మాగల్లు

ఆంధ్ర ప్రదేశ్, ఎన్టీఆర్ జిల్లా, నందిగామ మండల గ్రామం

మాగల్లు ఎన్టీఆర్ జిల్లా, నందిగామ మండలం లోని గ్రామం. ఇది మండల కేంద్రమైన నందిగామ నుండి 7 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన జగ్గయ్యపేట నుండి 50 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 1011 ఇళ్లతో, 3830 జనాభాతో 1437 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 1910, ఆడవారి సంఖ్య 1920. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 1523 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 24. గ్రామ జనగణన లొకేషన్ కోడ్ 588886. 2022 లో చేసిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం కృష్ణా జిల్లాలో, ఇదే మండలంలో ఉండేది..[1][2]

మాగల్లు
—  రెవెన్యూ గ్రామం  —
మాగల్లు is located in Andhra Pradesh
మాగల్లు
మాగల్లు
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 16°48′50″N 80°18′59″E / 16.8138°N 80.3164°E / 16.8138; 80.3164
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా ఎన్టీఆర్
మండలం నందిగామ
ప్రభుత్వం
 - సర్పంచి
జనాభా (2001)
 - మొత్తం 3,758
 - పురుషులు 1,914
 - స్త్రీలు 1,844
 - గృహాల సంఖ్య 884
పిన్ కోడ్ 521185
ఎస్.టి.డి కోడ్ 08678

సమీప గ్రామాలు మార్చు

ఈ గ్రామానికి సమీపంలో పల్లగిరి, దాములూరు, శనగపాడు, జొన్నలగడ్డ, రుద్రవరం గ్రామాలు ఉన్నాయి.

సమాచార, రవాణా సౌకర్యాలు మార్చు

మాగల్లులో సబ్ పోస్టాఫీసు సౌకర్యం ఉంది. పోస్టాఫీసు సౌకర్యం, పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. ప్రైవేటు బస్సు సౌకర్యం, ట్రాక్టరు సౌకర్యం మొదలైనవి గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. రైల్వే స్టేషన్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. ప్రధాన జిల్లా రహదారి, జిల్లా రహదారి గ్రామం గుండా పోతున్నాయి. జాతీయ రహదారి గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. రాష్ట్ర రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి. జగ్గయ్యపేట, నందిగామ నుండి రోడ్దురవాణా సౌకర్యం ఉంది. విజయవాడ రైల్వేస్టేషన్ 50 కి.మీ దూరంలో ఉంది.

విద్యా సౌకర్యాలు మార్చు

గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు రెండు, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల ఒకటి ఉన్నాయి. జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల, సమీప బాలబడి నందిగామలో ఉంది. సమీప జూనియర్ కళాశాల, ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల, ఇంజనీరింగ్ కళాశాల నందిగామలో ఉన్నాయి. సమీప వైద్య కళాశాల, మేనేజిమెంటు కళాశాల విజయవాడలోను, పాలీటెక్నిక్ నందిగామలోనూ ఉన్నాయి. సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల, అనియత విద్యా కేంద్రం నందిగామలోను, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల విజయవాడ లోనూ ఉన్నాయి.

మౌలిక సదుపాయాలు మార్చు

ప్రాధమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం లి., మార్చు

పశువైద్యశాల మార్చు

చౌకధరల దుకాణం మార్చు

గ్రామంలో నూతనంగా ఏర్పాటైన ఈ దుకాణాన్ని, 2017,మార్చి-6న ప్రారంభించారు.

ఖాసిం వృద్ధాశ్రమం మార్చు

మాగల్లు ఎత్తిపోతల పథకం మార్చు

మునేరు కాలువ ఆధారంగా మాగల్లు, సోమవరం, తొర్రగుడిపాడు గ్రామాల రైతులకు చెందిన చివరి పొలాలకు సక్రమంగా సాగునీరు రాక, పంటలు పండక రైతులుఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనికి పరిష్కారంగా వైరా నది మీద ఎత్తిపోతల పథకం నిర్మించితే సాగునీటి సమస్య తీరుతుందని రైతులు 10 సంవత్సరాలుగా కృషి చేయడంతో, ఇటీవల ఈ పథకానికి ప్రభుత్వ అనుమతి మంజూరయినది. ఈ పథకం ప్రకారం, రుద్రవరం గ్రామం వద్ద, వైరా నది నుండి నీటిని తరలించెదరు. అక్కడినుండి 3 కి.మీ. గొట్టపు మార్గం (Pipe Line) ద్వారా మునేరు ఆయకట్టుకు సాగునీరందించెదరు. మూడు గ్రామాలలోని 2,780 ఎకరాలకు సాగునీరందించే ఈ పథకంలో ఒక్కొక్కటీ 450 అశ్వకశక్తి (Horse Power) గల మూడు పంపులను ఏర్పాటుచేసెదరు. వీటిద్వారా 17 క్యూసెక్కుల నీరు ఆయకట్టుకు సరఫరా చేసెదరు. ఈ ఎత్తిపోతల పథకం ద్వారా ఆయకట్టు భూములలో సాగుచేసే వరితో పాటు, మెట్టపైర్లకు గూడా సాగునీరు అందించెదరు. ఈ పథకానికి నాబార్డు వారు, ఆర్.ఐ.డి.ఎఫ్ - 20 స్కీము ద్వారా, రు. 26.30 కోట్ల నిధులను గూడా మంజూరు చేసారు.

వైద్య సౌకర్యం మార్చు

ప్రభుత్వ వైద్య సౌకర్యం మార్చు

మాగల్లులో ఉన్న ఒక ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో డాక్టర్లు లేరు. ఇద్దరు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. ఒక పశు వైద్యశాలలో ఒక డాక్టరు, ఒకరు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. డిస్పెన్సరీ, సంచార వైద్య శాల గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.

ప్రైవేటు వైద్య సౌకర్యం మార్చు

గ్రామంలో4 ప్రైవేటు వైద్య సౌకర్యాలున్నాయి. డిగ్రీ లేని డాక్టర్లు నలుగురు ఉన్నారు. ఒక మందుల దుకాణం ఉంది.

తాగు నీరు మార్చు

గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. బావుల నీరు కూడా అందుబాటులో ఉంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది. బోరుబావుల ద్వారా కూడా ఏడాది పొడుగునా నీరు అందుతుంది.

పారిశుధ్యం మార్చు

మురుగునీరు బహిరంగ కాలువల ద్వారా ప్రవహిస్తుంది. మురుగునీరు బహిరంగంగా, కచ్చా కాలువల ద్వారా కూడా ప్రవహిస్తుంది. మురుగునీటిని నేరుగా జలవనరుల్లోకి వదులుతున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.

గ్రామ పంచాయతీ మార్చు

2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీమతి కొమ్మినేని వెంకట లక్ష్మీ నరసమ్మ సర్పంచిగా ఎన్నికైనారు. 2013 ఆగస్టులో పంచాయతీ పాలకవర్గం కొత్తగా ఏర్పడగానే పలు అభివృద్ధిపనులు చేపట్టినారు. రు. 2.27 లక్షల 13వ ఆర్థికసంఘం నిధులతో పీర్లచావడి ప్రాంతంలో డ్రెయిను నిర్మించారు. రు. 5 లక్షల ముఖ్యమంత్రి ప్రత్యేకనిధులతో ఎస్.సి.కాలనీలో సిమెంటు రహదారులు విస్తరించారు.

దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు మార్చు

శ్రీ రుక్మిణీ సత్యభామా సమేత శ్రీ మదన గోపాలస్వామివారి ఆలయం మార్చు

ఆలయ చరిత్ర మార్చు

ఈ ఆలయం కాకతీయులనాటి ఆలయం. పూర్వం ముదిగొండ చాళుక్యరాజు దండయాత్రకు వెళుతూ మాగల్లులో ఒక రాయిపై కూర్చుని విశ్రాంతి పొందినాడు. ఆ సమయంలో రాజుకు స్వామి స్వప్నంలో కనిపించి, ఆ రాయి క్రింద తను విగ్రహరూపంలో ఉన్నానని చెప్పగా, త్రవ్వకాలలో స్వామి విగ్రహాలు బయల్పడినవి. యుద్ధంలో విజయం సాధించితే ఇక్కడ దేవాలయం నిర్మించెదనని చెప్పిన రాజు, యుద్ధంలో విజయం సాధించి ఇక్కడ దేవాలయాన్ని నిర్మించినాడట. సూర్యచంద్రులున్నంతవరకు, ఇక్కడ దేవుడిని విశ్వసించుడని ఇక్కడి శిలాశాశాసనం ద్వారా తెలియజేసినారు. దేవనాగరిలిపిలో ఉన్న శిలాశాసనాన్ని, పురాతత్వశాఖ వారు వెలికి తీసినారు.

ఆలయ అభివృద్ధి మార్చు

ప్రస్తుతం ఈ పురాతన ఆలయం శిథిలమవడంతో భక్తుల, దాతల, గ్రామస్థుల విరాళాలు 15 లక్షల రూపాయల అంచనాతో, 30 అడుగుల ఎత్తయిన ఆలయ విమాన శిఖరం నిర్మించుచున్నారు. మూలవిరాట్టును కదిలించకుండా గర్భాలయం ఎత్తు పెంచి, పాలిష్ రాళ్ళతో తీర్చిదిద్దినారు. అంతరాలయాన్ని అభివృద్ధిచేసారు. దేవాలయానికి ఉత్తర ఈశాన్యదిశలో రహదారి, పుష్కరిణిల అభివృద్ధికి కృషిచేస్తున్నారు. ఆధునికతకు తగ్గట్టుగా ఆగమశాస్త్రం ప్రకారం అపురూపంగా నిర్మించుచున్నారు. 2014 సంవత్సరం ఆఖరుకు పనులు పూర్తిచేసి, శిఖర ప్రతిష్ఠ, కుంభాభిషేకం నిర్వహించుటకు నిర్ణయించారు.

శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయం మార్చు

ఈ ఆలయానికి 14.97 ఎకరాలమాన్యం భూమి ఉంది.

మార్కెటింగు, బ్యాంకింగు మార్చు

గ్రామంలో వ్యవసాయ పరపతి సంఘం ఉంది. గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం ఉన్నాయి. వాణిజ్య బ్యాంకు గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. ఏటీఎమ్, సహకార బ్యాంకు గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. రోజువారీ మార్కెట్, వారం వారం సంత, వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి.

ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు మార్చు

గ్రామంలో అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ కేంద్రం, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. సమీకృత బాలల అభివృద్ధి పథకం, ఆటల మైదానం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. సినిమా హాలు, గ్రంథాలయం, పబ్లిక్ రీడింగ్ రూం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి.

విద్యుత్తు మార్చు

గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 15 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.

భూమి వినియోగం మార్చు

మాగల్లులో భూ వినియోగం కింది విధంగా ఉంది:

  • వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 181 హెక్టార్లు
  • వ్యవసాయం సాగని, బంజరు భూమి: 11 హెక్టార్లు
  • శాశ్వత పచ్చిక ప్రాంతాలు, ఇతర మేత భూమి: 10 హెక్టార్లు
  • తోటలు మొదలైనవి సాగవుతున్న భూమి: 6 హెక్టార్లు
  • వ్యవసాయం చేయదగ్గ బంజరు భూమి: 4 హెక్టార్లు
  • సాగులో లేని భూముల్లో బీడు భూములు కానివి: 3 హెక్టార్లు
  • బంజరు భూమి: 16 హెక్టార్లు
  • నికరంగా విత్తిన భూమి: 1203 హెక్టార్లు
  • నీటి సౌకర్యం లేని భూమి: 1082 హెక్టార్లు
  • వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 140 హెక్టార్లు

నీటిపారుదల సౌకర్యాలు మార్చు

మాగల్లులో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.

  • కాలువలు: 140 హెక్టార్లు

ఉత్పత్తి మార్చు

మాగల్లులో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.

ప్రధాన పంటలు మార్చు

వరి, ప్రత్తి, మిరప, అపరాలు, కాయగూరలు

ప్రధాన వృత్తులు మార్చు

వ్యవసాయం, వ్యవసాయాధరిత వృత్తులు

గ్రామ విశేషాలు మార్చు

ఈ గ్రామానికి చెందిన రామకోటేశ్వరరావు ఒక ఆదర్శ రైతు. వీరు పరిశోధన సంస్థలలో శాస్రవేత్తలు అభివృద్ధి చేసిన నూతన వంగడాలను ప్రత్యేకంగా తీసుకొని వచ్చి, వాటిని తాను సాగు చేస్తూ, మంచి ఫలితాలను సాధించుచున్నారు. తక్కువ పెట్టుబడి, సేంద్రియ వ్యవసాయ పద్ధతులతో ఎక్కువ దిగుమతులను సాధించుచూ, రైతులకు ఆదర్శంగా నిలుచుచున్నారు. వరంగల్లుకు చెందిన సిరి ఆర్గనైజేషన్ అను సంస్థ, వీరిని ఈ సంవత్సరం ఉత్తమ రైతు పురస్కారానికి ఎంపిక చేసింది. 2016,డిసెంబరులో వీరికి ఈ పురస్కారం అందజేసెదరు.

గణాంకాలు మార్చు

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 3758. ఇందులో పురుషుల సంఖ్య 1914, స్త్రీల సంఖ్య 1844, గ్రామంలో నివాస గృహాలు 884 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 1437 హెక్టారులు.

మూలాలు మార్చు

  1. "ఆంధ్రప్రదేశ్ రాజపత్రము" (PDF). ahd.aptonline.in. Archived from the original (PDF) on 2022-09-06. Retrieved 2022-09-06.
  2. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".

వెలుపలి లింకులు మార్చు

"https://te.wikipedia.org/w/index.php?title=మాగల్లు&oldid=4128130" నుండి వెలికితీశారు