పద్య విశేషాలు
వృత్తాలు
ఉత్పలమాల, చంపకమాల
మత్తేభం, శార్దూలం
తరళం, తరలము
తరలి, మాలిని
మత్తకోకిల
స్రగ్ధర, మహాస్రగ్ధర
ఇంద్రవజ్రము, ఉపేంద్రవజ్రము
లయగ్రాహి, లయవిభాతి
జాతులు
కందం, ద్విపద
తరువోజ
అక్కరలు
ఉప జాతులు
తేటగీతి
ఆటవెలది
సీసము

మధురాక్కర[1] ప్రసిద్ధ తెలుగు పద్య ఛందోరూపం. మధురాక్కర అత్యంత ప్రాచీన పద్యరూపం. నన్నయ కాలానికి ముందే వున్నది. ఈ పద్యరీతి శాసనాల్లో వాడుకలో ఉండడం కనిపిస్తోంది. ఆపైన నన్నయ యుగంలో కూడా దీని వాడుక కనిపిస్తోంది. ఆంధ్రమహా భారత రచనలో ఆదికవి, వాగనుశాసనుడు అయిన నన్నయ్య ఈ ఛందోరీతిని వినియోగించినట్టు మనకు కనబడుతుంది. ఆపైన కావ్యాల వాడుకలోంచి క్రమంగా తప్పిపోయి విస్మృతిలో పడిపోయింది.

పద్య లక్షణము మార్చు

నాలుగు పాదములు ఉండును.
ప్రతి పాదమునందు ఒక సూర్య , మూడు ఇంద్ర , ఒక చంద్ర గణములుండును.

ప్రాస మార్చు

నియమము కలదు.

యతి మార్చు

ప్రతి పాదమునందు 4వ గణము యొక్క మొదటి అక్షరము యతి స్థానము

ఉదాహరణలు[2] మార్చు

మధురాక్కర

తరణి వాసవ త్రితయంబు ధవళ భానుయుతి నొంద
నిరతి విశ్రాంతి నాలవనెలవున నింపుమీఱ
సరసమధురార్ధములఁ జెప్పఁ జను మధురాక్కరంబు
వరుసఁ బంచగణములను వాలి కృతుల వెలయు

మూలాలు మార్చు

  1. "మధురాక్కర". Archived from the original on 2017-11-24. Retrieved 2017-02-23.
  2. "మధురాక్కర ఉదాహరణలు". Archived from the original on 2017-11-24. Retrieved 2017-02-23.