పురాణాలు

భారతీయ గ్రంథాలు
(అష్టాదశపురాణాలు నుండి దారిమార్పు చెందింది)

అష్టాదశ పురాణాలను కృష్ణద్వైపాయనుడైన వ్యాసమహర్షి రచించాడని, రచించిన తాను వక్తగా కాకుండా ఆ విషయాలను ఒకప్పుడు నైమిశారణ్యంలో శౌనకుడు మొదలైన మహా మునులు దీర్ఘ సత్రయాగం చేస్తున్నప్పుడు, వారికి వ్యాసుని శిష్యుడైన రోమహర్షణుడు కుమారుడైన సూత మహర్షి ద్వారా చెప్పించాడని పురాణాలే చెబుతున్నాయి. ఈ పురాణాలు మధ్య యుగంలో జరిగిన శైవ, వైష్ణవ ఘర్షణల వలన పరివర్తన చెందాయి అనే వాదన కూడా లేక పోలేదు. కొన్ని శ్లోకాల రచన శైలి వ్యాస మహర్షి రచన శైలిని గమనిస్తే ఆ విషయం అవగతం అవుతుంది.

ప్రముఖ ఎనిమిది విగ్రహాలుతో యుద్ధంలో రాక్షసుడు రక్తబీజుడు నకు వ్యతిరేకంగా దేవత దుర్గ, మార్కండేయ పురాణము లోని దేవి మహాత్మ్యం లోని చిత్రం.
ఈ వ్యాసానికి సంబంధించిన రచనలు
హిందూధర్మశాస్త్రాలు
aum symbol
వేదములు (శ్రుతులు)
ఋగ్వేదం · యజుర్వేదం
సామవేదము · అధర్వణవేదము
వేదభాగాలు
సంహిత · బ్రాహ్మణము
అరణ్యకము  · ఉపనిషత్తులు
ఉపనిషత్తులు
ఐతరేయ  · బృహదారణ్యక
ఈశ  · తైత్తిరీయ · ఛాందోగ్య
కఠ  · కేన  · ముండక
మాండూక్య  ·ప్రశ్న
శ్వేతాశ్వర
వేదాంగములు (సూత్రములు)
శిక్ష · ఛందస్సు
వ్యాకరణము · నిరుక్తము
జ్యోతిషము · కల్పము
స్మృతులు
ఇతిహాసములు
మహాభారతము · రామాయణము
పురాణములు
ధర్మశాస్త్రములు
ఆగమములు
శైవ · వైఖానసము ·పాంచరాత్రము
దర్శనములు
సాంఖ్య · యోగ
వైశేషిక · న్యాయ
పూర్వమీమాంస · ఉత్తరమీమాంస
ఇతర గ్రంథాలు
భగవద్గీత · భాగవతం
విష్ణు సహస్రనామ స్తోత్రము · త్రిమతాలు
లలితా సహస్రనామ స్తోత్రము · శక్తిపీఠాలు
శివ సహస్రనామ స్తోత్రము
త్రిమూర్తులు · తిరుమల తిరుపతి
పండుగలు · పుణ్యక్షేత్రాలు
... · ...
ఇంకా చూడండి
మూస:హిందూ మతము § వర్గం:హిందూమతం

పురాణ వాఙ్మయం ఆవిర్భావం మార్చు

 
భాగవత పురాణము ఆధారంగా వరాహ అవతారము యొక్క ఒక ఉదాహరణ

"పురాణ" శబ్దానికి "పూర్వ కాల కథా విశేషం" అన్న అర్ధం నిరూఢమై ఉంది. క్రీస్తు పూర్వం ఐదవ శతాబ్దం నాటికే ఈ వాఙ్మయం ప్రస్తుతం లభిస్తున్న రూపు సంతరించుకొంది కాని వేదవాఙ్మయ కాలానికే దీని మౌలిక రూపం ఏర్పడి ఉండాలి. యజ్ఞసమయంలో ఋక్సామచ్ఛందాలతో పాటు ఉచ్చిష్ట రూపమై పురాణం ఆవిర్భవించిందని అధర్వణ వేదంలో తొలిసారిగా ప్రస్తావింపబడింది. శతపథ బ్రాహ్మణం, బృహదారణ్యకోపనిషత్తు, గోపథ బ్రాహ్మణం వంటి గ్రంథాలలో పురాణ ప్రశంసలున్నాయి. ఆదికాలంలో ఇది వేదాధ్యయనానికి ఒక సాంగ సాధన ప్రక్రియగా ఉండేదని, కాలక్రమంలో ప్రత్యేక శాఖగా పరిణమించి మతసాహిత్యంగా రూపుదిద్దుకొందని విమర్శకుల ఊహ. సుదీర్ఘ కాలం జరిగే యజ్ఞయాగాది కార్యాల సమయంలో నడుమ నడుమ విరామ వేళలలో ఇష్ట కథా వినోదంగా ఇది మొదలై ఉండవచ్చును. ఆ యజ్ఞాలు చేసే రాజుల వంశాల చరిత్రను, యజ్ఞానికి లక్ష్యమైన దేతల కథలను ఇలా చెబుతూ ఉండవచ్చును. మొదటి కాలంలో బహుశా యఙ్నాన్ని నిర్వహించే పండితులే ఈ కథాకాలక్షేపం జరిపి ఉండవచ్చును కాని ఇది ప్రధాన కార్యక్రమం కాదు గనుక క్రమంగా సూత పౌరాణికులకు (క్షత్రియునకు బ్రాహ్మణ స్త్రీయందు జన్మించిన సంతానం) ఈ విధి సంక్రమించి ఉండవచ్చును. ఇలాంటి ఐతిహ్యం వాయు బ్రహ్మాండ విష్ణు పురాణాలలో కనిపిస్తుంది.[1]

వ్యాస మహర్షి పురాణ సంహితను నిర్మించి తన సూత శిష్యుడు రోమహర్షునికి ఉపదేశించాడు. అతడు దానిని భాగాలుగా చేసి సుమతి, అగ్నివర్చుడు, మిత్రాయువు, శాంశపాయనుడు, అకృతవర్ణుడు, సావర్ణి అనే ఆరుగురు శిష్యులకు బోధించాడు. వీరిలో అకృతవర్ణుడు, సావర్ణి, కాశ్యప శాంశపాయనులు వేరువేరుగా మూడు పురాణ సంహితలను రూపొందించారు. రోమహర్షుని మాతృకతో కలిసి ఈ గ్రంథజాతమంతా పురాణ వాఙ్మయానికి మూలమయింది. ఈ విధంగా పరిశీలిస్తే అప్పటి యాఙ్ఞికులైన బ్రాహ్మణుల అధీనంలో ఉన్నవాఙ్మయాన్ని వ్యాసుడు విషయ క్రమం ప్రకారం పునర్వ్వస్థీకరించి, కాలానుగుణంగా అవుసరమైన మార్పులతో లోకులకు తెలియజేయమని బ్రాహ్మణేతరులైన సూతులకు అప్పగించాడు. ఆపస్తంభ ధర్మ సూత్రాలలోని ప్రస్తావనల ఆధారంగా క్రీ.పూ. 600-300నాటికే పురాణ వాఙ్మయం ఒక ప్రత్యేక శాఖగా రూపుదిద్దుకొందని, కాలానుగుణంగా ఉపదేశికుల బోధలను సంతరించుకొంటూ సా.శ. 12వ శతాబ్దివరకూ మార్పులు చెందుతూ వచ్చిందని ఊహించవచ్చును[1].

ప్రణవం వేదాలు పురాణాల పుట్టుక

పురాణాలు ప్రణవం నుండి పుట్టాయని సంస్కృత భాగవతంలోని పన్నెండవ స్కందం చెప్తుంది. బ్రహ్మదేవుడు ధ్యానమగ్నుడై ఉన్న సమయంలో ఆయన హృదయగృహ నుండి ఒక అనాహత శబ్దం వెలువడింది. ఆ శబ్దంలో నుండి కార కార కార శబ్ధాలు కూడిన ఓంకారశబ్దం ఆవిర్భవించింది. "అ" నుండి "హ" వరకు గల అక్షరాలు ఆశబ్దంనుండి ఉద్భవించాయి. ఓంకారం సకల మంత్రాలకు బీజాక్షరం అయింది. ఓంకారం నుండి నాలుగు వేదాలను ఉద్భవించాయి. ఆ 'అ'కార, 'ఉ'కార 'మ'కారములనుండి సత్వ,రజో,తమో అనే త్రిగుణాలు, ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణవేదం అనే చతుర్వేదాలు, భూ॰భువ॰సువ॰ అనే త్రిలోకాలు, జాగృత్, స్వప్న, సుషుప్తి అవస్థలు జనించాయి. ఆ తరువాత బ్రహ్మదేవుడు చతుర్వేదాలను వెలువరించి తనకుమారులైన మరీచి తదితరులకిచ్చాడు. వారు తమ కుమారులైన కశ్యపుడు తదితరులకు ఇచ్చారు. అలా వేదాలు పరంపరాగతంగా సాగిపోతూ ఉన్నాయి.

వేదాలు ప్రజలకు క్లిష్టమైనవి కనుక అందుబాటులో లేనివి కనుక వేదవ్యాసుడు వేద ఉపనిషత్తు సారంతో కూడిన అష్టాదశ పురాణాలను రచించాడు. పురాణాలను వ్యాసుడు తన శిష్యుడైన రోమహర్షణుకి చెప్పాడు. రోమహర్షుడు తిరిగి వాటిని తన శిష్యులైన త్రైయారుణి, కశ్యపుడు, సావర్ణి లాంటి శిష్యులకు అందించాడు. ఆ తర్వాత అలా ఒకరి నుండి ఒకరికి సంక్రమించాయి.

పురాణం లక్షణాలు మార్చు

ప్రతి పురాణం కుడా పురాణాల ముఖ్యమైన లక్షణాలను మొదటి సర్గలలో చెబుతుంది. కూర్మపురాణంలో చెప్పబడిన పురాణ ఉపోద్ఘాతము ప్రకారం

సర్గశ్చ ప్రతిసర్గశ్చ వంశో మన్వంతరాణి చ
వంశానుచరితం చైవ పురాణం పంచలక్షణం

సర్గము, ప్రతి సర్గము, వంశము, మన్వంతరము, వంశాలచరిత్ర అనే పంచలక్షణాలు కలిగినదే పురాణం.

  • సర్గము - సర్వ ప్రపంచ సృష్టిని విస్తరించేది
  • ప్రతి సర్గము - సకల ప్రపంచము లయమయ్యే లక్షణం తెలిపేది (ప్రళయం)
  • వంశము - పృథు, ప్రియ వ్రతాదుల వంశోత్పత్తిని వివరించుట
  • మన్వంతరము - ఏ కల్పంలో ఏ మనువు కాలంలో ఏమి జరిగిందో తెలుపుట
  • వంశాలచరిత్ర

భాగవతంలో పురాణ లక్షణాలు పది చెప్పబడ్డాయి

సర్గోప్యశ్చ విసర్గశ్చ వృత్తి రక్షాంతరాణి చ
వంశో వంశానుచరితం సంస్థాహేతు రపాశ్రయ
దశభిర్లక్షణైర్యుక్తం పురాణం తద్విదో విదు:

అనగా సర్గము (సృష్టి), ప్రతిసర్గము (ప్రళయము), వృత్తి (వ్యాపారము), రక్షా (పరిపాలవ), అంతరము (మన్వాదుల కాలము), వంశము (వంశాదుల విషయము), వంశానుచరితము (సూర్య, చంద్ర వంశస్థుల కథనాలు), సంస్థా (స్థితి), హేతువు (కారణము), అపాశ్రయము (ఆశ్రయ విషయాలు) అనే పదీ పురాణ లక్షణాలు. కొంతమంది ఇలా పది లక్షణాలున్నవి మహాపురాణాలని, ఐదు లక్షణాలున్నవి పురాణాలని వర్గీకరిస్తున్నారు.[2]

పురాణాల విభజన మార్చు

పురాణాల పేర్లు చెప్పే శ్లోకం మార్చు

సత్రయాగం జరుగుచున్నప్పుడు అష్టాదశపురాణాలను తెలుపుతూ సూతుడు ఋషులకు చెప్పిన శ్లోకం. భాగవత పురాణము ప్రధమ స్కందములో చెప్పబడింది.

మద్వయం భద్వయం చైవ బ్రత్రయం వచతుష్టయం
అనాపద్లింగకూస్కాని పురాణాని పృథక్ పృథక్

పైన చెప్పిన వాటిలో:

  • "మ" ద్వయం -- మత్స్య పురాణం, మార్కండేయ పురాణం
  • "భ" ద్వయం -- భాగవత పురాణం, భవిష్య పురాణం
  • "బ్ర" త్రయం -- బ్రహ్మ పురాణం, బ్రహ్మ వైవర్త పురాణం, బ్రహ్మాండ పురాణం
  • "వ" చతుష్టయం -- విష్ణు పురాణం, వరాహ పురాణం, వామన పురాణం, వాయు పురాణం

మిగిలిన వాటి పేర్ల మొదటి అక్షరాలు మాత్రమే తీసుకుని శ్లోకపాదం కూర్చటం జరిగింది:

  • అ -- అగ్ని పురాణం
  • నా—నారద పురాణం
  • పద్—పద్మ పురాణం
  • లిం -- లింగ పురాణం
  • గా—గరుడ పురాణం
  • కూ -- కూర్మ పురాణం
  • స్క—స్కంద పురాణం

అష్టాదశ పురాణములలో శ్లోకాలు [3] మార్చు

  1. బ్రహ్మ పురాణం - బ్రహ్మదేవుడు మరీచికి బోధించింది. 10,000 శ్లోకములు కలది.
  2. పద్మ పురాణము - బ్రహ్మదేవునిచే చెప్పబడింది. 55,000 శ్లోకములు కలది.
  3. విష్ణు పురాణం - పరాశరుని రచన. దీనిలో 63,000 శ్లోకములు ఉన్నాయి.
  4. శివ పురాణం - వాయుదేవునిచే చెప్పబడింది. ఇందులో 24,000 శ్లోకాలున్నాయి.
  5. లింగ పురాణము - నందీశ్వరుని రచన. 11,000 శ్లోకాలు ఉంది.
  6. గరుడ పురాణం - విష్ణుమూర్తి గరుత్మంతునికి చెప్పిన ఈ పురాణంలో 19,000 (16,000?) శ్లోకాలున్నాయి.
  7. నారద పురాణము - నారద మహర్షి రచన. 24,000 (25,000?) శ్లోకములు కలది.
  8. భాగవత పురాణం- శుకమహర్షి పరీక్షిత్తునకుపదేశించింది. 18,000 శ్లోకములు కలది.
  9. అగ్ని పురాణం - భృగుమహర్షిచే చెప్పబడింది. 16,000 (8,000?) శ్లోకములు కలది.
  10. స్కంద పురాణం - కుమారస్వామిచే చెప్పబడింది. 80,000 (లక్ష?) ఇందు శ్లోకములు ఉన్నాయి.
  11. భవిష్య పురాణం లేదా భవిష్యోత్తర పురాణం - శతానీకుడు సుమంతునకు బోధించింది. 14,500 (31,000?) శ్లోకములు ఉన్నాయి.
  12. బ్రహ్మవైవర్త పురాణం - వశిష్ట మహర్షి అంబరీషునకు ఉపదేశించింది. 18,000 (12,000) శ్లోకములు కలది.
  13. మార్కండేయ పురాణం - పక్షులు క్రోష్టి (జైమిని) కి చెప్పినట్లుగా మార్కండేయమహర్షి రచించెను. 9,000 (32,000?) శ్లోకములు ఉంది.
  14. వామన పురాణము - బ్రహ్మదేవుని రచన - 14,000 శ్లోకములు కలది.
  15. వరాహ పురాణం - శ్రీవరాహమూర్తి భూదేవికి ఉపదేశించింది. ఇందు 24,000 శ్లోకములు ఉన్నాయి.
  16. మత్స్య పురాణం - శ్రీమత్స్యావతారుడైన విష్ణువు మనువునకు ఉపదేశించెను. దీనిలో 14,000 శ్లోకాలున్నాయి.
  17. కూర్మ పురాణం - శ్రీకూర్మావతారుడైన విష్ణువు ఉపదేశించెను. దీనిలో 17,000 (6,000) శ్లోకాలున్నాయి.
  18. బ్రహ్మాండ పురాణం - బ్రహ్మదేవుని రచన- 1,100 (12,200?) శ్లోకములున్నది.

దేవతాప్రాముఖ్యాన్ని గుణాన్ని చెప్పే శ్లోకం మార్చు

ఈ క్రింది శ్లోకం అష్టాదశ పురాణాలను మూడు విధాలుగా విభజిస్తూ వైష్ణవ, శైవ, బ్రహ్మ పురాణాలుగా చెబుతుంది.

వైష్ణవం నారదీయం చ తధా భాగవతం శుభం గారుడంచ తధా పాద్మం
వరాహం శుభదర్శనే సాత్వికాని పురాణాని విష్ణ్వేయాని శుభానిదై
బ్రహ్మాండం బ్రహ్మ వైవర్తం మార్కండేయం తధైవ చ భవిష్యం వామనం బ్రహ్మరాజ నిబోధతే
మాత్స్య కౌర్మం తధా లైంగ శైవం స్కౌందం ఆగ్నేయంచ షడేతాని తామసాని భోధమే
ఇలాంటిదే మరొక శ్లోకం
బ్రాహ్మం పాద్వం వైష్ణవంచ శైవం వైంగం చ గారుడమ్
నారదీయం భాగవతం ఆగ్నేయం స్కాంద సంజ్ఞికమ్
భవిష్యం బ్రహ్మవైవర్తం మార్కండేయం చ వామనమ్
వారాహం మత్స్య కౌర్మాణి బ్రహ్మాండాఖ్యమితి త్రిషట్

మహాపురాణాలు మార్చు

పురాణము పేరు శ్లోకములు సంఖ్య వ్యాఖ్యలు
అగ్ని 15,400 శ్లోకములు వాస్తు శాస్త్రం, రత్నశాస్త్రం వివరాలను కలిగి ఉంది.
భాగవత 18,000 శ్లోకములు విష్ణువు యొక్క పది అవతారాలు చెప్పడం, పురాణాలల్లో యొక్క అత్యంత ప్రసిద్ధి, ప్రముఖం అయినదిగా భావించింది.[4][5] దీని పదవ, పొడవైనది అని చెప్పవచ్చు, కృష్ణ పనులు, వ్యాఖ్యానం, తన చిన్ననాటి లీలలు పరిచయం, తరువాత అనేక భక్తి ఉద్యమాలు ఒక ప్రక్రియ ద్వారా విశదీకరించింది.[6]
బ్రహ్మ 10,000 శ్లోకములు గోదావరి, దాని ఉపనదులు వివరిస్తుంది..
బ్రహ్మాండ 12,000 శ్లోకములు లలితా పంచాక్షరీ, కొన్ని హిందువులు ప్రార్థనలు వర్ణించు ఒక వాచకం కలిపి ఉంది.
బ్రహ్మవైవర్త 17,000 శ్లోకములు కృష్ణ, వినాయకుడు దేవతలు,పూజించే మార్గాలను వివరిస్తుంది..
గరుడ 19,000 శ్లోకములు మరణం, దాని తర్వాత కార్యాలు వివరిస్తుంది.
హరివంశ 16,000 శ్లోకములు ఇతిహాసములు (పురాణ కవిత్వం) పరిగణించబడుతుంది.
కూర్మ 17,000 శ్లోకములు విష్ణువు యొక్క పది ప్రధాన అవతారములు యొక్క రెండవది ఉంది.
లింగ 11,000 శ్లోకములు విశ్వం యొక్క లింగం వైభవం, శివ యొక్క చిహ్నం, మూలం వివరిస్తుంది. ఇది

లింగం గురించి అనేక కథలు ఉన్నాయి. ఇందులో విష్ణు, బ్రహ్మ మధ్య వివాదం ఎలా అనివార్యమైంది, అలాగే ఎలా పరిష్కరించవచ్చు అనేది కూడా అగ్ని లింగం తెలియ జేస్తుంది.

మార్కండేయ 09,000 శ్లోకములు దేవి మహాత్మ్యం, గుళ్ళల్లో పూజారులు/శాక్తేయులు మొదలగు వారి కోసం ఒక ముఖ్యమైన వాచకం, పొందుపరచబడింది.
మత్స్య 14,000 శ్లోకములు మత్స్యావతారము కథ, విష్ణువు యొక్క పది ప్రధాన అవతారాల యొక్క మొదటి అవతారం. ఇది కూడా పలు రాజ వంశాల వారసత్వపు వివరాలను కలిగి ఉంది.[7]
నారద 25,000 శ్లోకములు వేదాలు, వేదాంగాలు గొప్పతనం వర్ణిస్తుంది.
పద్మ 55,000 శ్లోకములు భగవద్గీత గొప్పతనాన్ని వివరిస్తుంది. అందువల్ల, ఇది కూడా గీతామహత్మ్యము గా (లిట్. భగవద్గీత ఘనత ) అంటారు.
శివ 24,000 శ్లోకములు శివుడు, ఆయన గురించి ఇతర కథలు, పూజలు, శివ గొప్పతనం, గొప్పతనాన్ని వివరిస్తుంది.
స్కంద 81,100 శ్లోకములు స్కంధ (లేదా కార్తికేయ), శివుడు యొక్క కుమారుడు పుట్టిన వివరాలు వివరిస్తుంది. ఇది చాలా పొడవైన పురాణం., ఇందులో సంబంధిత పురాణములు, ఉపమానరీతిగా, కీర్తనలు, కథలు భారతదేశంలో తీర్థయాత్రా కేంద్రాలలో భౌగోళిక స్థానాలను కలిగిన ఒక అసాధారణమైన, కచ్చితమైన పుణ్యస్థల సూచికను కలిగి ఉంది. అనేక ఆచూకీ లభ్యం కాలేని సూక్తులను వాచకము రూపములో అందిస్తుంది.[8]
వామన 10,000 శ్లోకములు ఉత్తర భారతదేశంలో కురుక్షేత్రం చుట్టూ ప్రాంతాల్లో వాటిని వివరిస్తుంది.
వరాహ 24,000 శ్లోకములు విష్ణు భక్తి ఆచారాలు, వివిధ రూపాలు ప్రార్థన వివరిస్తుంది. శివుడు, దుర్గ యొక్క అనేక దృష్టాంతాలు కూడా కలిగి ఉంది.[9]
వాయు 24,000 శ్లోకములు శివ పురాణం యొక్క మరో పేరు
విష్ణు 23,000 శ్లోకములు విష్ణువు అనేక పనులు, ఆయనని పూజించేవారు వివిధ మార్గాలను వివరిస్తుంది.[10]

వర్గీకరణ మార్చు

మహాపురాణాలు దైవము యొక్క మూడు రూపములు ప్రకారంగా వర్గీకరించ బడ్డాయి. త్రిమూర్తి:

వైష్ణవ పురాణాలు: విష్ణు పురాణం, భాగవత పురాణం, నారద పురాణము, గరుడ పురాణం, పద్మ పురాణము, వరాహ పురాణం, వామన పురాణము, కూర్మ పురాణం, మత్స్య పురాణము
బ్రహ్మ పురాణాలు: బ్రహ్మ పురాణము, బ్రహ్మాండ పురాణం, బ్రహ్మ వైవర్త పురాణం, మార్కండేయ పురాణము, భవిష్య పురాణం,
శైవ పురాణాలు: శివ పురాణము, లింగ పురాణము, స్కంద పురాణం, అగ్ని పురాణం

[11]

పద్మ పురాణంలో, ఉత్తర ఖండంలో (236.18-21),[12] దానికదే ఒక వైష్ణవ పురాణం, మూడు గుణాలలో లేదా లక్షణాలను అనుగుణంగా పురాణాల్లో వర్గీకరించింది; సత్యం, అభిమానం, ఉదాసీనత:

సత్వ ("నిజం; స్వచ్ఛత") విష్ణు పురాణం, భాగవత పురాణం, నారద పురాణము, గరుడ పురాణం, పద్మ పురాణము, వరాహ పురాణం
రాజస ("డిమ్నెస్; అభిరుచి") బ్రహ్మాండ పురాణం, బ్రహ్మ వైవర్త పురాణం, మార్కండేయ పురాణము, భవిష్య పురాణం, వామన పురాణము బ్రహ్మ పురాణము
తామస ("చీకటి; అజ్ఞానం") మత్స్య పురాణము, కూర్మ పురాణం, లింగ పురాణము, శివ పురాణం స్కంద పురాణం, అగ్ని పురాణం

వ్రాతప్రతులు మార్చు

 
11 వ శతాబ్ధానికి చెందిన నేపాలు తాళపత్ర వ్రాతప్రతుల సంస్కృత గ్రంథాలు (మార్కండేయ పురాణం)

పురాణాల వ్రాతప్రతుల అధ్యయనం చాలా అస్థిరంగా ఉన్నందున సవాలుగా ఉంది.[13][14] ఇది మహాపురాణాలు, ఉపపురాణాలన్నింటికి వర్తిస్తుంది.[13] పురాణగ్రంధాలు అధికంగా ముఖ్యంగా పాశ్చాత్య పండితుల ఉపయోగంలో ఉన్నాయి. "ఒక వ్రాతప్రతి ఆధారంగా లేదా యాదృచ్ఛికంగా ఎంపిక చేయబడిన కొన్ని వ్రాతప్రతుల మీద ఆధారపడి ఉన్నాయి". అదే శీర్షికతో విభిన్నమైన లిఖిత ప్రతులు ఉన్నప్పటికీ. పురాణ వ్రాతప్రతుల ఉనికిని పండితులు చాలాకాలానికి ముందుగా గుర్తించారు. ఇవి "ముద్రిత ప్రతులకు చాలా భిన్నంగా ఉన్నట్లు అనిపిస్తుంది". ఇది ఏది కచ్చితమైనదో అస్పష్టంగా ఉంది. యాదృచ్ఛికంగా లేదా చెర్రీపిక్డు ప్రింటెడు ప్రతుల నుండి తీసుకోబడిన తీర్మానాలు భౌగోళికంగా విశ్వజనీయమైనవి.[13] అదే శీర్షిక పురాణ వ్రాతప్రతులలో ఈ సమస్య చాలా తీవ్రంగా ఉంది. కానీ ప్రాంతీయ భాషలైన తమిళం, తెలుగు, బెంగాలీ, ఇతరులు ఎక్కువగా విస్మరించబడ్డాయి. [13]

ఆధునిక విద్యావేత్తలు ఈ వాస్తవాలన్నింటినీ గమనించారు. నిజమైన అగ్ని పురాణం పరిధి అన్ని సమయాలలో అన్ని ప్రదేశాలలో ఒకేలా ఉండదని సమయం, ప్రాంతంలోని వ్యత్యాసంతో ఇది వైవిధ్యంగా ఉందని ఇది గుర్తించింది. (...) దేవి పురాణం వచనం ప్రతిచోటా ఒకేలా ఉండదని కానీ వివిధ ప్రావిన్సులలో గణనీయంగా తేడా ఉందని ఇది చూపిస్తుంది. అయినప్పటికీ తార్కిక తీర్మానాన్ని రూపొందించడంలో ఒకరు విఫలమయ్యారు: మన [మనుగడలో ఉన్న] వ్రాతప్రతులలో కనిపించే పురాణాల సంస్కరణ పాటు, మా [ముద్రిత] ప్రతులలో చాలా తక్కువ అనే శీర్షికల క్రింద అనేక ఇతర ప్రతులు ఉన్నాయి. కానీ ఇవి గుర్తించబడలేదు, పునరుద్ధరించడానికి వీలుకాని విధంగా మారాయి.

—లూడో రోచరు, పురాణాలు [15][16]

కాలక్రమానుసార మార్పులు, చేర్పులు మార్చు

మధ్యయుగ శతాబ్దాల నుండి కొత్తగా కనుగొన్న పురాణాల వ్రాతప్రతులు పండితుల దృష్టిని ఆకర్షించాయి. పురాణ సాహిత్యం కాలక్రమేణా నెమ్మదిగా పునర్నిర్మాణంలో అనేకమార్పులు సంభవించాయి. అలాగే అనేక అధ్యాయాలను ఆకస్మికంగా తొలగించడం కొత్త సమాచారంతో భర్తీ చేయడం వంటివి ప్రస్తుతం ప్రచారంలో ఉన్న పురాణాలు 11 వ శతాబ్దం లేదా 16 వ శతాబ్దానికి ముందు ఉన్న వాటికి పూర్తిగా భిన్నంగా ఉంటాయి.[17]

ఉదాహరణకు కొత్తగా కనుగొన్న నేపాలులోని స్కంద పురాణం తాటి-ఆకు వ్రాతప్రతి సా.శ. 810 నాటిది అయినప్పటికీ వలసరాజ్యాల కాలం నుండి దక్షిణ ఆసియాలో చెలామణి అవుతున్న స్కంద పురాణం సంస్కరణలకు ఇది పూర్తిగా భిన్నంగా ఉంది.[17][18] మరో నాలుగు వ్రాతప్రతుల తదుపరి ఆవిష్కరణలు, పత్రం రెండుసార్లు పెద్ద పునర్ముద్రణల ద్వారా వెళ్ళిందని సూచిస్తుంది. మొదట 12 వ శతాబ్దానికి ముందు, 15 వ -16 వ శతాబ్దంలో సంభవించిన రెండవ పెద్ద మార్పు కారణాలు అస్పష్టంగా ఉన్నాయి.[19] స్కంద పురాణం వ్రాతప్రతులు విభిన్న సంస్కరణలు కాలక్రమేణా "చిన్న" పునరావృత్తులు, అంతర్కాలుష్యంతో రచనలోని ఆలోచనల అవినీతిని సూచిస్తున్నాయి.[19]

ప్రతి పురాణం కూర్పు తేదీ వివాదాస్పద సమస్యగా ఉందని రోచరు పేర్కొన్నాడు.[20][21] ప్రతి పురాణ వ్రాతప్రతులు ఎంసైక్లోపీడియా శైలిలో ఉన్నాయని డిమ్మిటు, వాను బ్యూటెనెను పేర్కొన్నాడు. ఇవి ఎప్పుడు, ఎక్కడ, ఎందుకు, ఎవరిచే వ్రాయబడ్డాయి అని నిర్ధారించడం కష్టం:[22]

ప్రస్తుతం అవి ఉన్నందున పురాణాలు స్థిరీకరించిన సాహిత్యం. ప్రతి పేరున్న రచనలో వరుస చారిత్రక యుగాలలో అనేక వృద్ధి చెందుతుంది. అందువల్ల ఏ పురాణానికి కూర్పు ఒక్క తేదీ కూడా లేదు. (...) అవి కొత్త వాల్యూములను నిరంతరం జోడించిన లైబ్రరీల వలె ఉంటుంది. షెల్ఫు చివరిలో కాదు యాదృచ్ఛికంగా.

—కార్నెలియా డిమ్మిటు, జె.ఎ.బి. వాను బ్యూటెనెను, క్లాసికలు హిందూ మిథాలజీ: సంస్కృత పురాణాలలో ఒక పాఠకుడు.[22]

నకిలీలు మార్చు

చాలా వ్రాతప్రతులు తాటి ఆకు మీద వ్రాయబడ్డాయి లేదా బ్రిటిషు ఇండియా వలసరాజ్యాల కాలంలో కాపీ చేయబడ్డాయి. కొన్ని 19 వ శతాబ్దంలో ఉన్నాయి.[23][24] వివిధ పురాణాల మీద అధ్యయనాలు తరచూ నకిలీల కారణంగా బాధించబడుతుందని పురాణాల ప్రచారంలో స్వేచ్ఛ సాధారణమైనదని, పాత వ్రాతప్రతులను కాపీ చేసిన వారు పదాలను భర్తీ చేశారని లేదా వలసరాజ్యాల పండితులు ప్రచురణ మీద ఆసక్తి చూపుతున్నారనే సిద్ధాంతానికి తగినట్లుగా కొత్త విషయాలను చేర్చారని లూడో రోచరు పేర్కొన్నాడు.[23][24]

అనువాదాలు మార్చు

1840 లో విష్ణు పురాణం సంస్కరణ ఒకటి ప్రారంభ ఆంగ్ల అనువాదాలలో ఒకటి ప్రచురించబడింది.[25] అదే వ్రాతప్రతులు విల్సను అనువాదం మన్మధ నాథుదత్తు చేత పునర్నిర్వచించబడి 1896 లో ప్రచురించబడింది.[26] " ఆల్ ఇండియా కాశీరాజ్ ట్రస్టు " పురాణాల సంచికలను ప్రచురించింది.[27]

మారిదాసు పౌల్లే (మరియాదాసు పిళ్ళై) 1788 లో భగవత పురాణం తమిళ ప్రతుల నుండి ఒక ఫ్రెంచి అనువాదాన్ని ప్రచురించారు. ఇది ఐరోపాలో విస్తృతంగా పంపిణీ చేయబడింది. ఇది 18 వ శతాబ్దపు హిందూ సంస్కృతి, హిందూ మతం వలసరాజ్యాల కాలంలో చాలా మంది యూరోపియన్లకు పరిచయం అయ్యింది. 1795 లో అదే రచనను " లే భగవత" పేరుతో భిన్నమైన అనువాదాన్ని పాండిచేరి నుండి పౌల్లే తిరిగి ప్రచురించాడు.[28] పౌలు అనువాదం నకలు పారిసులోని బిబ్లియోథెకు నేషనలు డి ఫ్రాంసులో భద్రపరచబడింది.

ప్రభావం మార్చు

 
పురాణాలు హిందువుల పండుగలు, వివిధకళాలను ప్రభావితం చేసాయి. [29]

భారతీయ సాహిత్యం పురాణాల శైలి దేశంలోని సంస్కృతి విద్య అధ్యయన వేత్తలు, ముఖ్యంగా భారతీయ అధ్యయన వేత్తలు అత్యంతంగా ప్రభావితం చేసాయి.[30] "సంస్కృతి మిశ్రితం"లో ఆచారబద్ధమైన ఆచారాల నుండి వేదాంత తత్వశాస్త్రం వరకు, కల్పిత ఇతిహాసాల నుండి విభిన్న విశ్వాసాలను కలగలిపి సమగ్రపరచడం జరిగింది. వాస్తవిక చరిత్ర, వ్యక్తిగత ఆత్మపరిశీలన, యోగా నుండి సామాజిక వేడుకలు, ఉత్సవాలు, దేవాలయాల నుండి తీర్థయాత్ర వరకు, ఒక దేవుడి నుండి మరొక దేవునికి, దేవతల నుండి తంత్రానికి, పాత నుండి క్రొత్త వరకు కూడా ప్రభావం ప్రదర్శించాడు.[31] ఈ అద్భుత బహిరంగ పాఠాలు కాలక్రమేణా సామాజికంగా కూర్చబడ్డాయి. ఇది గ్రెగు బెయిలీ, హిందూ సంస్కృతిని "క్రొత్త విషయాలను నిరంతరం చేరుస్తూనే పాతదాన్ని కాపాడుకోవడానికి" అనుమతించి ఉండవచ్చు. "అవి అవి గత 2,000 సంవత్సరాలలో సాంస్కృతిక అనుసరణ, పరివర్తన రికార్డులు"గా ఉన్నాయి.[30]

పురాణ సాహిత్యం వివిధ భాషలతో వివిధ ఆర్థిక తరగతుల నుండి వివిధ రాజ్యాలు, సాంప్రదాయాలలో, ప్రజల వైవిధ్యత "సంస్కృతి, వసతి"ను ప్రభావితం చేసింది. సమకాలీన "హిందూ మతం సాంస్కృతిక సమైఖ్యతని"ను కృష్ణుడు ప్రభావితం చేసాడని సూచిస్తున్నాయి.[32] వారు భారతదేశంలో సాంస్కృతిక బహుళ్యాన్ని ప్రభావితం చేయడంలో సహాయపడ్డారని సాహిత్య రికార్డు సూచిస్తుంది.[32]

పురాతన మధ్యయుగ భారతదేశంలో సాంస్కృతిక మార్పిడి, ప్రసిద్ధ విద్యకు పురాణాలు సమర్థవంతమైన మాధ్యమంగా పనిచేశాయని ఓం ప్రకాషు పేర్కొన్నారు.[33] ఈ గ్రంథాలు వాయు పురాణంలోని పాశుపత విష్ణు పురాణంలోని సత్వా, మార్కెండేయ పురాణంలోని దత్తాత్రేయ, భవష్య పురాణంలోని భోజకులు వంటి ప్రాంతీయ దేవతలను స్వీకరించి వివరించి సమగ్రపరిచాయి.[33] ఇంకా ప్రకాషు ఇలా చెబుతున్నాడు. అవి "కవితలు, నాటకీయత, వ్యాకరణం, నిఘంటువు, ఖగోళ శాస్త్రం, యుద్ధం, రాజకీయాలు, వాస్తుశిల్పం, భౌగోళికం, ఔషధం వంటి లౌకిక విషయాలకు అగ్ని పురాణం, గరుడ పురాణంలో సుగంధ ద్రవ్యాలు, లాపిడరీ ఆర్ట్స్, చిత్రకళలు, శిల్పం, విష్ణుధర్మోత్తర పురాణంలోని ఇతర కళలు " మొదలగు అంశాలు ప్రస్తావించాయి.[33]

భారతీయ కళలు

పురాణాల సాంస్కృతిక ప్రభావం భారతీయ శాస్త్రీయ కళలకు విస్తరించింది. పాటలు, దక్షిణ భారతదేశంలోని భరత నాట్యం[29] ఈశాన్య భారతదేశంలో రాసా లీల వంటి నృత్య సంస్కృతి,[34] నాటకాలు, పారాయణాలు పురాణాలతో ప్రభావితమయ్యాయి.[35]

పండుగలు

పురాణ సాహిత్యంలో హోలీ, దీపావళి, దుర్గా పూజ వంటి ప్రధాన హిందూ సాంస్కృతిక ఉత్సవపురాణాలు, చంద్ర మానం ఆచారాలు, వేడుకలు ఉన్నాయి.[36][37]

ఉపపురాణాలు మార్చు

ఈ అష్టాదశపురాణాలే కాకుండా ఉపపురాణాలు కూడా 18 ఉన్నాయి. అవి:

ఇవి కూడా చూడండి మార్చు

ముంబ్రా దేవి ఆలయం

మూలాలు మార్చు

  1. 1.0 1.1 శ్రీమద్భాగవతము - సరళాంధ్ర పరివర్తన - ఏల్చూరి శేషగిరిరావు
  2. "అష్టాదశ పురాణములు" - వాడ్రేవు శేషగిరిరావు
  3. శ్లోకాల సంఖ్య వివిధ గ్రంధాలలో తేడాగా ఉంది. వాడ్రేవు శేషగిరిరావు రచన "అష్టఅదశ పురాణములు"లో ఇచ్చిన సంఖ్య (ఇతర సంఖ్యలో భిన్నంగా ఉంటే గనుక) బ్రాకెట్లలో ఉంచబడింది.
  4. Thompson, Richard L. (2007). The Cosmology of the Bhagavata Purana 'Mysteries of the Sacred Universe. Motilal Banarsidass Publishers. p. 10. ISBN 978-81-208-1919-1.
  5. Monier-Williams 1899, p. 752, column 3, under the entry Bhagavata.
  6. Hardy 2001
  7. Dalal, Roshen (2011). Hinduism: An Alphabetical Guide. Penguin Books India. p. 250. ISBN 978-0-14-341421-6.
  8. Doniger 1993, pp. 59–83
  9. Wilson, Horace H. (1864), Works: ¬Vol. ¬6 : ¬The Vishṅu Purāṅa: a system of Hindu mythology and tradition ; 1, Trübner, p. LXXI
  10. Lochtefeld, James G. (2002), The Illustrated Encyclopedia of Hinduism: N-Z, The Rosen Publishing Group, p. 760, ISBN 978-0-8239-3180-4
  11. "The Puranic Encyclopedia". Archived from the original on 2014-12-22. Retrieved 2015-01-18.
  12. Wilson, H. H. (1840). The Vishnu Purana: A system of Hindu mythology and tradition. Oriental Translation Fund. p. 12.
  13. 13.0 13.1 13.2 13.3 Ludo Rocher (1986), The Puranas, Otto Harrassowitz Verlag, ISBN 978-3447025225, pages 59-67
  14. Gregory Bailey (2003), The Study of Hinduism (Editor: Arvind Sharma), The University of South Carolina Press, ISBN 978-1570034497, pages 141-142
  15. Ludo Rocher (1986), The Puranas, Otto Harrassowitz Verlag, ISBN 978-3447025225, page 63
  16. Rajendra Hazra (1956), Discovery of the genuine Agneya-purana, Journal of the Oriental Institute Baroda, Vol. 4-5, pages 411-416
  17. 17.0 17.1 Dominic Goodall (2009), Parākhyatantram, Vol 98, Publications de l'Institut Français d'Indologie, ISBN 978-2855396422, pages xvi-xvii
  18. R Andriaensen et al (1994), Towards a critical edition of the Skandapurana, Indo-Iranian Journal, Vol. 37, pages 325-331
  19. 19.0 19.1 Kengo Harimoto (2004), in Origin and Growth of the Purāṇic Text Corpus (Editor: Hans Bakker), Motilal Banarsidass, ISBN 978-8120820494, pages 41-64
  20. Rocher 1986, p. 249.
  21. Gregory Bailey 2003, pp. 139–141, 154–156.
  22. 22.0 22.1 Dimmitt & van Buitenen 2012, p. 5.
  23. 23.0 23.1 Rocher 1986, pp. 49–53.
  24. 24.0 24.1 Avril Ann Powell (2010). Scottish Orientalists and India: The Muir Brothers, Religion, Education and Empire. Boydell & Brewer. pp. 130, 128–134, 87–90. ISBN 978-1-84383-579-0.
  25. HH Wilson (1840), Vishnu Purana Trubner and Co., Reprinted in 1864
  26. MN Dutt (1896), Vishnupurana Eylsium Press, Calcutta
  27. Mittal 2004, p. 657
  28. Jean Filliozat (1968), Tamil Studies in French Indology, in Tamil Studies Abroad, Xavier S Thani Nayagam, pages 1-14
  29. 29.0 29.1 Katherine Zubko (2013), The Bhagavata Purana: Sacred Text and Living Tradition (Editors: Ravi Gupta and Kenneth Valpey), Columbia University Press, ISBN 978-0231149983, pages 181-201
  30. 30.0 30.1 Greg Bailey (2001), Encyclopedia of Asian Philosophy (Editor: Oliver Leaman), Routledge, ISBN 978-0415172813, pages 442-443
  31. Gregory Bailey (2003), The Study of Hinduism (Editor: Arvind Sharma), The University of South Carolina Press, ISBN 978-1570034497, pages 162-167
  32. 32.0 32.1 R Champakalakshmi (2012), Cultural History of Medieval India (Editor: M Khanna), Berghahn, ISBN 978-8187358305, pages 48-50
  33. 33.0 33.1 33.2 Om Prakash (2004), Cultural History of India, New Age, ISBN 978-8122415872, pages 33-34
  34. Guy Beck (2013), The Bhagavata Purana: Sacred Text and Living Tradition (Editors: Ravi Gupta and Kenneth Valpey), Columbia University Press,ISBN 978-0231149983, pages 181-201
  35. Ilona Wilczewska (2013), The Bhagavata Purana: Sacred Text and Living Tradition (Editors: Ravi Gupta and Kenneth Valpey), Columbia University Press, ISBN 978-0231149983, pages 202-220
  36. A Whitney Sanford (2006), Alternative Krishnas: Regional and Vernacular Variations on a Hindu Deity (Editor: Guy Beck), State University of New York Press, ISBN 978-0791464168, pages 91-94
  37. Tracy Pintchman (2005), Guests at God's Wedding: Celebrating Kartik among the Women of Benares, State University of New York Press, ISBN 978-0791465950, pages 60-63, with notes on 210-211

వనరులు మార్చు

  • "అష్టాదశ పురాణములు" - రచన: వాడ్రేవు శేషగిరిరావు - ప్రచురణ: సోమనాధ్ పబ్లిషర్స్, రాజమండ్రి (2007)
  • శ్రీమద్భాగవతము - సరళాంధ్ర పరివర్తన - రచన : ఏల్చూరి శేషగిరిరావు - ప్రచురణ : శ్రీరామకృష్ణ మఠము, హైదరాబాదు

బయటి లింకులు మార్చు

"https://te.wikipedia.org/w/index.php?title=పురాణాలు&oldid=3920725" నుండి వెలికితీశారు