తెలుగు సంస్కృతి

(జన జీవనం నుండి దారిమార్పు చెందింది)

ఇక్కడి వాగ్గేయకారులు, కూచిపూడి (నృత్యము) సుసంపన్నమైన సంస్కృతి-సంప్రదాయాలకి నిలువెత్తు సాక్ష్యాలు. కర్ణాటక సంగీతం లో, శాస్త్రీయ సంగీతంలో తెలుగు భాష ఇట్టే ఇమిడి పోవటంతో ఆంధ్ర ప్రదేశ్ సంగీతానికి, సాహిత్యానికి, నృత్యానికి మాతృకగా వ్యవహరించింది.

తెలుగుదనం వ్యాసాన్ని, ఈ వ్యాసంలో విలీనం చెయ్యాలని ప్రతిపాదించడమైనది. (చర్చించండి)
తెలుగు సాంస్కృతిక చరిత్ర కళలు, నిర్మాణ శైలి, సాహిత్యం, ఆహారపుటలవాట్లు, ఆంధ్రుల దుస్తులు, మతం, తత్త్వాలుగా విభజించవచ్చు.

హైదరాబాదు ప్రాంతంలో పర్షియా నిర్మాణ శైలికి స్థానిక కళాత్మకత మేళవించి కట్టడాలని నిర్మించారు. వరంగల్లులో గ్రానైటు, సున్నపురాయి ల కలయికలతో కట్టడాలని నిర్మించారు. శాతవాహనులు ఆధ్యాత్మిక సూక్ష్మాలని తెలిపే శిల్పకళతో కూడిన కట్టడాలు అమరావతిలో నిర్మించారు.

ప్రాచీన భాషగా గుర్తింపబడ్డ తెలుగు యొక్క సాహిత్య సంస్కృతి విశాలమైనది. అనేక ప్రాచీన కవుల, రచయితల వలన తెలుగు ఉత్తాన పథాన్ని చేరినది. ఆధ్యాత్మిక, సంగీత, తత్వ రచనలకి అనువుగా ఉండటంతో తెలుగువారితో బాటు, తెలుగేతరుల మెప్పు పొందినది. ఇటాలియన్ భాష వలె అజంతాలతో ఉండటం వలన ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అని సంబోధించబడ్డది. అంతరించిపోతున్న అద్భుత భాషకి మరల జవసత్వాలని అందించిన చార్లెస్ ఫిలిప్ బ్రౌన్తో తెలుగు ఖండాంతరాలకి వ్యాప్తి పొందినది. అనేక ఆధునిక రచయితలు తెలుగు భాషని క్రొత్త పుంతలు త్రొక్కించారు.

బెంగుళూరు, చెన్నై నగరాలలో ఆంధ్ర శైలి భోజన శాలలు విరివిగా ఉండటం, వీటిలో తెలుగువారితో బాటు, స్థానికులు, (తెలుగు వారు కాని) స్థానికేతరులు వచ్చి సుష్ఠుగా భోం చేసి వెళ్ళటం, తెలుగువారి ఆహారం యొక్క ప్రాశస్త్యం గురించి చెబుతాయి. గోంగూర, తాపేశ్వరం కాజా, పూతరేకులు, ఆవకాయ, హైదరాబాదీ బిరియాని, హలీమ్, ఇరానీ చాయ్లు తెలుగు ప్రజల వంటలుగా సుప్రసిద్ధాలు.

కళలు మార్చు

ఆంధ్రప్రజలు తమ జీవనవిధానంలో వినోదానికెప్పుడూ పెద్ద పీటనే వేసారు. కళాకారులను కళలనూ గుర్తించి, గౌరవించి పోషించుట చేతనే చాలాకాలం అజరామరంగా జీవించాయి. ఆంగ్లభాష ప్రబలి విద్యుతాధార వినోదం ప్రజలకు అందుబాటులోకి రావడంతో మెల్లమెల్లగా ఒక్కొక్క కళ కనుమరుగవుతూ ప్రస్తుతం అంతరించే స్థితికి చేరుకున్నాయి. అలాంటి కళలు కొన్ని -

ముగ్గులు మార్చు

 
అందమైన ముగ్గులు వేయడానికి ఇదొక పద్ధతి

తూర్పు తెలతెలవారుతుండగా, పొగమంచు ఇంకా విచ్చిపోకముందే ముంగిట రకరకాల ముగ్గులు వరిపిండితోనూ సున్నపు పిండితోనూ వేసి వాటి మధ్య బంతిపూలు తురిమిన గొబ్బిళ్లు పెట్టే ఆడపిల్లలు తెలుగు పల్లెటూళ్ల ధనుర్మాస శోభకు వన్నెలు చేకూరుస్తారు.

ముగ్గు కేవలం సంస్కృతి-సంప్రదాయాలలో భాగం మాత్రమే కాదు. దీని వెనుక శాస్త్రీయాంశము కూడా ఉంది. ఇంటి ముందు కళ్ళాపు చల్లి దాని పై ముగ్గు వేస్తే వీటిలో నున్న జీవ రసాయనాలు క్రిమి కీటకాలని వెలుపలి నుండి ఇంటిలోనికి రాకుండా నిరోధిస్తాయి. వివిధ రకాల సూక్ష్మక్రిముల ద్వారా ప్రబలే రోగాలని ఇవి నిరోధిస్తాయి. ఇంటి లోగిళ్ళకి ముగ్గులు అలంకారం కూడా తెచ్చిపెడతాయి.

కాంక్రీటు అడవులు నిర్మించబడుతున్న ఆధునిక యుగం లో, ఇరుకైన అపార్టుమెంట్ల సంస్కృతి పెరగటంతో ముగ్గులు నగరాలలో అక్కడక్కడా కనిపించిననూ కళ్ళాపు మాత్రం దాదాపు కనుమరుగైనది.

ఉగాది మార్చు

వేపపువ్వు, చెరుకుముక్కలు, కొబ్బరి ముక్కలు, మామిడి ముక్కలు, బెల్లం, చింతపండు, అరటి పండు కలిపిన ఉగాది పచ్చడి ఎంతో శ్రద్ధతో తయారు చేస్తారు. వ్యక్తి జీవితంలో సుఖదుఃఖాలకు ప్రతీక అయిన తీపి, చేదుల వేపపువ్వు పచ్చడి ప్రసాదం తీసుకోకుండా ఉగాదినాడు ఏ పనినీ తలపెట్టకూడదని ప్రజల నమ్మకం.

జానపద నృత్యాలు మార్చు

అన్ని సంస్కృతులకు ఉన్నట్లే తెలుగువారికే ప్రత్యేకమైన జానదకళలు అనేకం ఉన్నాయి.

కొమ్మునృత్యం మార్చు

కొమ్మునృత్యం గోదావరి తీర ప్రాంతాలలో నివసించే గిరిజనుల సంప్రదాయ నృత్యం. ఈ నృత్యం ప్రదర్శించే కోయలు వారి భాషలో ఈ నృత్యాన్ని పెరియకోక్ ఆట అని అని అంటారు. కోయ భాషలో పెరియకోక్ అంటే దున్నపోతు కొమ్ములు అని అర్థం. దున్నపోతు కొమ్ములు ధరించి, దున్నలు కుమ్ముకునే రీతిలో నృత్యం చేస్తారు కాబట్టి ఈ నృత్యం కొమ్ము నృత్యంగా వ్యవహరింపబడుతున్నది. వీరు ఉపయోగించే వాద్యం "డోలు కొయ్య". చైత్రమాసంలో భూదేవి పండుగను ఘనంగా చేసుకుంటారు కోయలు. ఆ పండుగ సమయంలో పురుషులు అడవులలోకి వేటకి వెళ్ళడం పరిపాటి. వేట ముగించుకుని విజయవంతంగా ఇంటికి చేరుకున్న సందర్భంగా కోయలు దున్నపోతు కొమ్మలు, నెమలి ఈకల గుత్తిని పొదిగిన బుట్టను తలకు అలంకరించుకుని రంగు రంగుల బట్టలు వేసుకుని ఆయా సంప్రదాయ వాద్యాల్ని వాయిస్తూ చేసే నృత్యం, ఈ కొమ్ము నృత్యం.

తప్పెటగుళ్ళు మార్చు

 
జంగం దెవర

శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలలో యాదవ కులానికి చెందినవారు చేసే నృత్యాన్ని తప్పెటగుళ్ళు అంటారు. ఎదురు రొమ్ముపై ధరించిన రేకు తప్పెటలను వాయిస్తూ వీరు ముఖ్యంగా శ్రీకృష్ణగాథలను గానం చేస్తారు. వీరు ఎదురురొమ్ముపై తప్పెట గుళ్ళను కాళ్ళకు చేతులకు చిరు మువ్వలను దరించి అందరూ ఒకే పద్ధతిలో కదులుతూ గానం చేస్తుంటారు.

డప్పు మార్చు

పల్లెల్లో ప్రముఖమైన ప్రచార సాధనం డప్పు. అది ఏ ఉత్సవానికైనా పల్లెల్లో విశేషంగా ఉపయోగపడే వాద్యం. ఉద్రేకాన్ని, ఉత్తేజాన్ని కలిగించే డప్పు వాద్యానికి అనుగుణంగా అడుగులు వేస్తూ చేసే నృత్యం డప్పు నృత్యం. ముందు మెల్లగా ప్రారంభమయ్యే ఈ నృత్యం రాను రాను పదవిన్యాసంతో పాటు వాద్యం కూడా ఉధృతమై, ఉత్తేజం కలిగిస్తుంది. ఆంధ్రదేశంలోని అన్ని పల్లె ప్రాంతాలలోను డప్పు ఉనికి మనకు కనిపిస్తుంది, వినిపిస్తుంది.

జముకు మార్చు

పూర్వపు రోజులలో శక్తి గ్రామ దేవతల కొలుపులు చేసేటప్పుడు బవనీలు అనబడేవారు అతి బీభత్సంగా జముకు అనే వాద్యాన్ని గుండెలదిరేలా మ్రోగించేవారు. కల్లు, సారాయి లాంటి మత్తు పదార్థాల్ని సేవించి కణకణలాడే కళ్ళతో శక్తి ముందు చిందులు తొక్కుతూ గొర్రెలను, మేకలను గావు పట్టేవారు. గావు పట్టడం అంటే బలి పశువును నోటితో మెడకొరికి చంపడం అని అర్థం. ఆ పైన నెత్తురు గ్రోలి, దాని ప్రేగులు ధరించి, దొబ్బలు నోటకరిచి, జముకులను వాయిస్తూ వీధుల వెంట తిరిగేవారు. ఇప్పుడు ఆ సంప్రదాయం పోయింది. కాలక్రమేణా ఈ వాద్యం ఆధారంగా కాటం రాజు మొదలైన కథా గీతికల్ని ఆలపించడం, ఆ కథలు జముకుల కథలుగా ప్రసిద్ధి చెందడం జరిగింది.

శరభనృత్యం మార్చు

వంటినిడా విభూతి పుండ్రాలు ధరించి శరభ శరభా, హశ్శరభ శరభా అని వీరంగం వేస్తూ, చిందులు తొక్కుతూ, పొడవాటి పలుపు తాడుతో వీపులపై తాటించుకుంటూ ఖడ్గాలను చేత ధరించి వాటిని తిప్పుతూ నృత్యం చేస్తారు. మరొక పద్ధతిలో శూలాలతోనూ శూలాల చివర నూనె గుడ్డలు చుట్టి దానికి మంటలు పెట్టి వాటిని త్రిప్పుతూ నృత్యం చేస్తారు. ఇది కూడా పల్లెలలో ప్రసిద్దమైన జానపద కళ. ఇప్పటికీ ఈ నృత్యాన్ని చాలా చోట్ల వీరభధ్రస్వామి దేవాలయాలలో, నిప్పుల గుండం తొక్కే సందర్భాలలోనూ చూడవచ్చు.

ఉరుముల నృత్యం మార్చు

వీరభద్ర ప్రస్తాయం అనునది వీరాశైవులు భక్తితో వీరభద్రుని పూజిస్తారు... ఇ కార్యక్రమం లో దండకలు బాగా ఉంటాయి

డప్పరి నృత్యం మార్చు

గొంతెలమ్మ అశ్వనృత్యం మార్చు

వాలకం నృత్యం మార్చు

చెంచునృత్యం మార్చు

ఘటనృత్యం మార్చు

ఘటనృత్యం లేదా గరగనృత్యంగా పిలిచే ఈ ప్రక్రియలో తలపై కలిశాకారం కలిగిన ఘటాన్ని ఎత్తుకొని డప్పులశబ్ధానికి లయగా నృత్యం చేస్తారు. ఐదు లేదా మూడు సర్పాల ఘటాలతో జాతరలలో ఎక్కువగా వెరు నృత్యం చేస్తుంటారు.

జానపద కళలు మార్చు

కొమ్మదాసరి మార్చు

చిందు భాగవతం మార్చు

Katipapala Parusha Ramudu gadhwal jila jiladudinne gramu wadapali modalam మార్చు

మందులవారి వేషాలు మార్చు

ప్రదర్శనలు మార్చు

బుట్టబొమ్మలు మార్చు

 
బుర్రకథ కళా కారులు

బుట్టబొమ్మలు ఆంధ్ర ప్రాంతములో పెళ్ళి ఊరేగింపులలోనూ దేవుని కళ్యాణ ఉత్సవ సమయాల్లోనూ, పెద్ద పెద్ద తిరునాళ్లలోనూ, జాతర్లలోనూ వినోదము కొరకు ప్రదర్శింపబడుతూ ఉంటాయి. బుట్టబొమ్మలు ప్రజా సమూహాల మధ్య ఎత్తుగా ఉండి అందరికీ కనిపించే తీరులో అందర్నీ ఆకర్షిస్తూ ఉంటాయి. బుట్టబొమ్మలు ఎత్తుగా ఉండి నడుము భాగమునుండి క్రిందికి దిగేకొద్దీ లోపల కాళీగా మారుతూ పెద్దగా బుట్ట ఆకారంలో మారుతుంది. అందువలననే వీటిని బుట్టబొమ్మలంటారు.

బొమ్మల పై భాగమంతా బొమ్మ ఆకారంగా ఉండి లోపలి భాగం డొల్లగా ఉండి బొమ్మ యొక్క కళ్ళభాగంలోనూ, నోటి దగ్గరా రంధ్రాలుంటాయి. ఆటగాడు ఈ లోపలి భాగంలో దూరి, తలను దూర్చి నృత్యంచేస్తే కేవలం బొమ్మే అభినయించినట్లుంటుంది. బుట్ట బొమ్మలు ఎవరితోనూ మాట్లాడవు. ప్రజల మధ్య తిరుగుతూ వినోద పరుస్తాయి. బుట్టబొమ్మలలో పలురకాలు కలవు

మోడీ ప్రదర్శన మార్చు

గారడీ ప్రదర్శన మార్చు

జిత్తులగారడీ మార్చు

ఆచారాలు మార్చు

భారతీయ మత సంప్రదాయాలలో కొన్ని తెలుగునాట కూడా ఆచరించబడుతూ ఉన్నాయి.

బొమ్మలకొలువు మార్చు

ఏడాది పొడుగునా అల్మారాలలో దాగిన రంగురంగుల దేవతల బొమ్మలు, జంతువుల బొమ్మలు, దొరబొమ్మలు, దేశభక్తుల బొమ్మలు, కొన్ని ప్రాంతాల్లో సంక్రాంతికి, మరి కొన్నిచోట్ల దసరాకి ప్రత్యక్షమై ధూప, దీప, నైవేద్యాలు అందుకుంటూ కొలువు తీరుతాయి. బొమ్మల కొలువులు చిన్న పిల్లలతో పెట్టించి చుట్టుపక్కల నివసించే ఇల్లాండ్రను పిలిచి రాజూ-రాణీ, లేదా పెళ్ళికొడుకు-పెళ్ళికూతురు బొమ్మలకు పెళ్ళి చేయడమో లేదా పేరంటం చేయడమో చేసి వచ్చిన ఇల్లాళ్ళకు వాయినమిచ్చి పంపిస్తారు.

భజన మార్చు

ఉత్సవాలు మార్చు

ప్రభలు మార్చు

 
కోటప్పకొండ తిరునాళ్లకు వెళ్లుతున్న ప్రభ

ప్రభ అనేది దేవుని ఊరేగింపుకు పల్లకీ లేనిచోట్ల ఉపయోగించే అరపలాంటి నిర్మాణము. చిన్న చిన్న దేవాలయములలో రెండు కర్రలపై నలుగురు పట్టుకొనేలా ఒక అరపను చేసి దానిపై దేవుని విగ్రహము లేదా బొమ్మను పెట్టి వెనుక దేవాలయము మాదిరి ఒక కట్టడాన్ని తేలికపాటి గడకర్రలతో రంగుల కాగితాలతో తయారుచేసి దానిపై దేవుని ఊరేగించేవారు. అది రానురానూ అంతటా వ్యాపించింది. మరొక తెలుగు సంప్రదాయం ప్రభలు. ఎంత ఎత్తు ప్రభ అయితే అంత గొప్ప. కోటప్పకొండ తిరణాలకి వందలాది రంగు రంగుల ప్రభలు శోభ చేకూర్చుతాయి. ఇక్కడ ప్రతి సంవత్సరం ఉత్తమ ప్రభకు బహుమతిని అందచేస్తున్నారు.

గుంటూరు జిల్లా నరసరావుపేట తాలూకాలోని కోటప్ప కొండ ప్రసిద్ధమైన శైవక్షేత్రం. మహాశివరాత్రికి చాలా పెద్ద ఎత్తున తిరునాళ్లు జరుగుతాయి. లక్షలాది భక్తులు ఆనాడు అక్కడ ఉత్సవాలకు హాజరవుతారు. ముఖ్యంగా చూడవలసింది ప్రభల ప్రదర్శన. వందలాదిగా ప్రభలు ఆ ఉత్సవాలలో పాల్గొంటాయి. అవికాక ఇంకా కోలాటం, వీరంగం, హరికథలు మొదలైనవి ఉంటాయి. తల నీలాల మొక్కుబడులకు కూడా ఈ క్షేత్రం ప్రసిద్ధి. శివరాత్రికి రుద్రాభిషేకం, సహస్రనామార్చనలు జరుగుతాయి. ఇక్కడి శివుడిని కోటేశ్వరుడు, త్రికోటేశ్వరస్వామి అంటారు. ఆ పేరే తెలుగులో కోటప్ప అయింది.

తెప్పోత్సవాలు మార్చు

విజయవాడ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో, విజయదశమి సందర్భంగా నవరాత్రి ఉత్సవాలు జరుగుతాయి. ఆఖరి రోజున కృష్ణానదిలో తెప్పోత్సవం జరుగుతుంది. హంస ఆకారంలో తెప్పను రమణీయంగా అలంకరిస్తారు. దానిలో అమ్మవారిని ఉంచి నదిలో ఊరేగిస్తారు. ఒడ్డును చేరిన వేలాది భక్తులకు అది కన్నుల పండుగ.

కథాకాలక్షేపాలు మార్చు

బుర్రకథ మార్చు

 
బుర్ర కథ కళాకారులు

ప్రబోధానికీ, ప్రచారానికీ సాధనంగా ఈనాటికీ విస్తృతంగా ఉపయోగపడే కళా రూపం బుర్రకథ. యక్షగాన పుత్రికలయిన జంగం కథ, శారద కథలకు రూపాంతరమే బుర్రకథ. అది సంగీతం, నృత్యం, నాటకం -ఈ మూడింటి మేలుకలయిక. బుర్రకథలో నవరసాలూ పలుకుతాయి. ముఖ్యంగా వీర, కరుణరసాలను బాగా ఒప్పించే ప్రక్రియ ఇది. ప్రదర్శన సౌలభ్యాన్ని బట్టి, వీరగాథలను గానం చేసేందుకు ఈ ప్రక్రియ ప్రచార సాధనంగా ఎంతగానో ఉపకరిస్తుంది. బుర్రకథ అనగానే నాజర్ పేరు గుర్తుకు వస్తుంది. ఆయనకు ఎందరెందరో ఏకలవ్య శిష్యులు బుర్రకథనే జీవనాధారం చేసుకొని బ్రతుకుతున్నారు. నాజర్ పల్నాటి యుద్ధం, బొబ్బిలి యుద్ధం బహుళ ప్రచారం పొందినవి.

బుర్రకథ ప్రాచీనమైన తెలుగు జానపద కళ. ముగ్గురు బృందముగా ఉండే ఈ ప్రదర్శనలో మధ్య పాత్రధారి ముఖ్య కథకుడు గానూ, మిగిలిని ఇద్దరిలో ఒకరు వంత కథకు, మరొకరు హాస్య కథకులుగానూ ఉంటారు. సాధారణంగా ఇది నిలుచుని చెప్పే కథ ఐనా, సౌలభ్యత కోసం కూర్చుని కూడా బుర్రకథ చెప్పి శ్రోతలను రంజింపజేయగలవారు కొన్ని ప్రాంతాలలో ఉన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు సమీపాన దొడ్డిపట్ల గ్రామంలో కూర్చుని బుర్రకథ చెప్పే బృందాలు ఉన్నాయి.

బుడిగే జంగాలు మార్చు

బుర్రకథలకు పూర్వ రూపమే జంగం కథ. ఈ కథను చెప్పే వారినే జంగాలని బుడిగే జంగాలని అంటారు. ఒకప్పుడు దేశభక్తి మత ప్రచారాలకు ఎంతో తోడ్పడినా ప్రస్తుతం తెరమరుగై కొందరి ఉధర పోషణార్ధం కొరకే పనికొస్తున్నాయి.

హరికథ మార్చు

హరికథ అన్నది తెలుగు వారి సంప్రదాయ కళారూపం. హిందూ మతపరమైన భక్తి కథలు, ప్రధానంగా హరిలీలలను సంగీత, సాహిత్యాల సంగమంగా చెప్పడాన్ని హరికథ అంటారు.

గిరిజన నృత్యాలు మార్చు

గిరిజనులకు ప్రత్యేకమైన పలు ఆచారాలు తెలుగునాట కూడా ప్రబలమై ఉన్నాయి.

తండాలనృత్యం మార్చు

 
లంబాడీ స్త్రీల నృత్యం

లంబాడీలు, సుగాలీలు, బంజారాలు అని వివిధ నామాలతో పిలువబడే ఆదిమ జాతివారు నాగరిక సమాజానికి దగ్గరగా పల్లెలలో, పట్టణాలలో నివసిస్తున్నా తమ కట్టు, బొట్టు, మాట, పాట, ఆట, ఆచార వ్యవహారాలను సంస్కృతిని వందలాది ఏళ్ళుగా నిలుపుకుంటూ వస్తున్నారు. ముఖ్యంగా లంబాడీ మహిళల రంగురంగుల దుస్తులు, రకరకాల ఆభరణాలు చూడముచ్చటగా ఉంటాయి. వీరు తండాలుగా జీవిస్తారు. పెళ్ళిళ్ళలో, జాతరలలో, వీరి సాంప్రదాయక సామూహిక నృత్యం నేత్రపర్వంగా ఉంటుంది. ఆదిలాబాదు, రంగారెడ్డి, మహబూబ్ నగర్ ప్రాంతాలలో వీరి నృత్యాలను చూసే అవకాశం ఉంది.

గుసాడీ మార్చు

ఆదిలాబాదు జిల్లాలో రాజగోండులకు దీపావళి పెద్ద పండుగ. పౌర్ణమి నాడు ప్రారంభించి నరకచతుర్దశి వరకు గోండులు ఆటపాటలతో కాలక్షేపం చేస్తారు. నెమలి పింఛాలతో తయారు చేసిన పాగా, కృత్రిమమైన గడ్డాలు, మీసాలతో వేషం కట్టి, మెడలో గవ్వల హారాలు, తుంగకాయల దండలు, నడుముకు, మణికట్టుకు చిరు గంటలు, గజ్జెలు ధరించి, కంటి చుట్టూ తెల్లని రంగు పూసుకుని, చేతిలో కర్ర పట్టుకుని గుసాడీ నాట్యం చేస్తారు.

థింసా మార్చు

థింసా నృత్యం విశాఖపట్నం ఏజెన్సీ ప్రాంతాలలో విశేషాదరణ పొందిన జానపద సామూహిక నృత్యాలలో ఒకటి. ఇది గిరిజనుల సంప్రదాయ నృత్యం. ఆడా, మగా వయసుతో నిమిత్తం లేకుండా అన్ని కొండ జాతులవారు ఈ జానపద నాట్య సమ్మేళనంలో పాల్గొంటారు. ఈ నాట్యాన్ని ప్రతి పండుగ సందర్భంలోనూ, వివాహాది సందర్భాలలోనూ చేస్తుంటారు. వీరి దైనందిన జీవితానికి, ఆచార వ్యవహారాలకు ఈ నాట్యం అద్దం పడుతుంది.

రంగస్థల ప్రదర్శనలు మార్చు

యక్షగానం మార్చు

యక్షగాన పరిణామ చరిత్ర అతి విచిత్రమైనది. రచనలో, ప్రదర్శనలో, తరతరాలకు మార్పు చెందుతూ వచ్చింది. మొదట యాత్రా స్థలాలు, కామందుల లోగిళ్ళు తదుపరి పల్లెపట్టుల రచ్చసావిడి, రాచదేవిడీలు యక్షగాన ప్రదర్శనల కథిస్థానములైనవి. వర్తమానంలో అప్పటికప్పుడు ఏ వూరి మొగనో, ఏ కోవెల వాకిటనో, ఏ సంపన్న గృహస్థు ఇంటి ముందటనో, తాటాతూటముగా నిర్మింపబడిన కమ్మల పందిరి కింద, కళ్ళాపి జల్లిన కటికనేలయే దాని రంగస్థలము.

గ్రామవాసుల పందాలు మార్చు

ఎడ్లపందాలు మార్చు

తెలుగు పల్లెలలో ఎడ్ల బలాబలాలను పరీక్షించే బండ లాగుడు పందాలు సర్వ సామాన్యం.

కోడి పందాలు మార్చు

దస్త్రం:Kodi pamdem.jpg
గ్రామీణ ప్రాంతములో కోడిపందాలు

ఇప్పుడు జంతు హింసగా వీటిని నిషేధించారుగాని, ఒకప్పుడు సంక్రాంతికి ఊరూరా కోడి పందాలు తప్పనిసరిగా జరిగేవి. పల్నాటి యుద్ధానికి ఒక కారణం కోడి పందెమే. ఒకప్పుడు గ్రామాలలో కోడి పందాలు అంటే కేవలం కోడిపందాలు మాత్రమే కాదు - పందాలు జరిగే ప్రాంతములో గుండాటలు, పేక మేజిక్ ప్రదర్శనలు, బొమ్మల దుకాణాలు, మిఠాయి దుకాణాలు ఇలా వివిధములతో దాదాపు తిరునాళ్ళ వాతావరణము ప్రతిబింబిస్తూ ఉండేవి. అందుచేతే పందాలంటే ఉదయంనుంచే హడావిడి మొదలయ్యేది గ్రామాలలో. పేరుకు నిషేధం విధించినా అక్కడక్కడా జరుగుతూనే ఉన్నాయి.

సంచార ప్రదర్శనలు మార్చు

పగటివేషం మార్చు

పగటివేష కళాకారులకు రంగస్థలంతో పనిలేదు. పాత్రోచితము, రసోచితము, ప్రాంతీయోచితమైన వేషభాషలతో, నృత్య గానాలతో పట్టపగలు వేషాలు వేసుకుని హావ భావ నటనలు చిలికిస్తూ, రాగ, మేళ, తాళాలతో, పండిత పామరులను మెప్పించడం పగటివేష కళాకారులకు వెన్నతో పెట్టిన విద్య. వీరు ఊరూరా తిరుగుతూ ప్రదర్శించే ఈ రకాలైన ప్రక్రియలలో యక్షగానం ఒకటి.

జంగందేవరలు మార్చు

తలపైన ఫణిచక్రం కలిగిన కిరీటం, నుదుట విభూతి రేఖలు, చంకలో జోలె, ఒక చేతిలో ఇత్తడి గంట, మరో చేతిలో కర్ర, జంగందేవరల ఆహార్యంగా ఉంటుంది. సంక్రాంతి రోజుల్లో బుడబుక్కలవాడు అర్థరాత్రి వచ్చి బుడబుక్కని వాయిస్తూ వెళ్ళగానే వేకువ ఝామున శంఖం ఊదుతూ, గంటను మ్రోగిస్తూ, శివుని కీర్తిస్తూ జంగం దేవర ఊరంతా కలియతిరుగుతూ, ప్రతి ఇంటి ముందు ఆగి గృహస్థులను దీవిస్తూ ముందుకు కదులుతాడు.

బుడబుక్కలవాడు మార్చు

ఇప్పుడు బుడబుక్కల వాళ్లు ఎక్కడా కనిపించడం లేదు. గతంలో బుడబుక్కల వాళ్లు శ్మశానం సమీపంలో నివసించే వాళ్లు. వీరు కాటికాపర్లు. ఏడాదిలో ఒక్కసారి మాత్రమే గ్రామాల్లోకి వచ్చేవాళ్లు. సంక్రాంతి పండుగకు ముందు కేవలం ఓ వారం పది రోజుల పాటు మాత్రమే వీళ్లు ఊళ్లోకి వచ్చేవాళ్లు. తమ చేతిలో డమరుకం తరహాలోని వాయిద్యాన్ని వాయించుకుంటూ ఇల్లిల్లూ తిరిగి... ఆ ఇంటికి సంబంధించి, ఇంటి సభ్యులకు సంబంధించి భూత భవిష్యత్తు వర్తమానాల గురించి రాగయుక్తంగా వినిపించేవారు. అప్పట్లో బుడబుక్కల వారి జోస్యాన్ని ప్రజలు ఎంతగానో విశ్వసించేవారు. శ్మశానంలో కొలువుండే రుద్రుడే వీరి నోట తమ జాతకాన్ని పలికిస్తారని నమ్మేవారు. జోస్యం తమకు అనుకూలంగా ఉన్నా.. ప్రతికూలంగా ఉన్నా.. ఇంటి యజమాని సదరు బుడబుక్కల వాడికి సంతృప్తి కలిగేలా ధాన్యాన్ని ముట్టజెప్పేవారు.

వీరి చేతిలోని డమరుకం చేసే శబ్దం డబుక్కు డబుక్కు అంటూ వినిపించేది. అదే, వ్యావహారికంలో బుడబుక్కు బుడబుక్కు అని.. డమరుకాన్ని డబుక్కు బుడబుక్కు అన్న శబ్దం వచ్చేలా వాయించే వారిని బుడబుక్కల వాళ్లు అనీ పిలిచే వారు.

నిజానికి వీరు జంగమ దేవరలు. ఒంటినిండా రకరకాల వర్ణాల వస్త్రాలను ధరించేవారు. మొలకు పంచె కట్టు ఉండేది. తలకు వర్ణరంజితమైన వస్త్రంతో పాగా చుట్టుకునే వారు. కళ్లకు ఇంతలేసి కాటుక పూసేవారు. నుదుటన భస్మాన్ని దట్టించేవారు. అసలు వీళ్లని చూడగానే పిల్లలకు భయమేసేది. అందుకే తల్లిదండ్రులు మారాం చేసే పిల్లల్ని బుడబుక్కలోడికి పట్టిస్తా జాగ్రత్త అంటూ బెదిరించి దారిలోకి తెచ్చేవారు. వీరు శ్మశానానికి సమీపంలోనే గుడిసె వేసుకొని నివసిస్తూ ఉండేవారు. మారిన కాలంతో పాటే.. వీరి వృత్తిగత జీవితమూ మారిపోయింది. ఇప్పుడు కాటికాపర్లు ఎవరూ ఊళ్లలోకి రావడం కానీ.. జోస్యాలు చెప్పడం కానీ చేయడం లేదు. శ్మశానంలోనే.. చనిపోయిన వారి బంధువుల వద్ద తమకు కావలసినంత మొత్తాన్ని డిమాండ్‌ చేసి తీసుకుంటున్నారు.

కాటికాపర్లు మార్చు

పాములాడించేవారు మార్చు

హరిదాసులు మార్చు

 
సంకీర్తన చేయుచూన్న హరిదాసు

ఒకచేత చిడతలు, మరొకచేత తంబురా మీటుతూ, ఇంటింటి ముంగిట ఆగి "ఏ తీరుగ నను దయ చూచెదవో.." అంటూ ఏదో కీర్తన పాడుతూ హరిలో రంగహరి అని కదిలే హరిదాసులు ధనుర్మాస రాయబారులు. చక్కని ఎర్ర రంగు పంచె కట్టుకొని, ఛాతీ మీద, భుజాలపై, నుదిటి మీద విష్ణు నామాలను పెట్టుకొని అపర నారదుల వలె అగుపించే హరిదాసులు, వారి కీర్తనలు సంక్రాంతి సమయంలో పల్లెకు కొత్త శోభను తెస్తాయి.ఈ కళలో భిక్షాటన ఒక భాగం అయినప్పటికీ ఇందులో దాగి ఉన్న భక్తిభావం పుచ్చుకునే హరిదాసు పట్ల గౌవాన్ని కలిగిస్తుంది. గృహాన్ని వెదుక్కుంటూ వచ్చే కళాప్రక్రియలలో ఇది ఒకటి. ఇది తెలుగు నేలమీద మాత్రమే కనిపించే కళాప్రక్రియ. తెలుగువారి ప్రత్యేకతలలో ఇది ఒకటి. హరిదాసు తలమీద గుమ్మడికాయ వంటి పాత్రను ధరించడం ప్రత్యేకత. ఒక చేతిలో చిడత మరొక చేతిలో తంబురా శ్రావ్యమైన కీర్తనను కొనసాగిస్తూ హరిదాసు లాఘవంగా మొత్తంగా వంగి భిక్షస్వీకరించడం ఒక సుందరదృశ్యంగా భావించవచ్చు.

పులివేషం మార్చు

సర్కారు జిల్లాలలో దసరా పండుగకు, తెలంగాణాలో పీర్ల పండుగకు పులివేషం కడతారు. డప్పు వాద్యానికి అనుగుణంగా అడుగులు వేస్తూ, పులి ఇతర జంతువులను ఎలా ఒడుపుగా వేటాడుతుందో చక్కగా ప్రదర్శిస్తారు ఈ కళాకారులు. ఈ వేషం వేయడంలో విజయవాడకు చెందిన గర్రె అప్పారావు, విజయనగరానికి చెందిన పైడి గురువులు సిద్ధహస్తులు.

పకీరు వేషం మార్చు

గోరింటాకు మార్చు

కాళ్లకు పారాణి ఎలాగో చేతులకు గోరింటాకు అలాగ. గోరింటాకు శోభ ముందు నేటి గోళ్ల రంగులు దిగదుడుపే.

రుంజ మార్చు

రుంజ అనే ఈ చర్మ వాద్యం అతి ప్రాచీనమైనది. శైవ సంప్రదాయానికి చెందినది. ఇప్పుడు కోస్తా జిల్లాలలో అక్కడక్కడ మాత్రమే కనిపిస్తున్న ఈ రుంజ వాద్యాన్ని విశ్వబ్రాహ్మణులు మాత్రమే ఉపయోగిస్తున్నారు. తరం నుంచి తరానికి ఈ వాద్యకళ కొనసాగుతూ వస్తున్నది. 32 రకాలుగా దీన్ని వాయించవచ్చునట.

 
సంక్రాంతి సంభరాల్లో గంగిరెద్దులు

గంగిరెద్దులు మార్చు

ధనుర్మాసం వస్తూనే తెలుగునాట గంగిరెద్దులు ప్రత్యక్షమవుతాయి. వాటిని ఆడించడంలో ఎన్నో వింత పోకడలున్నాయి. గంగిరెద్దు వెంట వచ్చే వ్యక్తి రంగురంగుల దుస్తులు తలపాగాల పంచేకట్టు ధరించి నుదుట నామం మెడలో అనేకరకాల దండలతో ప్రత్యేకంగా ఉంటాడు. ఎద్దు కూడా చక్కగా శిక్షణ పొంది గంరద్దులవాడు చెప్పినదానికి తలఆడిస్తూ చూసేవారికి వినోదం కలిగిస్తుంది. ఇంటింటికీ పోయి వారిచ్చే పాతదుస్తులను తీసుకోవడం ఇందులో ఒక భాగం. గృహస్తు గంగిరెద్దులవాడికి పాతదుస్తులు, కొంత ధాన్యం ఇస్తుంటారు. భిక్షాటన కూడా ఇందులో ఒక భాగమైనా ఇల్లు వెతుక్కుంటూ వచ్చే కళాప్రదర్శనలలో ఇది ఒకటి కనుక ఇది ఇచ్చేవారికి తీసుకునేవారికి కూడా ఆనందం కలిగిస్తుంది.గంగిరద్దులవాడు గృహస్థును, గృహిణిని పొగడ్తలతో ఆనందింపజేయడం ఇందులో ప్రత్యేకత.

ఆటపాటలు మార్చు

చోడిగాడి కలాపం మార్చు

కోలాటం మార్చు

 
కోలాటం

కోలాటం అనేది బృదగానతో కూడిన లలితమైన బృందనృత్యం. దీనిని స్త్రీపురుష బృందాలు కూడా చేస్తుంటారు. ఇది సాధారణంగా ఉత్సవసందర్భంలో చేస్తుంటారు. తిరుపతి బ్రహ్మోత్సవాలలో కూడా కోలాటబృందాలు పాల్గొంటూ ఉంటాయి. బృందంలోని వారు రెండుచేతులలో రెండు కర్రలను పట్టుకుంటూ పాటలకు అనుగుణంగా అడుగులు వేస్తూ కర్రలను కలుపుతూ విడదీస్తూ ఎదుటి వారితో చేరి కర్రలతో కలిపి తాళం వేస్తూ నృత్యం సాగిస్తారు. బృందానికి ఒక నాయకుడు ఉంటాడు. పాటలగా మాత్రం భక్తిగీతాలను ఆలాపిస్తుంటారు. ఒకే విధమైన దుస్తులను వేసుకుని నృత్యం చేస్తే ఇది మరింత సుందరంగా ఉంటుంది. ఇది తెలుగు ప్రజల ప్రత్యేకతలలో ఒకటి.

ఆటలు మార్చు

పల్లెటూళ్ళలో పిల్లలు తమ నిజమైన బాల్యాన్ని అద్భుతంగా ఆస్వాదిస్తారు.ఈ బాల్య జీవితమే తమ భవిష్యత్తులో ప్రక్రుతిపై ప్రేమ,కల్మషం లేని మనస్తత్వం వంటి గుణాలకు ఆయువు పోస్తుంది.

పిల్లల మానసిక వికాసంలోనూ, ప్రకృతితో మమేకమవడం సొంత వూరి పై ప్రేమ వంటి గుణాలన్ని కేవలం ఆటల ద్వారా మాత్రమే పిల్లలకు లభిస్తుంది. పసితనములో బూచి అంటు అమ్మనాన్నలు పిల్లలతో ఆడుకుంటూ మురిసి పోతారు.ప్రతి పిల్లవాడు వూరంతా తనదే అన్న భావనతో తన తోటి పిల్లలతో కలసి ఎక్కడి దొంగలక్కడే గప్చుప్ అంటూ<దాగుడుమూతలు ఆడుకుంటూ అన్నం వేళలు సైతం మరచిపోయి అమ్మ వచ్చి బువ్వకు పిలిచేదాకా అలుపెరుగక ఆడుతూ వుంటారు.అమ్మయిలేమో పొద్దున్నే మంచినీల్లకి వాగులోని చెలమల వద్దకు వెల్లి అక్కడే గన్నాలు ఏరుకొని వచ్చి అచ్చనగన్నాలాట,మామిడి టెంకతో తొక్కుడుబిళ్ళ,గుజ్జనగూళ్ళు వంటి ఆటలతో మైమరిచి పోతారు.అబ్బాయిలేమోకర్ర బిళ్ళ క్రికెట్ వంగుడుదూకుడు వంటి అటలు ఆడుతూ పొలాలకు వెళ్ళి అక్కడ చెట్లతో అనుబంధం పెంచుకుంటూ అక్కడే తాటి ముంజలు తింటూ పక్షులతో గడుపుతూ కుటుంబం స్నేహితులతో బంద్గువులతో సంతొషిస్తారు.వెన్నెల రాత్రుళ్ళో చెప్పవలసిన అవసరమే లేదు.బజారులో పిల్లలందరూ దాక్కొనే ఆట,నీడ తొక్కే ఆట,వంటీవి ఆడూతూనే ఉంటారు.

ఇలా మానసిక వికాసంతో పాటు మంచి అలవాట్లు,కలివిడితనం,వంటి లక్షణాలు ఆటల ద్వారానే అలవడతాయి.కాని ప్రస్తుతం బాల్యం బందీ అవుతుంది.ఆటలు ఆడతానికి స్వేచ్ఛ లేదు.పోటి నెపంతో పిల్లలు బాల్యం అనుభవించకుండానె పెరుగుతున్నారు.పట్నమ్లో అయితే మరీ.ఒక గదిలో బంధించి వుంచబడుతాడు.ఈ పరిస్థితి మారాలి.

నృత్యసంప్రదాయాలు మార్చు

దేవదాసినృత్యం మార్చు

ఆంధ్ర దేశంలో దేవదాసీలు, భాగవతులూ నృత్య కళను పోషించి అభివృద్ధిలోకి తీసుకు వచ్చారు. దేవదాసీల నృత్యకళ, భాగవతుల నృత్య కళ అని అది వేరు వేరుగా అభివృద్ధి పొందింది. దేవదాసీలు దేవాలయాల నృత్యమండపాలలో, దేవుని సన్నిధానంలో శైవ, వైష్ణవ సంప్రదాయాలననుసరించి అరాధన నృత్యాలూ, అష్టదిక్పాలక నృత్యాలు, కేశికా ప్రదర్శనాలూ, కలాపాలూ మొదలైన నృత్యాలను ప్రదర్శించేవారు.

కూచిపూడి నృత్యం మార్చు

పిట్టలదొర మార్చు

నాకు తెలియదు

లంబాడి గన్నెగాడు మార్చు

వివాహవేడుకలు మార్చు

కనక తప్పెట్లు మార్చు

డప్పుల వాయిధ్యాన్నే రాయలసీమలో కనక తప్పెట్లు అంటారు. వీటిని సాధారణంగా జాతరలకు, వివాహాలకు, చాటింపులకు ఉపయోగిస్తూ ఉంటారు. దప్పులతో గుండ్రంగా తిరుగుతూ పాటలు పాడుతూ వివిధ వరుసలలో లయగా వాయిస్తూ లయబద్దంగా నృత్యం చేస్తారు.

విప్రవినోధం మార్చు

కొలుపులు మార్చు

దేవతాకొలువులు మార్చు

దండగానం మార్చు

జోస్యం మార్చు

ఎరుకలసాని మార్చు

చిలుక జోస్యం మార్చు

హస్తసాముద్రికం మార్చు

మతవిశేషాలు మార్చు

వీర శైవులు మార్చు

గొల్ల సుద్దులు మార్చు

పగటి వేషాలు మార్చు

జానపదకళలు ఆదరణ తక్కువ కావడంచేత చాలా కళలు భిక్షుకవృత్తిగా మారిపోయాయి. బుర్రకథ, వీధినాటకం, యక్షగానం వంటి కళారూపాలు భిక్షుకవృత్తిగా మారిపోయిన దశ కనిపిస్తుంది. అట్లాంటి కళారూపాలలో పగటివేషాలు ఒకటి. చాలా జానపద కళారూపాలు మతపరంగానో, కులపరంగానో, వాద్యాలపేరుతోనో పిలువబడితే కేవలం ప్రదర్శనాసమయాన్ని బట్టి పిలువబడేది పగటివేషాలు కళ. అనేకమైన వేషాలు ప్రదర్శింపబడడంచేత, పగటిపూటనే ప్రదర్శింపబడడంచేత ఇవి పగటివేషలయ్యాయి. పగటి వేషాలనే పైటేషాలని కూడా అంటారు.

పగటి వేషాలు జానపద కళారూపాల్లో ప్రముఖమైనవి. యక్షగానం, వీధినాటకాలనుండి బ్రోకెన్ డౌన్ మిత్ అన్న వాదం ప్రకారం వీధినాటకాలే పగటివేషాలుగా మారాయని పరిశోధకుల అభిప్రాయం. ప్రదర్శించే వేళను బట్టి, సమయాన్ని బట్టి వీటికి పగటివేషాలని పేరు వచ్చింది. కేవలం పగటిపూట మాత్రమే వీటిని ప్రదర్శిస్తారు. పగటివేషాలను, సంచారిపగటివేషాలని, స్థానిక పగటివేషాలని విభజించవచ్చు. సంచారిపగటివేషాల వాళ్ళు దాదాపుగా సంచారజీవనం చేస్తూ ప్రదర్శనలిస్తుంటారు. వీళ్ళనే బహురూపులు అనికూడా అంటారు. పగటివేషాల ప్రదర్శన ఒక ఊళ్ళొ నెలల పాటు ఉంటుంది. ప్రతి రోజు ప్రదర్శించి తరువాత చివరి రోజున సంభావనలు తీసుకుంటారు. జానపద కళలూ చాలా వరకు యాచక వృత్తిగా మారిపోయాయి. అట్లా మారిన వాటిలో పగటివేషాలు ఒకటి. వచ్చిన సంభావన అందరు పంచుకుంటారు. వీరు ఆహార్యం, అలంకరణ పట్ల శ్రద్ధ వహిస్తారు. సంభాషణలు, వీరు చెప్పే పద్యాలు రక్తి కట్టిస్తాయి. ప్రాచీన కాలంలో అనేక పగటివేషాలు ప్రదర్శింపబడేవి. కాని ఇప్పుడు అన్ని వేషాలు వేయడం లేదు. కారణం జీవనంలో వచ్చిన మార్పులేనని వీరు చెబుతారు. ఒకప్పుడు బోడి బాపనమ్మ వేషం వేసేవారు. కాని ఉదయమే ఈ విధవ మోహం చూడలేమని ఈ వేషంతో మా యింటి వద్దకు రావద్దని చెప్పడం మూలాన ఈ వేషం వేయడంలేదని వీరు వివరించారు. అట్లే కులాలకు, మతాలకు చెందిన సాత్తని వేషం, బ్రాహ్మణ వేషం వంటివి వేయడంలేదు. వీరు ప్రదర్శించే వేషాలలో అర్థనారీశ్వర వేషం ప్రత్యేకమైనది. ఈ వేషం మేకప్ వేయడానికి దాదాపుగా 3 గంటల సమయం పడుతుందని, సాయంకాలం దాకా ఈ మేకప్ ఉండాలికాబట్టి ప్రత్యేకమైన రంగులు వాడతామని వీరు చెబుతారు. ఒకే వ్యక్తి స్త్రీ, పురుష వేషాలు ధరించి సంభాషణలు చెప్పడం అంటే సామాన్యం కాదు.

పగటి వేషాలు చారిత్రకత మార్చు

జనవ్యవహారంలో ఉన్నకథలను బట్టి పగటివేషాలు రాజు కళింగ గంగుకథ, సంబెట గురవ రాజు కథ, విజయనగర రాజుల కథలు ప్రస్తావనలోకొస్తాయి. పగటి వేషల గురించి మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి, ప్రొ. ఎస్. గంగప్ప పరిశోధించి పగటి వేషాలు వాయసంలోను, కూచిపూడి భాగవథులు ప్రదర్శించే వేషాలను పగటి వేషాలుగా వివరించారు. పగటి వేషాలకు చారిత్రకాధారాలున్నాయి. భిక్షుకవృత్తిగా ప్రారంభమైన ఈ కళ కాలక్రమంలో ఒక సంక్లిష్ఠ రూపంగా మారింది. శాతవాహనుల పరిపాలనా కాలమందే ఈ కళారూపం ఉందని, హాలుని గాథాసప్తశతిలో దీని ప్రస్తావన ఉన్నట్లు తెలుస్తోంది. మార్గ, దేశి, శిష్ఠ సాహిత్య లక్షణాలన్ని మూర్తీభవించిన కళ పగటివేషాలు.

 
పగటి వేష గాళ్ళు

పగటివేషాలు - వర్గీకరణ మార్చు

  1. పగటి వేషాలు ఒకప్పుడు దాదాపుగా 64 ఉండేవని కాని ఇప్పుడు 32 వేషాలు మాత్రమే వేస్తున్నామని నంద్యాల కళాకారులు అంటారు. ఇతివృత్తం ఆధారంగా పగటివేషాలను ఐదు విధాలుగా విభజించవచ్చు.
  2. మతపరమైనవి: ఆదిబైరాగి వేషం, చాతాది వైష్ణవ వేషం, కొమ్ము దాసరి వేషం, హరిదాసు వేషం, ఫకీరు వేషం, సహెబుల వేషం.
  3. కులపరమైనవి: బుడబుక్కల వేషం, సోమయాజులు-సోమిదేవమ్మ వేషం, బోడి బ్రాహ్మణ స్త్రీ వేషం, వీరబాహు వేషం, గొల్లబోయిడు వేషం, కోయవాళ్ళ వేషం, దేవరశెట్టి వేషం, దేవాంగుల వేషం, ఎరుకలసోది వేషం వంటివి.
  4. పురాణపరమైనవి: జంగం దేవర వేషం, శక్తి లేదా శూర్పణఖ వేషం, అర్థనారీశ్వర వేషం వంటివి.
  5. జంతు ప్రదర్శన పరమైనవి: గంగిరెద్దుల వేషం, పాములోల్ల వేషం,
  6. ఇతరములు: పిట్టలదొర వేషం, చిట్టి పంతులు వేషం, కాశీకావిళ్ళ వేషం వంటివి.

పగటివేషాలు- ప్రదర్శన రీతులు మార్చు

పగటివేషాల్లో కొన్నింటిలో సంభాషణలకు ప్రాధాన్యత ఉంటే మరికొన్నింటిలో పద్యాలకు, అడుగులకు, వాద్యాలకు ప్రాధాన్యత ఉంటుంది. బుడబుడకల వేషం, ఎరుకలసాని వేషం, బోడి బ్రాహ్మణ స్త్రీ వేషం వంటి వాటిలో సంభాషణలకు ప్రాముఖ్యత ఉంటుంది. పురాణ వేషల్లో హార్మోనియం, తబలా వంటి వాద్యాలతో పాటు యక్షగాన శైలిలో ప్రదర్శన ఉంటుంది. కుల సంబంధమైన పగటివేషాలు సంఘంలోని అనేక కులాల వారి జీవనవిధానాన్ని వ్యంగ్యంగా ప్రదర్శిస్తాయి. ప్రతి కులాన్ని గురించి తెలియ చేస్తూ ఆ కులాలపై సమాజం యొక్క అభిప్రాయాలను విమర్శిస్తాయి. పగటివేషాల లక్ష్యం వ్యంగ్యమే. వీరికి రంగస్థలం అంటూ లేదు. ఇంటిగడప, వీధులు, సందులు, గొందులు, అన్ని వీరి రంగస్థలాలే. ప్రదర్శన సమయాల్లో ప్రేక్షకులు, ప్రదర్శకుల మధ్య వ్యత్యాసముండదు. పగటి వేషాల్లోనే ప్రత్యేకత, ప్రావీణ్యత కలిగిన వేషం అర్థనారీశ్వర వేషం. ఒక వ్యక్తి మధ్యలో తెర కట్టుకొని ఒకవైపు నుండి పార్వతి, మరోవైపునుండి శివుడుగా అలంకరణ చేసుకొని ప్రదర్శనలిస్తాడు. తెర మార్చుకుంటున్నప్పుడు ఒక వైపు నుండి చూస్తే శివుడు మరో వైపునుండి చూస్తే పార్వతిని చూసిన అనుభూతి కలుగుతుంది. తెర మార్చుకోవడంలోనే వీరి నైపుణ్యమంతా దాగిఉంది.

గిరిజన ఉత్సవాలు మార్చు

బతుకమ్మ మార్చు

తెలంగాణా ప్రాంతంలో ఆచరించే పూల పండుగ, పూబోడుల పండుగ, బతుకమ్మ. తొమ్మిది రోజులపాటు ఎంతో ఉత్సాహంతో మహిళలు జరిపే ఈ పండుగ చివరి రోజును సద్దలు అని వ్యవహరిస్తారు. దసరాకు ఒకటి రెండు రోజుల ముందు ఈ పండుగ వస్తుంది. రంగు రంగుల పూలను ఎంతో మెళుకువతో పిరమిడ్ ఆకారంలో పేర్చి, ఆ పువ్వుల కుచ్చెన నడిబొడ్డులోగాని, శిఖరంలోగాని గౌరమ్మను అమరుస్తారు. ఈ పువ్వుల పళ్లెరాన్ని వాకిట్లో ఉంచి కొత్త దుస్తులు ధరించి స్త్రీలు, బాలికలు చేరి దీని చుట్టూ క్రమంగా తిరుగుతూ చప్పట్లు కొడుతూ పాటలు పాడుతారు. తర్వాత ఊరేగించి ఈ బతకమ్మలను చెరువులో నిమజ్జనం చేస్తారు.

 
గొర్రెల మంద

నాగోబా జాతర మార్చు

సారక్కసమ్మక్క జాతర మార్చు

మూగజీవాలతో అనుబంధం మార్చు

అన్నదాతలకు దూరమవుతున్న ఆత్మ బంధువులు. పొలంలో రైతన్నలకు అసలైన నేస్తాలు ఈ మూగ జీవాలే. ఆవులు..గేదెలు..ఎద్దులు కళ్ల ముందు కనిపించకపోతే చాలా మంది రైతులు విలవిలాడిపోతారు. రోజంతా వాటితోనే కాలక్షేపం చేస్తారు. భాష రాకపోయినా ఎన్నో ఊసులు చెప్తారు. అవి చూపించే హావభావాలు ముసి ముసి నవ్వులు నవ్వుకుంటారు. వాటికి కష్టం వస్తే తల్లడిల్లిపోతారు. ఏదైనా ఊరు వెళితే అవి గడ్డి తిన్నాయో లేదో.. నీళ్ళు తాగాయో లేదోనని అన్నదాతలు బెంగపెట్టుకుంటారు. ఎందుకంటే వేల సంవత్సరాలుగా కొనసాగుతున్న బంధం అది. కేవలం 20 ఏళ్లలో ప్రపంచం మారిపోయింది. అందరికీ అన్నం పెట్టే అన్నదాత బతకలేక ఆత్మహత్య చేసుకుంటున్నాడు. ఒక వేళా గుండె నిబ్బరంతో బతుకుదామనుకుంటే మన విధానాలు బతకనివ్వడం లేదు. మూగజీవాలు ఎప్పుడూ ఆత్మహత్య చేసుకోవు . ఒకవేళ వాటికి కూడా భాష..భావం తెలిస్తే తమ ప్రియ నేస్తం రైతన్న పడుతున్న అగచాట్లు చూస్తే అవే ముందే ఆత్మహత్య చేసుకుంటాయి !!!

పల్లెదృశ్యాలు మార్చు

గొర్రెల మందలు మార్చు

గొర్రెల మందలను కాయడం ఒక వర్గం ప్రజలకు వృత్తి. గొర్రెలు పాలు ఇస్తాయి, ఉన్ని ఇస్తాయి. పైగా వ్యవసాయ భూములలో మందలను వదలి పెట్టడం వల్ల ఆ భూములకు ఎరువులు సమకూరి సారం పెరుగుతుంది. ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి కాపరులు గొర్రెలను తోలుకుపోవడం తెలుగునాట తరుచుగా కనబడే చక్కని దృశ్యాలలో ఒకటి.

పండుగలు మార్చు

ఉగాది మార్చు

వేపపువ్వు, చెరుకుముక్కలు, కొబ్బరి ముక్కలు, మామిడి ముక్కలు, బెల్లం, చింతపండు, అరటి పండు కలిపిన ఉగాది పచ్చడి ఎంతో శ్రద్ధతో తయారు చేస్తారు. వ్యక్తి జీవితంలో సుఖదుఃఖాలకు ప్రతీక అయిన తీపి, చేదుల వేపపువ్వు పచ్చడి ప్రసాదం తీసుకోకుండా ఉగాదినాడు ఏ పనినీ తలపెట్టకూడదని ప్రజల నమ్మకం.

మొహరం పండుగ మార్చు

మృతవీరులు - హసన్, హుస్సేన్ సంస్మరణార్థం మొహరం మాసంలో పది రోజులు జరిపే పండుగ మొహరం. ఏభై సంవత్సరాల క్రితం హైదరాబాదు నగరంలో మొహరం ఊరేగింపు చూడడం ఒక గొప్ప అనుభవం. నానాటికి ఈ విషాద గర్భిత ఉత్సవం ఆచరించుకునే తీరులో మార్పులు వస్తున్నట్టు గమనించవచ్చు. ఈ పండుగనే పీర్ల పండుగగా తెలుగులో వ్యవహరిస్తారు. ఈ పండుగ సందర్భంగా సున్నీ తెగవారు ఆకుపచ్చ దుస్తులు, షియా తెగవారు నల్లని వస్త్రాలను ధరిస్తారు. స్త్రీలు సంతాప సూచకంగా ఆభరణాలు ధరించరు. తల వెండ్రుకలు కూడా ముడవరు. చేతి గాజులు తొలగిస్తారు.

వినాయకచవితి మార్చు

హిందువుల పండుగలలో అతి ముఖ్యమైనది వినాయక చవితి. దీన్ని ఔత్తరాహులు గణేశ్ చతుర్థి అంటారు. తలపెట్టిన పనులు విఘ్నరహితంగా నెరవేరాలని కోరుతూ వినాయకుడిని ఆనాడు పూజిస్తారు. అన్ని రకాల పత్రి, పువ్వులు, ఫలాలు, పూజాద్రవ్యాలు, వినాయకునికి ఇష్టమైన కుడుములు ఆనాటి పిండి వంటలలో ముఖ్యభాగం. పూజానంతరం వినాయకుని కథ చదివి అక్షింతలు నెత్తిపై చల్లుకుంటే తప్ప పండుగ పూర్తికాదు. పూజ చెయ్యకుండా ఆ రాత్రి చవితి చంద్రుడిని చూడరాదని కట్టడి.

పూర్వం మన పల్లెటూళ్ళలో ఏ ఉత్సవం జరిగినా, తిరునాళ్ళు జరిగినా బుట్ట బొమ్మలు ప్రత్యక్షమయ్యేవి. ఈ బుట్టబొమ్మలు ధరించిన కళాకారులు వాద్యాలకు అనుగుణంగా లయాన్వితంగా నాట్యం చేస్తారు. క్రమంగా ఈ కళ అంతరించి పోతున్నది.

కన్నెపిల్లలు మార్చు

కన్నెపిల్లల అలంకరణలు మార్చు

కాళ్లకు పారాణి అచ్చమైన తెలుగు సంప్రదాయం. కాళ్లకు పారాణి పూసుకుని పావడా కుచ్చెళ్లు ఎత్తిపట్టుకుని వెండి పట్టాలు ఘల్లు ఘల్లుమంటూండగా కన్నెపిల్లలు నట్టింట నడయాడడం ఎంతో అందమైన దృశ్యం.

కన్నేపిల్లల ఆటపాటలు మార్చు

తొక్కుడు బిళ్ళలు మార్చు

చెమ్మచెక్క మార్చు

చెమ్మచెక్క - చేరడేసి మొగ్గ అంటూ ఆడే ఇలాంటి పడుచు పిల్లల్ని చూసే కవి తిలక్ నా అక్షరాలు వెన్నెల్లో ఆడుకునే అందమైన ఆడపిల్లలు అని, అని ఉంటాడు.

గవ్వలాట మార్చు

గుజ్జనగూళ్ళు మార్చు

గచ్చనగాయలు మార్చు

ఉయ్యల మార్చు

గొబ్బిపాటలు మార్చు

గుజ్జనగూళ్ళు మార్చు

బాలల ఆటపాటలు మార్చు

గోళీలు మార్చు

గోళీలు యావత్ భారతదేశంలోని పిల్లలందరికీ సుపరిచితాలే. అయితే వీటిని ఆడే విధానాలలో పలు తేడాలు గలవు.

తెలంగాణలో వీటిని ఆడటానికి ఇసుకలో కర్రతో గానీ, నేలపై బొగ్గు/సుద్దముక్కతో గానీ ఒక చతురస్రాకారంలో డబ్బా, కొంత దూరంలో ఒక గీత గీస్తారు. ఆటలో పాల్గొనే ఒక్కొక్కొళ్ళు ఎన్నేసి గోళీలు పందెం వేయాలో నిర్ణయించుకొంటారు. అందరి గోళీలని మొదటి ఆటగాడు తీసుకొని, గీత వద్ద నిలబడి గోళీలని డబ్బాలో వేయాలి. డబ్బాలోని గీతల మీద/గీతల వెలుపల పడ్డ గోళీలని చొన్గా వ్యవహరిస్తారు. డబ్బాలో పడ్డ గోళీలలో ఏదో ఒక దానిని ఇతర ఆటగాళ్ళు చూపిస్తారు. గీత వద్దనున్న ఆటగాడు ఇతరులు చూపిన గోళీని మాత్రమే తన వద్ద ఉన్న గోళీతో (దీనిని ట్యాంపర్ అంటారు) బయటికి కొట్టాలి. గోళీ బయటపడితే ఆ గోళీ కొట్టినవాడి సొంతం. పడకుంటే మళ్ళీ దానిని డబ్బాలో ఎక్కడో ఒక అక్కడ ఉంచవచ్చును. అయితే చొన్ లని మాత్రం ఎడమ చేత్తో (ఎడమ చేయి వాటం వారు కుడి చేత్తో) కొట్టాలి.

రాయలసీమలో తోక, తొంబ, నింబ అని ఒకే గోళీని వివిధ దూరాల నుండి కొట్టే ఆట ఉంది.

బొంగరాలు మార్చు

బచ్చాలు మార్చు

గిల్లాకర్ర మార్చు

చెడుగుడు మార్చు

 
పల్లెల్లో చెడుగుడు

ఉత్తరాదివారు కబడ్డీ అంటారు. తెలుగు వారు చెడుగుడు అంటారు. ఏ పేరుతో ఆడినా అందరికీ ఆసక్తి కలిగిస్తుంది ఈ ఆట. రెండు జట్లుగా జరిగే ఈ ఆటలో పది నుండి ఐదు వరకూ ఒకోజట్టులో సభ్యులుంటారు. కూత అనే ప్రక్రియతో అవతలి జట్టుమీదకు రెండవ జట్టు నుండి ఒకరు వెళతారు. అతడు నోటితో చేసే ఆకూత అనే శబ్దం ఆపేలోపుగా అవతలి జట్టులో ఎవరినైనా ముట్టాలి. అవతలి జట్టు అతని కూత ఆపి పారిపోయేలోగా పట్టూకొంటే అతను బయట నిలుచోవలసి వస్తుంది.

వీరకంబం మార్చు

కోక్కో మార్చు

లాలిపాటలు మార్చు

నోములు, వ్రతాలు మార్చు

సత్యనారాయణ వృతం మార్చు

ఈ వృతానికి చేసే ప్రసాదం, పంచామృతం. పాలు, పెరుగు, నెయ్యి, తేనె, వెన్నలని కలిపి అందులో పండ్ల ముక్కలు వేస్తారు. ఇది చాలా రుచికరంగా ఉండటమే కాక మంచి బలవర్ధకమైన ఆహారము.

కార్తీక నోములు మార్చు

నిర్మాణ శైలి మార్చు

 
అమరావతి స్తూపం నమూనా (ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పురావస్తు ప్రదర్శనశాలలో ఉన్న చిత్రం

తెలుగు నేలని పాలించిన మౌర్యులు, శాతవాహనులు, తూర్పు గాంగేయులు, పల్లవులు, చాళుక్యులు, చోళులు ద్రావిడులు, నాగరులు, కళింగుల ప్రభావం ఇక్కడ నిర్మించబడ్డ గుడుల పై ఉంది. అంతేకాక జైన మందిరాలు, చర్చిలు, మసీదులు, సమాధులపై వివిధ పాలకుల ప్రభావం ఉంది.

పూర్వపు చరిత్ర మార్చు

క్రీ.పూ 3వ శతాబ్దం ద్వితీయార్థంలో మధ్య, దక్షిణ దక్కను ప్రాంతం (అనగా ప్రస్తుత ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ)లలో గ్రానైటు కొండల పైన, వాటి చుట్టు ప్రక్కలా దీర్ఘ చతురస్రాకార గృహాలలో ప్రజలు నివసించేవారు. ఈ ఇళ్ళ గోడలని కర్ర, మట్టి, బంక మట్టి లతో నిర్మించేవారు. పైకప్పులు చదునుగా గానీ, శంఖాకృతిలో గానీ ఉండేవి.

బౌధ్ధ నిర్మాణాలు మార్చు

క్రీ.పూ 2వ శతాబ్దానికి పూర్తి అయిన అమరావతి స్థూపం శాతవాహనులచే కట్టింపబడింది. ప్రస్తుతం దీని అవశేషాలు మాత్రమే లభ్యమైననూ దీని చిత్రపటం చూచి అప్పటి వైవిధ్య నిర్మాణ శైలిని అర్థం చేసుకొనవచ్చును. ఇదే కాలానికి చెందిన కట్టడాలని గుంటుపల్లి (ఇబ్రహీంపట్నం) లోనూ చూడవచ్చును. నిలబడి ఉన్న పలు బుద్ధ విగ్రహాలు, పలు స్థూపాలు, బౌద్ధ విహారాలు రాతిపై చెక్కబడ్డాయి.

7వ శతాబ్దానికి చెందిన బౌద్ధ కట్టడాలని శంకారం (అనకాపల్లి)లో కూడా కనబడతాయి. తర్వాతి కాలంలో వీటిని హైందవ ప్రార్థనా మందిరాలుగా వినియోగించటం జరిగింది.

హైందవ నిర్మాణాలు మార్చు

ఇదే కాలంలో తూర్పు దక్కను ప్రాంతాన్ని కొండవీటి రాజులు పాలించారు. నెల్లూరు జిల్లాలోని భైరవకొండలో రాతిపై చెక్కిన శివాలయాలు, ఇతర ఆలయాలు ఉన్నాయి. ఇక్కడ శివలింగాలు, శివుని, ఇతర దేవుళ్ళ చిత్రపటాలు ఉన్నాయి. తమిళనాడులోని పల్లవులు నిర్మాణశైలి భైరవకొండలో ప్రస్ఫుటంగా కనబడుతుంది. ఇదే శతాబ్దంలోనే ఉండవల్లిలో గుహాలయాలు నిర్మించబడ్డాయి. వీటిలో అన్నింటికన్నా పెద్దది నాలుగు అంతస్తులు గలది. పై అంతస్తు క్రింది అంతస్తుకంటే వైశాల్యం తగ్గేలా దీనిని నిర్మించారు. నారద, తుంబురుల, సింహాల ప్రతిమలని మూడవ అంతస్తులో చుట్టు ప్రక్కలా చూడవచ్చును. వీటిలో నాలుగు మండపాలు ఒకదానితో ఒకటి అనుసంధానించబడి ఉన్నాయి. స్తంభాలు, గోడలపై అనంతశయనుడి, గరుడాధిరోహిత విష్ణువు యొక్క శిల్పాలని చెక్కబడి ఉన్నాయి.

 
ఉండవల్లి గుహలు

పాపనాథ (భారతీయ-ఆర్య) నిర్మాణ శైలి మార్చు

ఆలంపూర్లోని గుళ్ళ శిఖరాలు భారతీయ-ఆర్య సంస్కృతికి నిదర్శనాలు. ఇవి పాపనాథ/పత్తఢకల్ శైలిలో నిర్మించబడ్డాయి. ఇవి పెద్ద గుళ్ళు కాకపోయిననూ, వీటి నిర్మాణశైలిలో చాలా పరిపక్వత కనబడుతుంది. 7-8వ శతాబ్దాల కాలంలో తుంగభద్ర నదీతీరం పై పూర్వ చాళుక్యులు నిర్మించిన గుళ్ళు తొమ్మిది ఉన్నాయి. వీటన్నిటినీ కలిపి నవ బ్రహ్మగా సంబోధించిననూ, ఇవన్నీ శైవ క్షేత్రాలే. వీటి నిర్మాణశైలిలో మధ్య భారత, పశ్చిమ భారత శిఖరాల ప్రభావం చూడవచ్చును. 11వ శతాబ్దంలో నిర్మించబడిన పాపనాశి దేవాలయాల సమూహము ఈ ప్రదేశపు మతప్రాధాన్యతని తెలుపుతుంది.

 
ఆలంపూర్ లో చాళుక్యుల కాలం నాటి దేవాలయాలు

కాకతీయ నిర్మాణ శైలి మార్చు

చాళుక్య నిర్మాణ శైలినే ఇంకొంత అభివృద్ధి చేసి, స్థానిక స్థితిగతులకు అనుగుణంగా మార్పులు, చేర్పులు చేసి, కాకతీయులు తమకంటూ ఒక ప్రత్యేక నిర్మాణశైలిని ఏర్పరచుకొన్నారు. చాళుక్యుల వంపులకి, నిలువుగా ఉండే ఉత్తరాది నిర్మాణశైలికి భిన్నంగా కాకతీయులు శిఖరాలని మెట్లవలె చెక్కుకుంటూ వచ్చేవారు.

1210లో కాకతీయ రాజు గణపతి దేవుడిచే నిర్మించబడ్డ రామప్ప దేవాలయము విశ్వబ్రాహ్మణ శిల్పుల పనితనానికి మచ్చుతునకగా చెప్పవచ్చు. ఇక్కడ త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణువు, శివుడు లకు గుళ్ళు ఉన్నాయి.

1261వ సంవత్సరం నాటికి పూర్తయిన వరంగల్ కోటని కాకతీయ వంశానికి చెందిన గణపతి దేవుడు కట్టించాడు.

ఇవన్నీ ఇప్పటికీ విహార యాత్రికుల ఆకర్షణలే!

దక్కను-ఒడిస్సీ మిశ్రమ శైలి మార్చు

13వ శతాబ్దానికి చెందిన తూర్పు గాంగేయులు ప్రస్తుత విశాఖపట్నం పొలిమేరలలో ఒక కొండ పై వరాహ నరసింహస్వామి ఆలయాన్ని కట్టించారు. ఈ గుడి దక్కను, ఒడిస్సీ మిశ్రమ శైలికి ఉదాహరణ.

రెడ్డిరాజుల నిర్మాణశైలి మార్చు

కొండపల్లి కోట, కొండవీటి దుర్గం రెడ్డి రాజుల నిర్మాణ శైలికి జ్ఙాపకాలు.

విజయనగర సామ్రాజ్య నిర్మాణ శైలి మార్చు

పెనుగొండ కోట, లేపాక్షి వీరభద్రాలయం లోని నాగలింగం, నంది, తాడిపత్రి లోని గుళ్ళు, శ్రీశైలం, శ్రీకాళహస్తి, చంద్రగిరి కోట, అహోబిలం, తిరుమల, తిరుపతి లోని గుళ్ళలో విజయనగర సామ్రాజ్యము యొక్క విశాలమైన నిర్మాణశైలి స్పష్టంగా కనబడుతుంది.

కుతుబ్ షాహి శైలి మార్చు

దక్కను ప్రాంత రాజ్యాలకు పర్షియా, టర్కీ, అరేబియా లతో సంబంధాలుండటంతో ఇక్కడి పూర్వ తుగ్లక్ శైలితో నిర్మించబడే కోటలపై వాటి ప్రభావాలు ఉండేవి. ఈ ప్రభావాలతో సాంప్రదాయ హైందవ భూమిపై ఒక సరిక్రొత్త సంస్కృతి చొప్పించబడింది.

కుతుబ్ షాహిలు పెద్ద పెద్ద గ్రానైటు గోడలని వారి నిర్మాణాలలో ఉపయోగించేవారు. స్థానికంగా లభ్యమయ్యే గ్రానైటు-ఇసుక-సున్నపు మిశ్రమాలను గోల్కొండ కోట, పైగా సమాధులు, చార్మినార్, ఇతర సమాధులలో చూడవచ్చును. సాధారణంగా ఈ సమాధులు చతురస్రాకారాలలో కట్టబడి ఉంటాయి.

హైదరాబాదులోని తొట్టతొలి కుతుబ్ షాహి కట్టడం గోల్కొండ వద్దనున్న సఫా మసీదు. ఇది 1518లో, బహమనీ సుల్తానుల నుండి ప్రాప్తించిన విముక్తి జ్ఞాపకార్థం నిర్మించబడింది.

1543 లో గోల్కొండలో నిర్మించబడ్డ మొట్టమొదటి (సుల్తాన్ కులి) కుతుబ్ షాహి సమాధికి బీదరులో నిర్మించబడ్డ మొహమ్మదు సమాధికి సామ్యాలు ఉన్నాయి.

కుతుబ్ షాహి రాజులలో ఐదవ రాజు అయిన మొహమ్మద్ కులీ కుతుబ్ షాహ్, చార్మినార్ ని నిర్మించి గోల్కొండ వద్ద నుండి చార్మినార్ వద్దకి తన రాజ్యాన్ని మార్చాడు. కావున హైదరబాదుని కనుగొన్న ఘనత ఇతనికే చెందును.

తర్వాతి కాలంలో కుతుబ్ షాహి నిర్మాణ శైలి కొంత ఆధునికీకరించబడింది. మక్కా మసీదు, జుమ్మా మసీదులు ఈ శైలిలోనే నిర్మించబడినవి.

అసఫ్ జాహీ శైలి మార్చు

దస్త్రం:Chowmahalla palace inside.jpg
చౌమహల్లా రాజభవనం

కుతుబ్ షాహిలని ముట్టడించిన తర్వాత మొఘల్ రాజుల అధికారంలో అసఫ్ జాహీ శైలిలో నిర్మాణాలు జరిగాయి.

ఇతరాలు మార్చు

సాహిత్యం మార్చు

తెలుగు సాహిత్యం పై సంస్కృత సాహిత్యం, హైందవ గ్రంథాల ప్రభావం అధికంగా ఉంది. కవిత్రయంగా పేరుగాంచిన నన్నయ, తిక్కన, ఎఱ్రాప్రగడలు మహా భారతమును తెలుగులోకి అనువదించారు. వేద వ్యాసుడు రచించిన మహాభాగవతంను బమ్మెర పోతన శ్రీమదాంధ్ర భాగవతంగా అనువదించాడు. ఆదికవి నన్నయ పురాతనమైన తెలుగు-కన్నడ లిపి నుండి ప్రస్తుత తెలుగు లిపిని కూర్చారు. శ్రీ కృష్ణదేవ రాయలుఆముక్తమాల్యదను రచించటమే కాక దేశభాషలందు తెలుగు లెస్స అని అన్నాడు. యోగి వేమన తన పద్యాల ద్వారా తాత్త్విక చింతనని వినిపించగా,విశ్వనాథ సత్యనారాయణ, సింగిరెడ్డి నారాయణరెడ్డి వంటి ఆధునిక కవులు తెలుగు భాషకి క్రొత్త సొబగులు అద్దారు. శ్రీశ్రీ, గద్దర్ లాంటి విప్లవ కవులు తమ భావాలని భాష ద్వారా వ్యక్తపరచి జనంలోకి చొచ్చుకుపోయారు.

తెలుగు సాహిత్యమునకు వేల సంవత్సరాల చరిత్ర ఉంది. తెలుగు సాహిత్యం ఎంతో సుసంపన్నమైనది. ఆధ్యాత్మికములోనైనా, శృంగారాది నవరసములలోనైనా, జాతిని జాగృతం చేయు విషయంలోనైనా, తెలుగువారందరూ గర్వపడేటంత విశేషమై వెలుగొందుతున్నది తెలుగు సాహిత్యం. నన్నయ్య వ్రాసిన భారతము తెలుగులో మొదటి కావ్యము. అంతకు ముందే జానపద గీతాలు, కొన్ని పద్యాలు ఉన్నట్లు ఆధారాలు ఉన్నాయి. గాధా సప్తశతిలో తెలుగు జానపద గీతాల ప్రస్తావన ఉంది.

ఆహారపుటలవాట్లు మార్చు

 
శుభకార్యాలకి వడ్డించబడే శాకాహార భోజనం

భారతదేశంలో కెల్లా అత్యధిక మసాలా దినుసులు వాడే వంటకాలుగా తెలుగు వంటకాలు ప్రశస్తి. ప్రదేశానుసారం, సంప్రదాయానుసారం తెలుగు వంటకాలలో వివిధ రకాలు గలవు. పచ్చళ్ళు, ఊరగాయలు మొదలుకొని అల్పాహారాలకి, పరిపూర్ణ భోజనాలకి, తెలుగు వంటలు పెట్టింది పేరు.

దాదాపు అన్ని కూరగాయలతోనూ పచ్చళ్ళు ఉండగా, గోంగూర పచ్చడి మాత్రం తెలుగు వారి ప్రత్యేకం. (తమిళులకి, కన్నడిగులకి, మలయాళీలకి గోంగూర తెలియదు).

అన్నం తెలుగు వారి వంటకాలలో ప్రధానాంశం . ప్రతిరోజు చేసే భోజనంలో అన్నాన్ని నెయ్యితో బాటు, వివిధ రకాల పొడులు, పచ్చళ్ళు, పప్పుతో భుజిస్తారు. కూరగాయలతో వేపుళ్ళు, తాళింపులతో బాటు, సాంబారు, రసం (చారు), మజ్జిగ, మజ్జిగ పులుసు, పెరుగు, మిఠాయి, అరటి పండు, అప్పడాలు, వడియాలు తెలుగు వారి భోజనంలో భాగాలే. భోజనాలలోనే కాకుండా, ఇడ్లీ, దోశ, వంటి అల్పాహారాలలో బియ్యం వాడవలసిన అవసరం ఉంది. పొంగలి, పులిహోర, దద్ధ్యోజనం వంటి వాటిలో కూడా అన్నం ప్రధానాంశం. అందుకే అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్న నానుడి తెలుగునాట ఉంది.

14వ శతాబ్దం నుండి తెలంగాణ ప్రదేశాన్ని ఏలిన మహమ్మదీయుల ప్రభావం హైదరాబాదీ వంటలపై స్పష్టంగా కనబడుతుంది. మంసాహారాలైన ఇక్కడి హైదరాబాదీ బిరియానీ, హలీమ్ లు, ప్రతి వీధిలోనూ దొరికే ఇరానీ చాయ్లు ప్రపంచ ప్రసిద్ధాలు.

తెలుగు వంట తెలుగు వారి ఇంటి వంట. ఆంధ్ర ప్రదేశ్కే ప్రత్యేకం కాకుండా తెలుగు వారు నివసించే అన్ని ప్రాంతల్లో తెలుగు వంటలు ఉంటాయి. తెలుగు వంటకాలలో ప్రత్యేకతను సంతరించుకున్నవి ఊరగాయలు. ఆవకాయ మొదలుకొని అన్ని రకాల కూరగాయలతో ఊరగాయ చేసుకోవడం తెలుగు వారికే చెల్లయింది.

దుస్తులు మార్చు

పురుషుల పంచెకట్టు ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా ఉంటుంది. కోస్తా ఆంధ్రలో పంచెని ధోవతి వలె కట్టటం ఎక్కువ. రాయలసీమలో తమిళుల వలె నడుము చ్టుటూ కట్టే పంచెకట్టుని ఎక్కువగా వినియోగిస్తారు. వ్యవసాయం/సైకిలు త్రొక్కటం వంటి పనులు చేసే సమయంలో కట్టే ధోవతులు/పంచెకట్టులు, తలపాగా కట్లు, ఇతర సమయాలలో కట్టే కట్లతో భేదాలు ఉన్నాయి.

ఉత్తర భారత స్త్రీలు సాధారణంగా పైట చెంగు కుడి భుజం పైకి కడతారు. ఆంధ్రలో (ఆ మాటకొస్తే దక్షిణ రాష్ట్రాలన్నింటిలో) ఇది ఎడమ వైపుకు ఉంటుంది.

పురుషుల వస్త్రధారణ మార్చు

స్త్రీల వస్త్రధారణ మార్చు

యువతుల వస్త్రధారణ మార్చు

మతం మార్చు

తెలుగువారిలో అన్ని రకాల మతస్తులు కలరు. ప్రాథమికంగా హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు గలరు. వీరితో బాటు దూదేకుల వారు కూడా గలరు.

ప్రాచీన హైందవ సంప్రదాయాల, మధ్య యుగ బౌద్ధ సంప్రదాయాలు, నవీన ఇస్లామీయ-హైందవ సమ్మిళిత సంప్రదాయాలు, ప్రస్తుత క్రైస్తవ-హైందవ సమ్మిళిత సంప్రదాయాలు తెలుగు సంస్కృతిని ప్రభావితం చేశాయి. ధరణికోట, నాగార్జున కొండ, సంబంధిత సాహిత్యం అశోకుని కాలపు బౌద్ధ మతం గురించి ప్రస్తావిస్తాయి. తిరుపతి శైవ-వైష్ణవ సంప్రదాయాల విలీనం గురించి తెలుపుతుంది.

ఉత్తర ప్రదేశ్, బీహార్ ల తర్వాత అత్యధిక బౌద్ధారామాలు ఆంధ్ర ప్రదేశ్ లోనే ఉన్నాయి. మౌర్యులు, శాతవాహనులు, ఇక్ష్వాకుల పాలనలో బౌద్ధ మతం విలసిల్లినది. 2వ శతాబ్దంలో నాగార్జునాచార్యులు మాధ్యమ బౌద్ధ తత్త్వ గురుకులాన్ని హైదరాబాదుకి దక్షిణ దిశగా 150 కి.మీ ల దూరంలో (ప్రస్తుత నాగార్జున సాగర్ ప్రాంతంలో) ఏర్పాటు చేశారు. విశాఖపట్నం-విజయవాడల మధ్య అనేక ఇతర బౌద్ధారామాలు ఉన్నాయి.

తత్వం మార్చు

త్యాగరాజు అన్నమయ్య, వేమన, జిడ్డు కృష్ణమూర్తి, ముంతాజ్ అలీ వంటి వారెందరో తెలుగు సంస్కృతి పై చెరగని ముద్ర వేశారు.

ఇవి కూడా చూడండి మార్చు

మూలాలు, వనరులు మార్చు

కొంత సమాచారం పెద్దబాలశిక్ష నుండి

మూలాలు మార్చు