పద్య విశేషాలు
వృత్తాలు
ఉత్పలమాల, చంపకమాల
మత్తేభం, శార్దూలం
తరళం, తరలము
తరలి, మాలిని
మత్తకోకిల
స్రగ్ధర, మహాస్రగ్ధర
ఇంద్రవజ్రము, ఉపేంద్రవజ్రము
లయగ్రాహి, లయవిభాతి
జాతులు
కందం, ద్విపద
తరువోజ
అక్కరలు
ఉప జాతులు
తేటగీతి
ఆటవెలది
సీసము

మధురాక్కర[1] ప్రసిద్ధ తెలుగు పద్య ఛందోరూపం. మధురాక్కర అత్యంత ప్రాచీన పద్యరూపం. నన్నయ కాలానికి ముందే వున్నది. ఈ పద్యరీతి శాసనాల్లో వాడుకలో ఉండడం కనిపిస్తోంది. ఆపైన నన్నయ యుగంలో కూడా దీని వాడుక కనిపిస్తోంది. ఆంధ్రమహా భారత రచనలో ఆదికవి, వాగనుశాసనుడు అయిన నన్నయ్య ఈ ఛందోరీతిని వినియోగించినట్టు మనకు కనబడుతుంది. ఆపైన కావ్యాల వాడుకలోంచి క్రమంగా తప్పిపోయి విస్మృతిలో పడిపోయింది.

పద్య లక్షణముసవరించు

నాలుగు పాదములు ఉండును.
ప్రతి పాదమునందు ఒక సూర్య , మూడు ఇంద్ర , ఒక చంద్ర గణములుండును.

ప్రాససవరించు

నియమము కలదు.

యతిసవరించు

ప్రతి పాదమునందు 4వ గణము యొక్క మొదటి అక్షరము యతి స్థానము

ఉదాహరణలు[2]సవరించు

మధురాక్కర

తరణి వాసవ త్రితయంబు ధవళ భానుయుతి నొంద
నిరతి విశ్రాంతి నాలవనెలవున నింపుమీఱ
సరసమధురార్ధములఁ జెప్పఁ జను మధురాక్కరంబు
వరుసఁ బంచగణములను వాలి కృతుల వెలయు

మూలాలుసవరించు

  1. "మధురాక్కర". Archived from the original on 2017-11-24. Retrieved 2017-02-23.
  2. "మధురాక్కర ఉదాహరణలు". Archived from the original on 2017-11-24. Retrieved 2017-02-23.