ఆలె నరేంద్ర (ఆగష్టు 21, 1946 - ఏప్రిల్ 9, 2014) తెలంగాణకు చెందిన రాజకీయ నాయకులు. భారత కేంద్ర ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ స్థాపించిన ప్రారంభంలో ఆ పార్టీ అగ్రనాయకులలో ఒకరు.

ఆలె నరేంద్ర
[[Image:Ale narendra.jpg
ఈ
ఆలే నరేంద్ర
|225x250px|ఆలె నరేంద్ర]]

ఆలె నరేంద్ర


మాజీ కేంద్ర మంత్రి
రాజ్యసభ సభ్యుడు
తరువాత పదవిలో ఉన్నారు
నియోజకవర్గం మెదక్ (2004-09

వ్యక్తిగత వివరాలు

జననం 1946 ఆగస్టు 21
హైదరాబాదు, తెలంగాణ
మరణం 2014 ఏప్రిల్ 9
హైదరాబాద్, తెలంగాణ
రాజకీయ పార్టీ బహుజన సమాజ్ పార్టీ
జీవిత భాగస్వామి ఆలె లలిత
సంతానం 2 కుమారులు , 1 కుమార్తె
నివాసం హైదరాబాదు, తెలంగాణ
జనవరి 8, 2008నాటికి

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ క్రియాశీలక కార్యకర్తగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన నరేంద్ర, అనుచరవర్గములో టైగర్‌గా ప్రసిద్ధులు. 2003 వరకు భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ విభాగములో చెప్పుకోదగిన పాత్ర పోషించిన నరేంద్ర 2004 సార్వత్రిక ఎన్నికలకు ముందు బీజేపీ నుండి బయటికి వచ్చి ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర సాధనకై ఒక రాజకీయ వేదికను ప్రారంభించాడు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం పతాకస్థాయిలో ఉన్న దశలో తను స్థాపించన వేదికను కె.చంద్రశేఖరరావు ప్రారంభించిన తెలంగాణ రాష్ట్ర సమితిలో విలీనం చేశారు.

2004 ఎన్నికలలో మెదక్ లోక్‌సభ నియోజకవర్గం నుండి తెరాస పార్టీ తరఫున లోక్‌సభకు ఎన్నికైన నరేంద్ర, తెరాస యూపీఏ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వటంతో కేంద్రమంత్రి అయ్యాడు. ఒకటిన్నర సంవత్సరం తర్వాత, ప్రత్యేక తెలంగాణ విషయమై తగిన చర్యలు తీసుకోవట్లేదని తెరాస కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్నప్పుడు నరేంద్ర, ఇతర తెరాస మంత్రులతో పాటు మంత్రి పదవికి రాజీనామా చేశారు.

2008 జనవరిలో నరేంద్ర ఉత్తరప్రదేశ్ మహిళా ముఖ్యమంత్రి మాయావతి ఆధ్వర్యంలోని బహుజన సమాజ్ పార్టీలో చేరాడు.[1] ఆ తరువాత కాంగ్రెస్ పార్టీలో చేరి, 2009 ఎన్నికలకు ముందే కాంగ్రెస్ పార్టీ తరఫున రాజ్యసభకు ఎన్నికైనారు. అనంతర కాలంలో భారతీయ జనతా పార్టీలో చేరి పనిచేశాడు.

బాల్యం, విద్యాభ్యాసం మార్చు

ఆలె నరేంద్ర 1946, ఆగష్టు 21న హైదరాబాదులో పుష్పవతి, రామలింగం దంపతులకు జన్మించాడు.[2] స్థానికంగా హైదరాబాదులోనే ఉస్మానియా విశ్వవిద్యాలయంలో బియస్సీ పూర్తిచేశారు.

రాజకీయ జీవితం మార్చు

ప్రారంభం నుంచి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సభ్యుడైన నరేంద్ర 1983 నుంచి 1994 మధ్యకాలంలో భారతీయ జనతా పార్టీ తరఫున ఆంధ్రప్రదేశ్ శాసనసభకు హిమాయత్‌నగర్ నియోజకవర్గం నుంచి మూడు పర్యాయాలు ఎన్నికైనాడు. 1978లో ఖైరతాబాదు నియోజకవర్గంలో పోటీ చేసి కాంగ్రెస్ పార్టీకి చెందిన పి.జనార్థనరెడ్డి చేతిలో కేవలం 659 ఓట్ల తేడాతో ఓడిపోయారు.[3] 1980లో హైదరాబాదు లోక్‌సభ నియోజకవర్గంలో పోటీ చేసి కాంగ్రెస్ పార్టీకి చెందిన కె.ఎస్.నారాయణ చేతిలో పరాజయం పొందారు. 1983లో హిమయత్ నగర్ శాసనసభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి పి.ఉపేంద్ర పై గెలుపొంది శాసనసభలో అడుగుపెట్టారు. 1985లో మళ్ళీ అదే స్థానం నుంచి పోటీ చేసి కె.ప్రభాకరరావుపై గెలుపొందాడు. 1992లో హిమయత్ నగర్ శాసనసభ నియోజకవర్గంలో గెలుపొంది మూడవసారి శాసనసభలో అడుగుపెట్టాడు. 1994లో తెలుగుదేశం పార్టీకి చెందిన కృష్ణయాదవ్ పై ఓడిపోయాడు.1999లో భారతీయ జనతా పార్టీ తరఫున లోక్‌సభకు కాంగ్రెస్ పార్టీకి చెందిన బాగారెడ్డిపై విజయం సాధించి తొలిసారి లోక్‌సభ సభ్యులైయ్యారు. 2003 వరకు భారతీయ జనతా పార్టీలో మంచి పేరు సంపాదించుకొని అభిమానులచే టైగర్‌గా పిలుపించుకున్నాడు. ప్రత్యేక తెలంగాణా వాదంతో కె.చంద్రశేఖర్ రావు ప్రారంభించిన పార్టీలో చేరి ఆ పార్టీలో రెండో ముఖ్య నాయకుడిగా వ్యవహరించారు. 2004లో మళ్ళీ మెదక్ నియోజకవర్గం నుంచి తెలంగాణ రాష్ట్ర సమితి తరఫున పోటీ చేసి భారతీయ జనతా పార్టీకు చెందిన పి.రామచంద్రారెడ్డిపై 1,23,756 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండో పర్యాయం లోక్‌సభలో అడుగుపెట్టడమే కాకుండా మే 23 న కేంద్రంలో మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యుపిఏ ప్రభుత్వంలో గ్రామీణాభివృద్ధి శాఖా మంత్రిపదవిని పొందారు.

నకిలీ వీసా కేసులో చిక్కుకొని ఏప్రిల్ 2007లో తెలంగాణా రాష్ట్ర సమితి నుంచి బహిష్కృతుడై,[4] ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితి (నరేంద్ర) అనే కొత్త పార్టీని స్థాపించాడు. ఆ పార్టీకి జనాదరణ లభించకపోవడంతో 2008 జనవరి 8హైదరాబాదులో మాయావతి సమక్షంలో బహుజన సమాజ్ పార్టీలో చేరారు.[1] అమెరికాతో అణుఒప్పందం విషయంలో వామపక్షాలు యు.పి.ఏ.ప్రభుత్వానికి మద్దతును ఉపసంహరించుకున్న పిదప జరిగిన పరిణామాలతో నరేంద్ర యు.పి.ఏ.ప్రభుత్వానికి మద్దతు ఇచ్చి ఆ అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరాడు. 2009 ఎన్నికలకు ముందే కాంగ్రెస్ పార్టీ తరఫున రాజ్యసభకు ఎన్నికైయ్యాడు.

మరణం మార్చు

అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్‌కు చెందిన నాంపల్లి లోని కేర్ ఆసుపత్రిలో ఏప్రిల్ 9, 2014న మరణించారు.

మూలాలు మార్చు

  1. 1.0 1.1 (ఆంగ్లము) "బహుజన సమాజ్ పార్టీలో చేరిక". మేరీన్యూస్.కాం. ఏప్రిల్ 24, 2008.[permanent dead link]
  2. (ఆంగ్లము) "నరేంద్ర బయోడేటా". భారత ప్రభుత్వము. ఏప్రిల్ 24, 2008.
  3. (ఆంగ్లము) "రాజకీయాలు". తెలంగాణా.కాం. ఏప్రిల్ 24, 2008. Archived from the original on 2008-05-15. Retrieved 2008-04-22.
  4. (ఆంగ్లము) "వార్తలు". రెడిఫ్.కాం. ఏప్రిల్ 24, 2008.