భాగ్యరేఖ
బి.ఎన్.రెడ్డి ఎంతో కష్టపడి తీసిన బంగారుపాప చిత్రం నిరాశపరచింది. దాంతో తీవ్ర నిరాశకు గురైన బి.ఎన్. వెంటనే సొంత సినిమా తీసే ధైర్యం చేయలేక పోయారు. ఆ దశలో ఆయన దర్శకత్వంలో సినిమా నిర్మించే అవకాశమిమ్మని పొన్నలూరి బ్రదర్స్ ఆయనకు తమ దగ్గరున్న కథ చూపించారు. అంతకంటే మెరుగైన కథ తన దగ్గరే ఉందని బి.ఎన్. బంగారుపాప తీయడానికి ముందు తాను తయారు చేసుకుని పక్కన పడేసిన స్క్రిప్ట్ తోనే 1957లో భాగ్యరేఖ తీశాడు. అలా అది తమ స్వంత సంస్థ వాహినీ వెలుపల ఆయన తీసిన తొలి చిత్రం అయింది. అయితే అది ఆయనకే ఆశ్చర్యం కలిగించేలా హిట్టైంది.
భాగ్యరేఖ (1957 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | బి.ఎన్.రెడ్డి |
---|---|
కథ | పాలగుమ్మి పద్మరాజు |
చిత్రానువాదం | బి.ఎన్.రెడ్డి |
తారాగణం | నందమూరి తారక రామారావు, జమున, సూర్యకాంతం, షావుకారు జానకి, రేలంగి, అల్లు రామలింగయ్య, రమణారెడ్డి , సి.ఎస్.ఆర్., అల్లు రామలింగయ్య, పి. హేమలత, డా. జి.వి. సుబ్బారావు, లక్ష్మీకాంత్, సి. నాగభూషణం , ఇ.వి. సరోజ, డా. శివరామకృష్ణయ్య, కె.వి.ఎస్. శర్మ |
సంగీతం | pendyala Nageswara rao |
నృత్యాలు | వెంపటి సత్యం |
గీతరచన | కొసరాజు రాఘవయ్యచౌదరి, దేవులపల్లి కృష్ణశాస్త్రి, ఎరమాకుల ఆదిశేషారెడ్డి |
సంభాషణలు | పాలగుమ్మి పద్మరాజు |
ఛాయాగ్రహణం | బి.ఎన్. కొండారెడ్డి |
కళ | టి. వి. యస్. శర్మ |
కూర్పు | వాసు |
నిర్మాణ సంస్థ | పొన్నలూరి బ్రదర్స్ |
భాష | తెలుగు |
సాంకేతిక వర్గం
మార్చుకధ:పాలగుమ్మి పద్మరాజు
చిత్రానువాదo: బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి
దర్శకుడు: బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
మాటలు:పాలగుమ్మి పద్మరాజు
పాటలు:దేవులపల్లి కృష్ణశాస్త్రి,కొసరాజు రాఘవయ్య చౌదరి, ఎరమాకుల ఆదిశేషారెడ్డి, బమ్మెర పోతన
నేపథ్య గానం:ఘంటసాల వెంకటేశ్వరరావు, పులపాక సుశీల, ఎ.ఎం.రాజా, మల్లికార్జున, జిక్కి, వైదేహి,
కె.బి.కె.మోహనరాజ్, సత్యవతి, స్వర్ణలత, మాధవపెద్ది సత్యం
కెమెరా: బి.ఎన్.కొండారెడ్డి
నృత్యం: వెంపటి సత్యం
కళ: టి.వి.ఎస్.శర్మ
కూర్పు:వాసు
నిర్మాతలు: పొన్నలూరి బ్రదర్స్
విడుదల:20:02:1957.
కథ
మార్చు"లక్ష్మి" అనే పిల్ల (పెద్దయిన తరువాత జమున ఈ పాత్ర ధరించింది.) చిన్నతనంలో తల్లిదండ్రులను కోల్పోయి పినతండ్రి పంచన చేరింది. పినతండ్రి ఆమె చేయి చూసి ఆ చేతిలో "భాగ్యరేఖ" మెండుగా ఉన్నదంటాడు. లక్ష్మి పినతల్లి (సూర్యకాంతం) తన కూతురు కాత్యాయిని (పెద్దయనాక షావుకారు జానకి) ని ముద్దు చేస్తూ లక్ష్మిని హింసిస్తూ ఉంటుంది.
లక్ష్మి తన తాతవద్దకు వెళ్లి పెరుగుతుంది. కాని వృద్ధుడైన తాత మరణించడంతో మళ్ళీ పిన తల్లిదండ్రులవద్దకు చేరింది. అక్కడ కాత్యాయినిని చూడడానికి వచ్చిన పెళ్ళివారు లక్ష్మిని చేసుకుంటామని అంటారు. పినతల్లి నిష్టూరాలకు బాధపడి లక్ష్మి ఇంటినుండి వెళిపోతుంది. తిరుపతిలో దైవ దర్శనం చేసుకొని ఆత్మహత్యకు సిద్ధమవుతుంది. కాని అప్పుడే ఒక తప్పిపోయిన చిన్న పిల్లను కాపాడి తల్లిదండ్రులవద్దకు చేరుస్తుంది. లక్ష్మి కథ విని ఆ ధనిక కుటుంబం ఆమెను తమతో తీసుకెళ్ళి తమ ఇంట్లో ఉంచుకొంటారు.
అక్కడ వారి కొడుకు (ఎన్.టి.రామారావు) లక్ష్మిని పెళ్ళాడదలచి ఎలాగో తల్లిదండ్రులను ఒప్పిస్తాడు. తీరా పెళ్ళి సమయంలో పినతల్లి, ఇతరులు పన్నిన పన్నాగం వలన పెళ్ళి ఆగిపోతుంది. లక్ష్మి ఆ ఇంటినుండి దూరమౌతుంది. ప్రియుడు (రేలంగి) తో మద్రాసు వెళ్ళీ కాత్యాయిని కష్టాలపాలవుతుంది. ఆమెను లక్ష్మి ఆదుకొంటుంది. మంచంపట్టిన కథానాయకుడు మళ్ళీ లక్ష్మి రాకతో కోలుకుంటాడు.
పాటలు
మార్చుపాట | రచయిత | సంగీతం | గాయకులు |
---|---|---|---|
కన్నె ఎంతో సుందరి సన్నజాజి పందిరి | దేవులపల్లి కృష్ణశాస్త్రి | పెండ్యాల నాగేశ్వరరావు | జిక్కి |
కన్నీటి కడలిలోన చుక్కాని లేని నావ | దేవులపల్లి కృష్ణశాస్త్రి | పెండ్యాల నాగేశ్వరరావు | పి. సుశీల, ఎ.ఎం. రాజా |
తిరుమల మందిర సుందర హరి గోవింద గోవింద | దేవులపల్లి కృష్ణశాస్త్రి | పెండ్యాల నాగేశ్వరరావు | మల్లికార్జున బృందం |
నీవుండే దా కొండపై నా స్వామి నే నుండే దీ నేలపై | దేవులపల్లి కృష్ణశాస్త్రి | పెండ్యాల నాగేశ్వరరావు | పి.సుశీల |
నీ సిగ్గే సింగారమే ఓ చెలియ | దేవులపల్లి కృష్ణశాస్త్రి | పెండ్యాల నాగేశ్వరరావు | ఎ. ఎం. రాజా |
మనసా తెలుసా నీ విరాగ మంతా వృథాయని తెలుసా | దేవులపల్లి కృష్ణశాస్త్రి | పెండ్యాల నాగేశ్వరరావు | మాధవపెద్ది సత్యం |
మనసూగే సఖ, తనువూగే ప్రియ | దేవులపల్లి కృష్ణశాస్త్రి | పెండ్యాల నాగేశ్వరరావు | పి సుశీల, ఎ.ఎం.రాజా |
- ఓ నా మొరవినరాదా ఇక ఈ చర విడిపోదా, రచన:దేవులపల్లి కృష్ణశాస్త్రి, గానం.వైదేహి
- తరువూగే సఖీ తెరువూగే ప్రియ తలిరాకు ఓలేడెందం, రచన: దేవులపల్లి కృష్ణశాస్త్రి, గానం.పులపాక సుశీల, ఎ.ఎం.రాజా
- తల్లిని తండ్రిని ఎరుగగదా నాతండ్రి ఏ సుఖ మెరుగగదా, రచన:దేవులపల్లి ,గానం. పి.సుశీల
- నీ వుండేదా కొండపై నాస్వామీ నేనుండేదీ నేలపై , రచన:దేవులపల్లి, గానం.మాధవపెద్ది, పి సుశీల
- అందాల రాజవాడురా నా వన్నేకాడు ఎందుదాగి, రచన:కొసరాజు రాఘవయ్య చౌదరి, గానం.జిక్కి, సత్యవతి, కె.బి.కె.మోహనరాజ్
- ఏక్ బుడ్డి ఆరణా దో బుడ్డి బారణా పత్యమేధిలేదండి, రచన:కొసరాజు, రాఘవయ్య చౌదరి గానం.మాధవపెద్ది సత్యం,స్వర్ణలత
- లోకం గమ్మత్తురా ఈ లోకం గమ్మత్తూరా , రచన: ఎరమాకుల ఆదిశేషారెడ్డి, గానం.మాధవపెద్ది, సత్యం సత్యవతి .
- ఎవ్వనిచే జనించు జగము ఎవ్వని లోపల(పద్యం), రచన: బమ్మెర పోతన, గానం.పులపాక సుశీల
- ఏడుచు నేడుచు ఈబ్రతుకు నీడుచుచుంటి సౌఖ్యమన్నది(పద్యం) గానం.పులపాక సుశీల
- పేరేరా బొమ్మల పెళ్ళి(పద్యం), గానం. మాధవపెద్ది సత్యం
- కలడందురు దీనుల ఎడ కలడందురు పరమయోగి(పద్యం), రచన: బమ్మెర పోతన, గానం.ఘంటసాల వెంకటేశ్వరరావు.
పురస్కారాలు
మార్చు- భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు[1]
- 5వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు (1957) - భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు - ఉత్తమ తెలుగు సినిమా - ప్రశంసా పత్రం.
మూలాలు
మార్చు- ↑ "5th National Film Awards" (PDF). Directorate of Film Festivals. Retrieved 2 September 2011.
- డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.
- భాగ్య రేఖ పాటలు వినండి.
- ఘంటసాల గళామృతము, కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.