భారతదేశంలోని ఉన్నత న్యాయస్థానాల జాబితా
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
హైకోర్టు లేదా ఉన్నత న్యాయస్థానం (ఆంగ్లం: High Court) అనగా భారతదేశంలోని రాష్ట్రంలో అత్యున్నత న్యాయస్థానం. ప్రతీ రాష్ట్రానికీ, కేంద్ర పాలిత ప్రాంతానికీ ఒక్కో హైకోర్టు ఉంటుంది. రెండు లేక అంతకంటే ఎక్కువ రాష్ట్రాలకు కూడా ఒకే హైకోర్టు ఉండేటట్లు పార్లమెంటు చట్టం చేయవచ్చు. హైకోర్టులు భారత రాజ్యాంగంలోని ఆరవ భాగం, ఐదవ అధ్యాయం, 214 వ నిబంధనను అనుసరించి ఏర్పాటయ్యాయి.
మొత్తం భారతదేశంలో 25 హైకోర్టులు ఉన్నాయి. ఒక్కొక్క హైకోర్టులో ఒక్కొక ప్రధాన న్యాయమూర్తి ఉంటారు. హైకోర్టు న్యాయమూర్తులను భారత ప్రధాన న్యాయమూర్తి, రాష్ట్ర గవర్నర్ల సలహా మేరకు భారత రాష్ట్రపతి నియమిస్తారు. రాష్ట్రంలో ఏ ఇతర కోర్టులలో జరిగిన కేసులపై అయినా న్యాయ విచారణ కోసం హైకోర్ట్ను సంప్రదించవచ్చు. కేంద్రపాలిత ప్రాంతానికి ప్రత్యేక హైకోర్టు న్యూఢిల్లీకు మాత్రమే ఉంది.
హైకోర్టు న్యాయ మూర్తి పదవీ అర్హతలు:
- భారత దేశ పౌరుడై ఉండాలి.
- కనీసం 10 సంవత్సరాలు పాటు దిగువ కోర్టులో న్యాయమూర్తిగా కానీ, హైకోర్టులలో 10 సంవత్సరాలు న్యాయవాదిగానో, న్యాయ శాస్త్రవేత్తగానో కానీ పనిచేసి ఉండాలి.
హైకోర్టులుసవరించు
భారతదేశంలో గల 25 హైకోర్టుల జాబితా.
న్యాయస్థానము పేరు | స్థాపించిన సంవత్సరం | ఏ చట్టం ద్వారా స్థాపించారు | పరిధి | పీఠము | న్యాయపీఠములు (బెంచీలు) |
---|---|---|---|---|---|
అలహాబాదు హైకోర్టు[1] | 1866 జూన్ 11 | హైకోర్టుల చట్టం 1861 | ఉత్తర ప్రదేశ్ | అలహాబాదు | లక్నో |
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు | 2019 జనవరి 1 | ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం | ఆంధ్రప్రదేశ్ | అమరావతి | |
తెలంగాణ హైకోర్టు | 2019 జనవరి 1 | ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం | తెలంగాణ | హైదరాబాద్ | |
బాంబే హైకోర్టు | 1862 ఆగస్టు 14 | హైకోర్టుల చట్టం 1861 | మహారాష్ట్ర, గోవా, దాద్రా నాగర్ హవేలీ, డామన్ డయ్యూ | ముంబై | నాగపూర్, పనాజీ, ఔరంగాబాదు |
కలకత్తా హైకోర్టు | 1862 జూలై 2 | హైకోర్టుల చట్టం 1861 | పశ్చిమ బెంగాల్, అండమాన్ నికోబార్ ద్వీపాలు | కోల్కతా | పోర్ట్ బ్లెయిర్ (సర్క్యూట్ బెంచీ) |
ఛతీస్ గఢ్ హైకోర్టు | 2000 జనవరి 11 | మధ్యప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2000 | ఛత్తీస్ గఢ్ | బిలాస్ పూర్ | |
ఢిల్లీ హైకోర్టు[2] | 1966 అక్టోబరు 31 | ఢిల్లీ హైకోర్టు ఆక్టు, 1966 | జాతీయ రాజధాని పరిధి ఢిల్లీ | న్యూఢిల్లీ | |
గౌహతి హైకోర్టు[3] | 1948 మార్చి 1 | భారతప్రభుత్వ చట్టం 1935 | అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మణిపూర్, మేఘాలయా, నాగాలాండ్, మిజోరం | గౌహతి | కోహిమా, ఐజాల్లలో సర్క్యూట్ బెంచీ గలదు. |
త్రిపుర హైకోర్టు | 2013 మార్చి 26 | ఈశాన్య ప్రాంతాల పునర్విభజన, ఇతర సంబంధిత చట్టాల సవరణ చట్టం, 2012 | త్రిపుర | అగర్తలా | |
మణిపూర్ హైకోర్టు | 2013 మార్చి 26 | ఈశాన్య ప్రాంతాల పునర్విభజన, ఇతర సంబంధిత చట్టాల సవరణ చట్టం, 2012 | మణిపూర్ | ఇంఫాల్ | |
మేఘాలయ హైకోర్టు | 2013 మార్చి 26 | ఈశాన్య ప్రాంతాల పునర్విభజన, ఇతర సంబంధిత చట్టాల సవరణ చట్టం, 2012 | మేఘాలయ | షిల్లాంగ్ | |
గుజరాత్ హైకోర్టు | 1960 మే 1 | బాంబే పునర్వ్యవస్థీకరణ చట్టం 1960 | గుజరాత్ | అహ్మదాబాదు | |
హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు | 1971 | హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర చట్టం 1970 | హిమాచల్ ప్రదేశ్ | సిమ్లా | |
జమ్మూ , కాశ్మీరు హైకోర్టు | 1943 ఆగస్టు 28 | కాశ్మీరు మహారాజు జారీచేసిన పేటెంటు లేఖ | జమ్మూ కాశ్మీరు | శ్రీనగర్ & జమ్మూ[4] | |
జార్ఖండ్ హైకోర్టు | 2000 | బీహారు పునర్వ్యవస్థీకరణ చట్టం 2000 | జార్ఖండ్ | రాంచీ | |
కర్నాటక హైకోర్టు[5] | 1884 | మైసూరు హైకోర్టు చట్టం , 1884 | కర్నాటక | బెంగళూరు | |
కేరళ హైకోర్టు[6] | 1956 | రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం, 1956. | కేరళ, లక్షద్వీప్ | కొచ్చి | |
మధ్యప్రదేశ్ హైకోర్టు[7] | 1936 జనవరి 02 | భారత ప్రభుత్వ చట్టం 1935 | మధ్యప్రదేశ్ | జబల్ పూర్ | గ్వాలియర్, ఇండోర్ |
మద్రాసు హైకోర్టు | 1862 ఆగస్టు 15 | హైకోర్టు ఆక్ట, 1861 | తమిళనాడు, పాండిచ్చేరి | చెన్నై | మదురై |
ఒడిషా హైకోర్టు | 1948 ఏప్రిల్ 03 | ఒడిషా హైకోర్టు ఆజ్ఞ 1948 | ఒడిషా | కటక్ | |
పాట్నా హైకోర్టు | 1916 సెప్టెంబరు 02 | ' 1915 | బీహారు | పాట్నా | |
పంజాబ్ , హర్యానా హైకోర్టు[8] | 1947 నవంబరు 08 | హైకోర్టు (పంజాబ్) ఆజ్ఞ 1947 | పంజాబ్, హర్యానా, చండీగఢ్ | చండీగఢ్ | |
రాజస్థాన్ హైకోర్టు | 1949 జూన్ 21 | రాజస్థాన్ హైకోర్టు ఆర్డినెన్స్, 1949 | రాజస్థాన్ | జోధ్ పూర్ | జైపూరు |
సిక్కిం హైకోర్టు | 1975 | 38వ సవరణ భారత రాజ్యాంగం | సిక్కిం | గాంగ్ టక్ | |
ఉత్తరాంచల్ హైకోర్టు | 2000 | యూ.పీ. రీ ఆర్గనైజేషన్ ఆక్టు, 2000 | ఉత్తరాంచల్ | నైనీటాల్ |
అత్యధిక న్యాయమూర్తులు అహ్మదాబాద్ హైకోర్టుకు ఉన్నారు.
హైకోర్టులు ఉన్న రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాలుసవరించు
మూలాలుసవరించు
- ↑ ప్రారంభంగా ఆగ్రా లో స్థాపించారు. 1875 లో అలహాబాదుకు మార్చారు.
- ↑ లాహోర్ హైకోర్టు 1919 మార్చి 21 లో స్థాపించారు. పరిధి, అవిభాజ్య పంజాబ్ , ఢిల్లీ. 1947 ఆగస్టు 11 లో ఒక ప్రత్యేక హైకోర్టు ఆఫ్ పంజాబ్ స్థాపించబడినది, భారతీయ స్వాతంత్ర్య ఆక్టు 1947, ప్రకారం సిమ్లా లో ఒక సీటును ఏర్పాటు చేశారు. 1966 లో పంజాబ్ గుర్తింపబడిన తరువాత, పంజాబ్ హర్యానాల కొరకు ఒక హైకోర్టును స్థాపించారు. ఢిల్లీ హైకోర్టు, 1966 అక్టోబరు 31 లో, సిమ్లాలో ఒక సీటుతో స్థాపించారు.
- ↑ మూలంగా ఇది అస్సాం , నాగాల్యాండ్ కొరకు స్థాపింపబడింది. 1971 లో దీనికి గౌహతి హైకోర్టు "ఈశాన్యభారత పునర్వ్యవస్థీకరణ చట్టం 1971", ప్రకారం పేరు పెట్టారు.
- ↑ వేసవిలో రాజధాని శ్రీనగర్, శీతాకాలంలో జమ్మూ.
- ↑ మూలంగా దీనిని మైసూరు హైకోర్టు అనేవారు, తరువాత కర్నాటక హైకోర్టు అని పేరు 1973.
- ↑ ట్రావంకూర్-కొచ్చిన్ హైకోర్టు, ఎర్నాకుళంలో 1949 లో జూలై 7 న ఉద్ఘాటన చేశారు. కేరళ్ రాష్ట్రం, రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం 1956 ప్రకారం ఏర్పడింది. ఈ పునర్వ్యవస్థీకరణ చట్టం ద్వారా ట్రావంకూర్-కొచ్చిన్ హైకోర్టును అబాలిష్ చేసి కేరళ హైకోర్టును సృష్టించింది. దీని పరిధి, లక్షద్వీప్ వరకు గలదు.
- ↑ భారత ప్రభుత్వ చట్టం , 1935, లెటర్ పేటెంట్ ద్వారా 2-1-1936 న ఒక హైకోర్టు నాగపూర్ నందు స్థాపించబదింది. రాష్ట్రాలు ఏర్పడిన తరువాత జబల్ పూర్ కు మార్చబడింది, 1956.
- ↑ మూలంగా పంజాబ్ హైకోర్టు, తరువాత పంజాబ్ & హర్యానా హైకోర్టు గా మారింది, 1966
ఇతర ఆధార గ్రంథాలుసవరించు
- Jurisdiction and Seats of Indian High Courts, Eastern Book Company, retrieved 2 September 2005
- Judge strength in High Courts increased, Press Information Bureau – Govt. of India, retrieved 2 September 2005
- Judiciary, Supreme Court of India, archived from the original on 29 ఆగస్టు 2005, retrieved 2 September 2005
- Constitution of India, Wikisource, retrieved 31 December 2005