో ఈ లీగ్ కేవలం రాజకీయ స్వాతంత్ర్యం కోసం మాత్రమే కాక స్వాతంత్ర్యానంతరం భారతదేశం పెట్టుబడిదారీ, భూస్వామ్య ప్రాతిపదికలు మార్చివేసి, రాజ్యాన్ని సహకార ప్రాతిపదికపై వ్యవస్థీకరించేందుకు పనిచేయాలి. అంటే భారత స్వాతంత్ర్యంతో పాటుగా సామ్యవాద, ప్రజా ప్రాతినిధ్య ప్రభుత్వవాదం వంటివి ఇందులో ఇమిడి ఉన్నాయి. దీనిని అంతర్జాతీయ వాదానికి ముడిపెడుతూ ఒక పెద్ద ప్రపంచ సహకార కామన్వెల్తుకు ఈ పరిణామాలు దారితీయాలని కూడా ఆశించాడు. తన ఉద్దేశాలను కాంగ్రెస్ నాయకత్వంలో చాలామంది ఆమోదించట్లేదని తెలిసిన జవాహర్ తన ప్రధాన కార్యదర్శి పదవికి రాజీనామా చేశాడు. జవాహర్ చేస్తున్న ఈ కార్యాచరణకు కాంగ్రెస్ వారెవరూ పెద్ద ప్రాముఖ్యం ఇవ్వకపోవడంతో అతని రాజీనామా అంగీకరించలేదు. ఆ మాటకి వస్తే ఈ స్వాతంత్ర్యం అన్న డిమాండ్ అధినివేశ ప్రతిపత్తిని సాధించుకునేందుకు మంచి ఎత్తుగడగా వారు భావించారు.

ఇండిపెండెన్స్ ఫర్ ఇండియా లీగ్ ఆశించిన లక్ష్యాలు చేరుకోలేకపోయింది. అందులో చేరినవారు ప్రధానంగా - గాంధీ వైఖరి పట్ల ఆగ్రహం ఉన్నవారు కొందరు, జవాహర్‌కి వస్తున్న పేరుప్రఖ్యాతులను తమ రాజకీయ ప్రాభవానికి వాడుకుందామనుకునేవారు మరికొందరు. చివరకు 1929 ప్రారంభానికి కాంగ్రెస్ సంపూర్ణ స్వాతంత్ర్యాన్ని లక్ష్యంగా ఆమోదించడంతో అప్పటికి క్రియారహితంగా ఉన్న లీగ్‌ అస్తిత్వానికి కూడా కారణం కోల్పోయింది.

సైమన్ కమీషన్ బహిష్కరణ మార్చు

మరికొన్ని రాజ్యాంగ సంస్కరణలు చేయడానికి భారతదేశ సంసిద్ధత పరిశీలించాలంటూ బ్రిటన్ ప్రభుత్వం ఏర్పాటుచేసిన సైమన్ కమీషన్‌లో భారతీయులు ఎవరూ లేకపోవడాన్ని కాంగ్రెస్‌ భారతదేశాన్ని అవమానించడమేనని భావించింది. సైమన్ కమీషన్‌ను బహిష్కరించడం, సైమన్ కమీషన్ ఎదుట నిరసన ప్రదర్శనలు చేపట్టడం, హర్తాళ్ళు, ఊరేగింపులు నిర్వహించడం వంటి కార్యకలాపాలు నిర్ణయించుకుంది.[45] జవాహర్‌లాల్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా దేశవ్యాప్త ఆందోళనలను సమన్వయం చేసి, నిర్వహించాడు. దేశవ్యాప్తంగా పలు రాజకీయ పక్షాలను సమన్వయపరిచి కాంగ్రెస్ నిర్వహించిన హర్తాళ్ జవాహర్‌లాల్ ఆశించినదానికన్నా విజయవంతమైంది. సైమన్ కమీషన్ పర్యటించిన ప్రతీ ప్రాంతంలోనూ ఊరేగింపులు, నిరసనలు ఎదురయ్యాయి. ప్రభుత్వం లాఠీఛార్జిలు, కాల్పులు చేశారు. లాహోరులో పంజాబ్ కాంగ్రెస్ నేత లాలా లజపత్‌రాయ్‌ను ప్రాణాలకు ముప్పువచ్చేలా కొట్టి చంపారు.

ఆ వెంటనే 1928 నవంబరు 30న కమీషన్ లక్నోకి ఈ నేపథ్యంలో రానుండడంతో నవంబరు 23, 24 తేదీల్లో పోలీసుల అనుమతితోనే ఊరేగింపులు నిర్వహించారు.[46] నవంబరు 28 తేదీన మరో ఊరేగింపు తీయబోగా ముందస్తు అనుమతి ఇచ్చిన పోలీసులు చిన్న కారణం వంక చూపి రద్దుచేశారు. పోలీసుల నిషేధాజ్ఞలు ఉల్లంఘించి కాంగ్రెస్ వారు ఊరేగింపు నిర్వహించగా లాఠీఛార్జి చేశారు. ముందస్తు అనుమతులు ఉన్నాయి కాబట్టి ప్రశాంతంగా ఆందోళన జరుగుతుందని వేరే పనిపై లక్నో నుంచి బయలుదేరిన జవాహర్ హుటాహుటిన తిరిగివచ్చాడు. ముందురోజు పోలీసులు చేసిన పనికి ప్రతీకారంగా వారిని లక్ష్యపెట్టకుండా 30 తేదీన జవాహర్‌లాల్, గోవింద వల్లభ్ పంత్ నాయకత్వాన 12 మంది జట్టు ఊరేగింపుగా సభాస్థలానికి బయలుదేరారు. పోలీసుల లాఠీలతో ఆ జట్టును చెదరగొట్టబోయే క్రమంలో జవాహర్‌కి దెబ్బలు తగిలాయి. ఏదేమైనా జట్టు లొంగకపోవడంతో పోలీసులు వెన్నంటిరాగా సభాస్థలానికి చేరుకున్నారు.[47] 30న సైమన్ కమీషన్ లక్నోకు వచ్చే సందర్భంలో జవాహర్‌లాల్ నాయకత్వాన నిరసన తెలపడానికి పెద్ద ఊరేగింపు సాగింది. పోలీసులు వీరిపై తీవ్రమైన దాడిచేశారు. గుర్రాలతో తొక్కించడం, లాఠీలతో కొట్టడం చేయగా జవాహర్‌లాల్‌కి, ఇతర సహచరులకు గాయాలయ్యాయి. ఏదేమైనా వారు ప్రతీకారం చేయకుండా, వెనక్కితగ్గకుండా శాంతియుతంగా అక్కడే ఉండిపోయారు. ఈ సమయంలోనే ఒక విద్యార్థి వేషంలో పోలీసు ఏజెంటు అక్కడికి వచ్చి జవాహర్‌కి రెండు రివాల్వర్లు ఇవ్వజూపగా అతను మర్యాదగా నిరాకరించాడు. గడచిన రెండు రోజుల్లో పోలీసులను విజయవంతంగా ఆందోళనకారులు ప్రతిఘటించడంతో వారి నాయకుడైన జవాహర్ మీద కక్షపూని అతన్ని మరింత ప్రమాదకరమైన, కాంగ్రెస్ మౌలిక లక్ష్యాలకు విరుద్ధమైన కేసుల్లో ఇరికించేందుకు చేసిన కుట్ర అది.[48]

ఈ సంఘటనలో జవాహర్‌లాల్‌ను పోలీసులు గాయపరిచారన్న విషయం దేశమంతా పొక్కింది. ప్రజల్లో బ్రిటీష్ పాలన పట్ల, ఆగ్రహావేశాలు జవాహర్‌లాల్ మీద ప్రేమ పెల్లుబికాయి. ఈ సంఘటన దేశవ్యాప్తంగా జవాహర్‌కి ఉన్న జనప్రియత్వం బోధపరిచింది.[49]

కాంగ్రెస్ అధ్యక్ష పదవి, పూర్ణ స్వాతంత్ర్య ప్రకటన మార్చు

మోతీలాల్ నెహ్రూ తయారుచేసిన నెహ్రూ రిపోర్టును 1928లో జరిగిన కలకత్తా కాంగ్రెస్ సమావేశాల్లో ప్రవేశపెట్టారు. ఇందులో ప్రతిపాదించినట్టుగా అధినివేశ ప్రతిపత్తితో సంతృప్తి పడడం జవాహర్‌కు సరిపడని సంగతి. అయితే కాంగ్రెస్‌ను ఆ ప్రాతిపదికన చీల్చడం ఇటు జవాహర్‌కు,[49] అటు గాంధీకి కూడా ఇష్టం లేదు. జవాహర్‌లాల్‌, సుభాష్ చంద్ర బోస్, తదితరులు కాంగ్రెస్‌ను చీల్చకుండా చూసేందుకు - రెండు సంవత్సరాల్లో ప్రభుత్వం నెహ్రూ రిపోర్టును అంగీకరించి అధినివేశ ప్రతిపత్తిని ఇవ్వకపోతే కాంగ్రెస్ పూర్ణ స్వాతంత్ర్యాన్ని కోరవచ్చని గాంధీ అన్నాడు. జవాహర్‌లాల్‌తో ఇంకొంత చర్చించాకా ఆ కాలావధిని ఏడాదికి తగ్గించారు. [50] ఏడాది పాటు అధినివేశ ప్రతిపత్తి కోరే అంశంపై రాజీని కమిటీ స్థాయిలో అంగీకరించిన జవాహర్‌‌లాల్, సుభాష్ చంద్ర బోస్ బహిరంగ సమావేశంలో వ్యతిరేకించడంతో నొచ్చుకున్న గాంధీ "మీరు మీ మాటపై నిలవకపోతే ఇక స్వాతంత్ర్యం పరిస్థితి ఏమిటి?" అని ఆక్షేపించాడు.[51] అయితే జవాహర్‌లాల్ మనస్థితిలో పరిస్థితికి తలవంచినా, సాంకేతికంగా కూడా అధినివేశ ప్రతిపత్తికి రాయితీ ఇవ్వడం ఇష్టం లేదు. అందుకే జవాహర్‌లాల్ ఏదోమేరకు అయిష్టంతో అంగీకరించినా, కనీసం కాగితంపై కూడా అధినివేశ ప్రతిపత్తి తనకు సమ్మతం కాదన్న విషయాన్ని చెప్పడానికి తీర్మానం ఆమోదించిన ఆఖరు సమావేశానికి హాజరు కాలేదు.[50]

ప్రభుత్వం ఎలాగూ నెహ్రూ రిపోర్టును ఆమోదించి, అధినివేశ ప్రతిపత్తి ఇవ్వదన్న నమ్మకం ఉండబట్టి జవాహర్‌లాల్ 1929 సంవత్సరాన్ని రాబోయే పోరాటానికి ఉద్యమాన్ని, పార్టీని సంసిద్ధం చేసే తయారీ సంవత్సరంగా వినియోగించాలని ప్రయత్నించాడు. రాష్ట్ర కాంగ్రెస్ కార్యాలయాల తనిఖీ, మెరుగైన పనితీరు కోసం సిఫార్సులు, కాంగ్రెస్ స్వచ్ఛంద సేవాదళాలైన హిందుస్తానీ సేవాదళ్, యువజన సంఘాలు, విద్యార్థి సంఘాల పట్ల ప్రత్యేక శ్రద్ధ వంటి పనులు చేపట్టాడు.[52] 1929 మార్చిలో పలువురు ట్రేడ్ యూనియన్ నాయకులను, కొందరు అమాయకులను కమ్యూనిస్టులు అన్న పేరిట అరెస్టు చేసి, పెట్టిన మీరట్ కుట్ర కేసు విషయంలో వారికి సహాయంగా వాదించడానికి, ఆ కేసు నడిపించేందుకు నిధులు వసూలు చేయడానికి పనిచేశాడు.[53] ఈ దశలోనే జవాహర్‌లాల్‌ మీదా కేసు పెట్టాలని ప్రయత్నించినా ప్రత్యక్ష సాక్ష్యం లేనందున, జాతీయోద్యమం నుంచి కమ్యూనిస్టులను వేరుపరచాలన్న భావన ఉన్నందున అతనిపై ప్రభుత్వం కేసు పెట్టలేదు.[54]

1929లో కాంగ్రెస్ అధ్యక్ష స్థానానికి బార్డోలీ సత్యాగ్రహాన్ని విజయవంతం చేసి బార్డోలీ హీరోగా పేరొందిన వల్లభ్ భాయి పటేల్‌ను ఐదు స్థానిక కాంగ్రెస్ కమిటీలు ప్రతిపాదించాయి, జవాహర్‌ను మూడు కమిటీలే ప్రతిపాదించాయి.[54] అయితే రానున్న శాసనోల్లంఘనకు పూర్ణ స్వాతంత్ర్యాన్ని కోరే, యువకుడిని అధ్యక్ష స్థానంలో ఉంచితేనే మంచిదని వృద్ధ నాయకత్వం భావించింది. ప్రత్యేకించి మహాత్మా గాంధీ అధ్యక్ష స్థానానికి జవాహర్‌లాల్‌ ఉండాలని పట్టుబట్టాడు.[55] సుభాష్ చంద్ర బోస్, జవాహర్‌లాల్ నెహ్రూ వంటివారి వామపక్ష భావాలు, స్వతంత్ర్యం గురించి అభిప్రాయాలు తెలిసి ఉండడంతో జవాహర్ అధ్యక్షుడు అయితే సంస్థలో ఐకమత్యాన్ని సాధించడమే కాక అతనిని కూడా అదుపులో ఉంచవచ్చని గాంధీ భావించాడు.[56] రాజాజీ గాంధీని అధ్యక్ష స్థానానికి ప్రతిపాదించాడు. అయితే ఆ పదవిలో జవాహర్ ఉంటే తాను ఉన్నట్టేనని కూడా ప్రకటించాడు. అయితే జవాహర్‌కు ఈ పదవిని స్వీకరించడం ఇష్టం లేదు. కుమారుడు అధ్యక్ష పదవి చేపట్టాలని లోపల ఎంతవున్నా, జవాహర్ విముఖత చూసి మోతీలాల్ గాంధీకి నచ్చజెప్పబోయాడు. అయితే చివరకి జవాహర్‌లాల్ తన పట్టు వదులుకుని అంగీకరించగా, 1929 సెప్టెంబరులో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ జవాహర్‌ను కాంగ్రెస్ అధ్యక్షునిగా సంశయిస్తూనే ఎన్నుకుంది.[55]

వైశ్రాయ్ ప్రతిపాదనలకు కాంగ్రెస్ దృఢవైఖరి అవలంబించకపోవడంతో పదవి చేపట్టిన కొద్ది నెలలకే జవాహర్ అధ్యక్ష పదవికి రాజీనామా చేయబోయాడు.[57] అయితే కాంగ్రెస్-వైశ్రాయ్‌ల నడుమ జరిగిన సంప్రదింపులు పూర్తిగా విఫలం కావడంతో జవాహర్ వైఖరే సరైనదని నిర్ధారణ అయ్యి పార్టీ అంతా అతని వైఖరినే అవలంబించారు.[58] రాజీనామా అగత్యం తప్పిపోయింది. జవాహర్‌లాల్ లాహోరు కాంగ్రెస్ అధ్యక్షత వహించేనాటికి అతని వైఖరి పట్ల ఉన్న అడ్డంకులు అన్నీ తొలగిపోయి పూర్ణ స్వాతంత్ర్యాన్ని కాంగ్రెస్ లక్ష్యంగా అంగీకరించడం అనివార్యమే అయింది.[59] అధ్యక్షోపన్యాసంలో జవాహర్‌లాల్ తాను సామ్యవాదిని, ప్రజాస్వామ్యవాదిని అని సుస్పష్టంగా చెప్పాడు. స్వాతంత్ర్యాన్ని సాధించడానికి వ్యవస్థీకృతమైన హింసకు దిగడానికి కాంగ్రెస్‌కు సాధన సంపత్తి కానీ, శిక్షణ కానీ లేవనీ, వ్యక్తిగతమైన హింసాత్మక చర్యలు నిరాశా నిస్పృహలను వెల్లడించడం తప్ప మరేం చెయ్యవనీ, కాబట్టి పన్నుల చెల్లింపు నిరాకరణ, సార్వత్రిక సమ్మెల రూపంలో శాసనోల్లంఘన, సహాయ నిరాకరణ చేపట్టాలని పేర్కొన్నాడు.[60]

భారత స్వాతంత్ర్య ప్రకటన మార్చు

జవాహర్‌లాల్ నెహ్రూ భారత స్వాతంత్ర్య ప్రకటన చిత్తుప్రతిని తానే తయారుచేశాడు. దీనిని లాహోర్ కాంగ్రెస్‌ ఆమోదించింది. ఇందులో ఒక భాగం ఇలా పేర్కొంటూంది:

స్వేచ్ఛ, శ్రమకు తగ్గ ఫలితాన్ని అనుభవించగలగడం, జీవితావసరాలు సంపాదించుకుని ఎదగడానికి అవకాశాలు పొందడం ప్రపంచంలోని అన్ని దేశాల ప్రజల్లాగానే భారత ప్రజల మార్చలేని హక్కు. ఈ హక్కులను ఏ ప్రభుత్వం అయినా నిరాకరించి అణచివేస్తూంటే దాన్ని మార్చడానికి కానీ, ఆ ప్రభుత్వాన్ని రద్దుచేయడానికి కానీ ప్రజలకు హక్కు ఉంటుందని మేం నమ్ముతున్నాం. భారతదేశంలోని బ్రిటీష్ ప్రభుత్వం కేవలం భారత ప్రజలకు స్వేచ్ఛను నిరాకరించడమే కాదు, దేశంలోని ప్రజలను దోపిడీ చేసి, భారతదేశాన్ని ఆర్థికంగా, రాజకీయంగా, సాంస్కృతికంగా, ఆధ్యాత్మికంగా నాశనం చేస్తున్నది. దాంతో మేం నమ్మేదేంటంటే: భారతదేశం బ్రిటీష్ వారితో సంబంధాలు తెంపివేసుకుని, పూర్ణ స్వరాజ్ లేదా పూర్తి స్వాతంత్ర్యం సంపాదించాలి.[61]

1929 డిసెంబరు 31 అర్థరాత్రి నాడు జవాహర్‌లాల్ లాహోర్ నగరంలో రావి నది ఒడ్డున 3 లక్షల మంది చూస్తూండగా మువ్వన్నెల జెండా ఎగురవేశాడు.[62] జవాహర్, గాంధీ రాసిన పన్నుల నిరాకరణకు సైతం సిద్ధంగా ఉండడం కలిగివున్న స్వాతంత్ర్య ప్రమాణాన్ని అందరూ చదివి ప్రమాణాలు చేశారు. 172 మంది కేంద్ర, ప్రాంతీయ శాసన సభ్యులు ఈ ప్రకటనకు అనుగుణంగా రాజీనామా చేశారు. లాహోర్ కాంగ్రెస్‌లో 1930 జనవరి ఆఖరి ఆదివారం (అది జనవరి 26 అయింది) పూర్ణ స్వాతంత్ర్య ఆకాంక్షను వ్యక్తం చేస్తూ స్వాతంత్ర్య దినాన్ని జరుపుకోవాలన్న నిర్ణయం తీసుకున్నారు. తన స్వీయచరిత్రలో జవాహర్‌లాల్ ఆరోజును ఇలా వర్ణించాడు - "1930 జనవరి 26న స్వాతంత్ర్య దినం వచ్చింది, ఒక్క మెరుపులో దేశపు పట్టుదల, కుతూహలపు చిత్తవృత్తి మాకు తెలియవచ్చిందీ. ప్రతిచోటా పెద్ద సమావేశాలు జరిగాయి, వాటిల్లో ఆకర్షవంతమైందేదో ఉంది. అక్కడ ఉపన్యాసాలు లేవు, ఉద్బోధలు లేవు. ప్రశాంతంగా, గంభీరంగా స్వాతంత్ర్య ప్రమాణాలు స్వీకరించటం జరిగింది." కలకత్తా, బొంబాయిల్లో పెద్ద పెద్ద సమావేశాలు జరిగాయి. చిన్న పట్నాల సమావేశాలకు కూడా జనం అధిక సంఖ్యలో హాజరయ్యారు.[63]

సత్యాగ్రహం, జైలు జీవితం, ఉద్యమ విరమణ మార్చు

ఉప్పు సత్యాగ్రహం, గాంధీ-ఇర్విన్ ఒప్పందం మార్చు

పూర్ణ స్వాతంత్ర్య తీర్మానాన్ని ఆమోదించాకా శాసనోల్లంఘన ఉద్యమాన్ని తాను నిశ్చయించినప్పుడు ప్రారంభించవచ్చన్న అధికారాన్ని కాంగ్రెస్ కార్యనిర్వాహకవర్గం మహాత్మా గాంధీకి ఇచ్చింది. ఉప్పు పన్ను చట్టాన్ని ఉల్లంఘించాలని, ఉప్పు సత్యాగ్రహం చేయాలని గాంధీ నిర్ణయించి దండి వరకు పాదయాత్ర చేసి ఏప్రిల్ 6న జలియన్ వాలాబాగ్ దురంతపు స్మారక దినాన దండిలో ఉప్పు తయారు చేశాడు. మొదట జవాహర్‌లాల్ గాంధీ నిర్ణయం అర్థరహితమని భావించినా,[64] క్రమేపీ దానిని అర్థంచేసుకుని ఉత్సాహం ప్రోదిచేసుకున్నాడు. జవాహర్‌లాల్ గుజరాత్‌లోని దండియాత్రలో ఒక మజిలీ వరకు గాంధీతోపాటు నడిచాడు.[65] దేశ వ్యాప్తంగా శాసనోల్లంఘన ఉద్యమానికి జవాహర్‌లాల్ పిలుపునిచ్చాడు. అలహాబాద్ జిల్లాలో ఉప్పు సత్యాగ్రహం నిర్వహించడానికి సమీపంలో సముద్రతీరం లేకపోవడంతో ఏప్రిల్ 9న చట్టవిరుద్ధంగా తయారుచేసిన ఉప్పు పొట్లాలు అమ్మడం వంటి పనులతో శాసనాన్ని ఉల్లంఘించారు. రాయ్ బరేలి జిల్లాలో కౌళ్ళ చెల్లింపు మానుకుంటూ కౌలు రైతులతో సత్యాగ్రహం ప్రారంభించాడు. ఈ చర్యతో ప్రభుత్వం ఆందోళనపడి జవాహర్‌లాల్‌ను ఏప్రిల్ 14న అరెస్టు చేసింది.[66]

నైనీ జైల్లోనే విచారించి ఆరు నెలల సాధారణ జైలు శిక్ష విధించింది. అత్యంత ప్రమాదకరమైన, కరడుకట్టి నేరస్తులను ఉంచే చోట జవాహర్‌ను బంధించారు. జైలు జీవితాన్ని క్రమబద్ధీకరించుకునేందుకు పరుగు, నడక, వ్యాయామం, నూలు వడకడం, పుస్తకాలు చదివి నోట్సు రాసుకోవడం వంటివి చేసేవాడు.[67] జైలులో అతనిది దాదాపు ఏకాంతవాసమే అయినా కొందరు తోటి ఖైదీలు జవాహర్‌కు సేవలు చేస్తూ, జైలు కూలీలు చిన్న చిన్న కానుకలు సమర్పిస్తూ ఉండేవారు. రెండున్నర నెలలకు మోతీలాల్ నెహ్రూ, సయ్యద్ మహమూద్‌లు అదే జైలుకు రావడంతో తండ్రికి సేవలు, రాజకీయ సంప్రదింపులు చేయడం ప్రారంభించాడు.[68] సత్యాగ్రహం నిలిపివేసే అవకాశాలను పరిశీలించమంటూ యరవాడ జైలులోని గాంధీని మితవాదులైన తేజ్ బహదూర్ సప్రూ, జయకర్ కలవగా, కాంగ్రెస్ అధ్యక్షుడైన జవాహర్‌లాల్ నెహ్రూదే నిర్ణయం తీసుకునే అధికారమని గాంధీ తిప్పి పంపాడు. జవాహర్‌లాల్, మోతీలాల్ ఉద్యమాన్ని కొనసాగించడమే తమ అభిమతమని గాంధీకి గట్టిగా చెప్పినా వైశ్రాయ్‌కి చెప్పి వారిద్దరినీ గాంధీని కలిసేందుకు యరవాడ తీసుకువెళ్ళారు. అయితే చర్చలు ఫలప్రదం కాలేదు.[69] అక్టోబరు 11న ఆరునెలల శిక్షాకాలం పూర్తై జవాహర్‌లాల్ విడుదల అయి భూమిశిస్తు కౌళ్ళు, ఆదాయపు పన్నులు నిలిపివేసేలా ఉద్యమం ప్రారంభిస్తామని ప్రకటించడంతో పదిరోజుల్లో మళ్ళీ అరెస్టుచేశారు. ఈసారి రెండేళ్ళ కఠిన శిక్ష విధించారు. ఈసారి పరిశీలించేందుకు పుస్తకాలు లేవన్న కారణాన్ని పక్కన పెట్టి తన కుమార్తె ఇందిరకు ప్రపంచ చరిత్రపై లేఖలు రాయడం కొనసాగించాడు. [70] 1931 ఫిబ్రవరి 6న మోతీలాల్ మరణించాడు. తండ్రి అంత్యక్రియల సందర్భంగా రాజకీయాలలో సమయం వెచ్చించలేని జవాహర్‌లాల్ తరఫున తనకు తానై స్వంత బాధ్యతతో గాంధీ నడుమ గాంధీ-ఇర్విన్ సంధి కుదుర్చుకుని శాసనోల్లంఘనాన్ని నిలిపివేశాడు, రక్షణ, విదేశీ వ్యవహారాలు, అల్పసంఖ్యాక వర్గాల స్థితి వంటి అంశాలపై రౌండ్ టేబుల్ సమావేశంలో జరిగే చర్చలకు కాంగ్రెస్ హాజరవుతుందని అంగీకరించాడు. అందుకు బదులుగా హింసాత్మకమైన అభియోగాలు లేనివారి విడుదల, ఉప్పుతయారీకి అనుమతి, శాంతియుతమైన పికెటింగుకు అవకాశం ఇస్తుంది. జవాహర్‌లాల్‌కు ఈ సంధి ఆమోదయోగ్యం కాలేదు.[71] ఇది స్వాతంత్ర్యాన్ని కాకపోయినా కనీసం పన్నుల చెల్లింపు నిరాకరణలో పాల్గొన్న బార్డోలీ తదితర ప్రాంతాల రైతుల జప్తు అయిన ఆస్తులు తిరిగి, ఉప్పు తయారీకి, సేకరణకు పూర్తి హక్కులు ప్రభుత్వం ఇవ్వడం కూడా సాధించలేకపోయింది.[72] అయితే గాంధీ జవాహర్ ఊహిస్తున్నదాని కన్నా ఎక్కువగా ఉద్యమం వల్ల దేశం నీరసించి శక్తి, ఉత్సాహాలు కోల్పోయిందని అంచనా వేశాడు.[71]

తనకు నచ్చకపోయినా గాంధీ స్వంత పూచీకత్తు మీద చేసుకుని వచ్చిన ఒప్పందాన్ని ఆమోదించాల్సినదిగా కోరుతూ కరాచీ కాంగ్రెస్ మహాసభలో జవాహర్‌లాలే స్వయంగా ప్రవేశపెట్టాడు. భవిష్యత్తులో కాంగ్రెస్ ఆమోదించబోయే ఏ రాజ్యాంగంలోనైనా ప్రాథమిక హక్కులు, వయోజన ఓటింగు హక్కు, ఉచిత ప్రాథమిక విద్య మొదలైన హక్కులతో పాటు వాస్తవమైన ఆర్థిక స్వాతంత్ర్యాన్ని కూడా చేర్చేలా కాంగ్రెస్‌తో ఆమోదింపజేసుకున్నాడు.[72] ఆర్థిక స్వాతంత్ర్యాన్ని కాంగ్రెస్ ఆమోదించే రాజ్యాంగ హక్కుల్లో చేర్చినందుకు రాజకీయంగా గాంధీకి నెహ్రూ ఇచ్చిన రాయితీ అని కొందరు వాదిస్తూంటారు. కానీ అలాంటి కారణంతో కాదని, తాము నిర్ణయించుకున్న స్వాతంత్ర్య లక్ష్యాలకు విఘాతం కాకపోగా కేవలం సమరంలో యుద్ధ విరమణ వంటిది కాబట్టి నెహ్రూ సమాధానపడ్డాడని సర్వేపల్లి గోపాల్ భావించాడు.[73]

భూ సమస్యల్లో పోరాటం, జైలు జీవితం మార్చు

యునైటెడ్ ప్రావిన్సుల్లో 1930ల్లో కొనసాగుతున్న దుర్భిక్షం వల్ల కౌలురైతులు చాలా బాధలు పడ్డారు. శిస్తులు, కౌళ్ళు చెల్లించలేక అలమటిస్తున్న పరిస్థితిలో భూస్వాములకు, కౌలుదార్లకు జరుగుతున్న సంప్రదింపుల్లో తహశీల్ స్థాయి కాంగ్రెస్ సంస్థలు కౌలుదార్ల ఏజెంట్లుగా పనిచేశారు. ఈ వ్యవహారాన్ని జవాహర్‌లాల్ పర్యవేక్షించాడు.[74] కాంగ్రెస్ వ్యవహారశైలి ప్రభుత్వానికి అభ్యంతరకరంగా లేకపోయినా ఈ మధ్యవర్తి పాత్ర కాంగ్రెస్‌ను చేయనిస్తే వారు గ్రామీణ ప్రాంతాల్లో బలపడతారని ప్రభుత్వం భయపడింది. ప్రభుత్వాధికారులు జవాహర్‌లాల్ వర్గపోరాటాన్ని తీసుకురాబోతున్నాడని అసత్యాలతో గాంధీకి, జవాహర్‌కీ కొంతమేరకు విభేదాలు సృష్టించగలిగారు. ప్రభుత్వానికీ, ప్రజలకూ కాంగ్రెస్ మధ్యవర్తిత్వం నెరపవచ్చన్న వాదన గాంధీ ఉపసంహరించుకున్నాడు. అంతేకాక జవాహర్‌లాల్ అనారోగ్యం వల్ల గాంధీ నేరుగా యుపి రైతుల సమస్యను కాంగ్రెస్ తరఫు నుంచి చూడాల్సివచ్చినప్పుడు కౌలుదార్ల పరిస్థితులకు, యుపి రాజకీయ మహాసభ చేసిన తీర్మానాలను లక్ష్యపెట్టకుండా సాధ్యమైనంతవరకూ పన్ను చెల్లించెయ్యాలంటూ, యుపి కాంగ్రెస్ సిఫారసు చేసినదాన్ని మించి ఒక గరిష్ఠ శాతాన్ని సూచించి ఆమేరకు పన్ను చెల్లించాలని చెప్పాడు.[75]

రైతుల పట్ల గాంధీ వైఖరి ఏమంత అనుకూలంగా లేదని అర్థం చేసుకున్న యుపి ప్రభుత్వం కాంగ్రెస్‌కి, కౌలుదార్లకీ ఉన్న సంబంధాలు విచ్ఛిన్నం చేయడానికి దమనకాండ ప్రారంభించింది. కౌళ్ళ వసూలు సీజన్ ముగిసిపోయింది, అప్పటికే 60 నుంచి 80 శాతం చెల్లింపులు రైతులు చేశారు కాబట్టి ఇప్పటికి వసూళ్ళు ఆపాలన్న కాంగ్రెస్ న్యాయమైన విజ్ఞప్తిని కూడా ప్రాంతీయ ప్రభుత్వం అంగీకరించలేదు. ఆపైన బ్రిటీష్ ఇండియా ప్రభుత్వం స్థానిక కాంగ్రెస్ కార్యకర్తలతో సంప్రదించిన మీదటే శిస్తు వసూలు, కౌలు నిర్ణయం చేయాలన్న గాంధీ సూచనను పరిశీలించడానికి సుముఖంగా ఉన్నా యుపి ప్రభుత్వం మాత్రం బిగిసిపోయింది.[76] క్రమేపీ కేంద్ర ప్రభుత్వం కూడా కఠినంగా వ్యవహరించసాగింది. అప్పటికి రౌండ్ టేబుల్ సమావేశంలో ఉన్న గాంధీ తనకు ఉచితమన్న రీతిలో అవసరమైతే ఎటువంటి చర్య అయినా తీసుకొమ్మని జవాహర్‌కి అధికారం ఇచ్చినా, జవాహర్ గాంధీని ఇరుకునపెట్టడం ఇష్టం లేక శిస్తు చెల్లింపు నిరాకరణోద్యమం వాయిదా వేస్తూ వచ్చాడు. మరోవైపు యుపి ప్రభుత్వం, కాంగ్రెస్‌తో సంప్రదింపులు జరిపి విఫలమైంది.[77] ఈ దశలో జవాహర్‌లాల్ అనివార్యమైన శిస్తు చెల్లింపు నిరాకరణోద్యమాన్ని అలహాబాద్, రాయబరేలీ, ఎటావా, కాన్పూర్, ఉన్నావ్ జిల్లాల్లో ప్రారంభించాడు. ఈ జిల్లాల్లో శిస్తు చెల్లింపు పూర్తిగా నిలిచిపోవడమే కాక ఇతర జిల్లాలూ అటువంటి ఉద్యమానికి సిద్ధమవుతున్నాయి. ఈ దశలో ప్రభుత్వం జవాహర్‌కి, కాంగ్రెస్‌కి రైతుల్లో గట్టి పట్టు దొరుకుతోందని గమనించి, రైతులకు నీటితీరువా తగ్గింపు, ఋణాల మాఫీ వంటి కొన్ని ఉపశమన చర్యలు చేపట్టింది. నిషేధాజ్ఞలు ఉల్లంఘిస్తూ ఈలోపు ఆయా జిల్లాల్లో జవాహర్ పర్యటించినా అరెస్టు చేయకుండా ఉపేక్షించింది.[78] ఒక్కసారి తాము అనుకున్న ఉపశమన చర్యలు పూర్తిచేసి, అలహాబాద్ తిరిగివచ్చిన జవాహర్ పట్టణం విడిచి వెళ్లరాదని నిషేధించింది. 1931 డిసెంబరు 26న గాంధీకి స్వాగతం చెప్పేందుకు బొంబాయి వెళ్తూండగా ఆగ్రా సమీపంలోని ఇరాదాత్ నగర్ స్టేషన్‌లో అరెస్టు చేసి, వారం రోజుల తర్వాత రెండేళ్ళ జైలుశిక్ష విధించారు.[79]

ఈసారి సుదీర్ఘకాలం జవాహర్‌లాల్ జైల్లో గడిపాడు. జైలు జీవితం అతని ఆరోగ్యాన్ని క్షీణింపజేసింది. జైల్లో తన కుమార్తెకు ప్రపంచ చరిత్ర గురించి రాస్తున్న ఉత్తరాలు కొనసాగించాడు. మొదట నైనీ జైల్లో నిర్బంధించి, కొద్దివారాలకు బరైలీ జైలుకు తరలించారు. బరైలీ జైల్లో పరిస్థితులు, మనుషులూ దారుణంగా ఉండేవారు. జైలర్ జవాహర్‌ని చూడడానికి వచ్చిన భార్యనీ, తల్లినీ అవమానించడంతో,[80] ఆ అవకాశం ఇవ్వరాదని నెలల తరబడి సందర్శకులను చూడడానికి అంగీకరించలేదు. 1932 జూన్‌లో జవాహర్‌లాల్‌ను డెహ్రాడూన్‌లోని జైలుకు మార్చారు. ఆహ్లాదకరమైన వాతావరణం, అనువైన జైలు భవనాలకు తోడు ఐరిష్ జాతీయవాది డివెలరా శిష్యుడైన సూపరింటెండెంట్ కెప్టెన్ ఫాల్వే జవాహర్‌కు చాలా సౌకర్యాలు కలుగజేశాడు. తోటి ఉద్యమకారులకు లేని సౌకర్యాలు తనకు ఉండడం సిగ్గుచేటుగా భావించి జవాహర్ ఇతరులతో సమానంగా చూడమని కోరాడు. తన కుటుంబసభ్యులను తలచుకుని బాధపడేవాడు. జవాహర్ జైల్లో ఉండగా రెండుసార్లు గాంధీ చేసిన నిరాహారదీక్షలు అతన్ని కలచివేశాయి.[81] 1933లో ఉపవాసదీక్ష ప్రారంభించగానే గాంధీని ప్రభుత్వం జైలు నుంచి విడుదల చేయడం, అతను శాసనోల్లంఘనాన్ని నిలిపివేయడం జరిగాయి. శాసనోల్లంఘనోద్యమాన్ని నిలిపివేయడం తెలసి నెహ్రూ నిర్ఘాంతపోయినా గాంధీ మరణిస్తాడేమోనన్న ఆతృత దాన్ని జయించింది. జవాహర్ ఆ చర్యను ఆమోదించాడు.[82] 1933 ఆగస్టులో జవాహర్‌ను నైనీ జైలుకు మార్చి, అదే నెల 30వ తేదీన గడువు కన్నా 12 రోజుల ముందు విడుదల చేశారు.[83]

తిరిగి జైలుకు మార్చు

గాంధీ ఆలోచన, ఆచరణలకు, లక్ష్యాలకు జవాహర్ ఆలోచనలకు, లక్ష్యాలకు చాలా భేదమున్నట్లు ఆ దశలో జవాహర్‌ అవగాహన చేసుకుంటూనే ఉన్నాడు.[82][83][84] 1933 సెప్టెంబరు ఆరంబంలో జవాహర్ చేసిన పలు ప్రకటనలు జవాహర్ కాంగ్రెస్ నుంచి విడిపోయి, స్వాతంత్ర్యమే ప్రధాన లక్ష్యమైన వేరే పార్టీ నెలకొల్పుతాడన్న ఊహాగానాలకు అవకాశమిచ్చాయి.[83] సామ్యవాదం అవలంబించకుండా వచ్చిన స్వాతంత్ర్యం స్వాతంత్ర్యమే కాదని అభిప్రాయపడుతూ ఉన్నా బ్రిటీష్ సామ్రాజ్యవాదంపై పోరాడి స్వాతంత్ర్యం సముపార్జించేవరకు ఆర్థికాంశాలపై పోరాటం వృధా అన్న అభిప్రాయానికి వచ్చాడు. రాజకీయ స్వాతంత్ర్యాన్ని సాధించడానికి కాంగ్రెస్, దాన్ని నడిపించడానికి గాంధీ కీలకమని గ్రహింపు, నేరుగా గాంధీని కలిసి ముఖాముఖీ చేసిన చర్చలు కలగలిసి గాంధీ నాయకత్వాన్ని తాను ఆమోదిస్తున్నట్టు చేసిన ప్రకటన రూపంలో వెలువడ్డాయి. ఈ దశలో జవాహర్ తన వైఖరి వెల్లడిస్తూ కాంగ్రెస్ విధానాలకు తనకు అనుకూలమైన వ్యాఖ్యానాన్ని వివరిస్తూ తెలిపిన కొన్ని అంశాలను గాంధీ పెద్ద చర్చ లేకుండా ఆమోదించాడు.[85]

అలా గాంధీ నాయకత్వాన్ని, కాంగ్రెస్ సంస్థను జవాహర్ ఆమోదించాకా గ్రామోద్ధరణ, హరిజనోద్యమం వంటివి ఉపప్రదర్శనలుగా పక్కనపెట్టాడు. తాను కీలకమని భావిస్తున్నదీ, ఇన్నేళ్ళుగా బుద్ధిపూర్వకంగా ఉపేక్షించినదీ అయిన మతతత్వంపై దృష్టిసారించాడు.[86] ప్రధానంగా హిందూమహాసభపై తన విమర్శలు ఎక్కుపెట్టి, గాంధీ సహా ఎవరు చదివినా చాలా తీవ్రమని అంచనావేసిన భాషలో దుయ్యబట్టాడు.[87] ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆర్థిక దుస్థితి భారతదేశాన్ని కూడా ప్రభావితం చేస్తున్న ఆ తరుణంలో జవాహర్‌లాల్ ఏదైనా విప్లవాత్మకమైన కార్యాచరణ ప్రబోధిస్తే ప్రజలు అందుకుంటారన్న భయం ప్రభుత్వానికి ఉంది. పైగా గ్రామీణ ప్రాంతంలో అతను చేపడుతున్న కార్యకలాపాలు, అతని రచనలు, ప్రసంగాలు మధ్యతరగతిపై చూపుతున్న ప్రభావం చూసి ప్రభుత్వం బెదిరింది. ఈ స్థితిలో కలకత్తాలో అతను 1934 జనవరిలో చేసిన ప్రసంగాన్ని కారణంగా చూపి బెంగాలు ప్రభుత్వం వారెంటు జారీచేసింది.[88] 1934 ఫిబ్రవరి 12న అలహాబాదులో జవాహర్‌ని అరెస్టు చేసి కలకత్తా తీసుకువెళ్ళి నాలుగు రోజులకు రాజద్రోహ నేరంపై రెండు సంవత్సరాల సాధారణ జైలు శిక్ష విధించారు.[89]

మూడు నెలల పాటు ఆలీపూర్ జైలులో ఉంచారు, మే నెల మొదట్లో డెహ్రాడూన్ జైలుకు పంపించారు. గాంధీ 1934 ఏప్రిల్‌లో సహాయనిరాకరణోద్యమాన్ని పూర్తిగా నిలిపివేసి, కాంగ్రెస్ వారు నేరుగా కౌన్సిళ్ళకు పోటీచేసి ప్రవేశించవచ్చని నిర్ణయం వెల్లడించాడు. ఇది నెహ్రూను చాలా దెబ్బతీసింది. సైద్ధాంతికంగా ఏకత్వం లేని గాంధీతో స్వాతంత్ర్య సంపాదన లక్ష్యం ఐక్యంగా ఉందని కలిసి పనిచేయడం పొరబాటేమోనని నిందించుకున్నాడు.[90] నెహ్రూ తన మొహం చెల్లకుండా పోయిందన్నాడు, చివరకు గాంధీతో తెగతెంపులు చేసుకోవలసి రావచ్చేమోనని తన డైరీలో రాసుకున్నాడు.[91] అయితే నెహ్రూ చేస్తున్నది తన వేదనను, కోపాన్ని వెళ్ళగక్కడమే తప్ప పార్టీకి ప్రమాదం ఏమీ లేదని గాంధీ సరిగానే అంచనావేశాడు.[92] 1930కల్లా భారతదేశంలో సామ్యవాద చైతన్యానికి నెహ్రూ గొప్ప ప్రతీకగా నిలిచాడు.[93] 1934లోనే కాంగ్రెస్‌లో సామ్యవాద ఆశయాలను ముందుకు తీసుకుపోవడానికి, జాతీయవాదంతో సామ్యవాదాన్ని కలపడానికి పార్టీలోనే ఏర్పడిన సామ్యవాద పక్షం బహిరంగంగా తాము జవాహర్‌లాల్‌నే ప్రతిధ్వనిస్తున్నామని ప్రకటించింది. అయితే జవాహర్ వారిని సమర్థించలేదు.[92]

పార్టీ నాయకత్వం మార్చు

కాంగ్రెస్ నాయకత్వం, ఎన్నికలు మార్చు

1934లో నెహ్రూ తిరిగి జైల్లో ఉండగా భార్య స్థితి విషమించడంతో ప్రభుత్వం నిర్బంధాన్ని క్రమేపీ సడలిస్తూ విడుదల చేసింది. ఆమెను తీసుకుని ఐరోపా వెళ్ళినా చివరకు దక్కలేదు. అదే సమయంలో నెహ్రూకు ఏమాత్రం సంతృప్తినివ్వని భారత రాజ్యాంగ చట్టం 1935 ఏర్పాటయింది. జవాహర్‌లాల్ 1936లో ఐరోపాలో ఉండగానే గాంధీ నిర్ణయం ఆమోదిస్తూ కాంగ్రెస్ పార్టీ జవాహర్‌ని పార్టీ అధ్యక్షునిగా ఎన్నుకుంది. 1935 భారత రాజ్యాంగ చట్టంపై, దానిని అనుసరించి రానున్న ఎన్నికలలో నెగ్గి పదవులు స్వీకరించడం పట్ల జవాహర్ తీవ్ర వ్యతిరేకతతో ఉన్నాడు. పార్టీలో అత్యధికులు పదవుల స్వీకారానికి సుముఖులుగా ఉన్నారు. గాంధీ కూడా వారి అభిప్రాయానికి తలవొగ్గినా, ఈ విషయంలో ఏకాకి అయిపోయిన జవాహర్‌ని నొప్పించే ఉద్దేశం లేక ఎన్నికలు అయ్యేదాకా నిర్ణయాన్ని వాయిదా వేశాడు.[94] కాంగ్రెస్ సమస్త సామ్రాజ్యవాద శక్తుల ఐక్యసంఘటనగా రూపొంది, కార్మిక కర్షక తరగతులను కూడా తమ ఉద్యమంలో చేర్చుకునేలా నియమావళి సరళించాలని నిర్ణయం జరిగింది.[95] జవాహర్‌లాల్ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ప్రచారం ముమ్మరంగా సాగిస్తూ వచ్చాడు. సమస్త శక్తియుక్తులు కాంగ్రెస్‌ని గెలిపించడానికి ధారపోశాడు. రైళ్ళ నుంచి గుర్రాల వరకూ పలు వాహనాలపై విస్తారంగా ప్రయాణించాడు. ఒకచోట సమయం అయిపోతూండడంతో సభాస్థలానికి దాదాపు కిలోమీటరు దూరం నెహ్రూ, అతని వెంట జనం పరుగులుతీశారు. సభల్లో నెహ్రూకి ఉన్న ప్రజాకర్షణ ప్రస్ఫుటంగా వ్యక్తం అయ్యేది.[96] రాజ్యాంగ తిరస్కరణ, సామ్యవాద ధోరణి, విప్లవాత్మక ప్రవర్తన వంటివాటి దృష్ట్యా జవాహర్‌లాల్‌ని ఏదోక అభియోగంపై తిరిగి అరెస్టు చేయాలని ప్రభుత్వం భావించింది. జవాహర్‌ను అత్యంత ప్రాముఖ్యమైన అంతర్గత ప్రమాదంగా పరిగణించి, అతను ప్రసంగించిన ప్రతీచోటకు పోలీసులను నోటు పుస్తకాలతో పంపి నోట్ చేసుకునేవారు. సుదీర్ఘకాలం శిక్ష విధించడానికి తగ్గ అభియోగం మోపడానికి తగినది ఏదైనా అతని ప్రసంగాల్లో లభిస్తాయేమో చూసేవారు. అయితే వారి ప్రయాస వృధాగా మిగిలింంది.[97]

1937 మొదట్లో ఎన్నికల ఫలితాలు వెలువడి కాంగ్రెస్‌కు పలు ప్రావిన్సుల్లో ఆధిక్యత లభించింది. ముందు అనుకున్నట్టుగా చర్చించి అధికార స్వీకరణ గురించి నిర్ణయం తీసుకోవాల్సి ఉండగా, ఎన్నికల ఫలితాలు వెల్లడికాగానే మంత్రివర్గాల ఏర్పాటు, కూర్పు వంటివాటి గురించి కాంగ్రెస్ వర్గాలు చర్చించుకోవడం నెహ్రూకు మనస్తాపం కలిగించింది. ఢిల్లీలో జరిగిన అఖిల భారత కాంగ్రెస్ కార్యవర్గ సమావేశంలో నెహ్రూ అధికార స్వీకరణకు వ్యతిరేకంగా తీర్మానం ప్రవేశపెట్టాడు. అయితే కార్యనిర్వాహక వర్గంలో అత్యధికులు అధికార స్వీకరణకు అనుకూలంగా ఉండడంతో గాంధీ వారినే సమర్థించాడు. కాంగ్రెస్ తిరస్కరించిన రాజ్యాంగానికి బద్ధులై వ్యవహరించాల్సిన పదవులు స్వీకరించబోతున్నారు కనుక ఆ ఇరకాటాన్ని తప్పించేందుకు మంత్రులు రాజ్యాంగానికి లోబడి వ్యవహరించాల్సి వచ్చినా గవర్నర్లు జోక్యం చేసుకోరని శాసనసభలోని కాంగ్రెస్ నాయకులకు నమ్మకం కలిగితే అధికార స్వీకరణకు అడ్డం లేదని నిర్ణయించారు. అయితే తర్వాత కొద్దికాలానికే ఈ హామీలు గవర్నరు ఇవ్వకపోయినా అధికారాన్ని స్వీకరించాలని నిర్ణయించారు. ఈ పరిణామాన్ని విషాదంతో వ్యాఖ్యానిస్తూ పదవులు స్వీకరించడానికి కారణాలేమిటీ అని ఎవరూ చూడడం లేదని, పదవులు స్వీకరించాలి కనుక కారణాలు వెతుకుతున్నారనీ వాపోయాడు.[98][99]

కాంగ్రెస్ ప్రభుత్వాలు, మరోమారు ఐరోపా ప్రయాణం మార్చు

పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని నెహ్రూ అంగీకరించినా, అధికార స్వీకరణ పట్ల ఉన్న వ్యక్తిగత వైముఖ్యాన్ని దాచుకోలేకపోయాడు. పార్టీ అధ్యక్ష స్థానంలో కొనసాగినా మంత్రివర్గాలను సమన్వయపరిచి, వాటికి దారిచూపే పార్లమెంటరీ బోర్డులోనూ, రాష్ట్ర ప్రభుత్వాల ఏర్పాటు వ్యవహారాల్లోనూ అతను పాల్గోలేదు. ఆ పనిని వల్లభ్‌భాయ్ పటేల్ వంటి ఇతర నాయకులకు వదిలిపెట్టేశాడు. మొదటి కాంగ్రెస్ ప్రభుత్వాల ఏర్పాటుకు కొద్ది నెలల తర్వాత అస్సాం, వాయువ్య సరిహద్దు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాలను ఏర్పాటుచేసింది. ఈ ప్రభుత్వాల మీద కాంగ్రెస్ వారు చిన్న చిన్న అంశాలు లేవదీసి విమర్శిస్తే బాధ్యత కలిగిన పార్టీ అధ్యక్షునిగా వాటిని విమర్శకుల నుంచి కాపాడుతూ వచ్చాడు. ఈ ప్రభుత్వాలు కొన్ని విశేషాలు సాధించినప్పుడు ప్రశంసించినా, ఆంతరంగికంగా అవి మితవాద ధోరణితో నడుచుకోవడాన్ని విమర్శించేవాడు.1938లో హరిపురా కాంగ్రెస్‌లో సుభాష్ చంద్రబోస్ కాంగ్రెస్ అధ్యక్ష పదవిని స్వీకరించాక లభించిన విశ్రాంతిని అప్పటికి పలు తావుల సంక్షోభాలతో ప్రపంచయుద్ధానికి నాందీసూచకంగా ఉన్న ఐరోపా పర్యటించడానికి నిర్ణయించుకన్నాడు. ఆక్స్‌ఫర్డ్‌లో చదువుకుంటూన్న కుమార్తె ఇందిరా ప్రియదర్శినిని చూడడానికి బయలుదేరినా ఎప్పటివలెనే ఐరోపాలోని పలు రాజకీయ వ్యవహారాలతో గాఢమైన ప్రమేయం పెట్టుకుని, ప్రభావితుడయ్యాడు.

1938 జూన్‌లో ఓడలో బయలుదేరి మార్గమధ్యంలో ఈజిప్టులోని అలెగ్జాండ్రియాలో రాజకీయ నాయకులను కలిశాడు. ఇటలీలో ఓడ దిగగానే అంతర్యుద్ధంతో అతలాకుతలమవుతున్న స్పెయిన్‌ చేరుకుని రిపబ్లికన్ ప్రభుత్వ ఆతిథ్యం స్వీకరించాడు. పలవురు స్పెయిన్ రిపబ్లికన్ ప్రభుత్వాధికారులను కలిశాడు. స్వాతంత్ర్యం కోసం స్పానిష్ స్థానిక సైన్యం చేస్తున్న పోరాటానికి ముగ్ధుడై అక్కడే సైనికుడిగా ఉండిపోదామని అనుకునే స్థాయిలో ప్రభావితుడయ్యాడు.[100] ఇంగ్లాండు వెళ్ళినప్పుడు అంతకుముందు పర్యటనలకు భిన్నంగా బ్రిటన్ రాజకీయ నాయకుల్లో ప్రముఖులను కలుసుకున్నాడు. అక్కడ నుంచి పారిస్, జర్మనీ మీదుగా ప్రేగ్, జెనీవా, లండన్ అక్కడి నుంచి భారతదేశానికి ప్రయాణించాడు. ఈ పర్యటనల్లో పలువురు రిపబ్లికన్లు, వామపక్షీయులు అయిన రాజకీయ ముఖ్యులను కలుసుకున్నాడు.[101] అతను జెనీవాలో ఉన్నప్పుడు సంక్షోభం తీవ్రస్థాయికి చేరుకుంది, ఆపైన లండన్ చేరుకున్నప్పుడు అతనికొక గ్యాస్ మాస్క్ అమర్చారు. వీసా దొరకని కారణంగా మధ్య ఆసియా రిపబ్లిక్‌ల మీదుగా భారతదేశానికి వద్దామనుకున్న వాడల్లా, నౌకలో తిరిగివచ్చాడు.[102]

యుద్ధం, సంక్షోభం మార్చు

పార్టీలో సంక్షోభాలు, ప్రపంచ యుద్ధారంభం (1939) మార్చు

1938 చివర్లో భారతదేశానికి తిరిగిరాగానే దేశ రాజకీయాల్లో నిమగ్నుడయ్యాడు. ముస్లింలీగ్‌ని మంత్రివర్గాల్లో చేర్చుకోకపోవడం కాంగ్రెస్ అహంకారమనీ, ద్రోహమనీ భావించిన జిన్నా అప్పటినుంచీ కాంగ్రెస్‌పై దారుణమైన విమర్శలు చేయసాగాడు. కాంగ్రెస్ ఫాసిస్ట్ సంస్థ అనీ, ఇస్లాం ప్రమాదంలో పడిందనీ జిన్నా విమర్శలు చేయసాగాడు. వీటి విషయంలో సూటిగా ఉదాహరణలు ఇవ్వమనీ నెహ్రూ సవాలు చేసినా, అది పట్టించుకోకుండా జిన్నా మళ్ళీ వేర్వేరు ఆరోపణలు చేస్తూ పోవడమనే వ్యూహాన్ని తొలిసారిగా అమల్లో పెట్టసాగాడు.[102] ముస్లింలను ఆకట్టుకునేందుకు ముస్లిం రైతులతో సభలు ఏర్పాటుచేసి వారికి ప్రయోజనకరంగా ఉండేలా ఋణాలను, తాలూక్దారి విధానాన్ని రద్దుచేయమని కోరాలని, తద్వారా ముస్లిం నాయకులు భయాందోళనలు రేకెత్తించే విధానాలకు విరుగుడుగా ముస్లిం జనబాహుళ్యపు ఆర్థిక ప్రయోజనాల ద్వారా ఆకర్షించగలమని నెహ్రూ భావించాడు. కానీ దీర్ఘకాలం సాగాల్సిన ఈ వ్యూహాలు మతకల్లోలాలు, హింస, అభద్రతాభావం వ్యాప్తి మధ్యలో సాగలేదు.[103]

 
సుభాష్ చంద్రబోస్, శరత్ చంద్రబోస్ లతో నెహ్రూ

కాంగ్రెస్ పార్టీలో అధ్యక్షుడు సుభాష్ చంద్రబోస్‌కీ, గాంధీకి నడుమ అంతర్గత వివాదం ప్రారంభమైంది. 1938లో జవాహర్ నుంచి కాంగ్రెస్ అధ్యక్ష పదవి స్వీకరించిన బోస్ 1939లో మరోమారు కాంగ్రెస్ అధ్యక్ష స్థానానికి పోటీచేశాడు. అతనిపై పోటీకి కాంగ్రెస్‌లో గాంధీ అనుయాయుల నుంచి పట్టాభిని అభ్యర్థిగా నిలబెట్టారు. అయితే పట్టాభి మీద బోసు గెలిచాడు. గాంధీ ఆ ఓటమిని తన ఓటమిగా ప్రకటించడం, కాంగ్రెస్ కార్యవర్గంలో ముఖ్యులైన 12 మంది రాజీనామా చేయడం జరిగాయి. గాంధీ, ఇతర మితవాద నాయకులు తనకు సహకరించరని గ్రహించిన బోస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేశాడు. క్రమేపీ బోస్ కాంగ్రెస్ నుంచి దూరమయ్యాడు. ఈ సంక్షోభంలో నెహ్రూ తటస్థంగా, ఎటూ తేల్చక ఉండిపోయాడు. కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఎన్నికైన బోస్‌ను ఆ పదవి నుంచి దించిన విధానం నెహ్రూకు నచ్చలేదు. మరోవైపు బోస్ విధానాలను కూడా వ్యతిరేకించాడు.[నోట్స్ 1] రెండు పక్షాలకు ప్రైవేటు చర్చల్లో రాజీ కుదిర్చే ప్రయత్నాలు చేసి విఫలమయ్యాడు. సుభాష్ చంద్రబోస్ మాత్రం గాంధీ, తదితరులు ప్రత్యక్షంగా చేసిన దాడి కన్నా జవాహర్‌లాల్ నెహ్రూ అనిశ్చిత వైఖరి వల్లే ఎక్కువ దెబ్బతిన్నాడు. బోస్ నెహ్రూని ఈ వైఖరికి మరెన్నటికీ క్షమించలేకపోయాడు.[104] అయితే జవాహర్ వైఖరీ, బోస్ వైఖరీ, ప్రత్యేకించి అంతర్జాతీయమైన అంశాల్లో, అప్పటికే చాలా దూరం విభేదించి ఉన్నాయి.[105]

ఈ సమయంలో జవాహర్‌లాల్ నెహ్రూ అఖిల భారత సంస్థానాల ప్రజల మహాసభకు అధ్యక్షత వహించి సంస్థానాల సమస్యపైన, ప్రణాళికా రంగంలో జాతీయ ప్రణాళికా రచనలోనూ పనిచేశాడు. సంస్థానాల్లో జరిగే ఉద్యమాలు, ఆందోళనలను భారతదేశ వ్యాప్తంగా జరుగుతున్న జాతీయోద్యమంతో ప్రమేయం కల్పించి రెంటినీ ముడివేయాలని అతను భావించేవాడు. మరోవైపు గాంధీ పలు అంశాల్లో బ్రిటీష్ వారికీ, తనకీ మధ్య సంస్థానాధీశులను మధ్యవర్తులుగా అంగీకరిస్తూండడం నెహ్రూకు ఈ అంశంలో సమస్యలు తెచ్చిపెట్టినా ఆసక్తితో పనిచేస్తూండేవాడు. ప్రావిన్సుల్లో కొంతమేరకు స్వతంత్రంగా పనిచేయగల కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏర్పడడంతో పనితీరును దిశానిర్దేశం చేసే జాతీయ ప్రణాళికా రచన పనిని నెహ్రూ మొదలుపెట్టాడు.[105] దీనికి తక్షణ కాంగ్రెస్ వాదులతో పాటు శాస్త్రవేత్తలు, ఆర్థికవేత్తలు, వాణిజ్యవేత్తలు, పారిశ్రామికవేత్తలను చేర్చుకుని కమిటీని ఏర్పరిచి, సుదీర్ఘమైన ప్రశ్నావళి ఏర్పరుచుకుని నిర్దిష్టమైన అంశాలపై సవివరమైన సిఫార్సులు చేసేందుకు 30 ఉపసంఘాలు ఏర్పరిచాడు.[106] 1940 ఏప్రిల్ నాటికి 17 ఉపసంఘాలు తాత్కాలికమైనవి కానీ, తుది నివేదికలు కానీ సమర్పించాయి. 1940 మే, జూన్ నెలల్లో కార్యవర్గం సమావేశమై సమగ్ర నివేదిక రూపొందించసాగారు. అయితే 1940 అక్టోబర్ నాటికి జవాహర్‌లాల్ నిర్బంధానికి గురికావడంతో ప్రణాళికా కార్యక్రమం ఆగిపోయింది.[107]

రెండవ ప్రపంచ యుద్ధం, నెహ్రూ నిర్బంధం మార్చు

1940 సెప్టెంబరులో చైనాలో పలువురు నాయకులను సందర్శించాడు. మావోనూ, కమ్యూనిస్టులను కూడా కలుసుకోవాలని ఆశిస్తుండగా రెండవ ప్రపంచ యుద్ధం వచ్చి జవాహర్‌లాల్ భారతదేశం తిరిగిరావాల్సి వచ్చింది. మహాత్మా గాంధీ ప్రపంచయుద్ధం ప్రారంభం కావడంతో హింసకే జయం కలిగినందుకు ఏవగించుకుని, తక్షణ ప్రతిచర్యగా బ్రిటన్‌కి స్వచ్ఛందంగా మద్దతు ప్రకటించాడు. అలాగే రెండవ ప్రపంచ యుద్ధంలో అక్షరాజ్యాల దుశ్చర్యలకు వ్యతిరేకంగా బ్రిటన్ చేస్తున్న పోరాటాన్ని తానెంత సమర్థిస్తూన్నా దాన్ని వ్యక్తిగతంగానే ఉంచాడు. వ్యక్తిగత అంశాలను పక్కన పెట్టి కాంగ్రెస్ వైఖరిని జవాహర్‌లాల్ మలిచాడు. దాని ప్రకారం - బానిసత్వంలో మగ్గుతున్న భారతదేశం వేరే దేశాల స్వాతంత్ర్యం కోసం యుద్ధంలో పాల్గొనలేదు, బ్రిటీష్ వారు భారతదేశానికి స్వాతంత్ర్యం ఇచ్చి ప్రజాస్వామికంగా పాలింపబడేదైతే అప్పుడు బ్రిటన్‌తో సమస్కంధంగా వారికి సహకరిస్తుంది. బ్రిటన్ సమస్యల్లో ఉన్నప్పుడు దాన్ని అవకాశంగా తీసుకోవాలని కాంగ్రెస్ భావించకున్నా తన నిర్ణయాన్ని వేరొకరు తీసుకోవడం, దాన్ని మౌనంగా ఆమోదించడం భారతదేశానికి తగదు.[106] ఈ భావాలకు అనుగుణంగా కాంగ్రెస్ కార్యనిర్వాహకవర్గం తీర్మానాన్ని ఆమోదించింది. ప్రభుత్వం ఈ క్రమంలో సాగుతున్నట్టు సదుద్దేశాన్ని నిరూపించుకోవడానికి ఏదోక చర్య తీసుకోవాని తీర్మానించింది. కనీసం యుద్ధానంతరం తన భవితవ్యాన్ని భారతదేశం తానే నిర్ణయించుకుంటుందన్న ప్రకటన చేసినా చాలని కాంగ్రెస్ వారు వైశ్రాయితో పేర్కొన్నారు. అటువంటి ప్రకటన తర్వాత ఏదోక యుద్ధమండలికి తమ సేవలను ఉపయోగించుకోవచ్చని జవాహర్‌లాల్ సూచన చేశాడు.[108]

అయితే ప్రభుత్వం ఈ అంశాలపై ప్రతికూలంగా స్పందించింది. అందుకుతోడు యుద్ధ పరిస్థితులను సంయుక్తంగా ఎదుర్కొందామని జిన్నాకు సూచించి కాంగ్రెస్‌ని దారికి తెచ్చుకోజూసింది. ప్రభుత్వ విధానాలకు నిరసనగా ప్రావిన్సుల్లో కాంగ్రెస్ మంత్రివర్గాలు రాజీనామా చేశాయి. బ్రిటన్ సామ్రాజ్యవాద విధానాలు కొనసాగించినంతవరకూ సహాయ నిరాకరణం సాగాల్సిందేనని కాంగ్రెస్ నిర్ణయించింది. తానే మలచిన కాంగ్రెస్ వైఖరి కారణంగా బ్రిటన్ యుద్ధ ప్రయత్నాలు సహకరించలేకపోవడం, సోవియట్ రష్యా జర్మనీతో సహకరిస్తూ సాగడం వంటివాటి వల్ల జవాహర్ వ్యక్తిగతంగా చాలా వ్యాకులతతో బాధపడ్డాడు.[109] ప్రభుత్వం కాంగ్రెస్ నాయకులను అరెస్టులు చేయడం ప్రారంభించింది. జవాహర్‌లాల్‌ వార్థా నుంచి అలహాబాద్ వెళ్తూండగా 1940 అక్టోబరులో అరెస్టు చేశారు. కేసులో తన తరఫున వాదించుకోవడానికి జవాహర్ తిరస్కరించినా సుదీర్ఘమైన ప్రకటన చేశాడు. "మీరు విచారణ జరిపి శిక్షింప చూసేది నన్ను కాదు, కోట్లాది భారత ప్రజలను" అంటూ చారిత్రకమైన ప్రసంగం చేశాడు. అందరికీ హెచ్చరికగా ఉండేందుకు అంటూ జడ్జీ నాలుగేళ్ళ జైలు శిక్ష విధించాడు. ఇలాంటి శిక్ష గురించి తెలుసుకుని లండన్, ఢిల్లీ, లక్నోల్లోని బ్రిటీష్ అధికారులు, నాయకులే దిగ్భ్రాంతి చెందారు. జవాహర్‌లాల్‌ను సాధారణ నేరస్థునిగా చూడరని, శిక్ష కాఠిన్యం తగ్గిస్తారని ఆశిస్తున్నట్టు చర్చిల్ లండన్‌లోని ఇండియా ఆఫీస్ ద్వారా వైశ్రాయికి టెలిగ్రాం పంపించినా స్పందన లేకపోయింది.[110]

నెహ్రూ జైలుశిక్ష ఈమారు మరింత కఠినంగా సాగింది. అతనికి బయట నుంచి ఏ ఉత్తరాలూ అనుమతించలేదు. జైలు జీవితం కఠినంగా సాగింది. లక్నో క్యాంపులోని రాజకీయ ఖైదీలు అనుభవిస్తున్న కష్టాలు తెలిసి ఉన్న కాస్త సౌకర్యాలను కూడా ఏవగించుకున్నాడు, ఆ ప్రత్యేక సౌకర్యాలను తొలగించకుంటే జైలు క్రమశిక్షణ ధిక్కరిస్తానని అధికారులకు రాశాడు. బ్రిటీష్ రాజకీయవేత్త క్రిప్స్‌ను భారతదేశానికి క్రిప్స్ కమీషన్ పేరిట రాయబారానికి పంపించ నిర్ణయించారు. ఈ సంప్రదింపుల కోసం మిగిలిన కాంగ్రెస్ నాయకులతో పాటు జవాహర్‌లాల్‌ను కూడా విడుదల చేశారు. ఏడాది రెండు నెలల పాటు సాగిన ఈ జైలు శిక్ష 1941 డిసెంబరు మొదట్లో ముగిసింది.[111][112]

గాంధీ వారసత్వం, క్రిప్స్ రాయబారం మార్చు

జైలు బయటకు వచ్చేనాటికి ప్రజల్లో బ్రిటీష్ వారి పట్ల వ్యక్తమైన ఆగ్రహావేశాలే అతనిలో ప్రతిఫలించాయి. అయినా యుద్ధాన్ని గురించి అంచనా వేస్తూ జర్మనీ నేతృత్వంలోని అక్షరాజ్యాల కూటమి ప్రగతి వ్యతిరేక శక్తుల ఐక్య సంఘటన అని అవగాహన చేసుకున్నాడు. అప్పటికి యుద్ధం రష్యాకు కూడా విస్తరించింది. బ్రిటన్, రష్యా, చైనా, అమెరికాలతో కూడిన అభ్యుదయ శక్తులే విజయం సాధిస్తాయని ఆశాభావం వ్యక్తం చేసినా భారతదేశంలో పాత వ్యవస్థ మారిందన్న సూచనను అందించాకే భారతదేశం మిత్రమండలి పక్షాన మనస్ఫూర్తిగా యుద్ధం చేయడం సాధ్యపడుతుందని తేల్చాడు. మరోవైపు కాంగ్రెస్ అంతటా ఇదే వైఖరి వ్యక్తం కాలేదు. చక్రవర్తుల రాజగోపాలాచారి బార్డోలీలో జరిగిన కాంగ్రెస్ కార్యనిర్వాహకవర్గ సమావేశంలో గాంధీ, నెహ్రూలను అలక్ష్యం చేసి జాతీయ ప్రాతిపదికపై దేశరక్షణకు స్వతంత్ర భారత సహకారాన్ని అందించేందుకు అనుకూలంగా కార్యనిర్వాహకవర్గాన్ని ఒప్పించాడు. అయితే బ్రిటీష్ వారు స్వాతంత్ర్యం ఇస్తామన్న సూచన కూడా చేయనందున స్వతంత్ర్య భారతదేశం ఏ వైపు నిలబడుతుందని ఇప్పుడు ప్రకటించడం కేవలం సైద్ధాంతిక వ్యవహారమని నెహ్రూ కొట్టిపారేశాడు. [113]

రాజాజీ కాదు. జవహర్‌లాల్ నాకు వారసుడవుతాడు. నా భాష తనకు అర్థంకావడంలేదనీ, నాకు అన్యమైన వేరొక భాషలో తాను మాట్లాడతాననీ జవహర్‌లాల్ అంటాడు. ఇది నిజంకావచ్చు, కాకపోవచ్చు. అయితే హృదయాలు కలవడానికి భాష ఆటంకము కాదు. నాకీ సంగతి బాగా తెలుసు - నేను పోయిన తర్వాత ఆయన నా భాషలోనే మాట్లాడుతాడు.

మహాత్మా గాంధీ, 1942.

యుద్ధానికి ఏ ప్రాతిపదికన సమర్థన ఇవ్వాలన్న చర్చలో ఉండడం కూడా ఇష్టంలేని గాంధీ అఖిల భారత కాంగ్రెస్ కమిటీ నుంచి వైదొలిగాడు. ఆ సమయంలోనే రాజకీయాలలో తన వారసత్వాన్ని నెహ్రూకి అందిస్తూ కీలకమైన ప్రకటన చేశాడు. చక్రవర్తుల రాజగోపాలాచారి గాంధీ స్థానాన్ని స్వీకరిస్తాడేమోనన్న వాదాలు వినవస్తూ ఉండడంతో సూటిగా రాజాజీ కానీ, పటేల్ కానీ తనకు వారసులు కాదని కూడా నొక్కివక్కాణించాడు.[114][నోట్స్ 2] నెహ్రూకీ, తనకీ మధ్య అభిప్రాయ భేదాలు ఉంటూ వచ్చినా, తామిద్దరినీ ఆ భేదాలు విడదీయలేవన్నాడు. అలా నెహ్రూకి గాంధీ అందించిన వారసత్వం క్రమేపీ భారతదేశ నాయకత్వాన్ని అందించింది.[115]

రెండో ప్రపంచ యుద్ధంలో జపాను పురోగతి భారతదేశ తీరానికి దగ్గరగా వచ్చిన స్థితిలో బ్రిటీష్ వారిని సంకట స్థితిలో పెట్టకుండా సహాయ నిరాకరణ విరమించారు. యుద్ధానికి కలకత్తా చాలా సన్నిహితంగా ఉన్న ప్రాంతం కావడంతో జవాహర్ ప్రజలను భయభీతులు కాకుండా ప్రయత్నాలు చేశాడు. రంగూన్ శరణార్థుల విషయంలో భారతీయులకు, ఐరోపీయులకు మధ్య ప్రభుత్వం భేదం చూపి అప్రతిష్ట మూటకట్టుకుంది. ఈ దశలో ఫిబ్రవరి 19న బ్రిటీష్ ప్రభుత్వపు యుద్ధ కాలపు మంత్రిమండలిలో క్రిప్స్ చేరాడు. భారతీయ రాజ్యాంగ వ్యవహారాలు చర్చించడానికి అట్లీ ప్రతిపాదనలు సిద్ధం చేశాడు. యుద్ధం తర్వాత దామాషా పద్ధతిలో రాజ్యాంగ సభ ఏర్పడడం, ఏ రాష్ట్రానికైనా కొత్త డొమినియన్ రాజ్యాంగం ఇష్టం లేకుంటే అది ప్రస్తుతం ఉన్న స్థితిని కొనసాగించడం, అంతవరకూ యుద్ధంలో బ్రిటీష్ ప్రభుత్వం ఇండియా రక్షణ బాధ్యత వహించడం ప్రధానాంశాలు.[116] పై ప్రతిపాదనలను తీసుకుని భారతదేశంలో వివిధ పక్షాలను ఒప్పించేందుకు క్రిప్స్ బయలుదేరి వచ్చాడు.

దేశీయ సంస్థానాల్లోని ప్రజలకు బదులు సంస్థానాధీశులకు రాజ్యాంగ సభలో స్థానం ఉండడం, దేశ విభజనకు అనుకూలంగా క్లాజులు ఉండడంతో ఈ ప్రతిపాదనల పట్ల కాంగ్రెస్ వ్యతిరేకతతో ఉంది. దేశ విభజనకు ప్రతిపాదనలో అవకాశం ఉండడంతో గాంధీ వ్యతిరేకిస్తూ బహిరంగ ప్రకటన చేశాడు.[117] దేశ రక్షణ విషయంలో కాంగ్రెస్ సహకారాన్ని తీసుకోవడం అంగీకారమైతే గాంధీ అభ్యంతరాన్ని కూడా పక్కన పెట్టి ముందుకు వెళ్ళే స్థితిలో నెహ్రూ ఉన్నాడు. అందుకు తగ్గట్టు నెహ్రూను కలుసుకునే ముందు భారతదేశ రక్షణ భారత ప్రజల సహకారంతో నిర్వహించగలమన్న విషయంపై ఆమోదాన్ని, అందుకు తగ్గట్టు అవసరాన్ని బట్టి పేరాలు తిరగరాసేందుకు చర్చిల్ ఆమోదాన్ని క్రిప్స్ తీసుకున్నాడు. అటువంటి అవకాశాన్ని గండికొడుతూ వైశ్రాయ్ సర్వసైన్యాధ్యక్షుడి విధులపై ఆక్రమణ లేకుండా, ఇండియా ప్రభుత్వ రక్షణ బాధ్యతల్లో ఏదో ఒక పనిలో భారతీయుణ్ణి నియమిస్తామన్న విధంగా సంకుచితపరిచాడు.[118] వైశ్రాయ్ కౌన్సిల్ విషయంలో చర్చలు ప్రారంభమయ్యాయి. వైశ్రాయ్ కౌన్సిల్ క్యాబినెట్ తరహాలో ఉంటుందని మొదట్లో క్రిప్స్ మాట ఇచ్చాడు.[119] లిన్‌లిత్‌గో ఈ అంశంపై క్రిప్స్‌ను తప్పించి నేరుగా బ్రిటీష్ ప్రభుత్వంతో సంప్రదించగల అధికారం సంపాదించాడు. మరోవైపు జవాహర్‌లాల్, ఆజాద్‌లతో వేవెల్ ఇంటర్వ్యూ విఫలమైంది. వీటన్నటి మధ్యా వైశ్రాయ్ కౌన్సిల్ స్వరూప స్వభావాలను మార్చవద్దని బ్రిటన్ యుద్ధకాలపు మంత్రిమండలి క్రిప్స్‌కు నిర్దేశించింది.[119] అమెరికా అధ్యక్షుడు రూజ్వెల్ట్ వ్యక్తిగత ప్రతినిధిగా వచ్చిన లూయీ జాన్సన్ ఈ విషయంలో ఏదైనా పరిష్కారానికి సహకరిస్తాడని అంతా ఆశించారు. కానీ అమెరికా కలగజేసుకోవడానికి నిరాకరించడంతో ఈ ప్రయత్నమూ వీగిపోయింది.[120] ఈ రాయబారం అన్నివిధాలా విఫలమైన స్థితికి చేరుకున్నాకా, ఏదో విధంగా దీన్ని సఫలం చేయమని తన పాత మిత్రుడైన జవాహర్‌లాల్‌కు క్రిప్స్ విజ్ఞప్తి చేశాడు. అయితే తరచు మారుతూ వస్తూ, నిలకడగా లేని క్రిప్స్ వైఖరి జవాహర్‌లాల్‌కు నమ్మకం కలిగించలేదు. "కొన్ని పరిమితులు దాటి నేను కాంగ్రెస్‌ను అవతలికి తీసుకుపోలేను, కాంగ్రెస్ కూడా కొన్ని పరిమితులను దాటి దేశాన్ని అవతలికి తీసుకుపోజాల"దని జవాహర్‌లాల్ క్రిప్స్‌కు స్పష్టం చేశాడు. చివరకు క్రిప్స్ రాయబారం విఫలమైంది.[121]

క్విట్ ఇండియా మార్చు

క్రిప్స్ రాయబారం విఫలమై, ప్రాతినిధ్య ప్రభుత్వ ఏర్పాటు వెనక్కి వెళ్ళాకా కూడా యుద్ధ స్థితిగతుల్లో బ్రిటీష్ వారిని ఇరకాటంలో పెట్టని స్థితినే కొనసాగిస్తామని ప్రకటించాడు. యుద్ధసామగ్రి ఉత్పత్తిని ఆటంకపరచవద్దని ప్రజలకు ఆలిండియా రేడియో ద్వారా చెప్తానని ముందుకు రాగా ఆజాద్ వద్దని సూచించాడు. కలకత్తా వెళ్ళి పారిశ్రామిక సమ్మెలు నిలిపేందుకు ప్రచారానికి సిద్ధమయ్యాడు. అక్షరాజ్యాల పక్షాన ఉన్న జపాన్ ఆగ్నేయాసియాలో చేస్తున్న దండయాత్రలో ముందు సింగపూర్, తర్వాత రంగూన్ పతనమయ్యాయి. యుద్ధం అప్పటికే బర్మా నుంచి భారతదేశ ఈశాన్య సరిహద్దుల్లోని అస్సాం దాకా వచ్చింది. ఈ స్థితిలో బ్రిటీష్ సైన్యంలో అక్షరాజ్యాలకు దొరికిపోయిన భారత సైనికులను పోగుచేసి భారతదేశ స్వాతంత్ర్యాన్ని యుద్ధంలో సంపాదిస్తానంటూ జపాన్ పక్షాన వారితో సుభాష్ చంద్రబోస్ అజాద్ హింద్ ఫౌజ్ కూడా తలపడుతున్నాయి.

నెహ్రూ ఈ పరిణామాల్లో జపాన్ ని భారతదేశం ప్రతిఘటించాలని, అవసరమైతే అక్షరాజ్యాల తరఫున వస్తున్న సుభాష్ బోస్ నూ, అతని సైన్యాన్ని కూడా ఎదిరించాలని విధాన నిర్ణయం చేసుకున్నాడు. భారతీయులు గెరిల్లా యుద్ధం, భూదహన విధానాలు అవలంబించి జపాన్ పురోగతిని నిరోధించాలని నెహ్రూ ప్రకటించాడు.[121] ఈ ప్రకటనను భారత కమ్యూనిస్టు పార్టీ కూడా సమర్థించింది.[122] ఈ వైఖరి వల్ల కాంగ్రెస్ నాయకత్వం విచ్ఛిన్నం అయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించి, నెహ్రూ ప్రకటనను వెనక్కి తీసుకునేలా బలవంతం చేసి ఒప్పించాడు.[121] భారతదేశం నుంచి బ్రిటీష్ ఉపసంహరణ తక్షణం జరగాలని, ఆ తర్వాత జపాన్ భారతదేశంపై దాడిచేస్తే సంపూర్ణమైన అహింసాయుతమైన సహాయ నిరాకరణతో జపాన్ వారిని ఎదుర్కొంటామని గాంధీ తీర్మానం తయారుచేశాడు. దాన్ని విపరీతంగా భావించిన నెహ్రూ తీవ్రంగా ప్రతిఘటించి, మిత్రపక్షాలకు అనుగుణంగా ఉన్న తన వైఖరికి కట్టుబడివున్నాడు. కాంగ్రెస్ నెహ్రూ వాదాన్నే అంగీకరిస్తూ అతని వైఖరిని ఆమోదించింది.[123] మిత్రమండలికి మద్దతునిచ్చి ప్రాతినిధ్య ప్రభుత్వం విషయమై రాబట్టుకునేందుకు నెహ్రూ అమెరికాను నమ్ముకుని ఉన్నాడు. అయితే ఈ విషయంలో అమెరికా జోక్యం చేసుకోదని రూజ్వెల్ట్ స్పష్టం చేయడంతో ఇండియా ప్రభుత్వం కాంగ్రెస్ తో మరింత కఠినంగా వ్యవహరించసాగింది. మిత్రమండలికి అనుకూలంగా ఉన్న నెహ్రూ వైఖరి ఇలా అన్ని విధాలా దెబ్బతిని, గాంధీ వాదానికి పరిణామాలన్నీ బలం చేకూర్చాయి.[124] భారతదేశంలో బ్రిటీష్ ఉపసంహరణ తర్వాత ప్రపంచయుద్ధం విషయమై దేశ రక్షణ కోసం మిత్రమండలి సైన్యాల భారతదేశంలో ఉండవచ్చనీ, జాతీయ ప్రభుత్వం చేపట్టే మొట్టమొదటి చర్య మిత్రమండలితో సంధి కుదుర్చుకోవడమేనని గాంధీ తన వైఖరిని సవరించుకుని నెహ్రూ మద్దతునిచ్చేందుకు వీలిచ్చాడు.[125][126] గాంధీ ప్రతిపాదించిన క్విట్ ఇండియా ఉద్యమాన్ని 1942 జూలై 14న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీర్మానించింది. పెద్ద ఎత్తున అహింసాయుతమైన ప్రజా పోరాటాన్ని ప్రారంభించేందుకు గాంధీకి అధికారమిచ్చింది. ఆగస్టులో గాంధీ బొంబాయిలో ప్రజలను ఉద్దేశించి స్వాతంత్ర్యం మినహా మరేమీ ప్రభుత్వం నుంచి స్వీకరించేది లేదనీ, అందరం చావో రేవో తేల్చుకుందామనీ పిలుపునిచ్చాడు.

సుదీర్ఘ కారాగారవాసం మార్చు

ఉద్యమానికి ప్రతిస్పందనగా ప్రభుత్వం వెనువెంటనే తమ తమ నివాసాల్లోనే కాంగ్రెస్ నాయకులను అరెస్టు చేసింది. ఆ క్రమంలో అరెస్టు అయిన జవాహర్లాల్, ఇతర ముఖ్య నాయకులతో కలిసి ప్రత్యేక రైలులో ప్రయాణించి అహ్మద్ నగర్ కోటలోని ప్రత్యేక జైలులో బందీలయ్యారు.[127] ఈసారి జవాహర్లాల్ తన జీవితంలోకెల్లా అత్యంత సుదీర్ఘకాలంలో జైలుజీవితం అనుభవించాడు. 1942 ఆగస్టు 9 తేదీ నుంచి 1945 జూన్ 15 తేదీ వరకూ దాదాపుగా 2 సంవత్సరాల 10 నెలల పాటు జైల్లో గడిపాడు. 12 మంది కార్యవర్గ సభ్యులనూ అహ్మద్ నగర్ కోటలోని జైల్లోనే 2 సంవత్సరాల 7 నెలల పాటు బంధించారు. అరెస్టు చేసిన తొలినాళ్ళలో బయట నుంచి ఏ రకమైన సంబంధం లేకుండా ఉత్తరాలు, ఇంటర్వ్యూలు, పత్రికలు అనుమతించకుండా కటువైన నియమాలు అమలుచేశారు. ప్రజలకు అసలు వీరిని అరెస్టు చేసి ఎక్కడ ఉంచారో కూడా తెలియనివ్వలేదు. క్రమేపీ ఈ పరిస్థితిని కొంత సడలించి పత్రికలను, పరిమితంగా కుటుంబ సభ్యులకు వ్యక్తిగతాంశాలను రాసేందుకు అనుమతించారు. అయితే జవాహర్లాల్ కుమార్తె ఇందిర, సోదరి విజయలక్ష్మి కూడా జైళ్ళలోనే మగ్గుతున్నందున ఇదేమీ అతనికి లాభించలేదు.[128] రెండేళ్ళు గడిచాకా అనుమతించిన ఇంటర్వ్యూలను జవహర్లాల్, ఇతర కార్యవర్గ సభ్యులు తామే తిరస్కరించారు.

సంవత్సరాల పాటు ఒకే కారాగారంలో బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా జీవించడం వల్ల జవాహర్లాల్, మౌలానా ఆజాద్, వల్లభ్ భాయ్ పటేల్, తదితరులైన 12 మంది కార్యవర్గ సభ్యులు ఉద్రేకంతో వాగ్వాదాలకు దిగడం, వివాదాలు పెట్టుకోవడం చేసేవారు. తమకు ప్రియమైనవారు మరణించారని తెలుస్తూ ఉండడం, కటువైన జైలు నియమావళి వల్ల ప్రపంచంతో సంబందం లేకపోవడం వంటివి వీరి మధ్య కలహాలకు కారణమయ్యేవి.[129] జవాహర్లాల్ ఈ సమస్యల నుంచి ఊరటపొందేందుకు ఉమ్మడి జీవనాన్ని ఏర్పాటుచేసే ప్రయత్నం చేశాడు. ప్రతీ వ్యక్తికీ కొన్ని విధులు అప్పగించాడు. ఆ విధులు వారంవారం మారుతూండేవి. నెహ్రూ వంటపని చూసేవాడు. అస్వస్థులకు సేవ చేసేవాడు. బాడ్మింటన్, వాలీబాల్ వంటి ఆటలు ఆడేవారు. మానసికమైన వ్యాయామం లేకపోవడాన్ని భర్తీ చేసేందుకు తోటపనిలో శరీరం అలసిపోయేలా పనిచేసి సంతుష్టి చెందేవాడు.[130]

పుస్తకాలు, పత్రికలు అనుమతించగానే తాను 1941లో ప్రారంభించిన "డిస్కవరీ ఆఫ్ ఇండియా" పుస్తక రచన పున:ప్రారంభించి పూర్తిచేశాడు. భారతదేశ చరిత్రను అవలోకించేందుకు ఉద్దేశించింది ఈ రచన.[131] రెండు సంవత్సరాల 9 నెలల పాటు జవాహర్లాల్ ను, ఇతర కార్యవర్గ సభ్యులతో అహమ్మద్ నగర్ లోని ప్రత్యేక జైలులో ఉంచిన ప్రభుత్వం 1945 మార్చి నెలలో విడదీసి వేర్వేరు జైళ్ళకు పంపించింది. నెహ్రూను నైనీ జైలుకు, అక్కడ నుంచి బెరైలీకి, అటునుంచి అల్మోరాకు పంపారు. తుదకు 1945 జూన్ 15న విడుదల చేశారు.[128]

ప్రభావం, ప్రాచుర్యం మార్చు

నోట్స్ మార్చు

  1. నెహ్రూ చరిత్రకారుడు సర్వేపల్లి గోపాల్ ప్రకారం నెహ్రూ, బోస్‌లు అంతర్జాతీయ సమస్యలను, అందులో భాగంగా భారతదేశ స్వాతంత్ర్య సమస్యని అర్థం చేసుకున్న తీర్లు వేరు. నెహ్రూ తీవ్రంగా వ్యతిరేకిస్తూ వచ్చిన జర్మనీ, జపాన్, ఇటలీల అక్షరాజ్యాల కూటమి చర్యలను ఖండించడానికి కాంగ్రెస్ అధ్యక్ష హోదాలో బోస్ వెనుకాడాడు. 1938 డిసెంరులో బొంబాయిలోని జర్మన్ కాన్సల్‌ను కలుసుకున్నాడు. చైనా, స్పెయిన్ దేశాల స్వాతంత్ర్య పోరాటాలను సమర్థించినందుకు నెహ్రూను బోస్ విమర్శించాడు.
  2. గాంధీ తనను వారసుడిగా ప్రకటిస్తున్నప్పుడు నెహ్రూ కూర్చున్న చోట నుంచి ఒక్కసారి పైకి గెంతి, బాలీసుపై కూర్చొన్నాడని అక్కడే ఉన్న రాజస్థాన్ కు చెందిన కార్యకర్త రామ్ నారాయణ్ చౌదరి గమనించాడు.

మూలాలు మార్చు

  1. 1.0 1.1 1.2 Ghose 1993, p. 25.
  2. Moraes 2008, p. 49.
  3. Moraes 2008, p. 52.
  4. Moraes 2008, p. 53.
  5. 5.0 5.1 సర్వేపల్లి గోపాల్ 1993, p. 27.
  6. సర్వేపల్లి గోపాల్ 1993, p. 28.
  7. సర్వేపల్లి గోపాల్ 1993, p. 29.
  8. సర్వేపల్లి గోపాల్ 1993, p. 30.
  9. సర్వేపల్లి గోపాల్ 1993, p. 31.
  10. సర్వేపల్లి గోపాల్ 1993, p. 33.
  11. సర్వేపల్లి గోపాల్ 1993, p. 36.
  12. సర్వేపల్లి గోపాల్ 1993, p. 38.
  13. సర్వేపల్లి గోపాల్ 1993, p. 39.
  14. సర్వేపల్లి గోపాల్ 1993, p. 40.
  15. సర్వేపల్లి గోపాల్ 1993, p. 47.
  16. సర్వేపల్లి గోపాల్ 1993, p. 48.
  17. సర్వేపల్లి గోపాల్ 1993, p. 49.
  18. సర్వేపల్లి గోపాల్ 1993, p. 50.
  19. సర్వేపల్లి గోపాల్ 1993, p. 51.
  20. సర్వేపల్లి గోపాల్ 1993, p. 52.
  21. సర్వేపల్లి గోపాల్ 1993, p. 53.
  22. సర్వేపల్లి గోపాల్ 1993, p. 54.
  23. 23.0 23.1 సర్వేపల్లి గోపాల్ 1993, p. 55.
  24. 24.0 24.1 24.2 సర్వేపల్లి గోపాల్ 1993, p. 57.
  25. సర్వేపల్లి గోపాల్ 1993, p. 56.
  26. సర్వేపల్లి గోపాల్ 1993, p. 58.
  27. సర్వేపల్లి గోపాల్ 1993, p. 59.
  28. సర్వేపల్లి గోపాల్ 1993, p. 60.
  29. సర్వేపల్లి గోపాల్ 1993, p. 61.
  30. సర్వేపల్లి గోపాల్ 1993, p. 62.
  31. సర్వేపల్లి గోపాల్ 1993, p. 67.
  32. సర్వేపల్లి గోపాల్ 1993, p. 69.
  33. సర్వేపల్లి గోపాల్ 1993, p. 70.
  34. 34.0 34.1 సర్వేపల్లి గోపాల్ 1993, p. 71.
  35. సర్వేపల్లి గోపాల్ 1993, p. 72.
  36. సర్వేపల్లి గోపాల్ 1993, p. 73.
  37. సర్వేపల్లి గోపాల్ 1993, p. 74.
  38. సర్వేపల్లి గోపాల్ 1993, p. 75.
  39. సర్వేపల్లి గోపాల్ 1993, p. 76.
  40. సర్వేపల్లి గోపాల్ 1993, p. 78.
  41. సర్వేపల్లి గోపాల్ 1993, p. 80.
  42. సర్వేపల్లి గోపాల్ 1993, p. 82.
  43. సర్వేపల్లి గోపాల్ 1993, p. 81.
  44. టంగుటూరి ప్రకాశం (1972). "  గాంధీ - ఇర్విన్ ఒడంబడిక, మా విడుదల".   నా జీవిత యాత్ర-3. వికీసోర్స్. 
  45. సర్వేపల్లి గోపాల్ & 1993 104.
  46. సర్వేపల్లి గోపాల్ & 1993 105.
  47. సర్వేపల్లి గోపాల్ & 1993 106.
  48. సర్వేపల్లి గోపాల్ & 1993 107.
  49. 49.0 49.1 సర్వేపల్లి గోపాల్ & 1993 108.
  50. 50.0 50.1 సర్వేపల్లి గోపాల్ & 1993 109.
  51. రాజ్‌మోహన్ గాంధీ 1997, p. 132.
  52. సర్వేపల్లి గోపాల్ & 1993 110.
  53. సర్వేపల్లి గోపాల్ & 1993 111.
  54. 54.0 54.1 సర్వేపల్లి గోపాల్ & 1993 112.
  55. 55.0 55.1 సర్వేపల్లి గోపాల్ & 1993 113.
  56. రాజ్‌మోహన్ గాంధీ & 1997 139.
  57. సర్వేపల్లి గోపాల్ & 1993 114.
  58. సర్వేపల్లి గోపాల్ & 1993 115.
  59. సర్వేపల్లి గోపాల్ & 1993 117.
  60. సర్వేపల్లి గోపాల్ & 1993 120.
  61. "Declaration of independence". Archived from the original on 17 మే 2013. Retrieved 5 నవంబరు 2018.
  62. రాజ్‌మోహన్ గాంధీ & 1997 140.
  63. రామచంద్ర గుహా 2010, p. 4.
  64. రాజ్‌మోహన్ గాంధీ & 1997 142.
  65. సర్వేపల్లి గోపాల్ 1993, p. 123.
  66. సర్వేపల్లి గోపాల్ 1993, p. 124.
  67. సర్వేపల్లి గోపాల్ 1993, p. 125.
  68. సర్వేపల్లి గోపాల్ 1993, p. 127.
  69. సర్వేపల్లి గోపాల్ 1993, p. 128.
  70. సర్వేపల్లి గోపాల్ 1993, p. 130.
  71. 71.0 71.1 సర్వేపల్లి గోపాల్ 1993, p. 133.
  72. 72.0 72.1 సర్వేపల్లి గోపాల్ 1993, p. 134.
  73. సర్వేపల్లి గోపాల్ 1993, p. 136.
  74. సర్వేపల్లి గోపాల్ 1993, p. 138.
  75. సర్వేపల్లి గోపాల్ 1993, p. 139.
  76. సర్వేపల్లి గోపాల్ 1993, p. 141.
  77. సర్వేపల్లి గోపాల్ 1993, p. 143.
  78. సర్వేపల్లి గోపాల్ 1993, p. 144.
  79. సర్వేపల్లి గోపాల్ 1993, p. 145.
  80. సర్వేపల్లి గోపాల్ 1993, p. 146.
  81. సర్వేపల్లి గోపాల్ 1993, p. 147.
  82. 82.0 82.1 సర్వేపల్లి గోపాల్ 1993, p. 152.
  83. 83.0 83.1 83.2 సర్వేపల్లి గోపాల్ 1993, p. 153.
  84. సర్వేపల్లి గోపాల్ 1993, p. 154.
  85. సర్వేపల్లి గోపాల్ 1993, p. 155.
  86. సర్వేపల్లి గోపాల్ 1993, p. 156.
  87. సర్వేపల్లి గోపాల్ 1993, p. 157.
  88. సర్వేపల్లి గోపాల్ 1993, p. 158.
  89. సర్వేపల్లి గోపాల్ 1993, p. 159.
  90. సర్వేపల్లి గోపాల్ 1993, p. 160.
  91. రాజ్‌మోహన్ గాంధీ 1993, p. 189.
  92. 92.0 92.1 సర్వేపల్లి గోపాల్ 1993, p. 161.
  93. బిపిన్ et al. 1987, p. 298.
  94. సర్వేపల్లి గోపాల్ 1993, p. 177.
  95. సర్వేపల్లి గోపాల్ 1993, p. 178.
  96. సర్వేపల్లి గోపాల్ 1993, p. 184.
  97. సర్వేపల్లి గోపాల్ 1993, p. 180.
  98. సర్వేపల్లి గోపాల్ 1993, p. 186.
  99. సర్వేపల్లి గోపాల్ 1993, p. 187.
  100. సర్వేపల్లి గోపాల్ 1993, p. 197.
  101. సర్వేపల్లి గోపాల్ 1993, p. 199.
  102. 102.0 102.1 సర్వేపల్లి గోపాల్ 1993, p. 201.
  103. సర్వేపల్లి గోపాల్ 1993, p. 203.
  104. సర్వేపల్లి గోపాల్ 1993, p. 204.
  105. 105.0 105.1 సర్వేపల్లి గోపాల్ 1993, p. 205.
  106. 106.0 106.1 సర్వేపల్లి గోపాల్ 1993, p. 206.
  107. సర్వేపల్లి గోపాల్ 1993, p. 209.
  108. సర్వేపల్లి గోపాల్ 1993, p. 212.
  109. సర్వేపల్లి గోపాల్ 1993, p. 214.
  110. సర్వేపల్లి గోపాల్ 1993, p. 218.
  111. సర్వేపల్లి గోపాల్ 1993, p. 221.
  112. ఇండియాస్ జవాహర్‌లాల్ నెహ్రూ
  113. సర్వేపల్లి గోపాల్ 1993, p. 224.
  114. రాజ్‌మోహన్ గాంధీ 2006, p. 582.
  115. సర్వేపల్లి గోపాల్ 1993, p. 225.
  116. సర్వేపల్లి గోపాల్ 1993, p. 227.
  117. సర్వేపల్లి గోపాల్ 1993, p. 228.
  118. సర్వేపల్లి గోపాల్ 1993, p. 229.
  119. 119.0 119.1 సర్వేపల్లి గోపాల్ 1993, p. 230.
  120. సర్వేపల్లి గోపాల్ 1993, p. 231.
  121. 121.0 121.1 121.2 సర్వేపల్లి గోపాల్ 1993, p. 233.
  122. రాజ్‌మోహన్ గాంధీ 2006, p. 587.
  123. సర్వేపల్లి గోపాల్ 1993, p. 235.
  124. సర్వేపల్లి గోపాల్ 1993, p. 236.
  125. సర్వేపల్లి గోపాల్ 1993, p. 237.
  126. రాజ్‌మోహన్ గాంధీ 2006, p. 591.
  127. సర్వేపల్లి గోపాల్ 1993, p. 238.
  128. 128.0 128.1 సర్వేపల్లి గోపాల్ 1993, p. 239.
  129. సర్వేపల్లి గోపాల్ 1993, p. 240.
  130. సర్వేపల్లి గోపాల్ 1993, p. 241.
  131. సర్వేపల్లి గోపాల్ 1993, p. 243.