1946 మద్రాసు ప్రెసిడెన్సీ శాసనసభ ఎన్నికలు

బ్రిటిషు భారతదేశంలో మద్రాసు ప్రెసిడెన్సీలో జరిగిన ఎన్నికలు

1935 భారత ప్రభుత్వ చట్టం ద్వారా ద్విసభ శాసనసభను స్థాపించిన తర్వాత మద్రాసు ప్రెసిడెన్సీకి రెండవ శాసనసభ ఎన్నికలు 1946లో జరిగాయి. రెండవ ప్రపంచ యుద్ధంలో భారతదేశ ప్రమేయాన్ని నిరసిస్తూ సి. రాజగోపాలాచారి యొక్క భారత జాతీయ కాంగ్రెస్ ప్రభుత్వం రాజీనామా చేయడంతో 1939 నుండి ప్రారంభమైన 6 సంవత్సరాల గవర్నర్ పాలన తర్వాత ఎన్నికలు జరిగాయి. ఇది ప్రెసిడెన్సీలో జరిగిన చివరి ఎన్నికలు - 1947లో భారత స్వాతంత్ర్యం తర్వాత, ప్రెసిడెన్సీ మద్రాసు రాష్ట్రంగా మారింది. శాసన మండలి ఎన్నికలు ఏకకాలంలో జరిగాయి. మొత్తం 215 స్థానాలకు గానూ 163 స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. ఈ ఎన్నికల తర్వాత సంవత్సరాల్లో మద్రాసు కాంగ్రెస్ పార్టీలో ప్రాంతీయ (ప్రధానంగా తమిళం, ఆంధ్ర), కులపరమైన ( బ్రాహ్మణ, బ్రాహ్మణేతర) విభజనలతో వర్గీకరణ కనిపించింది. టి. ప్రకాశం (ఆంధ్ర బ్రాహ్మణ), సి. రాజగోపాలాచారి (తమిళ బ్రాహ్మణుడు), కె. కామరాజ్ (తమిళ బ్రాహ్మణేతరుడు) మధ్య పోటీ ఫలితంగా ప్రకాశం మొదట ప్రధానమంత్రిగా ఎన్నికయ్యాడు. కానీ తరువాత కామరాజ్ మద్దతుతో ఓమందూర్ రామస్వామి రెడ్డియార్ (తమిళ బ్రాహ్మణేతరు) చేతిలో ఓడిపోయాడు. మళ్ళీ, కామరాజ్ మద్దతుతో PS కుమారస్వామి రాజా (తమిళ బ్రాహ్మణేతరుడు) రెడ్డియార్ తొలగించి తాను గద్దెనెక్కాడు.

1946 మద్రాసు ప్రెసిడెన్సీ శాసనసభ ఎన్నికలు
← 1937 1946 మార్చి 30[1] 1952 →

మొత్తం 215 స్థానాలన్నింటికీ
  First party Second party
 
Leader టంగుటూరి ప్రకాశం ముఖమ్మద్ ఇస్మాయిల్[2]
Party కాంగ్రెస్ ఆలిండియా ముస్లిం లీగ్
Seats won 163 28
Seat change Increase 4 Increase 17
Percentage 75.81% 13.02%
Swing Increase 1.86% Increase 7.91%

ఎన్నికలకు ముందు మద్రాసు ప్రధానమంత్రి

గవర్నరు పాలన

Elected మద్రాసు ప్రధానమంత్రి

టంగుటూరి ప్రకాశం
కాంగ్రెస్

నేపథ్య మార్చు

మద్రాసులో గవర్నర్ పాలన మార్చు

1937 ఎన్నికలలో గెలిచి 1937లో మద్రాసు ప్రెసిడెన్సీలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రెండవ ప్రపంచ యుద్ధంలో భారతదేశ ప్రమేయాన్ని నిరసిస్తూ 1939 అక్టోబరులో రాజీనామా చేసింది.[3] 1935 భారత ప్రభుత్వ చట్టంలోని సెక్షన్ 93 ప్రకారం ప్రెసిడెన్సీ 1939 అక్టోబరు 30 న నేరుగా గవర్నర్ పాలనలోకి వచ్చింది. గవర్నర్ ప్రకటన ద్వారా దీన్ని 1943 ఫిబ్రవరి 15 న, 1945 సెప్టెంబరు 29 న రెండుసార్లు పొడిగించారు. 1945 జూలైలో యునైటెడ్ కింగ్‌డమ్‌లో క్లెమెంట్ అట్లీ నేతృత్వంలోని లేబర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఇది భారత స్వాతంత్ర్య ఉద్యమం పట్ల మరింత సానుభూతి చూపింది. భారత వైస్రాయ్ లార్డ్ వేవెల్, రాజ్యాంగ ప్రతిష్టంభనను విచ్ఛిన్నం చేయడానికి ఒక ప్రణాళికను ప్రతిపాదించాడు. దీన్ని "వేవెల్ ప్లాన్" అంటారు. దీని కింద కాంగ్రెస్ రాజకీయ ఖైదీలందరినీ విడుదల చేసారు. సెక్షన్ 93ని రద్దు చేయాలనీ, తాజా ఎన్నికలు నిర్వహించాలనీ పిలుపునిచ్చింది. ఎన్నికల ప్రక్రియలో తిరిగి పాల్గొనేందుకు కాంగ్రెస్ అంగీకరించింది. 1946 లో ఎన్నికలు జరప తలపెట్టారు.[4][5]

కాంగ్రెస్‌లో రాజాజీ-కామరాజ్‌ పోటీ మార్చు

1946 ఎన్నికలకు ముందు సంవత్సరాలలో మద్రాసు ప్రావిన్షియల్ కాంగ్రెస్ నాయకత్వం కోసం సి. రాజగోపాలాచారి (రాజాజీ), కె. కామరాజ్ ల మధ్య తీవ్ర పోరాటం జరిగింది. పాకిస్తాన్‌కు సంబంధించిన సమస్యలపై కాంగ్రెస్ నాయకులతో విభేదాల కారణంగా రాజాజీ 1942 జూలై 15న కాంగ్రెస్‌ను విడిచిపెట్టాడు. ఆయన నిష్క్రమణ తర్వాత, తమిళనాడు కాంగ్రెస్ నాయకత్వం మద్రాసు ప్రెసిడెన్సీలోని తమిళ ప్రాంతంలో అపారమైన ప్రజాదరణ పొందిన కామరాజ్ చేతుల్లోకి మారింది. రాజాజీ 1945 మధ్యలో మళ్లీ కాంగ్రెస్‌లోకి వచ్చాడు. ప్రెసిడెన్సీకి అతని సేవ చాలా అవసరమని వారు భావించినందున కాంగ్రెస్ హైకమాండ్ అతని తిరిగి రాకను చాలా స్వాగతించింది. సత్యమూర్తి మరణించాడు, ప్రకాశం ప్రజాదరణ ఆంధ్ర ప్రాంతానికే పరిమితమైంది, కామరాజు చాలా చిన్నవాడు.

1945 అక్టోబరు 31 న తిరుప్పరంకుండ్రంలో జరిగిన ప్రావిన్షియల్ కాంగ్రెస్ కమిటీ సమావేశంలో రాజాజీ నాయకత్వానికి బలమైన మద్దతు లభించింది. అతనిని ఎదుర్కోవడానికి కామరాజ్, CN ముత్తురంగ ముదలియార్, M. భక్తవత్సలం వంటి నాయకులతో జతకట్టాడు. రాజాజీ అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య మధ్యవర్తిత్వం వహించడానికి కాంగ్రెస్ హైకమాండ్ అసఫ్ అలీని మద్రాసుకు పంపింది. కామరాజ్, ముదలియార్ లు స్థానిక రాజకీయాలలో హైకమాండ్ జోక్యాన్ని, రాజాజీకి ప్రాధాన్యతనివ్వడాన్నీ నిరసిస్తూ కాంగ్రెస్ హైకమాండ్‌కు లేఖ రాశారు. రాజాజీ సెంట్రల్ అసెంబ్లీలో అడుగుపెడితే మంచిదని సర్దార్ వల్లభాయ్ పటేల్ భావించాడు. కానీ రాజాజీకి ప్రాంతీయ రాజకీయాలపై ఆసక్తి ఉండడంతో మద్రాసు యూనివర్సిటీ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనుకున్నాడు. మొత్తానికి, రాజాజీ లేకుంటే మద్రాసు ప్రెసిడెన్సీలో కాంగ్రెస్ నాయకత్వరహితంగా మారుతుందనే కాంగ్రెస్ హైకమాండ్ వాదనను కామరాజ్ తదితరులకు నచ్చలేదు. అది పూర్తిగా ప్రావిన్స్ ప్రయోజనాల కోసం పనిచేస్తుందని వారు భావించలేదు. [6]


1946 జనవరిలో దక్షిణ భారత హిందీ ప్రచార సభ రజతోత్సవ వేడుకల్లో పాల్గొనడానికి మద్రాసును సందర్శించిన గాంధీ, హరిజన్ పత్రికలో రాజాజీ అభ్యర్థిత్వాన్ని సమర్థిస్తూ ఒక వ్యాసం రాశారు. "క్యూరియస్" అనే శీర్షికతో వచ్చిన ఆ కథనంలో రాజాజీకి వ్యతిరేకంగా పనిచేసే మద్రాసు కాంగ్రెస్‌ "గ్రూపు" ఒకదాని గురించిన ప్రస్తావన ఉంది. గాంధీ ఆ కథనాన్ని ఇలా ముగించాడు:

దక్షిణాది ప్రెసిడెన్సీలో రాజాజీ చాలా ఉత్తమమైన వ్యక్తి. నా చేతిలో అధికారం ఉంటే, నేను రాజాజీని పదవిలో కూచోబెడతాను... కానీ ఆ అధికారం ప్రావిన్షియల్ కాంగ్రెస్ కమిటీ వద్ద ఉంది. నా అభిప్రాయం అనేది వ్యక్తిగతమైనది, ఒక వ్యక్తికి సంబంధించినది. దానికి ఎంత విలువ ఉంటుందో అంతే ఉంటుంది.

ఈ వ్యాసం మద్రాసు ప్రావిన్స్‌లో భారీ వివాదానికి దారితీసింది. గాంధీ కథనాన్ని ఖండిస్తూ అతనికి అనేక టెలిగ్రామ్‌లు, లేఖలు వచ్చాయి. ‘గ్రూపు’ అనే పదాన్ని ఉపసంహరించుకోకుంటే నిరాహార దీక్ష చేస్తామని కూడా కొందరు బెదిరించారు. అయినప్పటికీ, గాంధీ పశ్చాత్తాపపడలేదు. తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోలేదు. 1946 ఫిబ్రవరి 12 న కామరాజ్, తమిళనాడు కాంగ్రెస్ పార్లమెంటరీ బోర్డుకు రాజీనామా చేశాడు. ఈ వివాదంతో అసంతృప్తి చెందిన రాజాజీ, క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకున్నాడు. రాజాజీ ప్రతిష్టను బలోపేతం చేయడానికి కృషి చేసిన పటేల్, ఆయన ఆకస్మిక ఉపసంహరణతో ఆగ్రహించి ఇలా అన్నాడు.

మీరు ఇలా ప్రవర్తిస్తే ఎవరైనా మీకు ఎలా మద్దతు ఇస్తారు? మీరేమో మమ్మల్ని సంప్రదించరు. కానీ అది మీకు అలవాటైపోయింది. మీరు నాకు అర్థం కారు.

అయితే మద్రాసు యూనివర్శిటీ నియోజకవర్గం నుండి రాజాజీ ఉపసంహరణను ఆయన అంగీకరించాడు. రాజాజీ, రాజకీయాల నుండి విరమణ చేయడం ఇది మూడోసారి, మిగిలిన రెండు సందర్భాలు 1923, 1936 లో జరిగాయి.

ద్రవిడర్ కజగం పుట్టుక మార్చు

ప్రెసిడెన్సీలో కాంగ్రెస్‌కు ప్రధాన రాజకీయ ప్రత్యామ్నాయంగా ఉన్న జస్టిస్ పార్టీ 1937 ఎన్నికలలో ఓటమి తర్వాత రాజకీయ అజ్ఞాతం లోకి వెళ్లిపోయింది. 1937-40 నాటి హిందీ వ్యతిరేక ఆందోళనల సమయంలో, ఇది పెరియార్ EV రామసామికి, అతని ఆత్మగౌరవ ఉద్యమానికీ సన్నిహితంగా ఉంది. పెరియార్ చివరికి 1938 డిసెంబరు 29 న జస్టిస్ పార్టీ నాయకత్వం స్వీకరించాడు. 1944 ఆగష్టు 27 న దానికి ద్రావిడర్ కజగం (DK) అని పేరు మార్చారు.[7] పెరియార్ హయాంలో, ద్రవిడ నాడు కోసం వేర్పాటువాద డిమాండ్ దాని ప్రధాన రాజకీయ నినాదం అయింది. DK 1946 ఎన్నికలను బహిష్కరించింది. [8]

కమ్యూనిస్టుల భాగస్వామ్యం మార్చు

1942 లో కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (సిపిఐ)పై 1934 నుండి అమలులో ఉన్న నిషేధాన్ని ఎత్తివేసారు.[9] పిసి జోషి నాయకత్వంలో కమ్యూనిస్టులు 1946 ఎన్నికలలో పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. వారు 215 స్థానాల్లో 103 స్థానాల్లో పోటీ చేసి రెండు చోట్ల (రైల్వే ట్రేడ్ యూనియన్ నియోజకవర్గం, పశ్చిమ గోదావరి-కృష్ణా-గుంటూరు నాన్-యూనియన్ ఫ్యాక్టరీ లేబర్ నియోజకవర్గం) గెలిచారు. [10] [11]

నియోజకవర్గాలు మార్చు

1935 భారత ప్రభుత్వ చట్టం ప్రకారం మద్రాసు ప్రావిన్స్‌లో ద్విసభ శాసనసభను ఏర్పాటు చేసారు. శాసనసభలో గవర్నరు, రెండు శాసన సభలు - ఒక శాసన సభ, శాసన మండలి - ఉంటాయి. శాసనసభలో 215 మంది సభ్యులు ఉంటారు. వాటిని జనరల్ స్థానాలుగాను, ప్రత్యేక సంఘాలు, ప్రయోజనాల కోసమూ వర్గీకరించారు: [12][13]

జనరల్ షెడ్యూల్డ్ కులాలు మహమ్మదీయులు భారతీయ క్రైస్తవులు స్త్రీలు భూస్వాములు వాణిజ్యం, పరిశ్రమ లేబర్, ట్రేడ్ యూనియన్లు యూరోపియన్లు ఆంగ్లో ఇండియన్స్ విశ్వవిద్యాలయ వెనుకబడిన ప్రాంతాలు, తెగలు
116 30 28 8 8 6 6 6 3 2 1 1

ఆస్తి అర్హతల ఆధారంగా వోటుహక్కు ఇచ్చారు.[14] వివిధ రాజకీయ పార్టీల అభ్యర్థులకు వేర్వేరుగా బ్యాలెట్ బాక్సులను ఉంచారు. కాంగ్రెస్‌కు పసుపు రంగు పెట్టె కేటాయించగా, ముస్లిం లీగ్, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా లకు ఆకుపచ్చ, ఎరుపు రంగు పెట్టెలను కేటాయించారు. [15] [16]

ఫలితాలు మార్చు

1946 ఎన్నికల తర్వాత పార్టీల వారీగా సీట్ల విభజన: [17] [18] [19]

పార్టీ సీట్లు
భారత జాతీయ కాంగ్రెస్ 163
ఆల్-ఇండియా ముస్లిం లీగ్ 28
స్వతంత్ర పార్టీ 7
స్వతంత్రులు 6
యూరోపియన్లు 6
కమ్యూనిస్టులు 2
పోటీ చేయలేదు 2
మొత్తం 215

ప్రభుత్వ ఏర్పాటు మార్చు

1946 మార్చి 30న ఎన్నికలు ముగిశాయి. ఏప్రిల్ 29 న గవర్నర్ పాలన ముగియకముందే కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంది. కాంగ్రెస్ అత్యధిక మెజారిటీ సాధించినప్పటికీ, ప్రధాని అభ్యర్థి విషయంలో ఏకాభిప్రాయానికి రాలేకపోయింది. 1946 లో మద్రాసు ప్రెసిడెన్సీలో నాలుగు భాషా ప్రాంతాలుండేవి - తమిళనాడు, ఆంధ్ర, మైసూరు, కేరళ. మద్రాస్ కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీలోనూ (CLP) నాలుగు ప్రధాన విభాగాలుండేవి. అందులోని వర్గాలు ప్రాంతీయంగానూ ఉండేవి - తమిళం-ఆంధ్ర, తమిళం-కేరళీయులు, కర్ణాటక సభ్యులు; అలాగే కులపరంగానూ ఉండేవి- బ్రాహ్మణ -బ్రాహ్మణేతర. తమిళనాడు కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కామరాజ్ నేతృత్వంలో అరవై నుంచి డెబ్బై మంది బ్రాహ్మణేతర తమిళ సభ్యులతో అతిపెద్ద వర్గం ఉండేది. మిగిలిన తమిళ సభ్యులు తటస్థం గానో, రాజాజీకి మద్దతు గానో ఉన్నారు. రాజాజీకి పి. సుబ్బరాయన్ మద్దతు కూడా ఉంది. వారు తమను రిఫార్మ్ గ్రూప్ అని పిలుచుకునేవారు, వారిది ఒక ఇరవై, ముప్పై మంది గల సమూహం. 77 మంది సభ్యులతో కూడిన ఆంధ్ర వర్గం ప్రకాశం, భోగరాజు పట్టాభి సీతారామయ్య మద్దతుదారుల మధ్య చీలిపోయింది. సర్కారుల లోని బ్రాహ్మణేతరులు, రాయలసీమ లోని బ్రాహ్మణేతరులు వంటి చిన్న వర్గాలు కూడా ఉన్నాయి. CLPలో మలబార్, సౌత్ కెనరా/బళ్లారి నుండి పద్దెనిమిది మంది సభ్యులు కూడా ఉన్నారు. [20]

రాజాజీకి వ్యతిరేకత మార్చు

మహాత్మా గాంధీ, జాతీయ కాంగ్రెస్ నాయకత్వం మద్రాసు ప్రెసిడెన్సీకి రాజాజీని ప్రధానమంత్రిగా ఎన్నుకోవడాన్ని సమర్థించింది. క్విట్ ఇండియా ఉద్యమాన్ని వ్యతిరేకించిన నాయకులను తిరిగి చేర్చుకోని కాంగ్రెస్ విధానానికి ఇది విరుద్ధం. ఆంధ్రా, కేరళ, తమిళనాడుల లోని కాంగ్రెస్ కమిటీల ప్రావిన్షియల్ అధ్యక్షులైన ప్రకాశం, మాధవ మీనన్, కామరాజ్‌లను చర్చల కోసం న్యూఢిల్లీకి ఆహ్వానించారు. గాంధీ జోక్యం ఉన్నప్పటికీ, రాజాజీ వర్గం 38 -148 ఓట్ల తేడాతో ఓడిపోయింది.[20][21]

టి. ప్రకాశం మార్చు

కామరాజ్, కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు K. మాధవ మీనన్ లు ప్రధాన మంత్రి పదవికి CN ముత్తురంగ ముదలియార్‌కు మద్దతు ఇచ్చారు. ప్రకాశం అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించారు. తదుపరి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆంధ్రాకు చెందిన సభ్యుడు నాయకత్వం వహించాలని కాంగ్రెస్ సభ్యులు 1937 లో ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆ ఒప్పందం నేపథ్యంలో రాజాజీ, రిఫార్మ్ గ్రూప్ లు తటస్థతను పాటించాయి. దీంతో ప్రకాశం పంతులు 69 కి 82 ఓట్ల తేడాతో ఎన్నికయ్యాడు. మాధవ మీనన్‌ను మంత్రివర్గంలోకి తీసుకోవడంతో పాటు పలు అంశాలపై ప్రకాశం, కామరాజ్‌ల మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తాయి. అతన్ని చేర్చుకోవడాన్ని కామరాజ్ సమర్థించాడు. ప్రకాశం రాజాజీ అనుకూల వర్గానికి చెందిన రాఘవ మీనన్‌ను చేర్చుకోడానికి సుముఖంగా ఉన్నాడు. ప్రకాశం టెక్స్‌టైల్ మిల్లు విధానాల పట్ల, మద్యనిషేధాన్ని నెమ్మదిగా అమలు చేయడం పట్ల అసంతృప్తి అతని పతనానికి దారితీసింది. ప్రకాశం 1947 మార్చి 14న తన రాజీనామా సమర్పించాడు. రిఫార్మ్ గ్రూప్ ప్రకాశం ఇతర ప్రత్యర్థులతో పొత్తు పెట్టుకుని అతని ప్రభుత్వానికి వ్యతిరేకంగా వోటువేసింది.[20] [22]

T. ప్రకాశం మంత్రివర్గం మార్చు

టి. ప్రకాశం మంత్రి మండలి (1946 మే 1 – 1947 మార్చి 23) [23]

మంత్రి పోర్ట్‌ఫోలియో
టి. ప్రకాశం ప్రధాన మంత్రి, పబ్లిక్, హోమ్, పోలీస్, ఫుడ్, ఫైనాన్స్
వివి గిరి పరిశ్రమలు, కార్మిక, విద్యుత్, సహకారం, ప్రణాళిక, అటవీ
ఎం. భక్తవత్సలం పబ్లిక్ వర్క్స్, ఇరిగేషన్, హైవేలు
TS అవినాశిలింగం చెట్టియార్ చదువు
కెటి బాష్యం (బాష్యం అయ్యంగార్) చట్టం, న్యాయస్థానాలు, జైళ్లు, శాసనసభ
PS కుమారస్వామి రాజా అభివృద్ధి, వ్యవసాయం, పశువులు, చేపల పెంపకం
డేనియల్ థామస్ స్థానిక పరిపాలన
రుక్మిణి లక్ష్మీపతి పబ్లిక్ హెల్త్ అండ్ మెడికల్
KR కారంత్ భూ ఆదాయం
కె. కోటి రెడ్డి హిందూ మతపరమైన దానం,, రెవెన్యూ (భూ ఆదాయం కాకుండా)
వేముల కూర్మయ్య పబ్లిక్ సమాచారం
బిక్కిన వీరాస్వామి ఫారెస్ట్, సింకోనా, ఫిషరీస్, విలేజ్ ఇండస్ట్రీస్ (1946 జూన్ 18 - 1947 ఫిబ్రవరి 03)
ఆర్.రాఘవ మీనన్ గృహ నియంత్రణ, మోటారు రవాణా, ఆహారం
బిక్కిన వెంకటరత్నం ఫారెస్ట్, సింకోనా, ఫిషరీస్, విలేజ్ ఇండస్ట్రీస్ (1947 ఫిబ్రవరి 06 - 1947 మార్చి 23)
మార్పులు

1947 జనవరి 15న అనారోగ్యం కారణంగా బిక్కిన వీరాస్వామి మంత్రి పదవికి రాజీనామా చేశారు.

అటవీ శాఖ మంత్రి బిక్కిన వీరాస్వామి అనారోగ్య కారణాల వల్ల మంత్రి పదవికి రాజీనామా చేయగా, ఆయన స్థానంలో బిక్కిన వెంకటరత్నం అటవీ, సింకోనా, మత్స్య, గ్రామ పరిశ్రమల శాఖ మంత్రిగా చోటు దక్కించుకున్నాడు.


ఓమండూరు రామస్వామి రెడ్డియార్ మార్చు

1947 మార్చి 21 న , కామరాజు, ప్రకాశం వ్యతిరేక వర్గం కూటమిల మద్దతుతో ఓమండూరు రామస్వామి రెడ్డియార్‌ను ప్రధానమంత్రిగా ఎన్నుకయ్యాడు. 1948 లో ప్రకాశం, మళ్లీ ఎన్నికలను కోరుతూ రెడ్డియార్‌పై పోటీకి నిలబడ్డాడు. కామరాజ్‌తో పాటు, ఎన్. సంజీవ రెడ్డి, కళా వెంకటరావు వంటి ఇతర ప్రముఖ ఆంధ్ర సభ్యులు రెడ్డీయార్‌కు మద్దతు ఇచ్చారు. ప్రకాశం 84 - 112 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.[22] తన పరిపాలనలో కామరాజు జోక్యంతో రెడ్డియార్ క్రమంగా అసంతృప్తి చెందాడు. స్వేచ్ఛ కోసం అతను సంకేతాలను చూపించినప్పుడు, కామరాజ్ 1949 మార్చి 31 న కామరాజ్, CLPలో అవిశ్వాస తీర్మానం ద్వారా అతనిని తొలగించాడు.[20] [21]

ఒమండూర్ మంత్రివర్గం మార్చు

ఓమండూరు రామసామి రెడ్డియార్ మంత్రి మండలి (1947 మార్చి 24 – 1949 ఏప్రిల్ 6) [23]

మంత్రి పోర్ట్‌ఫోలియో
ఓమండూరు రామస్వామి రెడ్డియార్ ప్రధాన మంత్రి, ప్రజా, హిందూ మతపరమైన దానం, హరిజన ఉద్ధరణ
ఎం. భక్తవత్సలం పబ్లిక్ వర్క్స్, ప్లానింగ్
పి. సుబ్బరాయన్ ఇల్లు, చట్టపరమైన (లా అండ్ ఆర్డర్)
TSS రాజన్ ఆహారం, మోటారు రవాణా, కార్మికులు
TS అవినాశిలింగం చెట్టియార్ చదువు
డేనియల్ థామస్ నిషేధం, ఎక్సైజ్, రిజిస్ట్రేషన్, హౌసింగ్
వేముల కూర్మయ్య హరిజన ఉద్ధరణ, మత్స్య పరిశ్రమ, గ్రామీణాభివృద్ధి
హెచ్ సీతారామ రెడ్డి పరిశ్రమలు, సమాచారం
కె. చంద్రమౌళి స్థానిక పరిపాలన, సహకార
కె. మాధవ మీనన్ వ్యవసాయం, అటవీ
కళా వెంకటరావు రాబడి
ఎబి శెట్టి ప్రజారోగ్యం
S. గురుబాతం ఖాదీ, ఫిర్కా అభివృద్ధి, కుటీర పరిశ్రమలు
మార్పులు

1948 ఏప్రిల్ 5న సుబ్బరాయన్, 1948 జూన్ 15 న డేనియల్ థామస్, 1949 జనవరి 24 న కళా వెంకటరావులు రాజీనామా చేశారు.

PS కుమారస్వామి రాజా మార్చు

1949 ఏప్రిల్ 6న ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తదుపరి ప్రధానమంత్రి (1950 జనవరి 26 నుండి "ముఖ్యమంత్రి") పిఎస్ కుమారస్వామి రాజాను కామరాజుకు తొత్తుగా భావించారు. అతని ఎన్నికను పి. సుబ్బరాయన్, రాజాజీ, ప్రకాశంలు వ్యతిరేకించారు.[22] 1952 ఎన్నికలలో శ్రీవిల్లిపుత్తూరు నియోజకవర్గంలో తన స్థానాన్ని కోల్పోయే వరకు కుమారస్వామి రాజా మద్రాసును పాలించాడు. [24]

కుమారస్వామి రాజా మంత్రివర్గం మార్చు

కుమారస్వామి రాజా మంత్రి మండలి (1949 ఏప్రిల్ 7 - 1952 ఏప్రిల్ 9) [23]

మంత్రి పోర్ట్‌ఫోలియో
PS కుమారస్వామి రాజా పబ్లిక్, పోలీసులు
TSS రాజన్ ఆరోగ్యం, మతపరమైన ఎండోమెంట్, మాజీ-సేవా సిబ్బంది పునరావాసం
ఎం. భక్తవత్సలం పబ్లిక్ వర్క్స్, సమాచారం
హెచ్ సీతారామ రెడ్డి ల్యాండ్ రెవెన్యూ, లేబర్, ప్లానింగ్ అండ్ డెవలప్‌మెంట్
కె. చంద్రమౌళి స్థానిక పరిపాలన, సహకారం
బెజవాడ గోపాల రెడ్డి ఆర్థిక, వాణిజ్య పన్నులు
కె. మాధవ మీనన్ విద్య, కోర్టులు, జైళ్లు
కళా వెంకటరావు ఆరోగ్యం
ఎబి శెట్టి వ్యవసాయం, పశువైద్యం
బి. పరమేశ్వరన్ ఫిర్కా అభివృద్ధి, ఖాదీ, కుటీర పరిశ్రమలు, మత్స్య పరిశ్రమ, సింకోనా, హరిజన ఉద్ధరణ
సి.పెరుమాళ్స్వామి రెడ్డియార్ పరిశ్రమలు, గనులు, ఖనిజాలు
JLP రోచె విక్టోరియా ఆహారం, చేపల పెంపకం
నీలం సంజీవ రెడ్డి నిషేధం, హౌసింగ్
మార్పులు

సంజీవ రెడ్డి 1951 ఏప్రిల్ 10న రాజీనామా చేశాడు. రోచె విక్టోరియా 1949 జూన్ 2న, కళా వెంకటరావు 1951 సెప్టెంబర్ 26న మంత్రి అయ్యారు. 1952 ఎన్నికల ఫలితాలు వెలువడినప్పుడు 1952 ఫిబ్రవరి 8న కొందరు మంత్రులు రాజీనామా చేశారు. కుమారస్వామి రాజా, రాజన్, రెడ్డియార్, పరమేశ్వరన్, సీతారామ రెడ్డి, ఎబి శెట్టి ఏప్రిల్ 10 న తదుపరి మంత్రివర్గం ఏర్పడే వరకు తాత్కాలిక మంత్రులుగా కొనసాగారు.

ప్రభావం మార్చు

1946 ఎన్నికల ద్వారా ఏర్పడిన ప్రావిన్షియల్ లెజిస్లేచర్లు 1946 డిసెంబరులో భారత రాజ్యాంగ సభకు సభ్యులను (తమ స్వంత సభ్యుల నుండి) ఎన్నుకున్నాయి. రాజ్యాంగ సభ భారత రిపబ్లిక్ రాజ్యాంగాన్ని రూపొందించింది. 1947 ఆగస్టు 15 న భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత భారతదేశపు మొదటి పార్లమెంట్‌గా కూడా అది పనిచేసింది. మద్రాసు శాసనసభలోని ఉభయ సభలలో కాంగ్రెస్‌కు అత్యధిక మెజారిటీ ఉన్నందున అది పెద్ద సంఖ్యలో తన సభ్యులను అసెంబ్లీకి పంపగలిగింది.[25]

మద్రాసు ప్రెసిడెన్సీ నుండి రాజ్యాంగ సభ సభ్యుల జాబితా: [26]

సం. పేరు. పార్టీ లేదు. పేరు. పార్టీ
1 ఓ. వి. అళగేసన్ కాంగ్రెస్ 26 టి. ప్రకాశం కాంగ్రెస్
2 అమ్ము స్వామినాథన్ కాంగ్రెస్ 27 స్టాన్లీ హెన్రీ ప్రేటర్ ఆంగ్లో-ఇండియన్, డొమిసిల్డ్ యూరోపియన్ అసోసియేషన్
3 మదభుషి అనంతశయనమ్ అయ్యంగార్ కాంగ్రెస్ 28 బొబ్బిలి రాజు
4 మోటురి సత్యనారాయణ్ కాంగ్రెస్ 29 ఆర్. కె. షణ్ముఖం చెట్టి కాంగ్రెస్
5 దక్షాయణి వేలాయుధన్ కాంగ్రెస్ 30 టి. ఎ. రామలింగం చెట్టియార్ కాంగ్రెస్
6 జి. దుర్గాబాయి కాంగ్రెస్ 31 రామ్నాథ్ గోయెంకా కాంగ్రెస్
7 కళా వెంకట రావు కాంగ్రెస్ 32 ఒ. పి. రామస్వామి రెడ్డి కాంగ్రెస్
8 ఎన్. గోపాలస్వామి అయ్యంగార్ కాంగ్రెస్ 33 ఎన్. జి. రంగా కాంగ్రెస్
9 డి. గోవింద దాస్ కాంగ్రెస్ 34 నీలం సంజీవ రెడ్డి కాంగ్రెస్
10 జెరోమ్ డిసౌజా కాంగ్రెస్ 35 కె. సంతానం కాంగ్రెస్
11 పి. కక్కన్ కాంగ్రెస్ 36 బి. శివరావు కాంగ్రెస్
12 కె. కామరాజ్ కాంగ్రెస్ 37 కల్లూర్ సుబ్బారావు కాంగ్రెస్
13 వి. సి. కేశవ రావు కాంగ్రెస్ 38 ఉల్లాల్ శ్రీనివాస్ మాల్యా కాంగ్రెస్
14 టి. టి. కృష్ణమాచారి కాంగ్రెస్ 39 పి. సుబ్బరాయన్ కాంగ్రెస్
15 అల్లాది కృష్ణస్వామి అయ్యర్ కాంగ్రెస్ 40 సి. సుబ్రమణ్యం కాంగ్రెస్
16 ఎల్. కృష్ణస్వామి భారతి కాంగ్రెస్ 41 వి. సుబ్రమణ్యం కాంగ్రెస్
17 పి. కున్హీరామన్ నాయర్ కాంగ్రెస్ 42 ఎం. సి. వీరబాహు పిళ్ళై కాంగ్రెస్
18 ఎం. తిరుమల రావు కాంగ్రెస్ 43 పి. ఎమ్. వేలాయుధపాణి కాంగ్రెస్
19 వి. ఐ. మునిస్వామి పిళ్ళై కాంగ్రెస్ 44 ఎ. కె. మీనన్ కాంగ్రెస్
20 ఎం. ఎ. ముత్తయ్య చెట్టియార్ 45 టి. జె. ఎమ్. విల్సన్ కాంగ్రెస్
21 వి. నదీముత్తు పిళ్ళై కాంగ్రెస్ 46 మహ్మద్ ఇస్మాయిల్ ఆల్ ఇండియా ముస్లిం లీగ్
22 ఎస్. నాగప్ప కాంగ్రెస్ 47 కె. టి. ఎమ్. అహ్మద్ ఇబ్రహీం ఆల్ ఇండియా ముస్లిం లీగ్
23 పి. ఎల్. నరసింహారాజు కాంగ్రెస్ 48 మహబూబ్ అలీ బేగ్ ఆల్ ఇండియా ముస్లిం లీగ్
24 భోగరాజు పట్టాభి సీతారామయ్య కాంగ్రెస్ 49 బి. పోకర్ ఆల్ ఇండియా ముస్లిం లీగ్
25 సి. పెరుమాళ్ స్వామి రెడ్డి కాంగ్రెస్

ఇవి కూడా చూడండి మార్చు

మూలాలు మార్చు

  1. INDIA (FAILURE OF CONSTITUTIONAL MACHINERY) HC Deb 16 April 1946 vol 421 cc2586-92
  2. Ralhan, Om Prakash (1045). Encyclopaedia Of Political Parties, Volumes 33-50. Anmol Publications. p. 13. ISBN 978-81-7488-865-5.
  3. Baker, Christopher (1976), "The Congress at the 1937 Elections in Madras", Modern Asian Studies, vol. 10, no. 4, pp. 557–589, doi:10.1017/s0026749x00014967, JSTOR 311763
  4. Chaurasia, Radhey Shyam (2002). History of Modern India, 1707 A. D. to 2000 A. D. Atlantic Publishers. p. 388. ISBN 978-81-269-0085-5.
  5. Mansergh, Nicholas (1968). Survey of British Commonwealth Affairs: Problems of Wartime Cooperation and Post-War Change 1939-1952. Routledge. p. 299. ISBN 978-0-7146-1496-0.
  6. Saroja Sundararajan (1989). March to freedom in Madras Presidency, 1916-1947. Madras : Lalitha Publications. pp. 623–636.
  7. Kandasamy, W. B. Vasantha; Smarandache, Florentin (2005). Fuzzy and Neutrosophic Analysis of Periyar's Views on Untouchability. American Research Press. p. 109. ISBN 978-1-931233-00-2. OCLC 125408444.
  8. "Periyar - A Biographical sketch". Archived from the original on 9 February 2012. Retrieved 29 December 2009.
  9. Brown, William Norman (1972). The United States and India, Pakistan, Bangladesh. Harvard University Press. pp. 289. ISBN 9780674924468. https://books.google.com/books?id=vHcBAAAAMAAJ.
  10. Palanithurai, Ganapathy (1994). Caste, politics, and society in Tamilnadu. Kanishka Publishers Distributors. p. 56. ISBN 978-81-7391-013-5.
  11. Kurup, K. K. N. (1989). Agrarian struggles in Kerala. CBH Publications. p. 13. ISBN 978-81-85381-01-5.
  12. Baker, Christopher (1976), "The Congress at the 1937 Elections in Madras", Modern Asian Studies, vol. 10, no. 4, pp. 557–589, doi:10.1017/s0026749x00014967, JSTOR 311763
  13. The State Legislature - Origin and Evolution:Brief History Before independence Archived 2010-04-13 at the Wayback Machine
  14. Low, David Anthony (1993). Eclipse of empire. Cambridge University Press. p. 154. ISBN 978-0-521-45754-5.
  15. Ramakrishnan, S. V. "தேர்தல் - 1946 "மஞ்சள் பெட்டிக்கே உங்கள் ஓட்டு"". Uyirmmai (in తమిళము). Archived from the original on 6 October 2011. Retrieved 30 May 2010.
  16. Bandyopādhyāẏa, Śekhara (2004). From Plassey to partition: a history of modern India. Orient Blackswan. p. 322. ISBN 978-81-250-2596-2.
  17. Saroja Sundararajan (1989). March to freedom in Madras Presidency, 1916-1947. Madras : Lalitha Publications. pp. 623–636.
  18. Kurup, K. K. N (1989). Agrarian struggles in Kerala. CBH Publications. p. 13. ISBN 978-81-85381-01-5.
  19. Dash, Shreeram Chandra (1968). The Constitution of India; a comparative study. Chaitanya Pub. House. p. 532.
  20. 20.0 20.1 20.2 20.3 James Walch. Faction and front: Party systems in South India. Young Asia Publications. pp. 157–160.
  21. 21.0 21.1 Forrester, Duncan B.. "Kamaraj: A Study in Percolation of Style".
  22. 22.0 22.1 22.2 P. Kandaswamy (2001). The political career of K. Kamraj. New Delhi: Concept publishing company. p. 50. OL 6874248M.
  23. 23.0 23.1 23.2 Justice Party golden jubilee souvenir, 1968. Justice Party. 1968. pp. 50–65.
  24. I. N. Tewary (1999). Political system: a micro perspective. New Delhi: Anmol Publications PVT. LTD. p. 13.
  25. Some Facts of Constituent Assembly
  26. Members of the Constituent Assembly