సీతారామ్ కేసరీ

భారతీయ రాజకీయ నాయకుడు

సీతారామ్ కేసరీ (1919 నవంబరు 15 - 2000 అక్టోబరు 24)[1] ఒక భారతీయ రాజకీయవేత్త, లోక్‌సభ సభ్యుడు. అతను కేంద్ర మంత్రిగా పనిచేసాడు.1996 నుండి 1998 వరకు భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడిగా వ్యవహరించాడు.[2]

సీతారామ్ కేసరీ
దస్త్రం:Sita Ram Kesari (cropped).jpg
సీతారామ్ కేసరి, మేనకా గాంధీ, బల్వంత్ ఠాకూర్. (జమ్మూ కాశ్మీర్ లోని నట్రాంగ్ గ్రూప్ వ్యవస్థాపకుడు)
భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు
In office
1996 సెప్టెంబరు – 1998 మార్చి 14
అంతకు ముందు వారుపి.వి.
తరువాత వారుసోనియా గాంధీ
వ్యక్తిగత వివరాలు
జననం
సీతారామ్ కేసరీ

1919 నవంబరు 15
దానాపూర్, బీహార్ , ఒరిస్సా ప్రావిన్స్, బ్రిటిష్ ఇండియా
మరణం2000 అక్టోబరు 24(2000-10-24) (వయసు 80)
న్యూ ఢిల్లీ, భారతదేశం
రాజకీయ పార్టీభారత జాతీయ కాంగ్రెస్
జీవిత భాగస్వామికేశర్ దేవి
సంతానంఒక కుమారుడు
ఇద్దరు కుమార్తెలు
నివాసందానాపూర్, బీహార్
కళాశాలపాట్నా విశ్వవిద్యాలయం

రాజకీయ జీవితం మార్చు

స్వాతంత్ర్యానికి ముందు మార్చు

కేసరీ 13 సం.ల వయస్సులో రాజకీయంగా భారత స్వాతంత్ర్యోద్యమంలో చురుకుగా పాల్గొన్నాడు. 1930, 1942 మధ్యకాలంలో కేసరీ రాజకీయ కార్యకలాపాల కారణంగా అనేకసార్లు జైలుకు వెళ్లాడు. స్వాతంత్ర్యోఉద్యమంలో పాల్గొన్న బిందేశ్వరి దూబే, భగవత్ జా అజాద్, చంద్రశేఖర్ సింగ్, సత్యేంద్ర నారాయణ్ సిన్హా, కేదార్ పాండే, అబ్దుల్ గఫూర్, మొదలగు బీహార్ భవిష్యత్తు ముఖ్యమంత్రులతో పాటు, బీహార్ కాంగ్రెస్ ప్రసిద్ధ యంగ్ టర్క్‌లలో కేసరీ ఒకడు

రాజకీయ జీవితం మార్చు

కేసరి 1973లో బీహార్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా,1980లో భారత జాతీయ కాంగ్రెస్ కమిటీ కోశాధికారిగా ఎన్నికయ్యాడు (AICC) [3] 1967లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కతిహార్ నియోజకవర్గం నుండి లోక్‌సభకు ఎన్నికయ్యాడు. అతను 1971 2000 జూలై ఏప్రిల్ మధ్య ఐదు పర్యాయాలు రాజ్యసభలో బీహార్‌కు ప్రాతినిధ్యం వహించాడు.1974 1980 1988 ఏప్రిల్ 1994 జూలై ఏప్రిల్ ఏప్రిల్ లో తిరిగి ఎన్నికయ్యాడు.[4] ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, పివి నరసింహారావులు భారతదేశ ప్రధానమంత్రులుగా పనిచేసిన సమయంలో అతను కేంద్రమంత్రిగా పనిచేసాడు.

కేసరి దశాబ్దానికి పైగా కాంగ్రెస్ పార్టీ కోశాధికారిగా పనిచేశాడు. అదనంగా అతను 1997 జనవరి 3 న భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు.1998 మార్చిలో అతను కార్యాలయం నుండి నిష్క్రమించిన తరువాత, రాజకీయాలలో తక్కువస్థాయిని కొనసాగించాడు.అతని చివరి పదవీకాలం 2000 ఏప్రిల్ లో ముగిసిన తర్వాత రాజ్యసభకు పార్టీ అభ్యర్థిత్వాన్ని నిరాకరించాడు.

భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడిగా మార్చు

1996 సెప్టెంబరులో పివి నరసింహారావు కాంగ్రెస్ అధ్యక్ష పదవి నుండి వైదొలిగిన తరువాత, కేశ్రీ భారత జాతీయ కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా నియమితులయ్యాడు. తరువాతి సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీకి కష్టంగా మారాయి. జనంలో కేస్రీకి ప్రజాదరణ తగ్గిపోవడం పార్టీకి మరింత నష్టం కలిగించింది. కేశ్రీ అత్యంత వివాదాస్పద అంశం, హెచ్‌డి దేవగౌడ యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకోవడం వివాదంగా మారింది. దాని ఫలితంగా 1997 ఏప్రిల్ లో దేవగౌడ ప్రభుత్వం పతనానికి దారితీసింది. ఏదేమైనా, తరువాత ఒకరాజీ కుదిరింది. యునైటెడ్ ఫ్రంట్ కాంగ్రెస్ పార్టీ నుండి నిరంతర మద్దతుతో తదుపరి కొత్త నాయకుడిగా ఐకె గుజ్రాల్‌ని ఎన్నుకుంది.

సోనియా గాంధీ పార్టీ కోసం ప్రచారం చేయాలని నిర్ణయించుకున్నతర్వాత, ప్రధాన పార్టీ ప్రచారకర్తగా కేస్రీని నియమించారు.సోనియా తన ప్రచార ర్యాలీలలో భారీ జనాలను ఆకర్షించింది, కానీ పార్టీకోసం ఆ ఎన్నికల్లో గెలవలేదు. ఏదేమైనా, కాంగ్రెస్ గౌరవనీయమైన 140 స్థానాలను గెలుపొందింది.ఎన్నికల ప్రచారంలో, కోయంబత్తూర్‌లో వరుస బాంబు పేలుళ్లు జరిగాయి.అక్కడ బీజేపీ అధ్యక్షుడు లాల్ కృష్ణ అద్వానీ ఎన్నికల ర్యాలీలో ప్రసంగించాల్సి ఉంది. పేలుళ్లలో దాదాపు 50 మంది మరణించారు.పేలుళ్ల తర్వాత, కేశ్రీ బాంబు పేలుళ్లు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చేతివాటం అని, అంతేకాకుండా, పేలుళ్లలో ఆర్‌ఎస్‌ఎస్ ప్రమేయం ఉందని ప్రకటనలు చేసాడు. ఆర్ఎస్ఎస్ కేస్రీపై పరువునష్టం దావా వేసింది.అయితే కేస్రీకి 1998లో నగరకోర్టు బెయిల్ మంజూరు చేసింది.[5]

ఎన్నికల ఓటమి తరువాత, కేస్రీని 1998 మార్చిలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తన పదవి నుండి తొలగించింది.[6] అతని స్థానంలో సోనియా గాంధీని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా నియమించారు.సోనియా గాంధీకోసం కేస్రీని పార్టీనుండి తొలగించడానికి ప్రణబ్ ముఖర్జీ, ఇతరులు ఎలా కుట్ర పన్నారో పరిశీలిస్తే, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నుండి కేస్రీని తొలగించడం కొంతమంది పార్టీ రాజ్యాంగానికి చేసిన ద్రోహంగా భావిస్తారు.[7] కేస్రీ, తారిఖ్ అన్వర్‌తో సహా ఇతర కార్యవర్గ సభ్యులతో పాటు, కాంగ్రెస్ చీలిక తరువాత 1999 మే 19న కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం వద్ద "కోపంగా ఉన్న గుంపు", "కాంగ్రెస్ గూండాలు"గా వర్ణించబడింది. అది నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటుకు దారితీసింది.[6][8]

మూలాలు మార్చు

  1. Profile of Sitaram Kesri
  2. "Sitaram Kesri's name 'missing' as past Congress president on party's official website". OpIndia. 2019-06-03. Retrieved 2021-09-22.
  3. "Sitaram Kesri: President – Indian National Congress". Congress Sandesh. Archived from the original on 2012-10-30. Retrieved 2021-09-22.
  4. "List of Rajya Sabha members Since 1952".
  5. Sitaram Kesri gets bail in RSS defamation case Indian Express – 5 May 1998
  6. 6.0 6.1 Kesri and three transitions in Cong. Archived 2009-05-27 at the Wayback Machine The Hindu – 26 October 2000
  7. http://epaper.dnaindia.com/newsview.aspx?eddate=7/10/2011&pageno=15&edition=20&prntid=144322&bxid=31766966&pgno=15 Archived 4 అక్టోబరు 2011 at the Wayback Machine
  8. "Congress Plans More Powers for Sonia", The Indian Express, 23 May 1999

వెలుపలి లంకెలు మార్చు