త్రివిక్రమ్ శ్రీనివాస్
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
త్రివిక్రమ్ శ్రీనివాస్ తెలుగు సినీ మాటల రచయిత, కథారచయిత, దర్శకుడు. పశ్చిమ గోదావరి జిల్లా, భీమవరంలో జన్మించిన శ్రీనివాస్ న్యూక్లియర్ ఫిజిక్స్ లో ఎం. ఎస్. సి చేశాడు. బంగారు పతకం సాధించాడు. కొంతకాలం ఉపాధ్యాయుడిగా పనిచేసాడు. సాహిత్యంపై ఉన్న ఆసక్తితో సినిమా రంగంలోకి ప్రవేశించాడు. హైదరాబాదుకు వచ్చి పోసాని కృష్ణమురళి దగ్గర సహాయకుడిగా చేరాడు. మొదట్లో నటుడు సునీల్ తో కలిసి ఒకే గదిలో ఉండేవాడు. 1999 లో స్వయంవరం సినిమా ద్వారా మాటల రచయితగా సినీ రంగ ప్రవేశం చేసాడు. నువ్వే కావాలి, నువ్వు నాకు నచ్చావ్, మన్మథుడు వంటి సినిమాలకు కథ, స్క్రీన్ప్లే రచయితగా, అతడు, జులాయి, అత్తారింటికి దారేది వంటి సినిమాలకు దర్శకునిగా తెలుగు సినిమా రంగంలో పేరుపొందాడు.
త్రివిక్రమ్ శ్రీనివాస్ | |
---|---|
![]() "అ ఆ" సినీనిర్మాణంలో త్రివిక్రమ్ | |
జననం | ఆకెళ్ల నాగశ్రీనివాస్ 1971 నవంబరు 7 |
జాతీయత | భారతీయుడు |
విద్య | ఎం. ఎస్. సి, న్యూక్లియర్ ఫిజిక్స్ |
విద్యాసంస్థ | ఆంధ్ర విశ్వవిద్యాలయం |
వృత్తి | మాటల రచయిత స్క్రీన్ రచయిత దర్శకుడు వాణిజ్య ప్రకటనల దర్శకుడు |
క్రియాశీల సంవత్సరాలు | 1999 – ప్రస్తుతం |
జీవిత భాగస్వామి | సౌజన్య[1] |
తల్లిదండ్రులు |
|
పురస్కారాలు | సైమా పురస్కారం ఫిల్మ్ ఫేర్ అవార్డ్ సౌత్ నంది పురస్కరం |
బాల్యం, విద్యాభ్యాసం సవరించు
త్రివిక్రమ్ శ్రీనివాస్ అసలు పేరు ఆకెళ్ళ నాగశ్రీనివాస్. 1971 నవంబరు 7 వ తేదీన పశ్చిమ గోదావరి జిల్లా, భీమవరంలో ఆకెళ్ల ఉదయ భాస్కరరావు, నరసమ్మలకు దంపతులకు జన్మించాడు. భీమవరంలోని డి.ఎన్.ఆర్ కాలేజీలో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ పూర్తి చేసారు. ఆంధ్రా విశ్వవిద్యాలయంలో అణుకేంద్ర శాస్త్రంలో ఎం. ఎస్. సి పూర్తి చేసుకుని స్వర్ణ పతకం సాధించాడు.[2]
సినీప్రస్థానం సవరించు
సాహిత్యం పై ఉన్న ఆసక్తితో సినిమాలోకి రావాలనుకున్నాడు. త్రివిక్రమ్, హాస్యనటుడు సునీల్ ఒకే కళాశాలలో చదువుకున్నారు. ఇద్దరూ కలిసి హైదరాబాదుకు బయలుదేరారు. ఒకే గదిని పంచుకున్నారు. సునీల్ త్రివిక్రమ్ ను తన జీవితంలో ఎంతో ప్రభావవంతమైన వ్యక్తిగా భావిస్తాడు. సునీల్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ను గౌతంరాజుకు పిల్లలకు ట్యూషన్ చెప్పేవాడిగా పరిచయం చేసాడు. అదే సమయంలో ఒక ప్రముఖ వారపత్రికలో శ్రీనివాస్ రాసిన "ది రోడ్" అనే కథ ప్రచురితం అయ్యింది.
కొద్ది కాలానికి పోసాని కృష్ణ మురళి దగ్గర సహాయకుడిగా చేరాడు. 1999లో కె. విజయ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన స్వయంవరం చిత్రానికి రచయితగా అవకాశం వచ్చింది. తర్వాత నువ్వే కావాలి, చిరునవ్వుతో, నిన్నే ప్రేమిస్తా, నువ్వు నాకు నచ్చావ్ చిత్రాలకు మాటలు రాశాడు. తర్వాత తరుణ్ కథానాయకుడిగా వచ్చిన నువ్వే నువ్వే చిత్రంతో దర్శకుడిగా మారాడు. తర్వాత కూడా రచయితగా వాసు, మన్మథుడు, ఒక రాజు ఒక రాణి, మల్లీశ్వరి, జై చిరంజీవ చిత్రాలకు పనిచేశాడు.
నువ్వే నువ్వే చిత్రం తర్వాత మరో చిత్రం దర్శకత్వం వహించడం కోసం మూడేళ్ళ సమయం పట్టింది. మహేష్ బాబు కథానాయకుడిగా వచ్చిన అతడు సినిమా మంచి విజయం సాధించింది. తర్వాత పవన్ కల్యాణ్ తో తీసిన జల్సా సినిమా కూడా ఘనవిజయం సాధించింది. తర్వాత మహేష్ బాబుతో తీసిన ఖలేజా సినిమా అంచనాలను అందుకోలేదు. తర్వాత వచ్చిన జులాయి, అత్తారింటికి దారేది, సన్నాఫ్ సత్యమూర్తి, అ ఆ విజయవంతం అయ్యాయి. మళ్ళీ అజ్ఞాతవాసి ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. తర్వాత వచ్చిన అల వైకుంఠపురములో బాక్సాఫీసు వచ్చ విజయం సాధించింది.
రచనా శైలి సవరించు
సినిమాల జాబితా సవరించు
విడుల కాని చిత్రాలను సూచిస్తుంది |
సంవత్సరం | సినిమా | దర్శకుడు | స్క్రీన్ రైటర్ | మాటల రచయిత | కథారచయిత | Notes |
---|---|---|---|---|---|---|
2002 | నువ్వే నువ్వే | Yes | Yes | Yes | Yes | ఉత్తమ మాటల రచయిత- నంది పురస్కారం |
2005 | అతడు | Yes | Yes | Yes | Yes | Filmfare Award for Best Director – Telugu Nandi Award for Best Dialogue Writer Vamsee International Award for Best Director |
2008 | జల్సా | Yes | Yes | Yes | Yes | |
2010 | ఖలేజా | Yes | Yes | Yes | Yes | |
2012 | జులాయి | Yes | Yes | Yes | Yes | |
2013 | అత్తారింటికి దారేది | Yes | Yes | Yes | Yes | Filmfare Award for Best Director – Telugu SIIMA Award for Best Director - Telugu SIIMA Award for Best Telugu Film Nandi Award for Best Popular Feature Film Nandi Award for Best Dialogue Writer |
2015 | సన్నాఫ్ సత్యమూర్తి | Yes | Yes | Yes | Yes | |
2016 | అ ఆ | Yes | Yes | Yes | ||
2018 | అజ్ఞాతవాసి | Yes | Yes | Yes | ||
2019 | అరవింద సమేత వీర రాఘవ | Yes | Yes | Yes | Yes | |
2020 | అల వైకుంఠపురంలో | Yes | Yes | Yes | Yes | |
2020 | మహేష్ బాబు#27 | Yes | Yes | Yes | Yes |
పురస్కారములు సవరించు
తెలుగు ఫిల్మ్ ఫేర్ పురస్కారములు సవరించు
నంది పురస్కారములు సవరించు
- 2000: ఉత్తమ మాటల రచయిత చిరునవ్వుతో
- 2001: ఉత్తమ మాటల రచయిత నువ్వు నాకు నచ్చావ్
- 2002: ఉత్తమ మాటల రచయిత నువ్వే నువ్వే
- 2004: ఉత్తమ మాటల రచయిత మల్లీశ్వరి (2004 సినిమా)
- 2005: ఉత్తమ మాటల రచయిత అతడు
- 2013 : ఉత్తమ మాటల రచయిత అత్తారింటికి దారేది (నంది పురస్కారం - 2013 నంది పురస్కారాలు)[3]
- 2015: బి. ఎన్ రెడ్డి పురస్కారం
సైమా అవార్డులు సవరించు
- 2020: సైమా ఉత్తమ దర్శకుడు (అల వైకుంఠపురంలో)
- 2013: సైమా ఉత్తమ దర్శకుడు (అత్తారింటికి దారేది)
మూలాలు సవరించు
- ↑ Namasthe Telangana (2 April 2023). "ఆ రెండు కథలూ నేను ఓకే చేసినవే". Archived from the original on 3 April 2023. Retrieved 3 April 2023.
- ↑ "'అ ఆ'లతో గారడీ చేసే 'అజ్ఞాతవాసి' త్రివిక్రమ్". www.eenadu.net. Retrieved 2020-11-07.
- ↑ "Nandi Awards: Here's the complete list of winners for 2012 and 2013". hindustantimes.com/ (in ఇంగ్లీష్). 2017-03-01. Retrieved 25 June 2020.