రమేష్ రాథోడ్ అదిలాబాద్ (ఎస్.టి) పార్లమెంటరీ నియోజిక వర్గంనుండి గెలిచి 15వ పార్లమెంటులో తెలుగు దేశం పార్టీ తరపున సభ్యునిగా ఉన్నారు.

రమేష్ రాథోడ్ - 2021 నుండి భారతీయ జనతా పార్టీలో కొనసాగుతున్నారు

బాల్యము సవరించు

రమేష్ రాథోడ్, మోహన్ రాథోడ్, కమలబాయ్ దంపతులకు 1966 అక్టోబరు 20 న జన్మించారు.

విద్య సవరించు

వీరు అదిలాబాద్ లోని ప్రభుత్వ డిగ్రీ కళశాలలో బి.ఎ. డిగ్రీ చదివారు

కుటుంబము సవరించు

వీరు సుమన్ రాథోడ్ ను వివాహమాడారు. వీరికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె కలరు.

రాజకీయ ప్రస్థానము సవరించు

రమేష్ రాథోడ్ 1999 - 2004 మద్య కాలంలో ఆంధ్ర ప్రదేశ్ శాసన సభ సభ్యునిగా ఉన్నారు. 2006 నుండి 2009 వరకు అదిలాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ గా ఉన్నారు. 2009 లో 15 వ లోక్ సభకు పోటీచేసి పార్లమెంటు సభ్యునిగా పనిచేసారు.[1]

మూలాలు సవరించు

  1. ఈనాడు, తాజావార్తలు (18 March 2019). "ఆదిలాబాద్ లోక్‌సభ నియోజకవర్గం". www.eenadu.net. Archived from the original on 18 ఏప్రిల్ 2020. Retrieved 18 April 2020.

https://web.archive.org/web/20130313020516/http://164.100.47.132/LssNew/Members/Biography.aspx?mpsno=4258