కోరుకంటి చందర్

శాసనసభ సభ్యుడు

కోరుకంటి చందర్ పటేల్ (జననం: సెప్టెంబర్ 23, 1972 ) తెలంగాణ ఉద్యమకారుడు, రామగుండం నియోజకవర్గ శాసనసభ్యుడు. 2018 తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో ఆల్ ఇండియా ఫార్వార్డ్‌ బ్లాక్‌ పార్టీ టిక్కెట్ పై పోటీచేసి తన సమీప టిఆర్ఎస్ అభ్యర్థి సోమారపు సత్యనారాయణ పై 26,090 ఓట్ల అధిక్యంతో గెలుపొందాడు. మలిదశ ఉద్యమంలో భాగంగా తెలంగాణ సాధన పాదయాత్ర పేరుతొ 48 కి.మీ . పాదయాత్ర చేశాడు. ఇతను ఉద్యమంలో భాగంగా 45 రోజులు జైలు జీవితం గడిపాడు. కోరుకంటి చందర్ 2022 జనవరి 26న తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడిగా నియమితుడయ్యాడు.[2][3]

కోరుకంటి చందర్
కోరుకంటి చందర్

కోరుకంటి చందర్


పదవీ కాలం
11 డిసెంబర్ 2018 - 2023 డిసెంబర్ 03
ముందు సోమారపు సత్యనారాయణ
తరువాత మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్
నియోజకవర్గం రామగుండం శాసనసభ నియోజకవర్గం[1]

పదవీ కాలం
26 జనవరి 2022 - ప్రస్తుతం

వ్యక్తిగత వివరాలు

జననం సెప్టెంబర్ 23, 1972
పట్టణం: గోదావరిఖని, మండలం: రామగుండం, జిల్లా:పెద్దపల్లి తెలంగాణ
రాజకీయ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి
జీవిత భాగస్వామి విజయ
సంతానం ఉజ్వల, మణిదీప్
నివాసం పట్టణం: 17-5-225/1, చంద్రశేఖర్ నగర్, గోదావరిఖని, మండలం: రామగుండం, జిల్లా:పెద్దపల్లి తెలంగాణ
మతం హిందూమతము

బాల్యం, విద్యాబ్యాసం మార్చు

కోరుకంటి చందర్ 1972 సెప్టెంబర్ 23 న మల్లయ్య, లక్ష్మీ దంపతులకు రెండో సంతానంగా జన్మించాడు.[4] కాకతీయ యూనివర్సిటీలో ఎంఏ పొలిటికల్ సైన్స్ పూర్తి చేశాడు.

కుటుంబం మార్చు

ఈయనకు 1994లో విజయతో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉజ్వల, మనిదీప్.[5]

జీవిత ప్రస్థానం మార్చు

తెలుగుదేశం పార్టీ 1993-97 వరకు గోదావరిఖని పట్టణానికి 1997-99 వరకు రామగుండం ప్రాంతానికి తెలుగు యువత తరపున ప్రధాన కార్యదర్శిగా, కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించాడు. 2001లో కొప్పుల ఈశ్వర్ అధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరిన తర్వాత రామగుండం శాసనసభ నియోజకవర్గంకు ఉద్యమ సారథిగా వ్యవహరించాడు. 2002లో టీఆర్ఎస్వై సంయుక్త కార్యదర్శిగా, మంచిర్యాల శాసనసభ నియోజకవర్గం టీఆర్ఎస్వై జనరల్ సెక్రటరీ చేసాడు. 2009 మహాకూటమిలో భాగంగా రామగుండం నుంచి ఎమ్మెల్యేగా పోటీచేసి ఓడిపోయాడు. 2014 ఎన్నికలలో పోటీచేసి 2260 ఓట్ల స్వల్ప ఆధిక్యంతో సోమారపు సత్యనారాయణ పై ఓడిపోయాడు. తెలంగాణ శాసనసభ ఎన్నికలు (2018)లో తన సమీప అభ్యర్థి సోమారపు సత్యనారాయణపై పోటీచేసి 26,090 ఓట్ల అధిక్యంతో గెలుపొందాడు.[6][7] ఈ నియోజకవర్గంలో మొత్తం 1,35,678 ఓట్లు పోలవగా కోరుకంటి చందర్ కు 60,444 ఓట్లు, టీఆర్ఎస్ అభ్యర్థి సోమారపు సత్యనారాయణకు 34,354 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి మక్కాన్‌సింగ్ ఠాకూర్‌కు 26,614 ఓట్లు పోలయ్యాయి. ఆయన 2018లో శాసనసభలో పబ్లిక్ అండర్ టేకింగ్స్ కమిటీ సభ్యుడిగా ఉన్నాడు.[8]

కార్యక్రమాలు మార్చు

  • 2009 - పల్లె నిద్ర - బస్తీ నిద్ర అనే కార్యక్రమాన్ని 6రోజుల పాటు నిర్వహించారు.
 
వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ ప్రశంసా పత్రము బహుకరణం
  • 2009 - తెలంగాణ ఉద్యమ సమయంలో విద్యార్థి మేలుకో - తెలంగాణ ఏలుకో
  • 2011 - వందరోజుల నిరాహరదీక్ష నిర్వహించారు.
  • 2012 - తెలంగాణ సాధన పాదయాత్ర పేరుతో కుక్కలగూడురు నుంచి కాలని వరకు 48కి.మీ. వందమందితో పాదయాత్ర నిర్వహించారు.
  • 2017 - ప్రపంచ జానపద రోజుని పురస్కరించుకొని తెలంగాణ జానపద కళా ఉత్సవం పేరిట వంద మంది కళాకారులతో వంద నిమిషాలు నిరాటకంగా నిర్వహించి వండర్ బుక్ ఆఫ్ రికార్డుని నెలకొల్పారు.
  • 2017 - అభినందన సత్కార సభ పేరిట వంద మంది ఉద్యమకారులను, ఆత్మీయ సత్కారం పేరిట 2009 మంది ఉద్యమకారులను సత్కరించారు.

ఇవి కూడా చూడండి మార్చు

మూలాలు మార్చు

  1. Desk, The Hindu Net (2018-12-11). "Telangana Assembly elections 2018: Rebel candidate K. Chander Patel snatches victory from TRS in Ramagundam". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 23 September 2019.
  2. Namasthe Telangana (26 January 2022). "టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షులు వీరే.. ప్రకటించిన సీఎం కేసీఆర్‌". Archived from the original on 26 జనవరి 2022. Retrieved 26 January 2022.
  3. Andhrajyothy (27 January 2022). "నిరీక్షణకు తెర". Archived from the original on 27 జనవరి 2022. Retrieved 27 January 2022.
  4. Sakshi (4 November 2023). "చట్టసభల్లో నల్ల సూరీళ్లు". Archived from the original on 11 November 2023. Retrieved 11 November 2023.
  5. Sakshi (12 May 2019). "ప్రజాసేవలో 'విజయ'ను చూస్తున్నా: ఎమ్మెల్యే చందర్‌". Sakshi. Archived from the original on 14 July 2021. Retrieved 14 July 2021.
  6. "Ramagundam Election Result 2018 Live Updates: Korukanti Chandar Patel of AIFB Wins". News18. Retrieved 23 September 2019.
  7. Sakshi (13 December 2018). "90కి చేరిన టీఆర్‌ఎస్‌ బలం". Archived from the original on 14 July 2021. Retrieved 14 July 2021.
  8. Sakshi (22 September 2019). "తెలంగాణ పీఏసీ చైర్మన్‌గా అక్బరుద్దీన్ ఒవైసీ". Archived from the original on 15 July 2021. Retrieved 15 July 2021.