సాళువ వంశం

విజయనగర సామ్రాజ్యాన్ని పాలించిన రాజవంశాలలో ఒకటి
(సాళువ వంశము నుండి దారిమార్పు చెందింది)
విజయ నగర రాజులు
సంగమ వంశము
మొదటి హరిహర రాయలు 1336-1356
మొదటి బుక్క రాయలు 1356-1377
రెండవ హరిహర రాయలు 1377-1404
విరూపాక్ష రాయలు 1404-1405
రెండవ బుక్క రాయలు 1405-1406
మొదటి దేవరాయలు 1406-1422
రామచంద్ర రాయలు 1422
వీర విజయ బుక్క రాయలు 1422-1424
రెండవ దేవ రాయలు 1424-1446
మల్లికార్జున రాయలు 1446-1465
రెండవ విరూపాక్ష రాయలు 1465-1485
ప్రౌఢరాయలు 1485
సాళువ వంశము
సాళువ నరసింహదేవ రాయలు 1485-1491
తిమ్మ భూపాలుడు 1491
రెండవ నరసింహ రాయలు 1491-1505
తుళువ వంశము
తుళువ నరస నాయకుడు 1491-1503
వీరనరసింహ రాయలు 1503-1509
శ్రీ కృష్ణదేవ రాయలు 1509-1529
అచ్యుత దేవ రాయలు 1529-1542
సదాశివ రాయలు 1542-1570
ఆరవీటి వంశము
రామ రాయ 1542-1565
తిరుమల దేవ రాయలు 1565-1572
శ్రీరంగ దేవ రాయలు 1572-1586
వేంకటపతి దేవ రాయలు 1586-1614
శ్రీరంగ రాయలు 1 1614-1614
రామదేవ రాయలు 1617-1632
పెద వేంకట రాయలు 1632-1642
శ్రీరంగ రాయలు 2 1642-1646

సాళువ వంశము విజయనగర సామ్రాజ్యమును పరిపాలించిన రెండవ వంశము. ఈ వంశస్థులు 1485 నుండి 1505 వరకు విజయనగరాన్ని పాలించారు. సాళువ వంశము కన్నడ వంశము. ఈ వంశస్థులు కళ్యాణీపురవరాధీశ్వర అనే బిరుదు ధరించడము వలన కర్ణాటకలోని కళ్యాణీ నగరం వీరి జన్మస్థలమని చరిత్రకారుల అభిప్రాయము. ముస్లింల దండయాత్రలవలన ఆంధ్ర దేశానికి వలస వచ్చారు. వీరి రాజకీయ ప్రాభల్యము కర్నూలు, చంద్రగిరి ప్రాంతాలలో ప్రారంభమైనది.

హైదరాబాదు లోని టాంక్‌బండ్ సాళువ వంశానికి చెందిన శ్రీ కృష్ణదేవ రాయలు విగ్రహము

సాళువ వంశ స్థాపకుడు, సాళువ నరసింహుని ప్రపితామహుడు (ముత్తాత) మంగిరాజుకు ప్రతిపక్ష సాళువ అనే బిరుదు ఉంది. బిరుదనామమే వంశనామమయ్యిందని ఒక ఆలోచన. వీరి పూర్వీకులకు కూడా కటారిసాళువ అనే బిరుదు ఉంది. అయితే వీరి అసలు వంశనామము తెలియదు.

సాళువాభ్యుదయము గ్రంథమును అనుసరించి కంపరాయల మధురాపురి దండయాత్రలో, శ్రీరంగనాథుని పునప్రతిష్ఠించుటలో సాళువ మంగిరాజు ప్రముఖ పాత్ర పోషించాడు. ఈయన శ్రీరంగనాథునికి 60వేల మాడలు, 8 గ్రామాలు దానము చేశాడు. అప్పటి నుండి సాళువ వంశస్థులు కర్నూలు, చంద్రగిరి ప్రాంతాలను విజయనగర ఉద్యోగులుగా పాలించినట్లు స్థానిక చరిత్రలు, శాసనాలు చెబున్నాయి కానీ సాళువాభ్యుదయము ప్రకారము సాళువ నరసింహుని తండ్రి గుండరాజు కళ్యాణీ నుండి పాలించాడని చెబుతున్నది. గుండరాజు మరణానంతరము కళ్యాణీ నగరానికి విపత్తు సంభవించగా నరసింహదేవ రాయలు రాజధానిని చంద్రగిరికి మార్చాడట.

మూలములు మార్చు

  • ఆంధ్రుల చరిత్ర - బి.యస్.యల్.హనుమంతరావు
విజయనగర రాజులు  
సంగమ వంశం | సాళువ వంశం | తుళువ వంశం | ఆరవీడు వంశం | వంశ వృక్షం | పరిపాలన కాలం | సామ్రాజ్య స్థాపన | తళ్ళికోట యుద్ధం | పన్నులు | సామంతులు | ఆర్ధిక పరిస్థితులు | సైనిక స్థితి | సాహిత్య పరిస్థితులు | సామ్రాజ్యం