శాసన మండలి: కూర్పుల మధ్య తేడాలు
కొత్త పేజీ |
(తేడా లేదు)
|
08:36, 23 నవంబరు 2006 నాటి కూర్పు
భారత దేశము యొక్క రాష్ట్రాల శాసన వ్యవస్థలో రెండవ సభను శాసనమండలి అంటారు. 28 రాష్ట్రాలలో కేవలం 5 రాష్ట్రాలలో మాత్రమే ప్రస్తుతం శాసనమండలి ఉన్నది. అవి ఉత్తర ప్రదేశ్, బీహార్, కర్ణాటక, మహారాష్ట్ర మరియు జమ్మూ కాశ్మీరు. రెండు సభలు కలిగిన రాష్ట్రాల శాసన వ్యవస్థలో ఇది ఎగువ సభ. శాసన మండలి సభ్యులు ప్రజలచే అప్రత్యక్షముగా ఎన్నికౌతారు. ఇది శాశ్వత సభ అనగా శాసన సభ వలె దీన్ని రద్దు చేయలేము. ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి మూడొంతుల సభకు ఎన్నికలు జరుపుతారు. శాసన మండలి సభ్యుని పదవీకాలం 6 సంవత్సరాలు.
భారతదేశం |
ఈ వ్యాసం భారతదేశం రాజకీయాలు, ప్రభుత్వంలో ఒక భాగం. |
|
|
|
సభ్యుల అర్హతలు
- శాసనమండల సభ్యుడు కాదలచిన వ్యక్తి భారత పౌరులై ఉండాలి
- కనీసం 30 ఏళ్ళ వయసు ఉండాలి
- మానసికంగా ఆరోగ్యవంతుడై ఉండాలి
- దివాళా తీసి ఉండరాదు.
సభా సభ్యత్వం
శాసన మండలి సభ్యుల సంఖ్య ఆయా రాష్ట్రాల శాసన సభ్యుల సంఖ్యలో మూడొంతుల కంటే మించరాదు. కానీ సభ్యుల సంఖ్య 40 కి తగ్గరాదు. (జమ్మూ కాశ్మీరు శాసన మండలిలో 32 సభ్యులే ఉండటం ప్రత్యేక పార్లమెంటు చట్టము వలన అనుమతించబడినది). శాసన మండలి సభ్యులలో ఆరొంతుల (1/6) మంది సభ్యులు గవర్నరు చే నియమించబడతారు. వీరు సైన్సు, కళలు, సామాజిక సేవ మరియు ఇతర రంగములలో రాణించినవారై ఉంటారు. ఇంకొక మూడొంతుల మందిని స్థానిక ప్రభుత్వ సంస్థలు ఎన్నుకుంటాయి మరియు 1/12 వంతు మందిని ఉన్నత పాఠశాలల, కళాశాలల మరియు విశ్వవిద్యాలయాల అధ్యాపకులు ఎన్నుకొంటారు.