వికీపీడియా:వికీప్రాజెక్టు/తెలుగు సమాచారం అందుబాటులోకి/DLI లోని తెలుగు పుస్తకాల జాబితా - క్ష

అక్షరక్రమంలో డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలోని తెలుగు పుస్తకాలు
అంతర్జాలంలో ఉన్న విలువైన తెలుగు పుస్తకాలు మరింత అందుబాటులోకి తీసుకురావడం కోసం ప్రారంభించిన తెలుగు సమాచారం అందుబాటులోకి అనే ప్రాజెక్టు పనిలో భాగంగా ఈ జాబితా చేపట్టి అభివృద్ధి చేస్తున్నాం. డిజిటల్ లైబ్రరీలోని పలు తెలుగు పుస్తకాల లింకులు, వివరాలు జాబితా చేస్తూ కింద అక్షర క్రమంలో చేర్చుతున్నాము. వీటిలో చాలావరకూ కాపీరైట్లు లేనివే ఉన్నా కొన్ని మాత్రం కాపీరైట్ పరిధిలో ఉన్నవి ఉండివుండొచ్చు.

అంకెలు - - - - - - - - - - - - - - అం - - - - - - - - - -
- - - - - - - - - - - - - - - - - - - - - క్ష

డీఎల్‌ఐలోని తెలుగు పుస్తకాలు మార్చు

పుస్తకం, లింక్ రచయిత కాటగిరీ పుస్తకం గురించి డి.ఎల్.ఐ. బార్‌కోడ్ ప్రచురణ సంవత్సరం
క్షరాక్షరోపాదిద్వయ దోషరహిత పరమతత్వ కందములు [1] భాగవత కృష్ణదేశిక ప్రభువులు సాహిత్యం 2020010005650 1952
క్షాత్రయుగము నాటి హింద్వార్యులు [2] మాడపాటి హనుమంతరావు చరిత్ర ఆర్యజాతిగా భావిస్తున్న గంగా మైదాన ప్రాంతవాసులు క్రీ.పూ.3000 నుంచి క్రీ.పూ.250 వరకు ఎలా ఉన్నారన్న వివరాలతో ఈ పుస్తకం రాశారు. రామాయణ మహాభారతాల నాటి కాలం క్రీ.పూ.3000 నుంచి క్రీ.పూ.250 వరకూ విస్తరించిందని భావిస్తూ ఆ యుగానికి క్షాత్ర యుగం (వీరగాథల కాలం కనుక) పేరుపెట్టారు. ఆ కాలంలో ఆర్యులు ఎలాంటి దుస్తులు ధరించేవారు, ఏ ఆహారం స్వీకరించేవారు, వావివరుసలు ఏలా ఉండేవి వంటి అంశాలను అప్పటికాలపు సాహిత్యంగా భావిస్తున్న మహాభారత, రామాయణాలను ఆధారంగా చేసుకుని వివరించారు. ఈ యుగాన్ని ఆనాటి కాలంలోని పలువురు చరిత్రకారులు క్రీ.పూ.1200 నుంచి క్రీ.పూ.200 వరకూ విస్తరించిందని భావించినా రచయిత మాత్రం సి.వి.వైద్యా అన్న ప్రసిద్ధ చరిత్రకారుని ఆధారం చేసుకుని క్రీ.పూ.3000 నుంచి క్షాత్రయుగం ఉందన్న నిశ్చయానికి వచ్చి ఈ గ్రంథ రచన చేశారు. గ్రంథంలోని పలు విషయాలపై వైద్యా ప్రభావం ఉందని ఆయన ప్రకటించారు. 2990100067500 1927

మూలాలు మార్చు

డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా[dead link]