శ్రీ సూర్యరాయ విద్యానంద గ్రంథాలయం

శ్రీ సూర్యరాయ విద్యానంద గ్రంథాలయం పిఠాపురం లోని ప్రముఖ గ్రంథాలయం. ఇది 1915వ సంవత్సరంలో స్థాపించబడింది.[1]

శ్రీ సూర్యరాయ విద్యానంద గ్రంథాలయం
(SRI SURYARAYA VIDYANANDA LIBRARY)
సూర్యరాయ విద్యానంద గ్రంథాలయ ముఖద్వారం
దేశముభారత దేశము
తరహాప్రైవేటు
ప్రదేశముపిఠాపురం
భౌగోళికాంశాలు017°07′00″N 082°16′00″E / 17.11667°N 82.26667°E / 17.11667; 82.26667

పూర్వ చరిత్ర మార్చు

శతాబ్ధాల చరిత్ర కలిగిన పిఠాపురం జైన మతం, బౌద్ధ మతం, శైవ మతం, వైష్ణవ మతం ఇలా అన్ని దివ్య క్షేత్రాల కూడలిగా ఉంది. 1907 ప్రాంతంలో పిఠాపురం మాహారాజా సూర్యారావు గారు రాజరికానికి వచ్చిన తరువాత వారితోపాటుగా బ్రహ్మ సమాజీకులు మొక్కపాటి సుబ్బారాయుడుగారు, రఘుపతి వెంకటరత్నం నాయుడుగారు, పిఠాపురానికి దయచేసారు. అప్పటి నుండి కాకినాడ, పిఠాపురం, రాజమండ్రి వగైరా పట్టణాలలో సమాజ పరంగానూ మహారాజావారు వ్యక్తిగతంగానూ ప్రోత్సహించి సాంఘిక న్యాయం కోసం కార్యక్రమాలను చేపట్టి ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళారు.

రఘుపతి వెంకటరత్నం నాయుడు ఆదేశాaల మేరకు హరిజన, నిమ్నజాతుల అభివృద్ధికై కాకినాడలో శరణాలయం, రాజమండ్రిలో వీరేశలింగ ఆస్తికపాఠశాల, పిఠాపురంలో హరిజన బాల బాలికల శరణాలయాలు స్థాపించారు. వీటిలో ఉచిత భోజన, వసతి, విద్యాబోధనలు ఏర్పాటు చేసారు. అలా పిఠాపురానికి ఉత్తేజాన్ని తీసుకొచ్చారు శ్రీ రాజావారు. అయితే ఈ మార్పు వలన రాజ వారి చుట్టూ భజన పరుల సంఖ్య ఎక్కువ చేసింది కాని సమాజంలో తగిన మార్పు తీసుకురాలేకపోయింది. ఈ సమయంలో పురాతన సంసృతీ వ్యవస్థ, ఆధునిక బ్రహ్మ సమాజ వ్యవస్థల మద్య గ్రాంధిక బాషా బేషజాలు, జమిందారీ వ్యవస్థ మద్య జాతీయోజ్యమం, గ్రంథాలయ పరిణామం సాగుతూ వచ్చాయి.

ప్రారంభ చరిత్ర మార్చు

ఆ సమయంలో పిఠాపురం చరిత్రలో గొప్ప మలుపు చోటుచేసుకుంది. అదే సూర్యరాయ విద్యానంద గ్రంథాలయ స్థాపన. 1915 మార్చి 16 న శ్రీ మలిరెడ్డి వెంకటరాయుడు, వేపూరి వేణుగోపాలదాసు, శ్రీ కొత్త సూర్యనారాయణగార్లు మరికొందరు దేశభక్తులు కలసి పిఠాపురంలో విద్యానంద పుస్తక భాండాగారాన్ని స్థాపించారు. పిమ్మట శ్రీ హనుమానుల సూర్యనారాయణ గుప్త గారు అదే పట్టణంలో 12-03-1916లో శ్రీ సూర్యరాయ పుస్తక భాండారాన్ని నెలకొల్పారు.

దీనికి ఉపశాఖగా దామెర రామస్వామి గారి అధ్యక్షతన ఆంధ్రబాషా అభివృద్ధి నాటకసమాజం అనే ఒక సంస్థను మహారాజా వారి సహకారంతో స్థాపించారు. ఈ నాటక సమాజానికి రాజావారు యాభైవేలను విరాళంగా ఇచ్చారు. ఈ విరాళంతో నాటక సమాజానికి కావలసిన హంగులు సమకూర్చుకొని వేణీ సంహారం, విజయ విలాసం వంటి నాటకాలను, కొన్ని సంసృత నాటకాలనూ రాష్ట్రమంతటా పలు చోట్ల ప్రదర్శించేవారు. ఇలా నాటక సమాజం ద్వారా ప్రదర్శనలు ఇస్తూనే పిఠాపురం రెండు గ్రంథాలయాల నిర్వహకులు గ్రంథ సేకరణ, వనరుల సేకరణలో పోటాపోటీగా పనిచేసేవారు.

సూర్యరాయ, విద్యానంద గ్రంథాలయాలు మార్చు

 
సూర్యరాయ విద్యానంద గ్రంథాలయ భవనం

గ్రంథాలయ ఉద్యమంలో పిఠాపురం కేంద్రంగా రెండు గ్రంథాలయాలు విడివిడిగా పనిచేయడం కంటే కలసి పనిచేస్తే మరింత భావుంటుందని తలచిన స్థానిక పెద్దల కోరిక ఫలితంగా రెండు గ్రంథాలయాలు కలపి సూర్యరాయ విద్యానంధ గ్రంథాలయంగా రూపొందించారు. అన్ని పుస్తకాలను కలపి జాబితా రూపొందించారు. ఇది సోములు బాబుగా పిలిచే దామెర స్వాముల బాబు గారి ఇంట్లో ఎక్కువ కాలం నడిచింది. తదుపరి నగరంలో రెండు మూడు ఇళ్ళు మారింది. 30 సంవత్సరాలు గడిచిన పిమ్మట పాఠకుల సంఖ్య, గ్రంథాల సంఖ్య విశేషంగా పెరగటం వలన గ్రంథాలయానికి సొంత స్థలం, భవనం సమకూర్చాలని ఊరి ప్రముఖులు యోచన చేసారు.

ఆటుపోట్లు మార్చు

 
గ్రంథాలయ ప్రాంగణంలో కళావేదిక

1942లో సోషలిస్ట్ భావాలు కల చెలికాని భావనరావు గారు, అవంత్స సోమసుందర్ గార్లు దీనికి కృషిచేసారు, గ్రంథాలయానికి సొంత భవనం సమకూర్చారు. 1944 లో కొత్త కార్యవర్గం వచ్చిన పిదప పాత బస్టాండ్‌కు సమీపాన కల పెంకుటింటికి మార్చబడింది. అలా గ్రంథాలయానికి సొంత జాగా ఏర్పడినది. చెలికాని భావనరావు గారు కొంత కాలం ఊరు విడి వెళ్ళటం జరిగింది.

ప్రకృతి వైపరీత్యాల వలన, కొన్ని వైషమ్యాల వలన గ్రంథాలయ నిర్వహణ కుంటుపడటం, సాంసృతిక కూడలిగా ఉండాలనే తలంపుతో ఊరిలో కల కల్చరల్ క్లబ్‌ను ప్రక్కన కల రెండో భవనంలోకి దానిని తీసుకురావడం ద్వారా గ్రంథాలయంలో ఇతర అసాంఘిక కార్యక్రమాలకు నెలవుగా మారింది. అదేకాక పెంకుటింటిలో కొంత భాగం కూలిపోగా బాగా దెబ్బతినడం జరిగింది. అయితే పుస్తకాలు చాలా వరకూ జాగ్రత్త చేయబడ్డాయి.

తిరిగి ఊరు వచ్చిన చెలికాని భావనరావు గారు పరిస్థితులను పరిశీలించి గ్రంథాలయానికి తిరిగి పూర్వ వైభవం తేవాలని రాయవరపు సుబ్బరావు గారితో కలసి కోర్టులో గ్రంథాలయం తరపున పోరాడి రాజావారి దగ్గర నుండి 1400 రూపాయలతో భవనం, స్థలం మొత్తంగా కొనుగోలు చేసి గ్రంథాలయం పేరుతో 1974లో రిజిస్టర్ చేయించారు. జిలా గ్రంథాలయ అద్యక్షుడైన కొప్పన వెంకట కొండలరావు గారి ప్రోత్సాహంతో తిరిగి గ్రంథాలయ నిర్వహణ ఒక దారికి తీసుకువచ్చారు.

 
గ్రంథాలయ లోపలి భాగంలో

పునర్నిర్మాణం మార్చు

ప్రస్తుతం ఉన్న భవనం 1977-78 లో పునర్‌నిర్మించడం జరిగింది. దీనికి నటరాజ రామకృష్ణ బృందం, కళాకృష్ణ, డా.విజయలక్ష్మీ మురళీకృష్ణ గార్లకుమార్తె తుషార, సతివాడ సూర్యనారాయణ గారి కుమార్తె రాధిక మున్నగువారు ప్రధర్శనల ద్వారా నిధులను పోగుచేసి ఇచ్చారు. దానితో పాటుగా అప్పటి గ్రంథాలయ శాఖామాత్యులు భాట్టం శ్రీరామమూర్తి గారు, జె. చోక్కారావు గార్ల సహకారం, ఆంధ్ర నాట్య ప్రధర్శనల ద్వారా నూతన భవన నిర్మాణం జరిగింది.

ధాతలు, సహాయకులు మార్చు

  • 1917లో కలియుక భీమునిగా కీర్తింపబడిన కోడి రామ్మూర్తి గారు పిఠాపురం వచ్చినపుడు విద్యానంద గ్రంథాలయం చూసి వంద రూపాయలు విరాళంగా ఇవ్వగా, ఆ విరాళంతో పుస్తక భద్రత కొరకు నాలుగు టేకు బీరువాలు చేయించారు. అవి ఇప్పటికీ వాడుకలో ఉన్నాయి
  • 1940లో లక్ష్మీ నరసాపురం సంస్థనాధిపతులైన శ్రీ రావు రామాయమ్మ గారు ఎన్నో గ్రంథాలను సేకరించి పంపినారు, వాటి భద్రత కొరకు నాలుగు టేకు బీరువాలు చేయించారు.

నిర్వహణా విశేషాలు మార్చు

 
పత్రికా విభాగం

మాధవరావు గారి ప్రోద్భలంతో 1990 లో గ్రంథాలయ నిర్వహణ నిమిత్తం ముందు కల కాళీ స్థలంలో ముందు 3 షాపులను నిర్మించారు. వాటి ఆదాయం ద్వారా గ్రంథాలయ అభివృద్ధి నిమిత్తం ఖర్చుచేస్తూఉన్నారు. తధనంతర కాలంలో మరో 4 షాపులు 2006 లో నిర్మించారు. గ్రంథాలయ పై భాగాన ఊరి ధాతల సహకారంతో మరోక అంతస్తు నిర్మించారు. దీన్లో సాంసృతిక సభలకు, సమావేశాలకు నామ మాత్రపు అద్దెతో ఇవ్వడం ద్వారా గ్రంథాలయ నిర్వహణకు మరొక వనరుగా ఏర్పరిచారు.

వజ్రోత్సవం మార్చు

కృష్ణశాస్త్రి, విశ్వనాధ సత్యనారాయణ, సి.నారాయణ రెడ్డి, మల్లంపల్లి సోమశేఖర శర్మ వంటి అనేకమంది ఇక్కడ ఆహ్వానించి వారి ప్రసంగాలతో ఉత్తేజితులై వారిని సన్మానించుకొంటూ వెలిగినది. 1977లో వజ్రోత్సవం జరిగింది. పాతూరి నాగభూషణం, ఎం. ఆర్. అప్పారావు, భాష్యం అప్పలాచార్యులు, వెంపరాల సూర్యనారాయణ శాస్త్రి మొదలైన వారు పాల్గొని వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించారు

కార్య వర్గం మార్చు

  1. కాదులూరి వెంకట్రావు రెడ్డి - గౌరవ అద్యక్షులు
  2. చెలికాని మనోహర్ - గౌరవ అద్యక్షులు
  3. శ్రీ బాదం మాధవరావు - అద్యక్షులు
  4. కొత్తెం సుబ్బారావు - ఉపాదక్షులు
  5. మునగాల వెంకట సుందర భరతుడు -ఉపాద్యక్షులు
  6. కొండేపూడి శంకరరావు - కార్యదర్సి
  7. రాయవరపు వెంకట సుబ్బారావు - సహాయ కార్యదర్సి
  8. పత్రి రామకృష్ణ - కోశాసికారి
  9. వలవల సూర్యనారాయణ
  10. కండిపల్లి వెంకటరమణ
  11. సన్నపు కిషోర్ కుమర్
  12. పెదపాటి పెదనాయన
  13. సయ్యద్ మోహిద్దీన్ గారు

ఇతర విశేషాలు మార్చు

  • గ్రంథాలయంలో కల తాళపత్రాలను జాగ్రత్త చేయుట కొరకు జిల్లా గ్రంథాలయ సంస్థకు చేర్చడం జరిగింది. వాటిలో కల విలువైన జోతిష శాస్త్ర గ్రంథాలను ప్రాచీన గ్రంథాలయ రక్షణ శాఖకు తరలించారు
  • 2015 న ఈ గ్రంథాలయం నూరు సంవత్సరాలు పూర్తిచేసుకొని ఉత్సవాలు జరుపుకుంటుంది.


మూలాలు మార్చు

వికీ ప్రాజెక్టు - తెలుగు గ్రంథాలయం
తెలుగు గ్రంథాలయం యొక్క పుట్టుక, గ్రంథాలయ ఉద్యమం, ప్రసిద్ద గ్రంథాలయాల జాబితా, కొన్ని ప్రసిద్ద గ్రంథాలయాలలోని పుస్తకాల జాబితాల యొక్క సమగ్ర సమాచారం. దీనిలో భాగంగా తెలుగు గ్రంథాలయం అనే ప్రాజెక్టు పనిలో భాగంగా ఈ జాబితాలను చేపట్టి అభివృద్ధి చేస్తున్నాము. ఈ క్రింది గ్రంథాలయాలలో గల పుస్తకాల వివరాలు జాబితా చేస్తూ క్రింది సంఖ్యా క్రమంలో చేర్చుతున్నాము.

అన్నమయ్యగ్రంధాలయంగౌతమీగ్రంధాలయంసూర్యరాయ గ్రంథాలయంవీరేశలింగగ్రంథాలయంసర్వోత్తమగ్రంథాలయం

శ్రీ సూర్యరాయ విద్యానంద గ్రంథాలయ పుస్తకాల జాబితా

01 - 02 - 03 - 04 - 05 - 06 - 07 - 08 - 09 - 10 - 11 - 12 - 13 - 14 - 15 - 16 - 17 - 18 - 19 - 20
21 - 22 - 23 - 24 - 25 - 26 - 27 - 28 - 29 - 30 - 31 - 32 - 33 - 34 - 35 - 36 - 37 - 38 - 39 - 40