శ్రీకాకుళం (ఘంటసాల)

ఆంధ్రప్రదేశ్, కృష్ణా జిల్లా, ఘంటసాల మండల గ్రామం
(శ్రీకాకుళం (కృష్ణాజిల్లా) నుండి దారిమార్పు చెందింది)

శ్రీకాకుళం, కృష్ణా జిల్లా, ఘంటసాల మండలానికి చెందిన గ్రామం. ఇది మండల కేంద్రమైన ఘంటసాల నుండి 13 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన మచిలీపట్నం నుండి 39 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 2207 ఇళ్లతో, 7153 జనాభాతో 2924 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 3647, ఆడవారి సంఖ్య 3506. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 2120 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 208. గ్రామ జనగణన లొకేషన్ కోడ్ 589693.[1] సముద్రమట్టానికి 11 మీ.ఎత్తులో ఉంది.

శ్రీకాకుళం
—  రెవెన్యూ గ్రామం  —
శ్రీకాకుళం is located in Andhra Pradesh
శ్రీకాకుళం
శ్రీకాకుళం
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 16°11′46″N 80°50′50″E / 16.196063°N 80.847333°E / 16.196063; 80.847333
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం ఘంటసాల
ప్రభుత్వం
 - సర్పంచి శ్రీమతి తిరుమలశెట్టి భవాని
జనాభా (2011)
 - మొత్తం 7,153
 - పురుషులు 3,647
 - స్త్రీలు 3,506
 - గృహాల సంఖ్య 2,207
పిన్ కోడ్ 521132
ఎస్.టి.డి కోడ్ 08671
కృష్ణా జిల్లా

సమీప గ్రామాలు మార్చు

ఈ గ్రామానికి సమీప ంలో తెలుగురావుపాలెం, చోరగుడి, పెనుమత్చ, కొడాలి గ్రామాలు ఉన్నాయి.

విద్యా సౌకర్యాలు మార్చు

గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు 10, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలు రెండు, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాలలు రెండు ఉన్నాయి.సమీప బాలబడి ఘంటసాలలో ఉంది.సమీప జూనియర్ కళాశాల, ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల మొవ్వలోను, ఇంజనీరింగ్ కళాశాల చల్లపల్లిలోనూ ఉన్నాయి. సమీప వైద్య కళాశాల, మేనేజిమెంటు కళాశాల విజయవాడలోను, పాలీటెక్నిక్ మచిలీపట్నంలోనూ ఉన్నాయి.సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల ఘంటసాలలోను, అనియత విద్యా కేంద్రం మచిలీపట్నంలోను, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల విజయవాడ లోనూ ఉన్నాయి.

వైద్య సౌకర్యం మార్చు

ప్రభుత్వ వైద్య సౌకర్యం మార్చు

శ్రీకాకుళంలో ఉన్న ఒకప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఇద్దరు డాక్టర్లు, ఏడుగురు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. ఒక ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో డాక్టర్లు లేరు. ఇద్దరు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు.

పశు వైద్యశాల గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, డిస్పెన్సరీ, సంచార వైద్య శాల, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.

ప్రైవేటు వైద్య సౌకర్యం మార్చు

గ్రామంలో2 ప్రైవేటు వైద్య సౌకర్యాలున్నాయి. డిగ్రీ లేని డాక్టర్లు ఇద్దరు ఉన్నారు. ఒక మందుల దుకాణం ఉంది.

తాగు నీరు మార్చు

గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది. చెరువు ద్వారా గ్రామానికి తాగునీరు లభిస్తుంది.

పారిశుధ్యం మార్చు

మురుగునీరు బహిరంగ కాలువల ద్వారా ప్రవహిస్తుంది. మురుగునీరు బహిరంగంగా, కచ్చా కాలువల ద్వారా ప్రవహిస్తుంది. మురుగునీటిని నేరుగా జలవనరుల్లోకి వదులుతున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.

సమాచార, రవాణా సౌకర్యాలు మార్చు

శ్రీకాకుళంలో సబ్ పోస్టాఫీసు సౌకర్యం, పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు ఉన్నాయి. పోస్టాఫీసు సౌకర్యం గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్, ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. ప్రైవేటు కొరియర్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.

గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. ప్రైవేటు బస్సు సౌకర్యం, రైల్వే స్టేషన్ మొదలైనవి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి.

జిల్లా రహదారి గ్రామం గుండా పోతోంది. రాష్ట్ర రహదారి, ప్రధాన జిల్లా రహదారి గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. జాతీయ రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి.

మార్కెటింగు, బ్యాంకింగు మార్చు

గ్రామంలో వాణిజ్య బ్యాంకు, సహకార బ్యాంకు, వ్యవసాయ పరపతి సంఘం ఉన్నాయి. గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం, వారం వారం సంత ఉన్నాయి.

ఏటీఎమ్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. రోజువారీ మార్కెట్, వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి.

ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు మార్చు

గ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో సినిమా హాలు, గ్రంథాలయం, పబ్లిక్ రీడింగ్ రూం ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ కేంద్రం, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. ఆటల మైదానం గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.

విద్యుత్తు మార్చు

గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 15 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.

భూమి వినియోగం మార్చు

శ్రీకాకుళంలో భూ వినియోగం కింది విధంగా ఉంది:

  • వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 1239 హెక్టార్లు
  • నికరంగా విత్తిన భూమి: 1684 హెక్టార్లు
  • వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 1684 హెక్టార్లు

నీటిపారుదల సౌకర్యాలు మార్చు

శ్రీకాకుళంలో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.

  • కాలువలు: 1306 హెక్టార్లు
  • బావులు/బోరు బావులు: 378 హెక్టార్లు

ఉత్పత్తి మార్చు

శ్రీకాకుళంలో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.

ప్రధాన పంటలు మార్చు

వరి, చెరకు, మినుము

పారిశ్రామిక ఉత్పత్తులు మార్చు

బియ్యం

గామంలోని మౌలిక సదుపాయాలు మార్చు

బ్యాంకులు మార్చు

ఆంధ్రా బ్యాంక్.

సహకారసంఘం మార్చు

ఈ గ్రామంలో సహకారసంఘం నిధులు 27 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన భవనాన్ని, 2015,జూన్-4న ప్రారంభించారు. [14]

విద్యుత్తు సౌకర్యం మార్చు

ఈ గ్రామంలో 2014,నవంబరు-3న 33/11కె.వి. విద్యుత్తు ఉపకేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కేంద్రం వలన, ఈ గ్రామంతో పాటు చుట్టుప్రక్కల గ్రామాలయిన పాపవినాశనం, గోగినేనిపాలెం, తెలుగురావుపాలెం, అచ్చంపాలెం, సూరపనేనివారిపాలెం, వీరమాచనేనివారిపాలెం మొదలగు గ్రామాలలోలో వోల్టేజ్ సమస్య తీరిపోతుంది. [8]

గ్రామ పంచాయతీ మార్చు

  1. శీలంవారి పాలెం శ్రీకాకుళం గ్రామ పంచాయతీ పరిధిలోని గ్రామం.
  2. శ్రీకాకుళం గ్రామ పంచాయతీకి 2013 జూలైలో జరిగిన ఎన్నికలలో తిరుమలశెట్టి భవాని సర్పంచిగా ఎన్నికైంది. [4]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు మార్చు

దివిసీమకు చెందిన ఈ కృష్ణా నది తీర గ్రామంలో ప్రసిద్ధి చెందిన ఆంధ్ర మహా విష్ణువు మందిరం, శ్రీ రాజ్యలక్ష్మీ సమేత శ్రీకాకుళేశ్వర స్వామి మందిరం (శివాలయం) ఉన్నాయి. ఇంకా రామాలయం, హనుమాన్ మందిరం, పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి మందిరం, వినాయకుని గుడి ఉన్నాయి.

శ్రీ రాజ్యలక్ష్మీ భోగ్యలక్ష్మీ సమేత శ్రీకాకుళేశ్వర స్వామివారి ఆలయం మార్చు

  1. శ్రీకాకుళం గ్రామంలో వెలసిన ఈ ఆలయంలో, స్వామివారి వార్షిక కళ్యాణ బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరం, వైశాఖమాసం (మే నెల) లో శుక్ల త్రయోదశి నుండి బహుళ విదియ వరకు ఐదు రోజులపాటు, అత్యంత వైభవంగా నిర్వహించెదరు. [5]
  2. ఈ ఆలయానికి అయినంపూడి గ్రామంలో 16.44 ఎకరాలు, శ్రీకాకుళం గ్రామంలో 9.25 ఎకరాలు, తెలుగురావుపాలెంలో 16.73 ఎకరాలు, పాపవినాశనం గ్రామంలో 11.45 ఎకరాలు, గోగినేనిపాలెంలో 15.41 ఎకరాల మాన్యం భూమి ఉంది. ఇదిగాక, తెలుగురావుపాలెంలో 8.82 ఎకరాల చేపలచెరువు ఉంది. వీటిని 3 సంవత్సరాలకొకసారి బహిరంగ వేలంద్వారా కౌలుకు ఇచ్చి, వచ్చిన ఆదాయాన్ని దేవస్థానం ఖాతాలో జమచేయుదురు. [13]
  3. ఈ స్వామివారిని కీర్తించుచూ నాటి ప్రముఖ రచయిత శ్రీ కాసుల పురుషోత్తమ కవి రచించిన ఆంధ్రనాయకశతకం లోని 108 పద్యాలను, ఆలయప్రాంగణంలో రాతి శాసనాలరూపంలో భద్రపరచారు. ఈ పద్యాలను వారి వారసులు శ్రీ కాసుల కృష్ణంరాజు, రాజశ్రీధర్ లు, ప్రముఖ చలనచిత్ర నేపథ్య గాయకులు గాయకులు శ్రీ శ్రీకృష్ణచే ఆలపింపజేసి, సీ.డీ.రూపంలో నిక్షిప్తం చేసారు. ఈ సీ.డీ.లను 2016,ఫిబ్రవరి-4వ తేదీనాడు ఆలయంలో ఆవిష్కరించారు. [16]
  4. ఈ ఆలయం ప్రాంగణంలో, శ్రీ కాసులపురుషోత్తమ కవి విగ్రహాన్ని, 2016,ఫిబ్రవరి-11వ తేదీనాడు ఆవిష్కరించారు. ఈ విగ్రహాన్ని శ్రీ కాసుల పురుషోత్తమ కవి వంశీకులైన శ్రీ జాడల్రిజా సాగర్ రాజు, శ్రీ కాసుల కృష్ణంరాజు, శ్రీ కాసుల శ్రీధరరాజు ఏర్పాటు చేసారు. [17]
  5. ఈ ఆలయ ప్రాంగణంలో 2016,ఫిబ్రవరి-11, గురువారం రాత్రి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయశాఖ, భాషా సాంస్కృతికశాఖ, దివి ఐతిహాసిక పరిశోధన మండలి సంయుక్త ఆధ్వర్యంలో, శ్రీ కృష్ణదేవరాయల ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. [18]

శ్రీ సువర్చలా సమేత ఆంజనేయస్వామివారి ఆలయం మార్చు

ఈ ఆలయంలో, స్వామివారి 54వ వార్షిక బ్రహ్మోత్సవాలు 2014, మే-25, 26, 27 లలో ఘనంగా నిర్వహించారు. 26న శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. 27న స్వామివారి గ్రామోత్సవం నిర్వహించారు. [6]

శ్రీ ప్రసన్నమల్లికార్జునస్వామివారి ఆలయం మార్చు

ఈ ఆలయంలో, 30-జూన్,2014, సోమవారం నాడు, వర్షం కోసం ప్రత్యేకపూజలు నిర్వహించారు. కృష్ణానదీ జలాలు, 11 నీటిముంతలతో శివునికి రుద్రాభిషేకపూజలు, జలాభిషేకపూజలు నిర్వహించారు. [7]

శ్రీ రామాలయం మార్చు

శ్రీకాకుళం గ్రామంలో, దేవాదాయశాఖ నిధులు రు. 3 లక్షలు మరియూ గ్రామస్థుల విరాళాలు రు. 15 లక్షలతో, నూతనంగా నిర్మించిన ఈ ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమాలు, 2015,మే నెల-8వ తేదీ శుక్రవారం నుండి మూడురోజులపాటు నిర్వహించారు. ఈ కార్యక్రమాలలో భాగంగా 9వ తేదీ శనివారంనాడు, తిరుమల తిరుపతి దేవస్థానం వేదపండితుల ఆధ్వర్యంలో 108 కలశాలతో, హోమగుండాల వద్ద, విశిష్టపూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పవిత్ర కృష్ణా నది తీరాన, వేదపండితుల ఆధ్వర్యంలో జలాధివాసం పూజలు నిర్వహించారు. 10వ తేదీ ఆదివారం ఉదయం 9-31 గంటలకు శ్రీ హనుమత్, లక్ష్మణ, సీతా సమేత శ్రీ కోదండరామస్వామివారి నూతన విగ్రహ ప్రతిష్ఠ నిర్వహించారు. [10],[11] & [12]

 
శ్రీకాకుళాంధ్ర దేవాలయం
  • లభించిన సమాచారం ప్రకారం ఇక్కడ విష్ణు అనే వీరుడు తన తెగ లేదా ప్రాంతాన్ని కాపాడి ప్రజాభిమానం చూరగొన్నాడు. అతను విష్ణువు అంశ కలిగి ఉన్నాడని భావించి జనులు అతనికి మందిరం నిర్మించి ఉండవచ్చును.[2].
  • ఆలయంలో ప్రధాన మందిరం శాతవాహనుల కాలంనుండి నిలిచిఉన్నదనిపిస్తుంది. (సా.శ. పూ. 2వ లేదా 3వ శతాబ్దము). అలాగయితే ఇది దేశంలో అతి పురాతనమైన ఆలయాలలో ఒకటి. 'విష్ణు' అనే నాయకుడు శాతవాహనులకు ముందుకాలం వాడయ్యుండాలి. దీనికి కరనమ్
  • ఆలయం ప్రాచీనతే కాకుండా ఈ ఊరు తెలుగు సాహిత్యంలో ఒక విశిష్టమైన స్థానాన్ని కలిగి ఉంది.
  • విజయనగర రాజు శ్రీకృష్ణదేవరాయలు తన కళింగ దండయాత్ర మార్గంలో (సా.శ.1518లో) ఇక్కడి విజయవాడ, కొండపల్లి దుర్గాలను జయించాడు. తరువాత ఈ మందిరం గురించి విని ఇక్కడి స్వామిని దర్శించుకొని ఏకాదశి వ్రతాన్ని ఆచరించాడు. ఆ రాజుకు కలలో నీల మేఘము డాలు డీలు సేయగజాలు [3] విష్ణువు దర్శనమిచ్చి ఆండాళ్‌తో తనకు రంగమందయిన పెండ్లి సెప్పుమని ఆనతిచ్చాడు. అప్పుడు శ్రీకృష్ణ దేవరాయలు తెలుగదేలయన్న దేశంబు తెలుగు, యేను తెలుగు వల్లభుండ, తెలుగు కండ ... యెరుగవే బాసాడి, దేశ భాషలందు తెలుగు లెస్స యని తలచి ఆముక్త మాల్యద ప్రబంధమును తెలుగు భాషలో రచించాడు.
  • తరువాతి కాలంలో కాసుల పురుషోత్తమ కవి వ్యాజస్తుతి విధానంలో వ్రాసిన ఆంధ్రనాయక శతకము చాలా ప్రసిద్ధ చెందింది. అప్పటికి ఈ ఆలయం శిథిలావస్థలో ఉన్నందున కవి చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్య భావ! హత విమత జీవ శ్రీకాకుళాంధ్ర దేవ అనే మకుటంతోశతకాన్ని వ్రాశాడు.
  • కృష్ణా నది, రైవిస్ కాలువ ఈ గ్రామం చుట్టూరా ఉన్నాయి. గ్రామంలో చాలా చెరువులున్నాయి.

సమీప దేవాలయాలు మార్చు

గ్రామంలో ప్రధాన వృత్తులు మార్చు

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు

గ్రామ ప్రముఖులు మార్చు

గ్రామ విశేషాలు మార్చు

ఈ గ్రామంలో 2014, డిసెంబరు-8వ తేదీన ఇసుక క్వారీని ప్రారంభించారు. [9]

గణాంకాలు మార్చు

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 7835. ఇందులో పురుషుల సంఖ్య 3877, స్త్రీల సంఖ్య 3958, గ్రామంలో నివాస గృహాలు 1976 ఉన్నాయి.గ్రామ విస్తీర్ణం 2924 హెక్టారులు.

చిత్రమాలిక మార్చు

మూలాలు మార్చు

  1. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".
  2. "శేషు మాధవరావు వ్యాసం". Archived from the original on 2007-12-30. Retrieved 2007-12-07.
  3. ఆముక్త మాల్యద

బయటి లింకులు మార్చు

  • http://wikimapia.org/731860/
  • కృష్ణా జిల్లా వెబ్‌సైటు
  • [4] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2013,ఆగస్టు-8; 1వపేజీ. [5] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2014,మే-11; 2వపేజీ. [6] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2014,మే-28; 1వపేజీ. [7] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2014,జులై-1; 1వపేజీ. [8] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2014,నవంబరు-4; 1వపేజీ. [9] ఈనాడు కృష్ణా; 2014,డిసెంబరు-9; 6వపేజీ. [10] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2015,మే-9; 1వపేజీ. [11] ఈనాడు కృష్ణా; 2015,మే-10; 10వపేజీ. [12] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2015,మే-12; 1వపేజీ. [13] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2015,మే-21; 2వపేజీ. [14] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2015,జూన్-5; 1వపేజీ. [15] ఈనాడు అమరావతి; 2015,నవంబరు-5; 41వపేజీ. [16] ఈనాడు అమరావతి; 2016,ఫిబ్రవరి-5; 41వపేజీ. [17] ఈనాడు అమరావతి/అవనిగడ్డ; 2016,ఫిబ్రవరి-12; 1వపేజీ. [18] ఈనాడు అమరావతి; 2016,ఫిబ్రవరి-12; 3వపేజీ.