కోదండరాం అసలు పేరు ముద్దసాని కోదండ రామిరెడ్డి. తెలుగు ప్రజానీకానికి ప్రొఫెసర్. కోదండరాం గా సుపరిచితుడు. ప్రొఫెసర్ కోదండరాం ఒక విద్యావేత్త, ఆచార్యులు, రాజకీయ నాయకుడు. వృత్తి రీత్యా ఉస్మానియా విశ్వవిద్యాలయంలో రాజనీతి శాస్త్రం ఆచార్యుడిగా పనిచేశాడు. కొదండరాం తెలంగాణా రాష్ట్ర సాధనకొరకు ఏర్పడిన జాయింట్ యాక్షన్ కమిటీ (JAC)కి అధ్యక్షులు. తెలంగాణ జన సమితి పార్టీ వ్యవస్థాపక అద్యక్ష్యుడు

Kodandaram reddy.jpg
ప్రొఫెసర్ . కోదండరాం
జననంసెప్టెంబరు 5, 1955
విద్యM.A. & M.Phil in Political Science
వృత్తివిద్యావేత్త , ఆచార్యులు, రాజకీయనేత.
పిల్లలుఒక కుమారుడు, ఒక కుమార్తె.

వ్యక్తిగతంసవరించు

ఆదిలాబాదు జిల్లా లోని మంచిర్యాలలో వ్యవసాయదారుడైన ముద్దసాని జనార్ధన్ రెడ్డికి 1955లో కరీంనగర్ జిల్లా ఊటూర్ గ్రామం (మానకొండూర్ మండలం) కొదండరాం జన్మించాడు. విద్య మొత్తం దాదాపుగా అంతా వరంగల్ లోనే జరిగింది. వరంగల్లో గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో డిగ్రీ పూర్తవగానే రాజనీతి శాస్త్రంలో పొస్ట్ గ్రాడ్యుయేషన్ చదవడానికి 1975లో ఉస్మానియా విశ్వవిద్యాలయం, హైదరాబాదులో చేరాడు. 2004లో తెలంగాణ విద్యావంతుల వేదికను ఏర్పాటు చేసాడు. దీనికి ఆయన అధ్యక్షునిగా వ్యవహరించాడు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కొరకు 2009 డిసెంబర్ 24న తెలంగాణ రాజకియ జాయింట్ యాక్షన్ కమిటీ (TJAC) కన్వీనర్ గా చేశారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు, తెలంగాణ కొత్త రాష్ట్రము ఏర్పాటు తర్వాత కల్వకుంట్ల చంద్రశేఖరరావు, తెలంగాణ రాష్ట్ర సమితితో విభేదించి కొత్తగా తెలంగాణ జన సమితి పేరుతో ప్రాంతీయ పార్టీని 2018 మార్చి 31న ప్రారంభించాడు. [1][2]

మూలాలుసవరించు

"https://te.wikipedia.org/w/index.php?title=కోదండరాం&oldid=3890452" నుండి వెలికితీశారు