ఎం. వి. ఎస్. హరనాథ రావు
ఎం. వి. ఎస్. హరనాథ రావు (జూలై 27, 1948 - అక్టోబర్ 9, 2017) నాటక రచయిత, సినీ మాటల రచయిత, నటుడు.[3][4] 150 సినిమాలకు పైగా సంభాషణలు రాశాడు. ప్రతిఘటన, భారతనారి, అన్న, అమ్మాయి కాపురం ఆయన సంభాషణలు రాసిన సినిమాలు. ఈ నాలుగు సినిమాలకు ఆయనకు నంది పురస్కారాలు దక్కాయి.[3] 20 కి పైగా సినిమాల్లో నటించాడు.[5] ఈయన తమ్ముడు మరుధూరి రాజా కూడా సంభాషణల రచయిత.
ఎం.వి.ఎస్. హరనాథరావు | |
---|---|
![]() | |
జననం | [1] | 1948 జూలై 27
మరణం | 2017 అక్టోబరు 9[2] ఒంగోలు | (వయసు 69)
వృత్తి | నాటక రచయిత, దర్శకుడు, సినీ రచయిత, నటుడు |
జీవిత భాగస్వామి | కోటేశ్వరి |
పిల్లలు | సాహిత్య, శ్రీ సూక్త, నాట్య |
తల్లిదండ్రులు |
|
బాల్యం, విద్యాభ్యాసం సవరించు
హరనాథ రావు 1948 జూలై 27 న గుంటూరులో జన్మించాడు. ఆయన తండ్రి రంగాచార్యులు గుమాస్తాగా పనిచేసేవాడు. తల్లి సత్యవతి దేవి సంగీత ఉపాధ్యాయురాలు. ప్రాథమిక విద్యాభ్యాసం గుంటూరులో జరిగింది. చదువుకుంటున్నప్పుడే తండ్రితో కలిసి పౌరాణిక నాటకాలు చూసేవాడు. మూడో తరగతి నుంచే నాటకాల్లో నటించడం ప్రారంభించాడు. తల్లి ప్రభావంతో ఆయనకు సంగీతం మీద కూడా ఆసక్తి కలిగింది. తల్లి ఉద్యోగ రీత్యా ఒంగోలుకు మారడంతో ఈయన కూడా ఒంగోలు చేరి శర్మ కళాశాలలో చదివాడు.
నాటకరంగం సవరించు
ఒంగోలులో శర్మ కాలేజీలో చదువుతున్నపుడు నాటకాల్లో బాగా పాల్గొనేవాడు. ఆయన రాసిన మొట్టమొదటి నాటకం రక్తబలి. హరనాథ రావు దర్శకుడు టి. కృష్ణ కళాశాల రోజుల నుంచి మంచి స్నేహితులు. ఒకసారి ఇద్దరూ కలిసి అనేక నాటకాలు వేశారు. వారిద్దరూ కలిసి విజయవాడలో నాటకోత్సవాలు చూసి స్ఫూర్తి పొంది తాము కూడా మంచి నాటకాన్ని రాయాలనుకున్నారు. హరనాథ రావు దాదాపు రెండు సంవత్సరాల పాటు పరిశోధన చేసి జగన్నాథ రధచక్రాలు అనే నాటకం రాశాడు. భగవంతుని యొక్క ఉనికిని గురించి తాత్వికంగా చర్చించిన నాటకం ఇది. ఇది రాయటానికి ఈయనకు రెండేళ్ళు పట్టింది. ఈ నాటకం కొడవటిగంటి కుటుంబరావు, గోరా, ఆత్రేయ ప్రశంసలు పొందింది. ఉత్తమ నాటకంగా కన్యా వరశుల్కం ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక శాఖ నుండి పురస్కారం అందుకున్నారు. 6 నాటకాలు, 10 నాటకాలకు రచన, దర్శకత్వం చేసారు, వాటిలో నటించారు.[1]
సినిమా రంగం సవరించు
హరనాథ రావు తన స్నేహితుడైన టి. కృష్ణ ద్వారా సినీ పరిశ్రమలో 1985 లో రచయితగా అడుగుపెట్టాడు. ఒక్క సినిమా మినహాయించి ఆయన తీసిన అన్ని సినిమాలకు హరనాథ రావే సంభాషణలు రాశాడు.[6] మరో వైపు కొన్ని సినిమాలలో కూడా నటించాడు.
తన 40 ఏళ్ళ సినీ ప్రస్థానంలో 80 చిత్రాలకు రచయతగా, నటుడిగా 40 చిత్రాలకు పనిచేసారు. కె.విశ్వనాధ్, కె.రాఘవేంద్రరావు, దాసరి నారాయణరావు, కోడి రామకృష్ణ, ఎ.కోదండరామిరెడ్డి, సురేష్ కృష్ణ వంటి దిగ్గజ దర్శకులతో పనిచేసిన అనుభవం ఈయన సొంతం. రచయితగా సినిమాల్లో, రంగస్థలంలో ఎన్నో పురస్కరాలు అందుకున్నాడు.
రచయితగా సవరించు
- ప్రతిఘటన
- నేటి భారతం
- రేపటి పౌరులు
- అమ్మాయి కాపురం
- అన్న
- అగ్నిప్రవేశం
- ఉదయం
- ఇదా ప్రపంచం
- భారతనారి
- రాక్షసుడు
- సూత్రధారులు
- అన్న
- ప్రాణం
- దేశంలో దొంగలు పడ్డారు
- దేవాలయం
- వందేమాతరం
- ఇన్స్పెక్టర్ ప్రతాప్ (1988)
- నేనుసైతం (2004)
నటుడిగా సవరించు
- స్వయంకృషి
- ఛలో అసెంబ్లీ (2000)
పురస్కారాలు సవరించు
- నంది పురస్కారం (రచయతగా) - ప్రతిఘటన, ఇదా ప్రపంచం, భారత నారి, అన్న, అమ్మాయి కాపురం
- కందుకూరి అవార్డు (ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం)
- ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమీ అవార్డు (రచయితగా)
- దాసరి స్వర్ణ కంకణం
- కళాసాగర్ (చెన్నై) - ఉత్తమ రచయత అవార్డు
- జాలాది సినీ రచయితల అవార్డు
- ఆచార్య ఆత్రేయ అవార్డు
- పుచ్చలపల్లి సుందరయ్య అవార్డు
- పినిశెట్టి అవార్డు
- చాట్ల అవార్డు
మరణం సవరించు
హరనాథ రావు అక్టోబరు 9, 2017 న గుండెపోటుతో ఒంగోలులో మరణించాడు.[2]
మూలాలు సవరించు
- ↑ 1.0 1.1 1.2 TV1. "Jevannatakam, TV1 interview with M.V.S". youtube.com. TV1. Retrieved 12 July 2016.
- ↑ 2.0 2.1 "నంది అవార్డుల రచయిత ఇకలేరు". telugu.samayam.com. samayam.com. Retrieved 9 October 2017.
- ↑ 3.0 3.1 3.2 Staff Reporter (23 December 2007). ఈనాడు ఆదివారం వ్యాసం: దరిద్రమంటే అంత కసి. హైదరాబాదు: ఈనాడు. p. 20. Retrieved 25 October 2016.
- ↑ "హరనాథరావు కన్నుమూత". eenadu.net. ఈనాడు. Archived from the original on 10 October 2017. Retrieved 10 October 2017.
- ↑ "మాటల 'రాక్షసుడి' కలం ఆగిపోయింది". andhrajyothy.com. ఆంధ్రజ్యోతి. Archived from the original on 11 అక్టోబరు 2017. Retrieved 16 October 2017.
- ↑ "అభ్యుదయం చిలికించిన కలం". eenadu.net. ఈనాడు. Archived from the original on 10 October 2017. Retrieved 10 October 2017.