విశాఖపట్నం జంక్షన్ రైల్వే స్టేషను
మూస:విశాఖపట్నం-విజయవాడ రైలు మార్గము
![]() Clockwise from Right to Left Main Entrance of Visakhapatnam Railway station Bhubaneshwar bound Intercity Express at Visakhapatnam Guntur bound | |
సాధారణ సమాచారం | |
ప్రదేశం | జ్ఞానాపురం,రైల్వే న్యూ కోలని ,విశాఖపట్నం జిల్లా, ఆంధ్ర ప్రదేశ్ ,530004 భారతదేశము |
అక్షాంశరేఖాంశాలు | 17°43′20″N 83°17′23″E |
లైన్లు | హౌరా-చెన్నై ప్రధాన రైలు మార్గము |
నిర్మాణం | |
పార్కింగ్ | ఉన్నది |
ఇతర సమాచారం | |
స్టేషన్ కోడ్ | VSKP |
చరిత్ర | |
విద్యుద్దీకరించబడింది | అవును |
విశాఖపట్నం జంక్షన్ రైల్వే స్టేషను (వాల్తేర్ రైల్వే స్టేషన్) తూర్పు తీర రైల్వే జోనులోని విశాఖపట్నం నగరానికి సేవలందించే ప్రధానమైన రైల్వేస్టేషను. ఇది ఆంధ్ర ప్రదేశ్లో అతిపెద్ద రైల్వేస్టేషన్లలో ఒకటి. ఇది హౌరా నుండి చెన్నై వెళ్ళు ప్రధాన రైలుమార్గంలో ఉంది. ఇది దేశంలో 20వ రద్దీగా ఉండే స్టేషను.[1]
విశిష్టత
మార్చువిశాఖపట్నం రైల్వేస్టేషను ను మొదటగా వాల్తేరు రైల్వేస్టేషను అని పిలిచేవారు.1987 లో దీని పేరును విశాఖపట్నం రైల్వేస్టేషను గా మార్చారు. విశాఖపట్నం రైల్వేస్టేషను తూర్పు తీర రైల్వే లో అతిపెద్ద రైల్వేస్టేషన్ల లో ఒకటి . దీనిని తూర్పు తీర రైల్వే జోన్ నిర్వహిస్తున్నది. విశాఖపట్నం రైల్వేస్టేషను లోనికి వచ్చు రైలుబండ్లు తమ ప్రయాణ దిశను మార్చుకొని ప్రయాణించవలసివుంటుంది. అందువల్ల విశాఖపట్నం రైల్వేస్టేషను లో రైలుబండ్లు ఎక్కువసేపు ఆగవలసివుంటుంది. అందువల్ల ఈ రైల్వేస్టేషన్ లో ప్లాట్ఫారములు ఎక్కువ సమయం ఖాళీగా వుండవు. అందువల్ల కొన్ని రైలుబండ్లను కొత్తవలస-దువ్వాడ మార్గంలో మళ్ళిస్తున్నారు. ఈ రైల్వేస్టేషన్ కు రెండుపక్కల ప్రవేశద్వారాలు కలవు.
ప్లాట్ఫారములు
మార్చువిశాఖపట్నం రైల్వేస్టేషన్ లో మొత్తం 8 ప్లాట్ఫారములు కలవు. ప్రతి వేదిక (ప్లాట్ఫారము) కూడా 24 కంటే ఎక్కువ బోగీలు కల ఎటువంటి రైలుబండినయినా కూడా తీసుకుని, నిర్వహించగలుగుతుంది. ఇక్కడ అన్ని ట్రాక్లను బ్రాడ్గేజ్గా మార్చబడనవి.
ఎక్స్ప్రెస్ రైళ్ళు
మార్చు- విశాఖపట్నం–హజూర్ సాహిబ్ నాందేడ్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్: నాందేడ్-విశాఖపట్నం ఎక్స్ప్రెస్ (నిజామాబాద్-విశాఖపట్నం ఎక్స్ప్రెస్) అనేది మహారాష్ట్రలోని నాందేడ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం నగరాలను కలుపుతూ నడుపబడుతున్న ఒక ఎక్స్ప్రెస్ రైలు సేవ.
- విశాఖపట్నం–భగత్ కీ కోఠి ఎక్స్ప్రెస్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం - రాజస్థాన్ రాష్ట్రంలోని భగత్ కీ కోఠి స్టేషనల్ మధ్య ఈ రైలు నడుస్తోంది.
- విశాఖపట్నం - లోకమాన్య తిలక్ టెర్మినస్ ఎక్స్ప్రెస్: భారతీయ రైల్వేకు చెందిన రోజువారీ ఎక్స్ప్రెస్ రైలు సర్వీస్. ఇది 2010, మార్చి 24న ప్రారంభించబడింది.
- విశాఖపట్నం - లోకమాన్య తిలక్ టెర్మినస్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్: విశాఖపట్నం రైల్వే స్టేషన్ - ముంబైలోని లోకమాన్య తిలక్ టెర్మినస్ మధ్య నడుస్తున్న సూపర్ ఫాస్ట్ రైలు
- విశాఖపట్నం-సికింద్రాబాద్ దురంతో ఎక్స్ప్రెస్: భారతీయ రైల్వే సూపర్ ఫాస్ట్ ఏసి ఎక్స్ప్రెస్ రైలు. ఇది 2011-12 రైల్వే బడ్జెట్లో అప్పటి భారతీయ రైల్వేమంత్రి మమతా బెనర్జీ ద్వారా సికింద్రాబాద్ నుండి విశాఖపట్నం వరకు కలుపబడింది.
ఇవి కూడా చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ "RPubs India". Archived from the original on 2018-06-12. Retrieved 2018-05-24.