భీమవరపు నరసింహారావు

భీమవరపు నరసింహరావు (జనవరి 24, 1905 - సెప్టెంబర్ 7, 1976) తెలుగు సినిమా సంగీత దర్శకులు. ఈయన బి.ఎన్.ఆర్.గా అందరికి సుపరిచితుడు. ఈయన 8 సంత్సరాల వయసులోనే సంగీత కళ మొగ్గ తొడగడం మొదలైంది. ఈయనకు నాటకాల్లో నటించడం అన్నా, పాటలు పాడటం అన్నా చాలా మక్కువ. ఇతను ఏ గురుశుశ్రూష చేయలేదు. హార్మోనియం కూడా తనే స్వయంగా నేర్చుకొని అందులో ప్రావీణ్యం సంపాదించగలిగాడు. తెనాలిలోని శ్రీరామ విలాస సభ నాటకసంస్థలోసంగీత దర్శకుడిగా పనిచేశాడు.[1]ఈయన ధూమపాన ప్రియుడు. కేవలం సిగరెట్ల సంపాదన కోసం హార్మోనిస్ట్ గా థియేటర్ లో పనిచేయడం మొదలుపెట్టాడు.[ఆధారం చూపాలి]

భీమవరపు నరసింహారావు
జననంజనవరి 24, 1905
కొలకలూరు, గుంటూరు జిల్లా
మరణంసెప్టెంబర్ 7, 1976
వృత్తిసంగీత దర్శకుడు
పిల్లలుఇద్దరు; కొడుకు, కూతురు
తండ్రిపుండరీకాక్ష శర్మ
తల్లికోటమ్మ

జీవనసరాగాలు మార్చు

  • పుట్టిన తేది : 1905 జనవరి 24
  • జన్మస్థలం : గుంటూరు జిల్లా తెనాలి సమీపంలో కొలకలూరు.
  • తల్లిదండ్రులు : కోటమ్మ, పుండారీకాక్ష శర్మ
  • విద్యార్హత : ఎస్.ఎస్.ఎల్.సి
  • తోబుట్టువులు :
    • అన్నయ్యలు - పూర్ణయ్య, రామచంద్రరావు
    • నలుగురు సోదరులు
  • సంతానం :
    • కొడుకు - బి.వెంకటేశ్వరరావు
    • కూతురు - డాక్టర్ లీలావతి
  • మొదటి సినిమా : సతీ తులసి (1936)
  • ఆఖరి చిత్రం : అర్ధాంగి (1955)
  • మరణం : 7 సెప్టంబర్ 1976.

చిత్రసమాహారం మార్చు

మూలాలు మార్చు

  1. నాటక సమాజ దిక్సూచి శ్రీరామ విలాస సభ, (నాటకం-అమరావతీయం), డా. కందిమళ్ళ సాంబశివరావు, ఆంధ్రజ్యోతి, గుంటూరు ఎడిషన్, 23 జనవరి 2017, పుట.14

బయటి లింకులు మార్చు