ఆనం రామనారాయణరెడ్డి

రాజకీయ నాయకుడు

ఆనం రామనారాయణరెడ్డి ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఒక రాజకీయ నాయకుడు. ఇతను 2012 నాటికి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ క్యాబినెట్ లో ఆర్థికశాఖమంత్రిగా ఉన్నారు. ఇతను భారత జాతీయ కాంగ్రెస్ రాజకీయ పార్టీ యొక్క సభ్యుడు. 2023 మార్చిలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాసింగ్ ఓటింగ్కు పాల్పడ్డాడని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పార్టీ నుంచి సస్పెండ్ చేసింది.

ఆనం రామనారాయణరెడ్డి
ఆర్థిక మంత్రి (ఆంధ్ర ప్రదేశ్)
In office
2012 -2014
అంతకు ముందు వారుకోణిజేటి రోశయ్య
శాసనసభ సభ్యుడు
In office
1985-1989
1999-2004
2004-2009
నియోజకవర్గంరాపూరు
శాసనసభ సభ్యుడు
In office
2009-2014
నియోజకవర్గంఆత్మకూరు
శాసనసభ సభ్యుడు
In office
2019-
నియోజకవర్గంవెంకటగిరి
వ్యక్తిగత వివరాలు
జననం (1952-07-10) 1952 జూలై 10 (వయసు 71)
నెల్లూరు
రాజకీయ పార్టీవై.ఎస్.ఆర్.కాంగ్రెస్
జీవిత భాగస్వామిఎ.శిరీష
నివాసంహైదరాబాద్

ప్రారంభ జీవితం మార్చు

ఆనం రామనారాయణరెడ్డి నెల్లూరుకు చెందిన ఆనం వెంకటరెడ్డి కుమారుడు. ఇతని సోదరుడు ఆనం వివేకానందరెడ్డి కూడా రాజకీయ నాయకుడే. ఇతను సెయింట్ జోసెఫ్స్ ఇంగ్లీష్ మీడియం ఉన్నత పాఠశాలలో చదువుకున్నాడు, ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి బి.కాం, బి.ఎల్ పట్టాలను పొందాడు.[1]

కెరీర్ మార్చు

రామనారాయణరెడ్డి నెల్లూరు జిల్లా రాపూరు నియోజకవర్గం నుండి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు రెండుసార్లు ఎన్నికయ్యారు. ఈ రెండు సందర్భాలలో ఇతను తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఉన్నాడు. ఇతను ఎన్.టి. రామారావు యొక్క మంత్రివర్గంలో రహదారులు, భవనాల శాఖమంత్రిగా పనిచేశారు. ఇతను 1991లో భారత జాతీయ కాంగ్రెస్‌లో చేరారు, అసెంబ్లీ నియోజక వర్గాల పునర్విభజన పర్యవసానంగా 2009 రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో ఆత్మకూరు అసెంబ్లీ నియోజక వర్గానికి మారి అక్కడ నుంచి మళ్ళీ ఎన్నికయ్యారు. 2007, 2009 మధ్య రామనారాయణరెడ్డి వై.యస్. రాజశేఖరరెడ్డి ప్రభుత్వంలో ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ శాఖ రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. జూలై 2009 నాటికి ఇతను మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ రాష్ట్ర మంత్రిగా నియమించబడ్డాడు. 2012 నాటికి ఇతను కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వంలో ఆర్థికశాఖమంత్రిగా నియమింపబడ్డాడు. 2018లో ఇతడు వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీలో చేరాడు.[2] 2019 శాసనసభ ఎన్నికలలో వెంకటగిరి నియోజకవర్గం నుండి వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచాడు.[3]

రామనారాయణరెడ్డి వైసీపీని విడి టీడిపికి మద్దతుగా ఉండడంతో వైఎస్సార్సీపీ వేసిన పిటిషన్‌తో ఆ పార్టీని వీడిన ఆయనపై అనర్హత వేటు వేస్తూ 2024 ఫిబ్రవరి 26న స్పీకర్‌ తమ్మినేని సీతారాం నిర్ణయం తీసుకున్నాడు.[4][5]

మూలాలు మార్చు

  1. Sakshi (18 March 2019). "నెల్లూరు బరిలోని వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు వీరే". Archived from the original on 5 జనవరి 2022. Retrieved 5 January 2022.
  2. Sakshi (20 March 2019). "ఏళ్ల తరబడి రాజకీయ వారసత్వం". Archived from the original on 5 జనవరి 2022. Retrieved 5 January 2022.
  3. వెబ్ మాస్టర్. "SRI ANAM RAMANARAYANA REDDY Member of Legislative Assembly YSR Congress VENKATAGIRI". లెజిస్లేటివ్ అసెంబ్లీ, ఆంధ్రప్రదేశ్. Centre for Good Governance. Retrieved 14 May 2020.[permanent dead link]
  4. NT News (27 February 2024). "ఏపీలో 8 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు". Archived from the original on 12 March 2024. Retrieved 12 March 2024.
  5. Eenadu (27 February 2024). "8 మంది ఏపీ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు". Archived from the original on 12 March 2024. Retrieved 12 March 2024.