పకిడె అరవింద్

(అరవింద్ ఆర్య పకిడె నుండి దారిమార్పు చెందింది)

అర‌వింద్ ఆర్య ప‌కిడె, తెలంగాణ రాష్ట్రానికి చెందిన యువ చరిత్రకారుడు.[1][2][3]అరవింద్ స్వస్థలం జనగామ జిల్లా, రఘునాథపల్లి మండలానికి చెందిన కంచ‌న‌ప‌ల్లి అనే మారుమూల గ్రామం.[4] 1995 మార్చి 15 న లీల, సత్యనారాయణ దంపతులకు మొదటి సంతానంగా జన్మించాడు. తల్లిదండ్రులిద్దరూ వ్యవసాయదారులు. అరవింద్ కు ఒక తమ్ముడున్నాడు. వారిది సాధారణ మధ్య తరగతి కుటుంబం.

పకిడె అరవింద్ ఆర్య
పకిడె అరవింద్ చిత్రం
జననం15 మార్చి 1995
వృత్తిచరిత్రకారుడు
సుపరిచితుడు/
సుపరిచితురాలు
యువ చరిత్రకారుడు
తల్లిదండ్రులు
  • సత్యనారాయణ (తండ్రి)
  • లీల (తల్లి)
బంధువులుఆదిత్య పకిడే (సోదరుడు)

బాల్యం, విద్యాభ్యాసం మార్చు

అర‌వింద్ బాల్యమంతా కంచనపల్లిలోనే గడిచింది. కంచనపల్లిలోని జేసుతిరు హృదయ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి దాకా చదివాడు. ఐదవ తరగతి చదువుతున్న కాలంలో పద్మ, అల్లం అనిల్ రెడ్డిల సోషల్ స్టడీస్ బోధన వల్ల అరవింద్ కు సోషల్ సబ్జెక్ట్ మీద ఇష్టం, ఆసక్తి ఏర్పడ్డాయి. ఎనిమిదవ తరగతి చదువుతున్నప్పటి నుండి గ్రంథాలయానికి వెళ్ళడం, పుస్తకాలు బాగా చదవటం అతనికి అలవాటయ్యింది. 2005 నుండి పత్రికా పఠనం కూడా అలవడింది.

పదవ తరగతి తర్వాత హన్మకొండలోని ఏకశిలా జూనియర్ కాలేజిలో ఎం. పి.సి. కోర్సులో చేరాడు. అరవింద్ కు చిన్న‌ప్ప‌టి నుంచి పురాత‌న క‌ట్ట‌డాలు, చారిత్ర‌క ప్ర‌దేశాలు అంటే ఎంత‌గానో ఇష్టం. ఈ క్ర‌మంలోనే అర‌వింద్ ఇంట‌ర్మీడియ‌ట్ చ‌దువుతున్న‌ కాలంలో వరంగల్ జిల్లాలోని చారిత్రక ప్రాంతాల‌కు తరచుగా వెళ్తూ ఉండేవాడు. దీంతో వాటిపై అత‌నికి ఇంకా ఆస‌క్తి క‌లిగింది. ఆ ఆసక్తే తర్వాత తర్వాత పరిశోధనగా మారింది. అందులో భాగంగానే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పురాత‌న క‌ట్ట‌డాలు, చారిత్ర‌క ప్ర‌దేశాల గురించి తెలుసుకోవ‌డం మొద‌లు పెట్టాడు.

ఇంటర్మీడియట్ తర్వాత అరవింద్ డిగ్రీ చేయదలచి హన్మకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్సు కళాశాలలో బి.ఎ. (జర్నలిజం) కోర్సులో చేరాడు.జర్నలిజం కోర్సులో మెళకువలు నేర్చుకుని తన పరిశోధనలను ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా జనప్రాచుర్యంలోకి తీసురావడం మొదలుపెట్టాడు.

చరిత్రకారుడిగా చేసిన కృషి మార్చు

వ‌రంగల్‌లో ఉన్న అత్యంత పురాత‌న చారిత్రక ప్రదేశాల గురించి తెలిసిన అతి త‌క్కువ మందిలో అర‌వింద్ ఒక‌డు. ప్రాచీన దేవాలయాలు, చెరువులను సందర్శించి అక్కడ లభించిన శాసనాలను గమనించి, విలువైన సమాచారాన్ని సేకరించాడు. అప్పటి నుండే పురావస్తు శాస్త్రవేత్తలు, చరిత్రకారులు అరవింద్‌కు పరిచయమయ్యారు. తన పరిశోధనా క్రమంలోనే క్రమక్రమంగా అర‌వింద్ జనప్రాచుర్యంలో లేని100కు పైగా పురాతన క‌ట్ట‌డాల‌ను, చారిత్ర‌క ప్ర‌దేశాల‌ను గుర్తించాడు.[5] అర‌వింద్ అలా చారిత్ర‌క క‌ట్ట‌డాలు, ప్ర‌దేశాల‌ను గుర్తించేందుకు ఎన్నోపుస్తకాల, కొంత మంది ఆర్కియాల‌జిస్టుల, ఇంటర్నెట్ సహాయం తీసుకునేవాడు.

జ‌య‌శంక‌ర్ జిల్లా మంగ‌పేట మండ‌లం మ‌ల్లూరు కొండ‌ప్రాంతంలో అర‌వింద్ 8 కి.మీ. పొడవున్న ఓ పురాత‌న గోడ‌ను కూడా క‌నుగొన్నాడు. 2016లో పూర్వపు వరంగల్ పట్టణ జిల్లా, శివనగర్ ప్రాంతంలో మరుగున పడిపోయిన ఓ కాకతీయుల కాలంనాటి అంతస్తుల మెట్లబావిని గుర్తించి వెలుగులోకి తీసుకొచ్చాడు. అరవింద్‌ కృషిని చూసి జిల్లా కలెక్టర్‌ కాట ఆమ్రపాలి సహకారాన్ని అందించారు. ఆ సహకారంతో ఆ బావిని పునరుద్ధరించి, పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దడంలో విశేష కృషిచేసాడు. వరంగల్‌ ప్రాంతంలో ఏడు కోటలు ఉన్నాయనే విషయాన్ని ప్రపంచానికి వెల్లడించాడు.ఇలాంటి క‌ట్ట‌డాలు, ప్ర‌దేశాలు ఇంకా ఎన్నింటినో అర‌వింద్ గుర్తించి వెలుగులోకి తీసుకొచ్చాడు.[6]

ఉమ్మడి వరంగల్ జిల్లాలో వివిధ ప్రాంతాలలో ఉన్న చారిత్రక ప్రాధాన్యత కలిగిన విగ్రహాలను, వస్తు విశేషాలను హైదరాబాద్ వరంగల్ మ్యూజియాలకి తరలించే విధంగా కృషి చేయడం జరిగింది. ఇప్పటివరకు పరిష్కరించబడని రెడ్లవాడ, శాయంపేట హవేలి, గుడి తండా, నరసింహస్వామి దేవాలయం శాసనాలను enstampage చేసి వాటిని పరిష్కరించి ప్రచురించేలా కృషి చేయడం జరిగింది.

దేవునిగుట్ట ఆలయం అనే పురావస్తు కట్టడం గురించి రాసిన కథనాలు అనేక విదేశీ పురావస్తు శాస్త్రవేత్తలను ఆకర్షించి వారు భారతదేశం వచ్చి ఆ కట్టడాన్ని సందర్శించి వారు కూడా పరిశోధనలు చేసేలా పురికొల్పాయి. పలువురు విదేశీ పురాతత్వ శాస్త్రవేత్తలతో కలిసి ఆ కట్టడాన్ని పదుల సార్లు సందర్శించి పరిశోధనలు చేయడం జరిగింది.

  • అమెరికాలో ని Wesleyan Universityకి చెందిన ఆర్ట్ హిస్టరీ ప్రొఫెసర్ Phillip B Wagoner తో కలిసి వారం రోజులపాటు వరంగల్ చారిత్రక విశేషాలపై పరిశోధన చేయడం జరిగింది.
  • ఇండియన్ ఆర్ట్ హిస్టరీ రంగంలో ప్రముఖులైన Dr. Corinna Wessels Mevissen తో కలిసి పలుమార్లు దేవుడిగుట్ట, ఫణిగిరి, వరంగల్ కోట, నైన గుళ్ళు, సర్వతోభద్ర దేవాలయం లాంటి చారిత్రక కట్టడాలపై చేయడం పరిశోధన జరిగింది.
  • ప్రముఖ architectural historian,Professor Adam Hardy తో కలిసి దేవుని గుట్ట ఆలయాన్ని , వరంగల్ కోటను పరిశోధించడం జరిగింది .
  • Cardiff university కి చెందిన పరిశోధకురాలు Laxshimi andrade తో కలిసి వరంగల్ కట్టడాలపై పరిశోధన చేయడం జరిగింది.
  • University of Californiaకు చెందిన ప్రొఫెసర్, ప్రసిద్ధ ఆర్కియాలజిస్ట్ Thomas E. Levy తో కలిసి ఉమ్మడి వరంగల్ జిల్లాలోని బృహత్ శిలాయిగం నాటి సమాధులను గురించి పరిశోధన చేయడం జరిగింది.

తన పరిశోధనల నిమిత్తం తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా అనేక పర్యాయాలు పర్యటించాడు ముఖ్యంగా వరంగల్ జిల్లా, హన్మకొండ జిల్లా, జయశంకర్ భూపాలపల్లి జిల్లా, జనగామ జిల్లా , మహబూబాబాదు జిల్లా, కరీంనగర్ జిల్లా , నల్లగొండ జిల్లా, యాదాద్రి జిల్లా , ఖమ్మం జిల్లా మొదలగు జిల్లాల్లో అతని పరిశోధనలు విరివిగా కొనసాగాయి. వరంగల్ ప్రాంత వాసి కావడం, ఎక్కువగా కాకతీయులకు సంబంధించిన చరిత్రను అధ్యయనం చేసిన వ్యక్తి కావడం మూలంగా ఎక్కువగా కాకతీయులు ఏలిన ప్రాంతాల్లో పర్యటించి కాకతీయుల కట్టడాలను, చారిత్రక విశేషాలను వెలుగులోకి తీసుకొచ్చాడు అరవింద్.[7]

పాల్గొన్న ప్రముఖ కార్యక్రమాలు మార్చు

  • వికీపీడియా వారు నిర్వహించిన సెమినార్లో పాల్గొని చారిత్రక వారసత్వ కట్టడాల పరిరక్షణలో ఛాయాచిత్రాల పాత్ర అనే అంశంపై పరిశోధనా పత్రాలు సమర్పించడం జరిగింది.
  • రాక్ ఆర్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా సంస్థ ఆధ్వర్యంలో మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ లో జరిగిన ప్రపంచ స్థాయి సదస్సులో పాల్గొని తెలంగాణ రాష్ట్రంలోని రాతి చిత్రాలను గురించి పరిశోధనా పత్రం సమర్పించాడు.
  • వరంగల్ సందర్శిని అనే శీర్షికతో వరంగల్ ఆకాశవాణి కేంద్రం నుండి 15 కి పైగా రేడియో ప్రసంగాలు చేసాడు అరవింద్. అలాగే 93.5 RED F.M. వరంగల్ కేంద్రం వారు నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొని తన అనుభవాలతో పాటు చారిత్రక అంశాలను వెల్లడిస్తూ ఇంటర్వ్యూ ఇచ్చాడు. 2017లో T-SAT టీవీ ఛానల్ Interaction With Young Historian శీర్షికతో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొని చారిత్రక అంశాలను వెల్లడిస్తూ, తన పరిశోధనా యాత్రలోని అనుభవాలను, అనుభూతులను పంచుకుంటూ ఇంటర్వ్యూ ఇచ్చాడు.

అనేకచోట్ల తెలంగాణ పురావస్తు శాఖ, పర్యాటక శాఖలు నిర్వహించిన సెమినార్ లలో వక్తగా పాల్గొన్నాడు. అంతేకాకుండా అనేక స్వచ్ఛంద సంస్థలు నిర్వహించిన రక్తదాన శిబిరాలు, వన సంరక్షణ, బుక్ ఫెయిర్, ఉచిత పుస్తకాల పంపిణీ మొదలగు సామాజిక సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొన్నాడు.

రాసి ప్రచురించిన ప్రధాన వ్యాసాలు మార్చు

వివిధ పత్రికలలో అతను రాసిన పరిశోధనా వ్యాసాలు ప్రచురితమయ్యాయి. వాటిలో నమస్తే తెలంగాణ బతుకమ్మ సంచికలో ప్రచురితమైన కొండపర్తి గ్రామ చారిత్రక కథనం, సాక్షి దినపత్రికలో ప్రచురితమైన భూపాలపల్లి జిల్లా ప్రాంతాల్లోని డాల్మన్ సమాధుల గురించిన కథనం ప్రముఖుల ప్రశంసలందుకున్నాయి.

ప్రస్తుత కాకతీయ వంశస్థుడు కమల్ చంద్ర భంజ్ దేవ్ కాకతీయ తో పలుమార్లు జరిపిన ఇంటర్వ్యూలు దినపత్రికలలో ప్రచురితమయ్యాయి. వాటిలో మహనీయులు, చరిత్ర, సంస్కృతి, సాహిత్యం మొదలగు అంశాలకు సంబంధించిన 300 కథనాలున్నాయి.

నమస్తే తెలంగాణ దినపత్రిక ఆదివారం ప్రత్యేక సంచిక బతుకమ్మలో తెలంగాణ సంస్కృతి, చరిత్రను తెలిపే విధంగా చరిత్ర మరచిన చరిత్ర అనే పేరుతో చారిత్రిక విశేషాలు, కట్టడాలు, జానపద కళారూపాలు , కళాకారుల గురించి 70 పైగా వ్యాసాలను రాయడం జరిగింది.

నిర్వహించిన ప్రముఖ ప్రాజెక్టులు మార్చు

1. వరంగల్ అంటే 'ఆలయాల నగరం (City of Temples)' అని, కాకతీయులంటే 'నీళ్ళకు నడకలు నేర్పినవారు' అని భావించే అరవింద్ వరంగల్ అర్బన్ జిల్లాలో మరుగున పడిపోయిన కాకతీయుల కాలంనాటి 50 ఆలయాలు/మెట్లబావులను గుర్తించి, అనేక పర్యాయాలు ఆయా ప్రదేశాలను సందర్శించి వాటి పునరుద్ధరణకు అయ్యే ఖర్చులు, అవసరమైన పర్యాటక సౌకర్యాల వివరాలతో ఒక నివేదిక రూపొందించి అధికారులకు అందజేశాడు.

2. 2019 ఫిబ్రవరి నెలలో హైదరాబాద్ రవింద్రభారతిలోని ఐసిసిఆర్ ఆర్ట్ గ్యాలరీలో తెలంగాణ రాష్ట్రంలోని మరుగున పడిపోయిన చారిత్రక కట్టడాల , ప్రాంతాల ఛాయాచిత్రాలతో The Untold Telangana అనే ఛాయాచిత్ర ప్రదర్శన ఏర్పాటు చేశాడు.[8][9]

3. మార్చి నెలలో వరంగల్ హరిత కాకతీయ హోటల్ లో 3 రోజుల పాటు జరిగిన తెలంగాణ ఫోటోగ్రఫీ అకాడమీ కన్వెన్షన్ లో ఛాయాచిత్రప్రదర్శన నిర్వహించాడు.

4. 2019 మార్చి 25 నాడు కాకతీయ సామ్రాజ్య పాలకురాలు మహారాణి రుద్రమదేవి జన్మదినం సందర్భంగా పలువురు చరిత్రకారులు రచించిన వ్యాసాల సంకలనం విడుదల చేయడం జరిగింది.

5. రామప్ప దేవాలయానికి ప్రపంచ వారసత్వ హోదా లభించిన నేపథ్యంలో రామప్ప ఆలయ చారిత్రిక , సాంసృతిక విశేషాలను తెలిపే విధంగా ఏ సింఫనీ ఇన్ స్టోన్ అనే పేరుతో అక్టోబర్ 1 వ తేదీ నుండి 100 రోజుల పాటు ఛాయాచిత్ర ప్రదర్శన ఏర్పాటు చేయడం జరిగింది.

6. ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలోని బస్తర్ ప్రాంతంలో కాకతీయ వారసులు 75 రోజుల పాటు నిర్వహించే దసరా ఉత్సవాలను డాక్యుమెంట్ చేయడం జరిగింది.

7. ఓరుగల్లు రాజధానిగా 300 ఏళ్లపాటు పాలించిన కాకతీయ పాలకులు నిర్మాణం చేసిన ఆలయాలు , కట్టడాలు , మెట్ల బావులు , శాసనాలు , కోటలు, తోరణాల ఛాయాచిత్రాలతో విశ్వ ప్రసిద్ధ బస్తర్ దసరా వేడుకల్లో 15 రోజుల పాటు ఛాయాచిత్ర ప్రదర్శన ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు రెండున్నర లక్షల మంది ఈ ప్రదర్శనను సందర్శించి ఉంటారని ఒక అంచనా.

8. కాకతీయ పాలనా కాలం నాటి ప్రసిద్ధ నృత్యం పేరిణి ని ప్రస్తుత కాకతీయ వంశస్థుల ఎదుట ప్రదర్శింపజేయడం జరిగింది.

9. గిరిజన కుంభమేళా గా ప్రసిద్ధి చెందిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతర అనంతరం సమ్మక్క పూజారులైన సిద్ధబోయిన వంశస్తులు అందించిన సమ్మక్క సారెగా బంగారం (బెల్లం), గాజులు, కుంకుమ భరిణి, చీర, కండువాలను ఫిబ్రవరి 25 శుక్రవారం నాడు జగదల్ పూర్ లోని రాజప్రసాదంలో రాజమాత కృష్ణకుమారి దేవికి , కాకతీయ వారసుడైన కమల్ చంద్రదేవ్‌భంజ్‌కి పంపించారు.

రాసిన పుస్తకాలు మార్చు

ఇప్పటివరకు తెలంగాణలో వెలుగుచూడని శాసనాలు, వేల ఏండ్లనాటి సాంప్రదాయాలను మొదలగు వినూత్న అంశాలను తెలుపుతూ "మనకు తెలియని తెలంగాణ" పేరుతో ఒక పుస్తకం రాసాడు.[10] మామిడి హరికృష్ణ ప్రోత్సాహసహకారాలతో తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ప్రచురించిన ఈ పుస్తకం 2019, మే 20న తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శైలేంద్ర కుమార్ జోషి (ఐఏఎస్) చేతుల మీదుగా ఆవిష్కరించబడింది.[11][12]

రాణిస్తున్న రంగాలు మార్చు

  • చరిత్ర పరిశోధనా రంగం
  • పాత్రికేయ రంగం
  • ఛాయాచిత్రగ్రాహణ రంగం
  • పర్యావరణ పరిరక్షణా రంగం
  • సామాజిక సేవా రంగం

నిర్వహిస్తున్న పదవులు మార్చు

  • సేవా టూరిజం కల్చరల్ సొసైటీ కన్వీనర్
  • వనసేవ స్వచ్ఛంద సంస్థ సహా కార్యదర్శి
  • టార్చ్ సంస్థ ప్రధాన కార్యదర్శి
  • ఆక్యులస్  డిజైన్ స్టూడియో  జనరల్ మేనేజర్ .
  • ఎస్ ఆర్ ఆర్  డిగ్రీ, పిజి  కళాశాల బోర్డు ఆఫ్ స్టడీస్ సభ్యుడు
  • పేరిణి అధ్యయన బృంద సభ్యుడు - తెలంగాణ ప్రభుత్వ సాంసృతిక శాఖ
  • Negetive Blood Donar Association సభ్యుడు

అందుకున్నపురస్కారాలు/ పొందిన సన్మానాలు మార్చు

1. సామాజిక సేవా విభాగంలో 2015 స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో జిల్లా కలెక్టర్ వాకాటి కరుణ చేతుల మీదుగా ప్రశంసాపత్రం.

2. 2018 లో ఉత్తమ సామాజిక వేత్తగా కలెక్టర్ ఆమ్రపాలి చేతుల మీదుగా ప్రశంసాపత్రం.

3. చారిత్రిక పరిశోధన రంగంలో చేస్తున్న సేవలకు గాను సింగిడి సంస్థ 2019 నవంబర్ 29 నాడు రవీంద్రభారతిలో అందజేసిన సింగిడి పురస్కారం.

4. పురాతన కట్టడాల పరిరక్షణకు చేస్తున్న సేవలకు గాను 2021 స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ప్రభుత్వ చీఫ్ విప్ , వరంగల్ పశ్చిమ శాసనసభ్యులు దాస్యం వినయ భాస్కర్ గారి చేతుల మీదుగా ప్రశంసాపత్రం.

5. 2021 జనవరి 12 జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ చీఫ్ విప్ , వరంగల్ పశ్చిమ శాసనసభ్యులు దాస్యం వినయ భాస్కర్ గారి చేతుల మీదుగా సన్మానం.

6. 2021లో ప్రపంచ వారసత్వ దినం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారిచే సన్మానం.

7 . 2021  దసరా వేడుకల సందర్భంగా ఛత్తీస్ ఘడ్ రాష్ట్ర గవర్నర్ అనసూయ ఊకె చేతుల మీదుగా సత్కారం

8. 2022 ఫిబ్రవరి 1 నాడు మహాశివరాత్రి సందర్భంగా వరంగల్ నగరంలో ఇండస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో నిజామాబాద్ పార్లమెంటు సభ్యులు ధర్మపురి అరవింద్ చేతుల మీదుగా కాకతీయ పురస్కారం.

9. మనకు తెలియని తెలంగాణ పుస్తకానికి భారత ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు నుండి ప్రశంసా పత్రం లభించింది.

10. 2022 మార్చి 15న బస్తర్ రాజ్యంలో జరిగిన వేడుకల్లో కాకతీయ రాజు కమల్ చంద్ర భంజ్ దేవ్ గారిచే ఆత్మీయ సన్మానం.

11. కాకతీయ వైభవ సప్తాహం వేడుకల సందర్భంగా మహారాజా కమల్ చంద్ర భంజ్ దేవ్ కాకతీయ , తెలంగాణ రాష్ట్ర పురపాలక , ఐ టి శాఖల మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా సత్కారం

మూలాలు మార్చు

  1. వెబ్ ఆర్కైవ్, ఈనాడు, వరంగల్ (27 September 2018). "ఆసక్తి చూపిన మార్గం". Archived from the original on 27 September 2018. Retrieved 27 September 2018.{{cite news}}: CS1 maint: multiple names: authors list (link)
  2. ఆంధ్రజ్యోతి, యువ (28 February 2018). "చదువుతూ.. చరిత్రను అన్వేషిస్తూ." Archived from the original on 28 ఫిబ్రవరి 2018. Retrieved 28 February 2018.
  3. ఇండియన్ ఎక్స్ ప్రెస్. "Digging into Warangal's Past". Retrieved 19 August 2017.
  4. ప్రజాశక్తి. "ఈ సంచారి చరిత్రకారుడే!". Retrieved 19 August 2017.[permanent dead link]
  5. telugu.ap2tg.com. "ఆ యువ‌కుడు తెలంగాణ రాష్ట్రంలో 100కు పైగా పురాత‌న క‌ట్ట‌డాలు, చారిత్ర‌క ప్ర‌దేశాల‌ను గుర్తించాడు తెలుసా..?". Archived from the original on 27 ఫిబ్రవరి 2021. Retrieved 19 August 2017.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)
  6. ఈనాడు, వరంగల్ అర్బన్ (5 February 2019). "చరిత్ర తిరగరాస్తున్నాడు". www.eenadu.net. Archived from the original on 10 November 2019. Retrieved 10 November 2019.
  7. తెలంగాణ టుడే. "A protector of the monuments". Retrieved 19 August 2017.
  8. సాక్షి, ఫ్యామిలీ (3 April 2019). "ఈ గైడ్‌ ఫీజ్‌ అడగడు". గజవెల్లి షణ్ముఖరాజు (సాక్షి, వరంగల్‌ రూరల్‌). Archived from the original on 3 April 2019. Retrieved 3 April 2019.
  9. వి6 వెలుగు, తెలంగాణం (6 February 2019). "తెలంగాణ చారిత్రక సంపద: ఆకట్టుకుంటున్న ఫొటో ఎగ్జిబిషన్". V6 Velugu. Archived from the original on 8 ఫిబ్రవరి 2019. Retrieved 10 November 2019.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  10. తెలుగు వెలుగు, ముఖాముఖి. "అందుకే ఆ పుస్తకం రాశా!". www.teluguvelugu.in. గుండు పాండురంగ‌శ‌ర్మ‌. Archived from the original on 10 నవంబరు 2019. Retrieved 10 నవంబరు 2019.
  11. ఆంధ్రజ్యోతి, సాహిత్యవార్తలు (20 May 2019). "'మనకు తెలియని తెలంగాణ' ఆవిష్కరణ". lit.andhrajyothy.com. Archived from the original on 10 నవంబరు 2019. Retrieved 10 November 2019.
  12. Telangana Today, Telangana (21 May 2019). "Exploring the obscure Telangana". Telangana Today. Madhuri Dasagrandhi. Archived from the original on 10 November 2019. Retrieved 10 November 2019.

ఇతర లింకులు మార్చు