ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానం

(ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు నుండి దారిమార్పు చెందింది)

ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానం, 2019 లో అవశేష ఆంధ్రప్రదేశ్ కొరకు ఏర్పాటు చేసిన ఉన్నత న్యాయస్థానం. అంతకుముందు హైదరాబాదు లోని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టుగా పనిచేసేది. ఇది ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో నెలకొని ఉంది.[2] "జ్యుడిషియల్" హైకోర్టు భవనం

ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానం
అమరావతిలో ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థాన భవనం
స్థాపితం2019 జనవరి 1[1]
దేశం భారతదేశం
ప్రదేశంఅమరావతి, ఆంధ్రప్రదేశ్
భౌగోళికాంశాలు16°31′10″N 80°29′08″E / 16.5195°N 80.4856°E / 16.5195; 80.4856
సంవిధాన పద్ధతిసుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, సంబంధిత రాష్ట్ర గవర్నరు సలహా మేరకు రాష్ట్రపతిచే నియామకం. .
అధికారం పొందినదిభారత రాజ్యాంగం
తీర్పులపై ఉత్తరాభియోగంభారత అత్యున్నత న్యాయస్థానం
న్యాయమూర్తుల పదవీ కాలం62 సంవత్సరాల వయసులో తప్పనిసరి పదవీ విరమణ
స్థానాల సంఖ్య37
శాశ్వత: 28 ; అడిషనల్: 9
ఛీఫ్ జస్టిస్
ప్రస్తుతంజస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకుర్

చరిత్ర

1954 సంవత్సరంలో మద్రాసు ప్రెసిడెన్సీ నుంచి విడిపోయి, ఆంధ్ర రాష్ట్రం ఏర్పడ్డప్పుడు దీన్ని స్థాపించారు. 1956 నాటికి ఆంధ్ర హైకోర్టు గుంటూరులో ఉండేది. ఆంధ్ర రాష్ట్రం, హైదరాబాద్ రాష్ట్రం తర్వాత కలిసిపోయి ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డాకా దీన్ని ఆంధ్రప్రదేశ్ రాజధాని హైదరాబాద్‌కు తరలించారు. 2014లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లుగా విడిపోయాకా, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 ప్రకారం ఆంధప్రదేశ్‌కు ప్రత్యేకించి హైకోర్టు ఏర్పాటుచేసేదాకా, హైదరాబాద్‌లోని హైకోర్టు ఉమ్మడి న్యాయస్థానంగా కొనసాగింది. రాష్ట్రపతి ఉత్తర్వులతో 2019 జనవరి 1న ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 ప్రకారం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఏర్పాటైంది. దీన్ని ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో నెలకొల్పారు. సి. ప్రవీణ్ కుమార్ ఆంధ్రప్రదేశ్ (విభజన తర్వాత) ఏర్పడ్డ ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు తొలి తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా 2019 జనవరి 1 న నియమించబడ్డాడు.[3] 2019 అక్టోబరు 7 న నేలపాడు లో కొత్తగా నిర్మించిన హైకోర్ట్, న్యాయమూర్తులతో కొలువుదీరిన తరువాత, గవర్నర్ ప్రధాన న్యాయమూర్తి గా జస్టిస్ మహేశ్వరి తో ప్రమాణం చేయించాడు. 2021 జనవరి 6న అరూప్ కుమార్ గోస్వామి మూడవ ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణం చేశాడు.[4]

భౌగోళికం

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అమరావతిలో అంతర్భాగమైన నేలపాడు వద్ద నెలకొంది.[5] కృష్ణా నదికి 6.4 కిలోమీటర్ల దూరంలో ఉంది.

ప్రధాన న్యాయమూర్తులు

హైకోర్టు న్యాయమూర్తులు

మాజీ న్యాయమూర్తులు

మూలాలు

  1. "New Andhra High Court to function at Kurnool from Jan 1, President issues notification". Thenewsminute.com. Retrieved 28 December 2018.
  2. "CJI Ranjan Gogoi to open Judicial Complex, lay stone for permanent HC in Kurnool today". The New Indian Express. 3 February 2019. Archived from the original on 24 ఆగస్టు 2019. Retrieved 25 August 2019.
  3. "కొలువుదీరిన కొత్త హైకోర్ట్.. న్యాయమూర్తులతో ప్రమాణం చేయించిన గవర్నర్". BBC. 1 January 2019. Retrieved 7 April 2019.
  4. "రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణస్వీకారం చేసిన జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి" (PDF). I&PR,AP. 2021-01-06. Retrieved 2021-01-23.
  5. Reporter, Staff (2019-02-02). "CJI to inaugurate judicial complex today". The Hindu. ISSN 0971-751X. Retrieved 2019-02-03.
  6. 10TV Telugu (25 July 2023). "బాంబే, ఆంధ్రప్రదేశ్ హైకోర్టులకు కొత్త ప్రధాన న్యాయమూర్తుల నియామకం." (in Telugu). Archived from the original on 25 July 2023. Retrieved 25 July 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
  7. Hindustantimes Telugu (25 July 2023). "ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ధీరజ్ సింగ్‌ ఠాకూర్ నియామకం". Archived from the original on 25 July 2023. Retrieved 25 July 2023.
  8. Andhra Jyothy (14 February 2022). "ఏడుగురు నూతన న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారం". Archived from the original on 14 February 2022. Retrieved 14 February 2022.

ఇవి కూడా చూడండి.

వెలుపలి లంకెలు