తోటపల్లి సాయినాథ్

సాయినాథ్ తోటపల్లి (జననం 1956 ఏప్రిల్ 27) తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రసిద్ధ రచయిత. సితార, స్వాతిముత్యం, స్వర్ణకమలం, స్వయంకృషి, సిరివెన్నెల, ప్రేమ, ఛాలెంజ్, మరణ మృదంగం (1988), పవిత్ర ప్రేమ (1998), రాఖీ వంటి దాదాపు వంద తెలుగు చిత్రాలకు కథలు అందించాడు. క్రిమినల్, గుండాగర్ది వంటి బాలీవుడ్ చిత్రాలకు కూడా పనిచేసాడు.

పడియప్ప, మద్రాసి, విలన్ మొదలైన తమిళ చిత్రాలకు ఆయన పనిచేసాడు. అలాగే. కన్నడ సినిమాలో మాజీ ముఖ్యమంత్రి రామకృష్ణ హెగ్డే నటించిన రెండు చిత్రాలు-ప్రజశక్తి, మరణ మృదంగ చిత్రాలతో పాటు మరి కొన్ని ఉన్నాయి.

కెరీర్

మార్చు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపూర్ లో టిఎస్ఎస్ శర్మ, సుశీల దంపతులకు వారి ఏడుగురు పిల్లలలో నాలుగో వాడు సాయినాథ్. రైల్వే స్టేషన్ మాస్టర్ గా తన తండ్రి ఉద్యోగం కారణంగా, అతను తన చిన్న తనంలో విస్తృతంగా ప్రయాణించి, చెన్నైలో పాఠశాల విద్యను అభ్యసించాడు. విజయవాడలో ఎస్ఆర్ఆర్, సివిఆర్ ప్రభుత్వ కళాశాల నుండి బిఎస్సి పూర్తి చేసాడు.

7వ తరగతిలో తన మొదటి నాటకాన్ని వ్రాసినప్పటి నుండే అతని రచనా నైపుణ్యాలు కనిపించడం ప్రారంభించాయి. కళాశాలలో చిన్న కథల రచన రూపంలో ఈ పనిని కొనసాగించాడు. సృజనాత్మక పరిశ్రమతో ఆయన మొదటి అనుబంధం 1972లో జంధ్యాల సుబ్రమణ్య శాస్త్రి స్థాపించిన కళాభారతిలో చేరడంతో ప్రారంభమైంది. ఇక్కడ ఆయన వివిధ నాటకాలలో నటించడం ప్రారంభించి, 1973లో తన మొదటి నాటకం "కోణార్క్ వస్తుంది" ని రాసాడు. ఆయన నాటకం "చైతన్యం" 1974లో ఆల్ ఇండియా రేడియోలో, 1976లో వెన్నెల కెరటంలో ప్రసారం చేయబడింది.

1979లో, జంధ్యాల సుబ్రమణ్య శాస్త్రి ఆయనను తన రచనా సహాయకుడిగా తీసుకున్నాడు. ఆ తొమ్మిది నెలల వ్యవధిలో, ఆయన జంధ్యాల, సత్యానంద్ ఇద్దరికీ సహాయకుడిగా పద్నాలుగు చిత్రాలలో పనిచేసాడు. 1982లో వల్లభనేని జనార్ధన్ తో కలిసి అమాయక చక్రవర్తికి స్క్రిప్ట్ అసోసియేట్ గా చిత్ర పరిశ్రమలో తన నిజమైన పనిని ప్రారంభించాడు.

1984లో వంశీ దర్శకత్వంలో వచ్చిన సితార పెద్ద విజయం సాధించింది, దీనికోసం ఆయన సంభాషణ రచయితగా అరంగేట్రం చేసాడు, 2009 వరకు ఆ సమయంలో అత్యంత విజయవంతమైన చిత్రాలలో కొన్నింటికి ఆయన తన పనిని కొనసాగించాడు. తెలుగులో వచ్చిన ఆయన చిత్రాలలో స్వాతి ముత్యం, స్వయంకృషి, సిరివెన్నెల, ఛాలెంజ్, పుణ్య స్త్రీ, స్వర్ణకమలం, ప్రేమ, క్రిమినల్, కృష్ణ వంశీ రాఖీ (2006) వంటి వంత చిత్రాల వరకు ఉన్నాయి. టెలివిజన్ రంగంలో బాలాజీ టెలిఫిల్మ్స్ కోసం కలిసుందాం రా, రాడాన్ మీడియా లిమిటెడ్ కోసం గాయత్రి, జయసుధ నిర్మించిన జనని, కుట్టి పద్మిని మనసే మందిరం వంటి మరెన్నో ధారావాహికలను అందించాడు.

2008 సార్వత్రిక ఎన్నికల సమయంలో రాజకీయ వ్యంగ్య చిత్రం గోలీ సోడా ద్వారా సాక్షి టీవీకి రచయిత, దర్శకుడుగా మారాడు. 2009లో టీవీ5లో ప్రతి వారం రాజకీయ, చలనచిత్ర సంబంధిత పరిణామాలపై వారపు వ్యంగ్యచిత్రం "మిక్స్చర్ బండి" కి రచయితగా, దర్శకుడిగా పనిచేసాడు.

వ్యక్తిగత జీవతం

మార్చు

సాయినాథ్ తన భార్య అరుణ, తన కుమారుడు సాయి చరణ్, కుమార్తె సమీరా టి. లతో హైదరాబాదులో నివసిస్తున్నాడు.

ఫిల్మోగ్రఫీ

మార్చు

తెలుగు

మార్చు

హిందీ

మార్చు
  • 1995 క్రిమినల్ (ముకేశ్ భట్, మహేష్ భట్, నాగార్జున, మనీషా కొయిరాలా, రమ్య కృష్ణ)
  • 1997 గుండాగర్ది (కె. సి. బొకాడియా, ధర్మేంద్ర, విజయ్ శాంతి, సిమ్రాన్, ఆదిత్య పంక్)

తమిళ భాష

మార్చు
  • 1999 పడయప్ప (కె. ఎస్. రవికుమార్, రజనీకాంత్, రమ్యకృష్ణ, సౌందర్య)

కన్నడ

మార్చు
  • 1990 లయన్ జగపతి రావు (విజయ్ కుమార్, సాయి ప్రకాష్, విష్ణు వర్ధన్, లక్ష్మి, భవ్య)
  • 1992 ప్రజశక్తి (చిదంబరం శెట్టి, డి. రాజేంద్ర బాబు, రామకృష్ణ హెగ్డే, మలశ్రీ)
  • 1993 మరణ మృదంగ (చిదంబరం శెట్టి, రామ మూర్తి, రామకృష్ణ హెగ్డే, మలశ్రీ)
  • 1994 హలుండ తవారు (విజాగ్ రాజు, డి. రాజేంద్ర బాబు, విష్ణు వర్ధన్, సితార)
  • 2015 "లేడీ సింగం", నిర్మాతగా విజయ్ కుమార్, దర్శకుడిగా సాయి ప్రకాష్, నిర్మాణ ప్రణాళిక
  • జగదేక వీ,
  • రోల్ కాల్ రామకృష్ణ
  • వ్యుహ
  • ప్రధాన స్పర్స
  • సోమ
  • జీవనధి
  • రాజా
  • స్వరాంజలి

మూలాలు

మార్చు
  1. "Telugu cinema Review - Swetha Naagu - Soundarya, Abbas - Sanjeevi - CV Reddy".
  2. "Slokam - Telugu cinema Review - Sai Kumar, Madhu Sharma".
  3. "Telugu cinema Review - Villain - Raja Sekhar, Neha Dhupia, Tulip Joshi - KS Ravi Kumar".